ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పాలన | ys jagan met president of india | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పాలన

Jun 10 2015 3:09 AM | Updated on Sep 22 2018 8:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో అవినీతికి, కుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం ఇచ్చారు.

- ప్రణబ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వినతిపత్రం
- పట్టిసీమలో 21శాతం ఎక్సెస్ వేసిన వారికే పనులిచ్చారు
- భారీ ముడుపులు తీసుకుని డిస్టిలరీలకు అనుమతులిచ్చారు
- బెరైటీస్ కనీసధరను తగ్గించడంవల్ల ఖజానాకు భారీ నష్టం
- ఇసుక రీచ్‌లతో టీడీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారు
- సంక్రాంతి పండుగ నిత్యావసరాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు
- వీటన్నింటిపై విచారణ జరిపించండి... ఏపీ ప్రజలకు న్యాయం చేయండి
 
సాక్షి, న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో అవినీతికి, కుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతితో భేటీ సందర్భంగా రెండు వినతిపత్రాలు ఇచ్చారు.

అందులో అవినీతిపై ఇచ్చిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ఇవీ..
- ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి అత్యున్నత స్థాయి లో నిరాటంకంగా కొనసాగుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ వ్యవహారం తమ బాస్ చంద్రబాబు సూచనల మేరకే చేస్తున్నానని పదేపదే చెప్పడం వీడియో టేపుల్లో రికార్డయింది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు నేరుగా మాట్లాడిన ఆడియో టేపులు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చిన చంద్రబాబును ఏ-1గా చేర్చాలి. లంచం ఇవ్వజూపిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాలి. ఈ డబ్బంతా ఏడాదికాలంగా ఏపీలో పాల్పడిన అవినీతినుంచే తీసుకొచ్చారు. ఉదాహరణకు...

- పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు తమవారికే దక్కేలా వ్యవహరించారు. 21.9 శాతానికి ఎక్సెస్ వేసినా టెండర్‌ను ఆమోదించారు.
- ఈపీసీ కోడ్‌లో లేని మెటీరియల్‌కు కూడా ధరలు పెంచుకునే నిబంధన పొందుపరుస్తూ జీవో నెంబరు 22 జారీచేశారు.
- భారీగా ముడుపులు తీసుకుని ఎంపిక చేసిన డిస్టిలరీలకు అదనపు మద్యం ఉత్పత్తి చేసేందుకు వీలుగా అనుమతి ఇచ్చారు.
- రాష్ట్రంలో పలు పరిశ్రమలు పారిశ్రామిక రాయితీల కోసం ఎదురుచూస్తుండగా.. అడగని పరిశ్రమలకు రాయితీలు విడుదల చేశారు.
- వైఎస్సార్ జిల్లాలోని దాదాపు 200 బెరైటీస్ యూనిట్లకు ఖనిజం ఇవ్వడం ఆపివేసి 40 వేల మంది పొట్టగొట్టారు. పైగా కనీస బేసిక్ ధరను తగ్గిస్తూ టెండర్లను పిలిచారు. దీనివల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది.
- టీడీపీ నేతల బినామీలకు ఇసుక రీచ్‌లు కేటాయించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. దీంతో ఇసుక ధరలు 3 నుంచి 5 రెట్లు పెరిగిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.
- రాజధాని అభివృద్ధి కోసమంటూ స్విస్ చాలెంజ్ పద్ధతిని ఎంచుకుని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారుతున్నాయి.
- విద్యుదుత్పత్తి దారులకు మేలు చేకూర్చేలా కొనుగోలు నిబంధనలు మార్చారు. విద్యుత్తు తీసుకోని పక్షంలో పెనాల్టీ చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. విద్యుత్తు కొనుగోలుకు రేట్లను కూడా అధికంగా పొందుపరిచారు.
- అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తగ్గినప్పటికీ గడిచిన ఏడాదిగా కొంతమంది బొగ్గు సరఫరాదారులకు మేలు చేకూర్చేలా అధిక రేట్లకు బొగ్గును కొనుగోలు చేస్తున్నారు.
- సంక్రాంతి పండగ సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు ఇచ్చిన పథకంలో కూ డా అవినీతి చోటు చేసుకుంది. టెండర్లు పిలవకుండా, తమకు నచ్చినవారికి అధిక రేట్లు చె ల్లించి నాసిరకం సరుకులు కొనుగోలు చేశారు.
- రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో అవినీతి జరుగుతోందనడానికి ఇవి కొన్ని ఉదంతాలు మాత్రమే. అందువల్ల చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేర్చి, అవినీతిపై  సంబంధిత అధికారులను దర్యాప్తు జరపాలని ఆదేశించండి. ఏపీ ప్రజలకు న్యాయం చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement