Pranab Mukherjee
-
ప్రణబ్ స్మారకం..స్థలం కేటాయించిన కేంద్రం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ(Pranab Mukherjee) స్మృతి వననానికి కేంద్రం స్థలం కేటాయించింది. రాజ్ఘాట్ కాంప్లెక్స్లోని రాష్ట్రీయ స్మృతి స్థల్లోనే ప్రణబ్ ముఖర్జీ స్మారక వనానికి స్థలం కేటాయించారు. ఈ విషయమై కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన లేఖను ప్రణబ్ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ విడుదల చేశారు.తన తండ్రి స్మారకానికి స్థలం కేటాయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీని(Narendra Modi) ప్రత్యేకంగా కలిసిన షర్మిష్ట ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక ఊహించని,గొప్ప నిర్ణయమని కొనియాడారు.కాగా, ఇటీవల మాజీ ప్రధాని స్మారక చిహ్నం నిర్మాణానికి స్థలం కేటాయించడంపై వివాదం సందర్భంగా షర్మిష్ట కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు.తన తండ్రి ప్రణబ్ మరణించినపుడు కాంగ్రెస్(Congress) చేసిన అన్యాయాన్ని బయటపెట్టారు. ఇంతలోనే ప్రణబ్ముఖర్జీ స్మారక సమాధికి కేంద్రం స్థలం కేటాయించడం గమనార్హం. కాగా, ప్రణబ్ముఖర్జీ భారత రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు పనిచేశారు. 2020 ఆగస్టులో ఆయన తుదిశ్వాస విడిచారు. -
ప్రణబ్ చనిపోతే మీరేం చేశారు.. కాంగ్రెస్పై శర్మిష్ఠా ముఖర్జీ సీరియస్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పెద్దలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్ హైకమాండ్ను ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు లేఖ రాయడంపై ఆమె మండిపడ్డారు.మాజీ ప్రధాని మన్మోహన్కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ఈ అంశంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్ను శర్మిష్ఠా ముఖర్జీ ప్రశ్నించారు.తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే నివాళులర్పించడానికి కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తనకు చెప్పారని ఆమె అన్నారు. అయితే, తర్వాత అది నిజం కాదని ప్రణబ్ రాసుకున్న డైరీ ద్వారా తనకు తెలిసిందని శర్మిష్ఠ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె మండిపడుతున్నారు.ఇదిలా ఉండగా.. 92 ఏళ్ల మన్మోహన్ అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మన్మోహన్ పార్థివదేహాన్ని శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అక్కడ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తారని, అనంతరం 9:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉదయం 11:45 గంటలకు స్థానిక నిగమ్బోధ్ ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచారు.When baba passed away, Congress didnt even bother 2 call CWC 4 condolence meeting. A senior leader told me it’s not done 4 Presidents. Thats utter rubbish as I learned later from baba’s diaries that on KR Narayanan’s death, CWC was called & condolence msg was drafted by baba only https://t.co/nbYCF7NsMB— Sharmistha Mukherjee (@Sharmistha_GK) December 27, 2024 -
Pranab Mukherjee: 13 అశుభం.. ఆ మాజీ రాష్ట్రపతికి అత్యంత శుభం?
ఈరోజు డిసెంబరు 11.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జన్మదినం. ఆయన 1935, డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా మిరాటి గ్రామంలో జన్మించారు. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. 2020 ఆగస్టులో కన్నుమూసిన ప్రణబ్ ముఖర్జీ జీవితంలో 13వ నంబరుకు ప్రత్యేక స్థానముంది.చాలామంది 13వ నంబరును అశుభ సంఖ్యగా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో 13వ నంబరుపై ఉండే భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా అంటారు. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలలోని ప్రజలు 13 సంఖ్యను అశుభ సూచికగా చెబుతారు. దీనివెనుక పలు కారణాలను కూడా చెబుతుంటారు. అయితే ఇదే 13వ సంబరు ప్రణబ్ ముఖర్జీ జీవితంలో అదృష్ట సంఖ్యగా మారింది. ఆయన జీవితంలోని అన్ని ముఖ్యమైన సంఘటనలు 13వ నంబర్తో ముడిపడి ఉన్నాయి.ప్రణబ్ ముఖర్జీ వివాహందివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వైవాహిక జీవితం 13వ సంఖ్యతో ప్రారంభమైంది. ఆయన 1957, జూలై 13న వివాహం చేసుకున్నారు.రాజ్యసభకు..ప్రణబ్ ముఖర్జీ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి సన్నిహితునిగా పేరొందారు. ఆమె ప్రణబ్ ముఖర్జీని 1969లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు పంపారు. ప్రణబ్ ముఖర్జీ మొదటిసారిగా 1969 జూలై 13న పార్లమెంటులో ప్రవేశించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా..యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ప్రణబ్ ముఖర్జీ పేరు తెరపైకి వచ్చిన తేదీ కూడా 13 కావడం విశేషం. 2012, జూన్ 13న యూపీఏ ముందుకు రెండు పేర్లు వచ్చాయి. ఒకరు ప్రణబ్ ముఖర్జీ. మరొకరు హమీద్ అన్సారీ. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ పేర్లను మమతా బెనర్జీ అందరి ముందుకు తీసుకువచ్చారు.13వ రాష్ట్రపతిగా..ప్రణబ్ ముఖర్జీ దేశ 13వ రాష్ట్రపతి అయ్యారు. ఈ సమయంలో ఆయనకు ప్రభుత్వం 13వ నంబరు బంగ్లాను కేటాయించింది. ప్రణబ్ ముఖర్జీ 1996 నుండి 2012 వరకు ఢిల్లీలోని తల్కటోరిలోని 13వ నంబర్ బంగ్లాలో నివసించారు. 13వ నంబర్తో ప్రణబ్ ముఖర్జీకి ఉన్న అనుబంధం ఆయన జీవితంలోని చిరస్మరణీయ క్షణాలుగా మారాయి. ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
కాంగ్రెస్ పరిస్థితిపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
ఒక నిర్దిష్ట నాయకుని నాయకత్వంలో పార్టీ నిరంతరం ఓడిపోతుంటే, దాని గురించి ఆలోచించడం చాలా ముఖ్యమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, రచయిత శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజస్థాన్లోని జైపూర్ల జరిగిన 17వ లిటరేచర్ ఫెస్టివల్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2014, 2019లలో రాహుల్ గాంధీ ఘోరంగా ఓడిపోయారనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అని, దానిని ఎలా బలోపేతం చేయాలనే దానిపై కాంగ్రెస్ నేతలంతా ఆలోచించాలని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీలోని సంస్థాగత ఎన్నికలు, విధానపరమైన నిర్ణయాలు... ఇలా ప్రతి స్థాయిలోనూ అట్టడుగు స్థాయి కార్యకర్తలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నారని శర్మిష్ట పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన సిద్ధాంతాలు ఉంటాయని, ఎవరి భావజాలంతోనూ మనం ఏకీభవించకపోయినప్పటికీ, వారి భావజాలం తప్పుకాదని అర్థం చేసుకోవాలని శర్మిష్ట అన్నారు. తమ తండ్రి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు, పార్లమెంటులో ప్రతిష్టంభన సమయంలో ఇతర పార్టీ సభ్యులతో చర్చించడంలో ఆయనకున్న నేర్పు కారణంగా ఆయన ఏకాభిప్రాయ నిర్మాతగా గుర్తింపు పొందారన్నారు. ప్రజాస్వామ్యం అంటే మాట్లాడటం మాత్రమే కాదని, ఇతరుల మాట వినడం కూడా చాలా ముఖ్యమని, ప్రజాస్వామ్యంలో చర్చలు ఉండాలన్నది ప్రణబ్ ముఖర్జీ సిద్ధాంతమని షర్మిష్ట పేర్కొన్నారు. -
PRANAB, MY FATHER: రాహల్కు పరిణతి లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణతి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్ కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ–నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్ కు వచ్చింది గానీ వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు‘ అని కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. ‘కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా? ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా? ఏమో! నాకైతే తెలియదు‘ అంటూ అనుమానాలు వెలిబుచ్చారట. ’ప్రణబ్: మై ఫాదర్’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు చించివేశారని తెలిసి ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని చెప్పారు. ‘అలా చేయడానికి ఆయన ఎవరసలు? కనీసం కేబినెట్ సభ్యుడు కాదు. పైగా అప్పుడు ప్రధాని (మన్మోహన్ సింగ్) విదేశాల్లో ఉన్నారు. తన చర్య పార్టీపై, ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆలోచించరా? సొంత ప్రభుత్వ ఉత్తర్వులను అలా మీడియా ముందు ముక్కలు చేయడం 2014లో యూపీఏ కూటమి ఓటమికి కూడా ఒక కారణమైంది‘ అని ప్రణబ్ మండిపడ్డారట. ‘రాహుల్ హుందాగానే ప్రవర్తిస్తారు. కానీ దేన్నీ సీరియస్గా తీసుకోరు. బహుశా ఆయనకు అన్నీ చాలా సులువుగా లభించడమే కారణం కావచ్చు. రాహుల్ మాత్రం అత్యంత కీలక సమయాలు, సందర్భాల్లో కూడా చీటికీమాటికీ దేశం విడిచి ఎటో మాయమవుతారు. ఇది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తప్పుడు సందేశమే ఇచ్చింది‘ అని ప్రణబ్ అభిప్రాయపడ్డట్టు శర్మిష్ఠ తెలిపారు. -
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతమే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని తెలిసే తెలంగాణ ప్రకటించారని, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారంటే భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పినంత దరిద్రంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడారో కేటీఆర్ తెలుసుకుని మాట్లాడాలని, పనికిమాలిన మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నాడు కేసీఆర్ ఆన్ రికార్డు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఎంపీ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తెలంగాణ కావాలని.. ‘మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. వైఎస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నాతో సహా 41 మంది ఎమ్మెల్యేలం తెలంగాణ కావాలని అడిగినందుకే ప్రణబ్ముఖర్జీ కమిటీ వేశారు. అప్పుడు కేటీఆర్ రాజకీయాల్లో లేడు. అమెరికాలో ఉన్నాడు. ఆ తర్వాత కేసీఆర్కు చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకోం.’ అని కోమటిరెడ్డి హెచ్చరించారు. వాళ్లకు టికెట్లు క్యాన్సిల్ చేయండి కట్టె పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన దానం నాగేందర్, కేసీఆర్ను ఫుట్బాల్లా తంతానన్న తలసాని శ్రీనివాస్యాదవ్, పట్నం మహేందర్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ... ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా ఉందని, ఈ మంత్రులను ముందు కేబినెట్ నుంచి తొలగించి, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఇచ్చిన టికెట్లను క్యాన్సిల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బానిసత్వ పార్టీ ఎవరిదో అందరికీ తెలుసునని, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రి మహమూద్అలీలు ప్రగతిభవన్ వరకు వస్తే 100 కిలోమీటర్ల స్పీడ్తో వెనక్కు పంపింది ఎవరని ప్రశ్నించారు. ప్రగతిభవన్ లోపలికి రానివ్వకపోతే ఏడ్చానని రాజేందర్ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సర్పంచ్ కూడా ఆయనను సులువుగా కలవగలిగేవారని చెప్పారు. ఎన్నికల ఆలస్యంపై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యమవుతాయని, ఫిబ్రవరి వరకు తీసుకెళ్తారని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పద మని కోమటిరెడ్డి చెప్పారు. బీజేపీతో అమిత్షాతో భేటీ అయి కవితను జైలుకు పంపవద్దని ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇప్పుడు ఆయన ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయని చెప్పకపోతే తమకు తెలియదా? అని వ్యాఖ్యానించారు. -
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
చట్టసభల్లో నిరసనకు హద్దులుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో నిరసనలు తెలపడంలో తప్పు లేదని, అదే సమయంలో సభా గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాల్లోని లోపాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజా ప్రతినిధుల హక్కు అయినప్పటికీ, అవి భావోద్వేగాలకు దారి తీసి పరిమితులు దాటకూడదని హితవు పలికారు. చట్టసభల్లో కార్యకలాపాలకు తరచూ అంతరాయాలు కలుగుతుండటం, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితులు చోటు చేసుకోవడంపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలి స్మారకోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో అంతరాయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రణబ్ ముఖర్జీ లెగసీ ఫౌండేషన్ వర్చువల్ వేదికగా నిర్వహించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని, సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. చట్టసభల్లో అంతరాయాలతో జవాబుదారీతనం కొరవడి, ఏకపక్ష ధోరణి ఏర్పడే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ బుద్ధి కుశలత, అసాధారణ జ్ఞాపకశక్తి అనేక వివాదాస్పద అంశాలకు సమాధానాన్ని చూపిందన్న ఉపరాష్ట్రపతి, పన్ను సంస్కరణలను స్వయంగా ఆర్థికమంత్రిగా సేవలందించిన ప్రణబ్ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో నాగపూర్లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. శిక్షణా శిబిరంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, హుందాగా వ్యవహరించగల ప్రణబ్ వ్యక్తిత్వానికి ఇది ఉదాహరణ అన్నారు. జాతీయవాదం గురించి మాటల్లో చెప్పే వారికి, నిజమైన జాతీయవాదాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రణబ్ విశేష సేవలు: మోదీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దార్శనికతగల గొప్ప నేత అని ప్రధాని మోదీ శ్లాఘించారు. అత్యుత్తమ ప్రజాజీవితం, పరిపాలనా దక్షత, సునిశిత దృష్టి కలిగిన ఆయన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రథమ స్మారకోపన్యాసంలో ప్రధాని ఈ మేరకు పేర్కొన్నారు. అమోఘ ప్రజ్ఞాపాటవాలు కలిగిన ప్రణబ్ దేశాభివృద్ధికి గుర్తుంచుకోదగ్గ సేవలందించారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య విలువలను ఆయన పరిపుష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ఖలీదా జియా వర్చువల్గా ప్రసంగించారు. యువ ఎంపీగా బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పాటునందిం చారని ప్రణబ్ను కొనియాడారు. బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ 1971 జూన్లో రాజ్యసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తుకు తెచ్చుకున్నారు. భూటాన్ రాజు జింగ్మే కేసర్ నామ్గ్యాల్ వాంగ్చుక్ తన ఉపన్యాసంలో.. ప్రణబ్తో పలుమార్లు తాను భేటీ అయ్యాయని చెప్పారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాననీ, ఆయన లోటు తీర్చలేనిదని తెలిపారు. ప్రణబ్ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012–17 మధ్య కాలంలో పనిచేశారు. కాంగ్రెస్ నేత అయిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. -
కాంగ్రెస్కు షాక్.. టీఎంసీలోకి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
కోల్కతా: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. కోల్కతాలోని పార్టీ కార్యాలయంలో సోమవారం అభిజిత్ ముఖర్జీకి, టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయినవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో... ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు అభిజిత్ ముఖర్జీ. Warmly welcoming Shri @ABHIJIT_LS into the Trinamool family! We are certain that your contribution towards fulfilling @MamataOfficial's vision for a brighter Bengal shall be valued by all. pic.twitter.com/oSQgmfxVCR — All India Trinamool Congress (@AITCofficial) July 5, 2021 అయితే 2019లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ మొదలు పెట్టిన మతపరమైన హింసను మమతా బెనర్జీ సమర్థవంతంగా అదుపు చేశారని అభిజిత్ చెప్పారు. దేశమంతటా బీజేపీని కంట్రోల్ చేసే శక్తి ఆమెకు ఉందన్నారు. కాంగ్రెస్లో ప్రాథమిక సభ్యత్వం తప్ప తనకు ఎలాంటి పొజిషన్ లేదని... టీఎంసీలోనూ సాధారణ కార్యకర్తగానే చేరినట్టు అభిజిత్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు. అయితే అభిజిత్ ముఖర్జీ నిర్ణయంపై ఆయన సోదరి షర్మిష్ట స్పందిస్తూ.. విచారకరం అంటూ ట్వీట్ చేశారు. SAD!!! — Sharmistha Mukherjee (@Sharmistha_GK) July 5, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు చూసుకున్నారు అభిజిత్ ముఖర్జీ. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జట్టు కట్టడంపై అభిజిత్ ముఖర్జీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ ఓట్ల వాటా పెరిగి ఉండేదని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అభిజిత్ ముఖర్జీ పేర్కొన్నారు. -
ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ పార్లమెంట్లో తరచుగా మాట్లాడాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ‘ప్రెసిడెన్షియల్ ఈయర్స్ 2012– 2017’ పుస్తకంలో సూచించారు. ప్రణబ్ ముఖర్జీ చనిపోవడానికి ముందు చివరగా రాసిన ఈ పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది. పార్లమెంటులో విపక్ష సభ్యుల భిన్నాభిప్రాయాలను ప్రధాని వినాలని, తన అభిప్రాయాలను వివరించి, వారిని ఒప్పించాలని ఆ పుస్తకంలో ముఖర్జీ సూచించారు. ఏ ప్రధానైనా సరే.. సభలో ఉంటే చాలు, సభ నిర్వహణ వేరుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్పేయి, మన్మోహన్ సింగ్.. వీరంతా సభలో తమదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ తన పూర్వ ప్రధానుల నుంచి ఈ విషయంలో స్ఫూర్తి పొందాలి. స్పష్టమైన నాయకత్వాన్ని చూపాలి. తన అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు పార్లమెంటును వేదికగా వాడుకోవాలి’ అని సూచించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో స్వపక్ష, విపక్ష నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ క్లిష్ట సమస్యలను పరిష్కరించేవాడినని వివరించారు. సభ సజావుగా సాగడమే తన ప్రథమ లక్ష్యంగా ఉండేదన్నారు. దురదృష్టవశాత్తూ 2014–19 మధ్య ఎన్డీయే ప్రభుత్వంలో ఈ స్ఫూర్తి కొరవడిందన్నారు. అయితే, విపక్షం కూడా దారుణంగా, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించిందని విమర్శించారు. పార్లమెంట్లో గందరగోళం కొనసాగడం వల్ల ప్రభుత్వం కన్నా విపక్షమే ఎక్కువ నష్టపోతుందని తెలిపారు. దీన్ని సాకుగా చూపి సభా సమయాన్ని కుదించే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుందన్నారు. దేశం ప్రధాని పాలనపైననే ఆధారపడి ఉంటాయన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నుడై ఉండే పరిస్థితి మన్మోహన్ సింగ్దని, దాంతో ఆ ప్రభావం పాలనపై పడిందని ప్రణబ్ విశ్లేషించారు. ఆత్మకథలో సంచలన విషయాలు.. ‘ప్రధానమంత్రి నర్రేంద మోదీ, నవాజ్ షరీఫ్ వ్యక్తిగత కార్యక్రమం కోసం పాకిస్తాన్ వెళ్లాడరు. లాహోర్కు వెళ్లడం సరైన నిర్ణయం కాదు సర్జికల్ స్ట్రైక్ అనేది ఆర్మీ సాధారణంగా చేసే ప్రక్రియ మాత్రమే. నాకు అవకాశం ఇస్తే తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేవాడిని. తాను యూపీఏ-2లో ఆర్ధిక మంత్రిగా కొనసాగితే.. మమతా బెనర్జీ కూటమిలోనే కొనసాలా చేసేవాడిని. 2004లో నేను ప్రధానినైతే 2014లో...కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైన ఓటమి పాలయ్యేది కాదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. నేను రాష్ట్రపతిగా వెళ్లిన తరువాత... కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా అంశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. సోనియాగాంధీ పార్టీని నడపంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. మహారాష్ట్రలో సరైన నాయకులను కాకుండా ఇతరులపై పార్టీ ఆధారపడింది.’ అని తన ఆత్మకథ ‘ప్రెసిడెన్షియల్ ఈయర్స్ 2012– 2017లో పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని అంశాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
కొడుకుగా అది నా హక్కు: మాజీ ఎంపీ
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ప్రచురణ అంశంపై చెలరేగిన వివాదంపై ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ స్పందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే తాను ఆ బుక్ను పూర్తిగా చదివిన తర్వాతే పబ్లిష్ చేయాలని బుధవారం పునరుద్ఘాటించారు. ఈ మేరకు.. ‘‘కొందరు భావిస్తున్నట్లుగా, మా నాన్న చివరి జ్ఞాపకానికి సంబంధించిన అంశానికి నేనెంత మాత్రం వ్యతిరేకం కాదు. అయితే ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ గురించి తెలుసుకోవడం ఒక కొడుకుగా నాకున్న హక్కు. ఒకవేళ నాన్న బతికుండి ఉంటే, పుస్తకం పూర్తైన తర్వాత ఆయన కూడా ఇదే చేసేవారు. ఫైనల్ అవుట్పుట్ చూసేవారు. గతంలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా నేను అదే చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నా. నేను ఆ పుస్తకం చదివేంత వరకు ప్రచురణ ఆపేయండి. చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడవద్దు’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పేరిట ప్రణబ్ ముఖర్జీ రాసిన రూపా పబ్లికేషన్స్ విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్పై చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి. ఈ క్రమంలో జనవరిలో బుక్ను రిలీజ్ చేయనున్నట్లు పబ్లికేషన్స్ ప్రకటించగా.. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా అభిజిత్ ముఖర్జీ వెల్లడించగా, ఆయన సోదరి శర్మిష్ట మాత్రం చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అక్కాతమ్ముళ్ల తలెత్తిన భేదాభిప్రాయాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఈ మేరకు స్పందించడం గమనార్హం.(చదవండి: ప్రణబ్ పుస్తకం.. ఇంట్లోనే వైరం) 1/2 Contrary to the opinion of some , I am not against the publishing of my father's Memoir but I have requested D publisher to allow me to go through it's contents before final roll out & I believe my request is quite legitimate & within my rights as his Son . — Abhijit Mukherjee (@ABHIJIT_LS) December 16, 2020 -
ప్రణబ్ పుస్తకం.. ఇంట్లోనే వైరం
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ఆయన ఇంట్లోనే విభేదాలకు దారి తీసింది. ఆ పుస్తకాన్ని తన అనుమతి లేకుండా ప్రచురించ కూడదని కుమారుడు అభిజిత్ ముఖర్జీ చెబుతూ ఉంటే, పుస్తకం విడుదలకు అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని ఆయన సోదరి శర్మిష్ట ముఖర్జీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు పొందిన ప్రణబ్ ముఖర్జీ రాసిన ఈ చివరి పుస్తకంలో ఆయన సోనియాగాంధీ పైనా, మన్మోహన్ సింగ్పైనా చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి. తాను రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని చెబుతూ తనకు తెలిసిన ఇన్సైడ్ సమాచారాన్ని ప్రణబ్ ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం అక్కా తమ్ముళ్ల మధ్య విభేదాలకు దారి తీయడం చర్చనీ యాంశంగా మారింది. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. దీనిపై అభిజిత్ సోదరి శర్మిష్ట తీవ్రంగా ప్రతిస్పందించారు. చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్ చేశారు. -
ప్రణబ్ ముఖర్జీకి లోక్సభ నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్ సేవలను సభ కొనియాడింది. ఏ పదవిలో ఉన్నా ప్రణబ్ ముఖర్జీ ఆ పదవికి వన్నె తెచ్చారని స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. ఇటీవల మృతి చెందిన తమిళనాడు ఎంపీ వసంత్కుమార్, పండిత్ జస్రాజ్, అజిత్ జోగి, చేతన్ చౌహాన్ తదితరులకు సభ సంతాపం తెలిపింది. అలాగే కరోనాతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన కరోనా యోధులకు కూడా పార్లమెంట్ నివాళి అర్పిచింది. అనంతరం సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్ –19 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్–19 నెగెటివ్ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, లోక్సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. ఇక విజృంభిస్తున్న కరోనా, కుదేలైన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలు.. తదితర వైఫల్యాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం సిద్ధమవుతోంది. చైనా ఆక్రమణలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఆక్రమణలపై సభలో చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరీ, కే సురేశ్లు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు మావన హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అంశంపై సీపీఎం, నీట్ నిర్వహణను వ్యతిరేకిస్తూ, అలాగే 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే, సీపీఎం.. లోక్సభలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. -
కర్మయోగి.. అజాత శత్రువు
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధిలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రణబ్ మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకున్ని కోల్పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో ప్రణబ్ నిలిచిపోయారని కొనియాడారు. సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సూచన మేరకు సీఎం కేసీఆర్.. ప్రణబ్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రణబ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సీఎం మాట్లాడుతూ, ‘ప్రణబ్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన కర్మయోగి ప్రణబ్. 1970 తర్వాత దేశ అభివృద్ధిలో ఆయన లేని పేజీ ఉండదంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో ఎదిగారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయ్యాక పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధనలో ఆయనది అమోఘమైనపాత్ర. మిత్రపక్షాలను కలుపుకొనిపోవడంలో కుడిఎడమలను సమన్వయం చేసిన సవ్యసాచిలా మన్ననలు పొందారు. పార్లమెంట్ విలువలకు నిలువెత్తు ప్రతీక’అని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ప్రణబ్.. తెలంగాణతో ప్రణబ్కు ఉన్న సంబంధాన్ని సీఎం గుర్తు చేశారు. ‘రాష్ట్ర ఏర్పాటుపై పార్టీల అభిప్రాయ సేకరణకు నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా, ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారానికై అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా, రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు’అని సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులేశారు: భట్టి ‘ప్రణబ్ దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశంలో ఉత్పన్నమైన అనేక సమస్యలను ట్రబుల్ షూటర్గా పరిష్కరించేవారు. లోక్సభ, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారు.తెలంగాణ సాధనకు మార్గదర్శనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, దేశానికి విశేష సేవలు అందించినందుకు గర్విస్తున్నాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొ న్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తదితరులు ప్రణబ్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుధీర్రెడ్డి మాట్లాడి సంతాప తీర్మానాలను బలపరిచారు. అనం తరం ప్రణబ్ సేవలను స్పీకర్ పోచారం గుర్తు చేశారు. సభ ప్రణబ్ ముఖర్జీ మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపింది. 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర శాసనమండలి నివాళులర్పించింది. సమావేశాలు ప్రారంభమైన అనం తరం సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి ప్రణబ్కు శ్రద్ధాంజలి ఘటించారు. -
ప్రియనేతకు తుదివీడ్కోలు
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరుల అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులు, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ఆయనకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికారు. లోధి రోడ్లోని విద్యుత్ దహన వాటికలో మంగళవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాల మధ్య ప్రణబ్ ముఖర్జీకి ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ఇతరులు పీపీఈ కిట్స్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతికి ఆర్మీ దళం గన్ సెల్యూట్తో గౌరవ వందనం సమర్పించింది. అంతకుముందు ప్రణబ్ మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో త్రివర్ణ పతాకం కప్పి దహనవాటికకు తీసుకువచ్చారు. పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న అదే ఆసుపత్రిలో ప్రణబ్కు వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్స సైతం నిర్వహించారు. అదే సమయంలో ఆయనకు కరోనా కూడా సోకింది. భారత రత్న పురస్కార గ్రహీత అయిన ప్రణబ్ మృతికి సంతాప సూచకంగా కేంద్రం సోమవారం నుంచి 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖుల నివాళి ప్రణబ్ నివాసంలో ఆయన భౌతిక కాయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్వీర్ సింగ్ (నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా (ఎయిర్ఫోర్స్), సీనియర్ కాంగ్రెస్ నేతలు, పార్టీలకతీతంగా సీనియర్ నేతలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాజీ ప్రధాని, చిరకాల సహచరుడు మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తదితరులు ప్రణబ్కు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రణబ్ నివాసంలోని ఒక గదిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా, ప్రముఖుల సందర్శనార్థం మరో గదిలో ఏర్పాటు చేసిన ప్రణబ్ చిత్రపటానికి నాయకులు పుష్పాంజలి సమర్పించారు. ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు రాజాజీ మార్గ్లోని ప్రణబ్ నివాసానికి తరలివచ్చారు. వారంతా క్రమశిక్షణతో అభిమాన నేతకు అశ్రు నివాళి అర్పించారు. కొందరు అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ముఖాన్ని కప్పి ఉంచే ఫేస్ షీల్డ్ను సైతం ధరించారు. కోవిడ్ ముప్పు నేపథ్యంలో అంతిమయాత్రకు అధికారికంగా ఉపయోగించే వాహనంలో కాకుండా, మరో వాహనంలో ప్రణబ్ భౌతిక కాయాన్ని లోధి రోడ్లోని శ్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్స్ ధరించిన సిబ్బంది మృతదేహాన్ని వాహనంలోకి చేర్చారు. ప్రణబ్ చిత్రపటం వద్ద పుష్పాలతో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వగృహంలో మ్యూజియం పశ్చిమబెంగాల్లోని జంగీపూర్లో ఉన్న తమ స్వగృహంలో ఒక అంతస్తును తమ తండ్రి జ్ఞాపికలతో ఒక మ్యూజియంగా రూపొందిస్తామని, ఒక గ్రం«థాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి స్మృత్యర్థం ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్ను విడుదల చేయాలని అభిజిత్ కోరారు. తన తండ్రి కోసం ఆగస్టు 4న జంగీపూర్లోని తమ వ్యవసాయ క్షేత్రం నుంచి ఒక పనస పండును తీసుకువచ్చానని గుర్తు చేసుకున్నారు. ‘అవి ఇక్కడ కూడా లభిస్తాయి. కానీ మా సొంత క్షేత్రం నుంచి ఆయన కోసం తీసుకురావాలనిపించింది. ఆయన ఆ పండును సంతోషంగా స్వీకరించారు. అప్పుడు అదృష్టవశాత్తూ ఆయన షుగర్ లెవల్స్ కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ఆయన కోరికను తీర్చినందుకు చాలా సంతోషించాను’అని గద్గద స్వరంతో పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో కావచ్చు, జీవితంలో కావచ్చు.. ఎప్పుడు కూడా కక్షపూరితంగా ఉండవద్దు’అని తన తండ్రి పలుమార్లు తనతో చెప్పారన్నారు. ప్రణబ్కు శాయశక్తులా చికిత్స అందించిన వైద్యులకు అభిజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ లోకంలో ఆయన పోషించాల్సిన పాత్ర ముగిసిందనుకుంటా. ఒక సాధారణ వ్యక్తి కోరుకునే అన్నింటినీ ఆయన పొందారు’అని వ్యాఖ్యానించారు. చైనా, యూఎస్ల్లో.. పశ్చిమబెంగాల్లోని ప్రణబ్ స్వగ్రామం మిరాటీలో గ్రామస్తులు ప్రియతమ నేతకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ‘దాదాపు ప్రతీ దుర్గాపూజ ఉత్సవానికి కచ్చితంగా స్వగ్రామానికి వచ్చేలా ప్రణబ్ ప్రయత్నించేవారు. ఆయన లేకుండా దుర్గాపూజ ఉత్సవం ఎప్పటిలా ఎన్నటికీ జరగబోదు’అని గ్రామంలోని ఆలయ పూజారి బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనా విదేశాంగ కార్యాలయం ప్రణబ్ చిత్రపటానికి నివాళులర్పించింది. అమెరికా, భారత్ కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ప్రణబ్ విశేష కృషి చేశారని అమెరికా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తెలిపారు. గొప్ప నేతను దేశం కోల్పోయింది ప్రణబ్ ముఖర్జీ మృతికి మంగళవారం కేంద్ర కేబినెట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఒక గొప్ప నాయకుడిని, అద్భుతమైన పార్లమెంటేరియన్ను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించింది. ‘పాలనలో అనితరసాధ్యమైన అనుభవం ఉన్న నేత. దేశ విదేశాంగ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక మంత్రిగా గొప్ప సేవలందించారు’అని కేబినెట్ ఒక తీర్మానంలో ప్రశంసించింది. జాతిజీవనంపై తనదైన ముద్రను వదిలివెళ్లారని, ఆయన మృతితో శిఖరాయమాన దార్శనిక నేతను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి ప్రణబ్ అందించిన సేవలను భారతీయులు తరతరాలు గుర్తుంచుకుంటారని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ప్రణబ్ నివాసం వద్ద సెల్యూట్ చేస్తున్న సైనిక జవాన్లు -
కనెక్ట్ అయ్యారు
ప్రణబ్ హిందీ సినిమాలు చూడరు... ‘పీకూ’ చిత్రం మాత్రం ఇష్టంగా చూశారు. దీపికలో కూతుర్ని చూసుకున్నారు. అసలు ఆయన జీవితంలోని ప్రతి దశా.. ఒక స్త్రీమూర్తితో కనెక్ట్ అయి ఉన్నదే. అమ్మ రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ.. భార్య సువ్రా, కూతురు శర్మిష్ట.. రాజకీయాల్లో శ్రీమతి ఇందిరాగాంధీ.. ప్రణబ్ని నడిపించారు.. మహిళా సాధికారవాదిగా మలిచారు. ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది అనేవారు ప్రణబ్ ముఖర్జీ. ఆయనే అంటుండే ఇంకో మాట.. మహిళలు రాజకీయాల్లో వస్తే ఆ వెలుగులో సమాజం అభివృద్ధి అక్షరాలు దిద్దుకుంటుందని. ఇకనమిక్స్ పండిట్ ఆయన. మాటలు మరీ ఇంత సుకుమారంగా ఉండవు. ఉద్దేశం మాత్రం స్త్రీలకు.. నడిపించే సామర్థ్యం ఉందనే. ఎలా తెలుసు? ఆయనా ఒక మహిళ చూపిన దారిలోనే నడిచారు కనుక. ఒక మహిళ కాదు.. కొంతమంది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రణబ్కు దారి చూపిన మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. చాలా నేర్పించారు ఆమె ఈయనకు. ఒక్క ఇంగ్లిష్, హిందీ మాత్రం నేర్పించలేకపోయారు. అవి రెండూ ప్రణబ్కు రావని కాదు. వినసొంపుగా మాట్లాడ్డం సాధన చేయమనేవారు. ముఖ్యంగా ఇంగ్లిష్ను! ‘ఉచ్చారణను ఇంప్రూవ్ చేసుకోవయ్యా..’ అని ఆమె అంటే.. ‘సర్కిల్ నుంచి స్క్వేర్ను తయారు చేయాలని ప్రయత్నించకండి మేడమ్’ అని ఈయన నవ్వేవారు. ఇక పార్లమెంట్ చర్చా సమావేశాల్లోనైతే కొన్నిసార్లు శ్రీమతి గాంధీనే ప్రణబ్ మీదుగా గట్టెక్కేవాళ్లు. 1983లో లోక్సభలో చరణ్సింగ్ ఏవో కాగితాలు గాల్లోకి ఝుళిపిస్తూ.. ‘చూడండి. బడ్జెట్ ప్రసంగ పత్రాలివి. ప్రసంగానికంటే ముందు ఐ.ఎం.ఎఫ్.కి లీక్ అయ్యాయి’ అని ‘ఉమామహేశ్వరస్య ఉగ్రరూపస్య’ అయ్యాడు. శ్రీమతి గాంధీ ప్రధాని. అదెలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఆర్థికమంత్రి ప్రణబ్ కోసం చూశారు. చరణ్కి సమాధానం ఇవ్వాలి కదా. ఆ సమయంలో ప్రణబ్ రాజ్యసభలో ఉన్నారు. వెంటనే పిలిపించారు. ఆయన వచ్చేసరికి కూడా చరణ్ ఆగ్రహంతో ఊగిపోతూనే ఉన్నారు. ఆయన్ని మరికొంత సేపు మాట్లాడనిచ్చి.. అప్పుడు చెప్పారు ప్రణబ్.. ‘డేటు చూడండి. అవి గత ఏడాది నేను సమర్పించిన బడ్జెట్ ప్రసంగ పత్రాలు’అని! కాంగ్రెస్ బెంచీలు భళ్లున నవ్వాయి. శ్రీమతి గాంధీకి గొప్ప ఉపశమనం లభించింది. ప్రణబ్ ముఖర్జీ.. శ్రీమతి గాంధీకి సహచరులు మాత్రమే కాదు. సన్నిహితులు కూడా. కోపం వస్తే తిట్టేంత చనువుంది ఆమెకు. 1980 లోక్సభ ఎన్నికల్లో ఆమె వద్దంటున్నా కూడా పోటీ చేశారు ప్రణబ్. ఘోరంగా ఓడిపోయారు. శ్రీమతి గాంధీకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే కోల్కతా ఫోన్ చేశారు. ‘నువ్వు ఓడిపోతావని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆఖరికి గీతకు కూడా. కానీ నువ్వు వినలేదు. నాకు చిక్కులు తెచ్చిపెట్టావు’ అన్నారు. (ప్రణబ్ భార్య సువ్రా. శ్రీమతి గాంధీ, మరికొందరు స్నేహితులు ఆమెను గీత అని పిలిచేవారు). ప్రణబ్ మౌనంగా ఉన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనకు ఇంకో కాల్ వచ్చింది. సంజయ్ గాంధీ! ‘‘మమ్మీ.. మీ మీద చాలా కోపంగా ఉన్నారు. గురుతుల్యులు శ్రీమతి గాంధీ మీరు లేకుండా కేబినెట్ ఏమిటి అని కూడా అంటున్నారు. విమానంలో రేపటి కల్లా ఢిల్లీలో ఉండండి’’ అని చెప్పారు సంజయ్. ప్రణబ్ మీద శ్రీమతి గాంధీ నమ్మకం అంతటిది! ఆమె పట్ల ప్రణబ్ గమనింపు కూడా అంతలానే ఉండేది. బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ మొదటిసారి కలిసినప్పుడు శ్రీమతి గాంధీ ఏం తిన్నారో కూడా ఆయనకు గుర్తుంటుంది. రెస్పెక్ట్ విత్ కేరింగ్ అనుకోవాలి. భార్య సహా ప్రతి మహిళను ఆయన గౌరవంగా చూస్తారు. సఫ్దర్జంగ్ రోడ్డులో ప్రధాని వాజపేయి, ప్రణబ్ ముఖర్జీ ఇరుగు పొరుగుగా ఉన్నప్పుడు వాజపేయి దత్తపుత్రిక నమిత పెళ్లి కుదిరింది. పెళ్లి పనులన్నీ వాజపేయి అభ్యర్థనపై ప్రణబ్ భార్యే దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఆ పనుల్లో భార్యకు సహాయంగా ఉన్నారు ప్రణబ్! ప్రణబ్ తన జీవితంలో తొలిసారి చూసిన హిందీ సినిమా ‘రంగ్ దే బసంతి’. అది కూడా ఆయన చూడాలన్న ఆసక్తి కొద్దీ ఏం చూడలేదు. సెన్సార్ బోర్డు చీఫ్ షర్మిల ఠాగోర్ వచ్చి అడిగితే బలవంతంగా సరేనన్నారు. ఆమె ఎందుకు చూడమని అడిగారంటే.. అందులో భారత రక్షణ శాఖ మంత్రిపై ప్రతీకారం తీర్చుకునే కథాపరమైన అనివార్యత ఏదో ఉంది. ముందే చూపిస్తే తర్వాత తిట్లు పడవు కదా అని షర్మిల ఆలోచన. అప్పుడు మన రక్షణ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీనే. సినిమాను మహదేవ్ రోడ్డులోని ఓ థియేటర్లో ఆయన కోసం ప్రదర్శించి చూపించారు. సినిమా మధ్యలోనే బయటికి వచ్చేశారు ప్రణబ్. షర్మిల బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారు. ప్రణబ్ ఆమె వైపు చూసి, ‘దేశాన్ని కాపాడ్డం నా పని. సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కాదు’ అని నిష్క్రమించారు. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు షర్మిల. ‘రంగ్ దే బసంతి’ తర్వాత బహుశా ప్రణబ్ చూసిన రెండో హిందీ సినిమా ‘పీకూ’ అయుండొచ్చు. రాష్ట్రపతి భవన్లో వేసిన షోలో అడ్వాణీ తో కలిసి ఆ సినిమా చూశారు. వృద్ధుడైన తండ్రి, ఆయన కూతురు మధ్య ఉండే అనుబంధం ఆ సినిమా. నాయకులిద్దరూ కనెక్ట్ అయ్యారు. ఇద్దరికీ కూతుళ్లున్నారు మరి. ఒక విధంగా ప్రణబ్ది మహిళల వల్ల రూపు దిద్దుకున్న జీవితం. ఇంట్లో.. తల్లి రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ, భార్య సువ్రా, కూతురు శర్మిష్ట, రాజకీయాల్లో శ్రీమతి గాంధీ. అందుకే కావచ్చు ఆయనలో ఒక మహిళా సంక్షేమ, సాధికార, హక్కుల పరిరక్షణ యోధుడు కనిపిస్తాడు. భారత సైన్యంలో యుద్ధ విధుల్లోకి మహిళల ప్రవేశం ఆయన చొరవ కారణంగానే సాధ్యమయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గట్టి మద్దతు ఇచ్చిన వారిలో ఆయన ప్రథములు. మహిళల కోసం చట్టాలు చేసి ఊరుకుంటే సరిపోదని, చిత్తశుద్ధితో వాటిని అమలు పరచాలని ఆయన అంటుండేవారు. రాష్ట్రపతిగా 2012–17 మధ్య, ఇతర హోదాలలో అంతకుముందు, ఆ తర్వాత మహిళాభ్యున్నతికి, అభివృద్ధికి అనేక ప్రయత్నాలు చేశారు. సూచనలు ఇస్తూ వచ్చారు. చివరిసారి ఆయన మహిళల గురించి మాట్లాడింది.. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో జరిగిన ‘బేటీ పఢావో అభియాన్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా. ‘ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది’ అని అక్కడే ఆయన మరోసారి జాతి ప్రజలకు గుర్తు చేశారు. కూతురు శర్మిష్ఠ -
ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
-
అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
సాక్షి, విజయవాడ: పట్టణంలో పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజనలో 2.20 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 90 శాతం సంక్షేమ పథకాలను ఆయన ప్రజల వద్దకే తీసుకువచ్చారన్నారని ఆయన తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుని జూమ్ ద్వారా కులాలను, మతాలను రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇకనైన కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని, ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. -
ప్రణబ్కు నివాళులు అర్పించిన ప్రముఖులు
-
విడిది.. విశిష్ట అతిథి
సాక్షి, హైదరాబాద్: ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో దక్షిణాది విడిది అయిన బొల్లారంలోని ఆర్పీ భవనాన్ని నాలుగుసార్లు సందర్శించారు. 2012లో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది డిసెంబర్ నెలాఖరులో హైదరాబాద్లోని రాష్ట్రపతి భవన్కు శీతాకాల విడిదికి వచ్చారు. 2013 నూతన సంవత్సర వేడుకలను ఆయన ఇక్కడే జరుపుకొన్నారు. తిరిగి 2013 డిసెంబర్లోనూ ఇక్కడకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో మాత్రం ఆయన శీతాకాల విడిదికి హైదరాబాద్కు రాలేదు. మరుసటి ఏడాది డిసెంబర్కు బదులు జూలైలోనే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. ఆ ఏడాది కేవలం మూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. చివరిసారిగా 2016 డిసెంబర్లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. నక్షత్రవాటిక, దానిమ్మ తోటల ఏర్పాటు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్లోని నక్షత్ర వాటిక మాదిరిగానే, బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ నక్షత్ర వాటిక ఏర్పాటు చేయించారు. ఇందులో 27 నక్షత్రాలు (రాశులు) ప్రతిబింబించేలా 27 రకాల మొక్కలు ఏర్పాటు చేశారు. 99 ఎకరాల సువిశాల రాష్ట్రపతి నిలయంలో సగానికిపైగా స్థలం వృథాగానే ఉండేది. ఈ నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చిన ఆయన ఖాళీ స్థలాల్లో పండ్ల తోటలు, పూలమొక్కలు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్పటికే ఉన్న మామిడి, ఉసిరి, సపోటా తోటలకు అదనంగా దానిమ్మ తోటను ఏర్పాటు చేశారు. నేనున్నానంటూ భరోసానిచ్చారు: పీవీ వాణిదేవి సాక్షి, సిటీబ్యూరో: ‘నాన్న పీవీతో ప్రణబ్ ముఖర్జీది సుదీర్ఘ బంధం. నాన్న మరణం తర్వాత ఆయన మా కుటుంబానికి నేనున్నానన్న భరోసానిచ్చారు. కొన్ని సందర్భాల్లో పార్టీ పట్టించుకోకున్నా.. ఆయన మా కుటుంబానికి అండగా నిలిచారు. ప్రణబ్ మరణం దేశానికి తీరనిలోటు’ అని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు పీవీ వాణీదేవి అన్నారు. ప్రణబ్ మరణంపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 2012 డిసెంబరులో తొలిసారిగా పీవీ నర్సింహారావు స్మారక ఉపన్యాసాన్ని ప్రణబ్ ముఖర్జీయే ఇచ్చారని, ఆ రోజు తమ కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఫొటోలు తీయించారని వాణీదేవి గతాన్ని జ్ఞాపకం చేశారు. ప్రణబ్కు సీజీఆర్, గ్రేస్ నివాళి లక్డీకాపూల్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్), తూర్పు కనుమల పరిరక్షణ వేదిక (గ్రేస్) ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆయన మరణంతో దేశం పర్యావరణం పట్ల ఎంతో జ్ఞానం, స్పృహ కలిగిన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని అభిప్రాయపడింది. అర్ధ శతాబ్దానానికిపైగా వివిధ రూపాల్లో, హోదాల్లో ఆయన దేశానికి అందించిన సేవలు అనితర సాధ్యం, చిరస్మరణీయం అని పేర్కొంది. ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డి, లీలా లక్ష్మారెడ్డి (సీజీఆర్), దిలీప్రెడ్డి (గ్రేస్) ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు. -
ప్రణబ్కు ప్రముఖుల నివాళి
‘‘ప్రణబ్ ముఖర్జీ ఒక దిగ్గజం. మాతృదేశానికి యోగిలాగా సేవ చేశారు. భరతమాత ప్రియతమ పుత్రుడి మరణానికి దేశమంతా దుఃఖిస్తోంది. ఆధునికతను, సాంప్రదాయంతో మేళవించిన మనీషి భారత రత్న ప్రణబ్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’’ – రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ‘‘దేశం ఒక పెద్దమనిషిని కోల్పోయింది. కష్టించే గుణం, క్రమశిక్షణ, అంకితభావంతో ఆయన కిందిస్థాయి నుంచి దేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్ధాయికి ఎదిగారు. సుదీర్ఘ ప్రజాసేవలో ఆయన నిర్వహించిన ప్రతిపనికీ గౌరవం తెచ్చారు. ఓం శాంతి.’’ – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘‘2014లో ఢిల్లీకి నేను వచ్చినప్పటినుంచి ప్రణబ్ దార్శనికత, ఆయన ఆశీస్సులు నాకు మద్దతుగా నిలిచాయి. ఆయనతో అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రపతి భవన్ను వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంస్కృతిక కేంద్రంగా ఆయన మార్చారు. కీలక విధాన నిర్ణయాల్లో ఆయన సలహాలను ఎన్నటికీ మరువలేను. దేశ అభివృద్ధి పథంలో ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన్ని అన్ని రాజకీయ పక్షాలు గౌరవించేవి. సమాజంలో అన్ని వర్గాల అభిమానం చూరగొన్న వ్యక్తి భారతరత్న ప్రణబ్’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ప్రణబ్ చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. అన్ని రాజకీయ పక్షాలనేతలతో సుహృద్భావనతో మెలిగేవారు. అంకితభావంతో దేశానికి సేవ చేశారు. ఐదుదశాబ్దాలుగా అటు దేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ పయనంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన లేని లోటు తీర్చలేదని, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి.’’ – కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ‘‘ప్రణబ్ లేరన్న వార్త తీవ్ర విచారం కలిగించింది. ఆయన మరణంతో స్వతంత్ర భారతావనికి చెందిన ఒక గొప్పనాయకుడిని దేశం కోల్పోయింది. ఆయనతో కలిసి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన మేధస్సు, విజ్ఞానం, వివిధ ప్రజా విషయాలపై ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను.’’ – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘‘ప్రణబ్ ముఖర్జీ మృతి తీవ్ర వేదన కలిగిస్తోంది. అంకిత భావంతో దేశానికి సేవ చేసిన అనుభవజ్ఞుడు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణం దేశానికే గర్వకారణం. దేశ రాజకీయ యవనికపై ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓం శాంతి.’’ – హోం మంత్రి అమిత్షా ‘‘ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం బాధాకరం. దేశానికి ఆయన అనేక రూపాల్లో అంకితభావంతో సేవలనందించారు. అన్నిపార్టీలు ఆయన మేధస్సును గౌరవించేవి.’’ – బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘‘ ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్తతో దేశం తీవ్రవేదన చెందింది. దేశప్రజలతో పాటు ఆయనకు నా నివాళి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ – కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ‘‘ దేశప్రయోజనాలకే ప్రణబ్ పెద్దపీట వేసేవారు. రాజకీయ అస్పృశ్యతను ఆయన దరిచేరనీయలేదు. ఆర్ఎస్ఎస్కు ఆయన ఒక మార్గదర్శి. సంఘ్కు ఆయన లేని లోటు పూడ్చలేనిది.’’ – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘ ప్రణబ్ ముఖర్జీ ఒక పరిపూర్ణ పెద్దమనిషి. ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన మృతికి నా నివాళి.’’ – లతా మంగేష్కర్ ‘‘ భారత్ ఒక దిగ్గజ రాజకీయవేత్తను, గౌరవనీయుడైన నాయకుడిని కోల్పోయింది.’’ – అజయ్దేవగన్ ‘‘దశాబ్దాలుగా ప్రణబ్ దేశానికి సేవలనందించారు.ఆయన మృతి తీవ్ర విచారకరం.’’ – సచిన్ టెండూల్కర్ ‘‘ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి.’’ – విరాట్కోహ్లీ -
రాష్ట్రపతిగా ప్రణబనాదం
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలు మరపురానివి. మరువలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా, ఉత్తేజంగా రాష్ట్రపతిగా ప్రణబ్ ఉరిమే ఉత్సాహంతో పనిచేశారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత ఇంచుమించుగా అంతటి పేరు తెచ్చుకొని రాష్ట్రపతి భవన్కు పునరుజ్జీవనం తీసుకువచ్చారు. 2012–2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఇ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికంగా నిర్వహించారు. కేంద్రం అడుగులకి మడుగులు ఒత్తకుండా అన్నివైపుల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి కీలక శాఖలు నిర్వహించిన అనుభవం రాష్ట్రపతిగా ఆయన తీసుకునే నిర్ణయాలకు బాగా పనికివచ్చింది. తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆచితూచి అడుగులు పార్లమెంటు ఆమోదించిన బిల్లులు సంతకం కోసం రాష్టపతి దగ్గరకి వస్తే ఆయన వెంటనే ఆమోదించేవారు కాదు. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, నష్టాలేంటి అన్న అంశాలన్నీ నిశితంగా పరిశీలించేవారు. భూసేకరణ, పునరావాస చట్టంపై బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వివిధ అంశాలపై ఆర్డినెన్స్లు ఎక్కువగా తీసుకువస్తోందని దాదా ఆగ్రహించారు. ప్రజలకు చేరువగా భారతీయ చారిత్రక వైభవాన్ని, వారసత్వ సంపదని కాపాడుతూనే రాష్ట్రపతి భవన్ను ప్రజలకి చేరువ కావడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం ద్వారా రచయితలు, కళాకారులు, సృజనాత్మకత ఉన్నవారికి రాష్ట్రపతి భవన్ తలుపులు బార్లా తెరిచారు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న వారు రాష్ట్రపతి భవన్లో ఉంటూ ప్రాజెక్టులు నిర్వహించే సదుపాయం కల్పించారు. రాష్ట్రపతి భవన్కు ఎక్కువ మంది అతిథులు వచ్చేలా చర్యలు చేపట్టారు. క్షమాభిక్ష పిటిషన్లు ఉరిశిక్ష పడిన వారు దరఖాస్తు చేసుకునే క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఖాతాలో ఎక్కువగా తిరస్కరణలే ఉన్నాయి. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు పర్యాటక ప్రాంతంగా.. భారత్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రాష్ట్రపతి భవన్ను నిలపడానికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేశారు. రాష్ట్రపతి భవన్, మొఘల్ గార్డెన్స్, మ్యూజియం సందర్శించడానికి ప్రజలకు అనుమతులు ఇచ్చారు. ప్రణబ్ హయాంలో భారీగా ప్రజలు రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. 2017లో జరిగిన ఉద్యానోత్సవ్కి 7 లక్షల మంది వరకు హాజరవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’ ప్రణబ్ ముఖర్జీ హయాంలోనే రాష్ట్రపతి భవన్ మొదటిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టింది. 2014 జూలై 1న ట్విట్టర్లో అకౌంట్ ప్రారంభించి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ విరమణ చేసినప్పుడు 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజల మనిషి అయిన ప్రణబ్ ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’పేరును వాడారు. కొత్త మ్యూజియం రాష్ట్రపతి భవన్లో గుర్రపు శాలలు ఉండే ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఇందులో మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ఫొటోలను ఉంచారు. పురాతన ఆయుధాలు, ఫర్నీచర్ కూడా ఈ మ్యూజియంలో కనువిందు చేస్తాయి. -
బహుముఖ ప్రజ్ఞాశాలి... ప్రణబ్దా!
న్యూఢిల్లీ: బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ. దాదాపు 5 దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితం ఆయన సొంతం. చివరగా, అత్యున్నత రాజ్యాంగ పదవి ఆయన రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు విధులు నిర్వర్తించారు. అన్ని పార్టీలకు ఆమోదనీయ నేతగా ఆయన ఆ పదవి చేపట్టారు. 2019లో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’పొందారు. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రణబ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు గాంచారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు.. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేతగా, కుడి భుజంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ, రక్షణ, ఆర్థిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సంస్కరణల అమలుకు సాయమందించారు. తండ్రి సమరయోధుడు 1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. 1952–64 మధ్య పశ్చిమబెంగాల్ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యుడిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్గా కొంతకాలం పనిచేశారు. 1969 నుంచి అప్రతిహతంగా.. 1969లో ప్రణబ్ ముఖర్జీ క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సమయంలో జరిగిన మిడ్నాపుర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్ విజయంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యా న్ని కాంగ్రెస్ నాయకురాలు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గుర్తించి, పార్టీలో చేర్చుకున్నారు. 1969 జూలైలో రాజ్యసభకు పంపించారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై, పలుమార్లు సభా నాయకుడిగా విశేష సేవలందించారు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఆశీస్సులు, తన సామర్ధ్యంతో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ను ఆర్బీఐ గవర్నర్గా నియమించింది ప్రణబ్ ముఖర్జీనే కావడం విశేషం. 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రణబ్ ప్రఖ్యాతి గాంచారు. అయితే, ఇందిరాగాంధీ హత్య అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీలో, ప్రభుత్వంలో ప్రణబ్ను పక్కనపెట్టడం ప్రారంభమైంది. చివరకు, ఆయనను పశ్చిమబెంగాల్ పీసీసీ వ్యవహారాలు చూసుకొమ్మని కలకత్తాకు పంపించేశారు. ► ప్రణబ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు. ► దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి. ► ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్ను ప్రదానం చేశాయి. కుటుంబం ప్రణబ్కు మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద రు కుమారులు... ఇంద్రజిత్, అభిజిత్. కూతు రు షర్మిష్ట. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం లో షర్మిష్ట కీలకమైన సందర్భాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు. ప్రణబ్ అర్ధాంగి సువ్ర ముఖర్జీ 2015లో మరణించారు. 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అపారమైన జ్ఞాపకశక్తి, లోతైన విషయపరిజ్ఞానం, సమకాలీన అంశాలపై విస్తృత అవగాహన, పదునైన మేధోశక్తి... ప్రణబ్ను విశిష్టమైన రాజకీయవేత్తగా నిలిపాయి. 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింçహారావు, మన్మోహన్ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు. ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత. 1980–85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు. 2004–2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు. విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించడంలో దిట్ట. పార్టీలకతీతంగాఅందరి విశ్వాసం చూరగొన్నారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్కు స్వాతంత్య్రానంతర దేశ రాజకీయ చరిత్ర, పాలనా వ్యవహారాలు కొట్టినపిండి. దీంతో దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు. 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్– అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సహ చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, ఆధార్, మెట్రో రైలు ప్రాజెక్టులు లాంటి మన్మోహన్ సర్కారు నిర్ణయాల్లో ఆయనది ముఖ్యభూమిక. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ఏడాది తర్వాత జూన్, 2018లో నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంచలనం సృష్టించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ప్రణబ్ముఖర్జీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ప్రధాని కాలేకపోయారు 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1987లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రణబ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. రాజీవ్గాంధీతో సయోధ్య అనంతరం 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్లో విలీనం చేశారు. 1991లో రాజీవ్ హత్య తరువాత కేంద్ర రాజకీయాల్లో మళ్లీ ప్రణబ్ క్రియాశీలకం అయ్యారు. ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆ తరువాత కీలకమైన విదేశాంగ శాఖ అప్పగించారు. సోనియా రాజకీయాల్లోకి రావడానికి ప్రణబ్ వ్యూహమే కారణమని భావిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా స్వీకరించిన తరువాత, ప్రణబ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా నిరాకరించిన సమయంలో ప్రధానిగా అనుభవజ్ఞుడైన ప్రణబ్ పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ అనూహ్యంగా మన్మోహన్ ప్రధాని అయ్యారు. మన్మోహన్ కేబినెట్లోనూ ప్రణబ్ కీలకంగా ఉన్నారు. 2007లోనే ప్రణబ్ను రాష్ట్రపతిని చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ కేబినెట్లో ఆయన సేవలు అవసరమని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నారు. 2012లో రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు కాంగ్రెస్తోనే అనుబంధం కొనసాగింది. ఏకంగా 23 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీలో ఉన్నారు. మూడోసారి... కలిసొచ్చింది ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా... ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలనే బలమైన కోరిక మాత్రం ప్రణబ్ దాకు చాలాకాలం సాకారం కాలేదు. 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్పూర్ నుంచి లోక్సభకు పోటీచేసిన ప్రణబ్ముఖర్జీ ఓటమిపాలయ్యారు. తర్వాత 2004 దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోలేదు. మూడు కారణాలతో తాను మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగానని దాదా తన ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలో రాసుకున్నారు. ‘రాజ్యసభ సభ్యుడు మంత్రి కాగానే సాధ్యమైనంత తొందరగా లోక్సభకు ఎన్నిక కావడం మంచిదనేది నెహ్రూ విధానం. ఇదెప్పుడూ నా దృష్టిలో ఉండేది. రెండోది... 1984 తర్వాత ప్రతి ఎన్నికల్లో జాతీయ ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాను. ప్రచార కమిటీకి చైర్మన్గా ఉంటూ ప్రజాతీర్పును ఎదుర్కొనకపోతే ఎట్లా? అనేది నా మదిని తొలుస్తుండేది. మూడోది... నేను పోటీచేయాల్సిందేనని బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టి డిమాండ్ వచ్చింది. అందుకే 2004లో ముర్షిదాబాద్ నుంచి బరిలోకి దిగా’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లు ఎంపీగా చేసిన అబుల్ హస్నత్ ఖాన్ (సీపీఎం) ఆయన ప్రత్యర్థి. స్థానిక బీడీ కార్మికుల్లో బాగా పట్టున్న నేత. గెలుస్తానని స్వయంగా తనకే నమ్మకం లేనప్పటికీ... ప్రణబ్ను ముచ్చటగా మూడోసారి అదృష్టం వరించింది. దాదాపు 36 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే... పదవీకాలం ముగియగానే మళ్లీ రాజ్యసభకు పంపిస్తానని సోనియాగాంధీ అప్పటికే ఆయనకు హామీ ఇచ్చారు. పైగా ఓట్ల లెక్కింపు కోసం ప్రణబ్ ముర్షిదాబాద్కు వెళుతున్నపుడు... ఓటమి ఖాయమయ్యే దాకా వేచి ఉండొద్దు. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వచ్చేయమని సోనియా చెప్పారట. నాలుగో పుస్తకం... రాష్ట్రపతిగా తన ప్రయాణాన్ని ప్రణబ్ ముఖర్జీ చాలా విపులంగా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 11వ తేదీన ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం... ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ను విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ సోమవారం వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు. రాష్ట్రపతి భవన్ పనితీరుపై సమగ్ర అవగాహన కల్పించడమే కాకుండా, అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, నోట్లరద్దు... వంటి అంశాల్లో అసలేం జరిగిందో తాజా పుస్తకం వివరిస్తుందని రూపా పబ్లికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సర్జికల్ స్ట్రయిక్స్, ప్రధాని నరేంద్ర మోదీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ప్రణబ్ సంబంధాలపై కూడా ఇందులో వివరించారని తెలిపింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పనితీరుపై కూడా ఆయన తన అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. 2019లో రెండోసారి ఎన్నికల్లో గెలిచాక ప్రధాని మోదీకి మిఠాయి తినిపిస్తున్న ప్రణబ్ముఖర్జీ రాష్ట్రపతి కోవింద్ నుంచి భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రణబ్ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రణబ్ -
అనుభవశాలి కనుమరుగు
దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం గడించి, ఎన్నో పదవుల్లో రాణించి సమర్థుడిగా పేరుతెచ్చుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం కన్నుమూశారు. వేరే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు తనకు కరోనా సోకిందని నిర్ధారణ అయిందని గత నెల 10న ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. మెదడులో ఏర్పడిన అవరోధాన్ని తొలగించడానికి అదేరోజు ఆయనకు శస్త్రచికిత్స కూడా చేశారు. ఆనాటినుంచీ ఆయన సురక్షితంగా కోలుకుని బయటపడాలని దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ప్రణబ్ ఆరోగ్యం కుదుటపడుతోందని గత నెల 16న ఆయన కుమారుడు ట్వీట్ చేశారు కూడా. కానీ ఆ మరుసటి రోజునుంచే దురదృష్టవశాత్తూ ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడం మొదలుపెట్టింది. మధ్యలో కొద్దికాలం మినహా ప్రణబ్ ముఖర్జీ 1969లో కాంగ్రెస్లో చేరింది మొదలు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆ పార్టీతోనే ప్రయాణించారు. ఇందిరాగాంధీకి విశ్వాసపాత్రుడిగా మెలిగి 1973లో తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. రెవెన్యూ, బ్యాంకింగ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను స్వతంత్రంగా చూస్తున్న సమయంలో స్మగ్లర్ హాజీ మస్తాన్ నేర సామ్రాజ్యంపై దాడులు చేయించినప్పుడు మీడియాలో ఆయన పేరు మార్మోగింది. ఎమర్జెన్సీ పర్యవసానంగా 1977లో కాంగ్రెస్ ఓటమిపాలయ్యాక తాత్కాలికంగా తెరమరుగైనా 1982లో ఆ పార్టీ తిరిగి అధికారంలోకొచ్చినప్పుడు ప్రణబ్కు ఇందిరాగాంధీ కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను అప్పగించారు. స్వతంత్రంగా ఆలోచించడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మొదటినుంచీ ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. దేనికో ప్రభావితం కావడం, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం మొదటినుంచీ ఆయనకు పడదు. ఆయన హయాంలోనే భిన్న రంగాలకు సేవచేసేందుకు అనువుగా అనేక సంస్థలు మొగ్గతొడిగాయి. గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంకు వగైరాలు ప్రణబ్ చలవేనంటారు. అనునిత్యం ఎన్నో సవాళ్లు, సమస్యలు వచ్చిపడే రాజకీయ రంగంలో మానసిక ఒత్తిళ్లకు లోనుకాకుండా వుండటం అసాధ్యం. పరస్పర విరుద్ధమైన ప్రయోజనాల కోసం సంఘర్షించే భిన్న వర్గాలను ఒక తాటిపైకి తీసుకురావడం కూడా కష్టం. కానీ ప్రణబ్ వీటిని స్థిరచిత్తంతో ఎదుర్కొన్నారు. సమస్యను జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని, అన్ని వర్గాలతో ఓపిగ్గా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడంలో ప్రణబ్కు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ప్రభుత్వంలోనైనా, పార్టీలోనైనా ఆయన తీరు అదే. అందుకే ఆయన్ను ‘సంక్షోభ పరిష్కర్త’గా చూసేవారు. ఆర్థికమంత్రిగా వున్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) రుణాన్ని వెనక్కి తిప్పి పంపడం ఒక సంచలనం. సంస్కరణలవైపు మొగ్గుచూపినా వాటిని సంయమనంతో అమలు చేయడం ప్రణబ్ ప్రత్యేకత. ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్గాంధీ అధికారంలోకొచ్చాక ప్రణబ్ ప్రభ మసకబారడం మొదలైంది. తనను ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పంపారని అలిగిన ప్రణబ్ సొంతంగా రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ను స్థాపించారు. 1987 ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో మౌనంగా వుండిపోయారు. రాజీవ్ మరణానంతరం పీవీ నరసింహారావు హయాంలో తిరిగి కాంగ్రెస్లో చేరి పూర్వ వైభవాన్ని పొందగలిగారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకొచ్చినప్పుడు ప్రధాని పదవి చేపట్టడానికి సోనియాగాంధీ నిరాకరించాక అందరి దృష్టీ ప్రణబ్పైనే పడింది. పార్టీలో ఆయన్ను మించిన అనుభవశాలురు లేరు. కానీ రాజీవ్తో వున్న అనుభవంరీత్యా ఆయనేమీ ఆశించలేదు. ఇందిర హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేస్తూ రిజర్వ్బ్యాంకు గవర్నర్గా తాను నియమించిన మన్మోహన్ సింగ్ను ప్రధాని పదవికి ఎంపిక చేస్తే మారుమాట్లాడకుండా శిరసావహించారు. రెండోసారి 2009లో కూడా ప్రధాని పదవికి ప్రణబ్ పేరు ప్రస్తావనకొచ్చింది. కానీ అప్పుడూ ఆయనకు అది దక్కలేదు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రణబ్ తీరుపై సోనియాగాంధీకున్న భయాందోళనలే ఇందుకు కారణమంటారు. అయితే 2012లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఆయన తన అభీష్టాన్ని దాచుకోలేకపోయారు. రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ తొలి చాయిస్ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీయేనని అప్పట్లో మీడియాలో కథనాలొచ్చాయి. సంక్షోభ పరిష్కర్తగా వుండే ప్రణబ్ అనుభవాన్ని వదులుకోలేకే ఇలాంటి ఆలోచన చేసినట్టు కాంగ్రెస్ లీకులిచ్చినా 2014లో బొటాబొటీ మెజారిటీ వచ్చే పక్షంలో ఆయన సహకరించకపోవచ్చునన్న సంశయం సోనియాగాంధీకి వుందంటారు. ఏమైతేనేం రాష్ట్రపతి పదవికి ఆయన్ను ఎంపిక చేయక తప్పలేదు. సాధారణంగా రాజకీయాల్లో మునిగి తేలేవారికి పుస్తక రచన సంగతలావుంచి పుస్తకాలు చదవడానికి కూడా సమయం చిక్కదు. కానీ ప్రణబ్ ఇందుకు భిన్నం. ఆయన ఎన్ని సమస్యల్లో తలమునకలైవున్నా గ్రంథ పఠనానికి, అధ్యయనానికి సమయం కేటాయించుకునేవారు. రాష్ట్రపతి అయ్యాక తీరిక దొరకడం వల్ల కావొచ్చు...ఆయన తన అనుభవాలను రంగరించి మూడు పుస్తకాలు తీసుకొచ్చారు. పదవినుంచి వైదొలగాక మరో గ్రంథాన్ని రాశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనకెదురైన అనుభవాలు, వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలపై తన మనోభీష్టాన్ని వాటిల్లో వ్యక్తం చేశారు. అయితే సంక్షోభ పరిష్కర్తగా పేరున్నందువల్ల కావొచ్చు... ఎక్కడా ఆయన వివాదాస్పద అంశాల జోలికి పోలేదు. ఎవరినీ నొప్పించే ప్రయత్నం చేయలేదు. చివరకు రాజీవ్ తనను తొలుత కేంద్ర కేబినెట్ నుంచీ, ఆ తర్వాత పార్టీనుంచి సాగనంపడంపై ప్రచారంలో వున్న కథనాలను సైతం ఆయన కొట్టిపడేశారు. ఉద్దేశపూర్వకంగానే కొన్ని జ్ఞాపకాలను పంచుకోవడం లేదని కూడా ఆ పుస్తకాల్లో తేల్చిచెప్పారు. అయిదు దశాబ్దాలపాటు దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి కనుమరుగైన ప్రణబ్కు ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది. -
ప్రణబ్దా.. అల్విదా
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ దురంధరుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. అనారోగ్యంతో గత 21 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ప్రణబ్.. సోమవారం సాయంత్రం మృతి చెందారు. సాయం త్రం 4.30 గంటల సమయంలో గుండెపోటుతో ప్రణబ్ మరణించారని వైద్యులు ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అదే హాస్పిటల్లో ఆగస్టు 10న ఆయనకు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. అదే సమయంలో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో పాటు కరోనా కూడా సోకడంతో అప్పటి నుంచి ప్రణబ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పైనే కోమాలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను నేడు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్లోని çశ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబం వెల్లడించింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులను ప్రణబ్ అధిష్టించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశ రాజకీయ చిత్రపటంపై చెరగని ముద్ర వేసిన నేతగా పేరుగాంచారు. జీవితాంతం రాజకీయ దురంధరుడిగా, అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా దేశ ప్రజలు, సహచరుల మన్ననలు పొందారు. ఎన్నో సంక్షోభాల నుంచి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా గట్టెక్కించిన ట్రబుల్ షూటర్గా ఆయన గుర్తుండిపోతారు. 2019లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో ఆయనను గౌరవించింది. ప్రణబ్కు ఒక కుమార్తె షర్మిష్ట, ఇద్దరు కుమారులు అభిజిత్ ముఖర్జీ, ఇంద్రజిత్ ముఖర్జీ ఉన్నారు. భార్య సువ్రా ముఖర్జీ 2015లో చనిపోయారు. ప్రణబ్ మృతి వార్తను మొదట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీటర్ ద్వారా ప్రకటించారు. ఒక శకం ముగిసింది ప్రణబ్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రణబ్ మృతితో ఒక శకం అంతరించిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజా జీవితంలో శిఖరసమానుడు ప్రణబ్. ఒక యోగిలా మాతృభూమికి సేవ చేశారు. గొప్ప కుమారుడిని కోల్పోయిన భారతదేశం శోకతప్తమయింది. ఆయన కుటుంబానికి, మిత్రులకు, దేశ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’అని ఆయన ట్వీట్ చేశారు. సంప్రదాయం, ఆధునికత.. జ్ఞానం, వివేచన కలగలసిన నేతగా ప్రణబ్ను రాష్ట్రపతి ప్రశంసించారు. 2012 నుంచి 2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ ప్రణబ్ ఆప్తుడని కొనియాడారు. శిఖరాయమాన దార్శనికుడిగా, అత్యుత్తమ విజ్ఞాన ఖనిగా ఆయనను అభివర్ణించారు. ‘భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల దేశం యావత్తూ ఆవేదన చెందుతోంది. భారత దేశ అభివృద్ధి పథంపై తనదైన ముద్ర వేసిన నాయకుడు ప్రణబ్’అని ట్వీట్ చేశారు. ‘అనేక దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆర్థిక, ఇతర వ్యూహాత్మక మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రతో సేవలందించారు. ఆయన గొప్ప పార్లమెంటేరియన్. చర్చలకు బాగా సిద్ధమై వచ్చే నాయకుడు. గొప్ప వక్త. అంతే స్థాయిలో హాస్య స్ఫూర్తి ఉన్న నేత’అని మోదీ ట్వీట్ చేశారు. ప్రణబ్కు పాదాభివందనం చేస్తున్న ఫొటోతో పాటు మరికొన్ని ఫొటోలను ఆయన తన ట్వీట్కు జతచేశారు. ఇక ముందు ఎలా? పార్టీలో సీనియర్ సహచరుడు ప్రణబ్ మృతిపై తన సంతాపాన్ని ఒక లేఖ ద్వారా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆయన కూతురు షర్మిష్టకు తెలియపరిచారు. గత ఐదు దశాబ్దాల ప్రణబ్ జీవితం.. యాభై ఏళ్ల దేశ చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తుందని సోనియా అందులో కొనియాడారు. ‘ప్రణబ్దా దేశ చరిత్రలో, కాంగ్రెస్ ప్రస్థానంలో విస్మరించలేని భాగం. ముందు చూపు, విజ్ఞానం, అనుభవం, అద్భుత అవగాహనతో కూడిన ఆయన సలహాలు, సూచనలు లేకుండా ఇక ముందు ఎలా సాగుతామనేది ఊహించలేకుండా ఉన్నాం. నిర్వహించిన ప్రతీ పదవికీ ఒక దిశానిర్దేశం చేసిన నాయకుడు ఆయన. పార్టీలకు అతీతంగా అందరు నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేత. గొప్ప అంకితభావంతో దేశసేవ చేశారు’అని ప్రశంసించారు. వారం పాటు సంతాపం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రణబ్ మృతికి సంతాపసూచకంగా ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో జాతీయ పతాకం సగం వరకు అవనతం చేస్తారని తెలిపింది. బెంగాల్ నుంచి ప్రారంభం.. ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం 1969లో పశ్చిమబెంగాల్లో ప్రారంభమైంది. ఆ క్రమంలో ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయ నేతగా కాంగ్రెస్ పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. ఇతర సీనియర్ మంత్రులున్నప్పటికీ.. ప్రధాని ఇందిర తరువాత ఆమె మంత్రివర్గంలో నెంబర్ 2గా నిలిచారు. అయితే, ఇందిర మరణం అనంతరం పార్టీకి కొంతకాలం దూరమయ్యారు. తరువాత, ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆ తరువాత విదేశాంగ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. తదనంతర పరిణామాల్లో సోనియాకు విశ్వసనీయ సహచరుడిగా, కీలక వ్యూహకర్తగా, సంక్షోభ నివారణ నిపుణుడిగా కాంగ్రెస్ పార్టీలో పేరుగాంచారు. ప్రభుత్వ విధుల్లోనూ ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను అత్యంత ప్రతిభా సామరŠాధ్యలతో నిర్వహించారు. 47 ఏళ్ల వయస్సులోనే ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇందిర మరణం అనంతరం ఒకసారి, రాజీవ్ మృతి తరువాత మరోసారి ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఆయనకు తృటిలో చేజారింది. ప్రణబ్ 7 సార్లు ఎంపీగా ఉన్నారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో.. విరుద్ధ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న ప్రధాని మోదీతోనూ ఆయన సత్సంబంధాలను కొనసాగించడం విశేషం. -
దేశం ఓ వజ్రాన్ని కోల్పోయింది: చిరంజీవి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఈ రోజు సాయంత్రం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్ మృతి పట్ల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రణబ్ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. ‘ప్రణబ్ ముఖర్జీ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. అతనితో నేను గడిపిన క్షణాలను ఎప్పటికి గుర్తుంటాయి. ఒక గొప్ప జ్ఞానం, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని సాధించిన వ్యక్తి మీరు. మిమ్మల్ని మిస్ అవుతాము సర్.. దేశం ఈ రోజు ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రణబ్ దా..’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (ప్రణబ్ కుమార్తె భావోద్వేగ ట్వీట్) Deeply saddened by the demise of Shri #PranabMukherjee Will always treasure & cherish my interactions with him..An accomplished man of great wisdom & an illustrious political career..Will miss you Sir..The country has lost a precious diamond today...Rest in peace Dear Pranab Da! — Chiranjeevi Konidela (@KChiruTweets) August 31, 2020 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడం బాధగా ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. తన అత్యంత మేధోశక్తికి, ఉత్తమ నాయకునికి ఈ దేశం సంతాపం ప్రకటిస్తుందన్నారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు చేతులు జోడింది హృదయపూర్వక సంతాపం తెలిపారు. వీరితోపాటు అజయ్ దేవ్గణ్, తాప్సీ, రితేష్ దేశ్ముఖ్, లతా మంగేష్కర్, రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ దావన్, శిల్పా శెట్టి, శ్రీను వైట్ల వంటి పలువురు ప్రముఖులు ప్రణబ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.(దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం) Saddened to hear about the demise of our former President Shri Pranab Mukherjee. The nation mourns one of its most intellectual and inspiring leaders. Heartfelt condolences to the family and loved ones in this hour of grief. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2020 కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణ..బ్ ఆగస్టు 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా మెదడుకు డాక్టర్లు. సర్జరీ చేయగా..ఆస్పత్రిలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో కొంత కాలంగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందారు. రేపు ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మరణంతో దేశంలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాలు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. (చదవండి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత) అలాగే రాష్ట్రపతి భవన్తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. రేపు ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, గత కొంతకాలంగా కోవిడ్తో పాటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రంతుది శ్వాస విడిచారు. -
‘దాదా లేని ఢిల్లీని ఊహించలేం’
కోల్కతా : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మనల్ని వీడి వెళ్లడం బాధాకరమని, ఆయన మరణంతో ఓ శకం ముగిసిందని అన్నారు. దశాబ్ధాలుగా ప్రణబ్ ముఖర్జీ తనను తండ్రి మాదిరిగా ఆదరించారని చెప్పారు. ఎంపీగా తాను తొలిసారి గెలిచినప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీ తన సీనియర్ కేబినెట్ సహచరుడిగా ఆపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆయనతో అనుబంధం మరువలేనిదని మమతా పేర్కొన్నారు. దివంగత నేతతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, ప్రణబ్ దాదా లేకుండా ఢిల్లీ పర్యటన ఊహించలేనిదని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకూ అన్ని అంశాల్లోనూ ఆయన లెజెండ్ అని కొనియాడారు. ప్రణబ్ లేని లోటు పూడ్చలేనిదని ఆయన కుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ట ముఖర్జీలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి : ‘మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం’ It is with deep sorrow I write this. Bharat Ratna Pranab Mukherjee has left us. An era has ended. For decades he was a father figure. From my first win as MP, to being my senior Cabinet colleague, to his becoming President while I was CM...(1/2) — Mamata Banerjee (@MamataOfficial) August 31, 2020 -
‘మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం’
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. అందరికీ వందనం అంటూ ట్వీట్ను ప్రారంభించిన శర్మిష్ట ‘నాన్నా..అందరికీ మీ తుది వీడ్కోలు పలికేందుకు మీ అభిమాన కవి కోట్ను ఉదహరించే స్వేచ్ఛ తీసుకుంటున్నాను..దేశ సేవలో, ప్రజా సేవలో మీరు పూర్తిగా, అర్ధవంతమైన జీవితం గడిపారు..మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఇక ఆర్మీ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మరణించారని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రణబ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “সবারে আমি প্রনাম করে যাই” I bow to all🙏 Baba, taking the liberty to quote from your favourite poet to say your final goodbye to all. You have led a full, meaningful life in service of the nation, in service of our people. I feel blessed to have been born as your daugher. pic.twitter.com/etYfZXzZ1j — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 31, 2020 చదవండి : రాష్ట్రపతి భవన్ను సామాన్యులకు చేరువ చేశారు : మోదీ -
తెలంగాణతో విడదీయలేని అనుబంధం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రియతమ నేత, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం ఎంతో బాధాకరం. దూరదృష్టి కలిగిన నేత, మంచి వక్త, రచయిత, గొప్ప పార్లమెంటేరియన్ అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. భారతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ మరణం కేవలం దేశానికే కాదు.. మానవాళికీ తీరని లోటు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షకుడిగా పేరొందిన ప్రణబ్ మరణంతో దేశం ఓ గొప్ప నేత, పాలనాదక్షుడు, మానవతావాదిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరి.. స్వర్గలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’అని గవర్నర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణతో విడదీయలేని అనుబంధం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ అంశంతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు’అని సీఎం తన సంతాప సందేశంలో గుర్తు చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర డిమాండ్లో న్యాయం ఉందని ప్రణబ్ భావించేవారు. నేను కలసిన ప్రతీసారి ఎన్నో విలువైన సూచనలు చేసేవారు. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత నాకు దక్కిందని ప్రత్యేకంగా అభినందించారు. ప్రణబ్ రాసిన ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్కు తెలంగాణ అంశమే తప్ప పోర్ట్ఫోలియో అక్కరలేదని పేర్కొన్నారు’అని ప్రణబ్తో అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా ప్రణబ్ గుర్తించినట్లు అర్థమవుతోందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. యాదాద్రి దేవాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారని గుర్తు చేశారు. ప్రణబ్ మరణం తీరని లోటని సీఎం పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ప్రణబ్కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారం పాటు సంతాప దినాలు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి నివాళిగా వారం రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలు పాటిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. వారం రోజుల పాటు ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. తెలంగాణ రుణపడి ఉంటుంది: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రాజకీయ కురువృద్ధుడు, గొప్ప ఆర్థికవేత్త, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నాయకులుగా దశాబ్దాల పాటు పనిచేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ పని చేస్తున్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రణబ్కు తెలంగాణ రాష్ట్రం రుణపడి ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో ఉత్తమ్ పేర్కొన్నారు. దేశంలో అనేక కీలక సమస్యలను పరిష్కరించడంలో ప్రణబ్ ముఖ్యపాత్ర పోషించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఉత్తమ్ తెలిపారు. ప్రణబ్ మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు కె. జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, మర్రి శశిధర్రెడ్డి, కోదండరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులున్నారు. తెలంగాణ ఏర్పాటులో ఆయనది కీలకపాత్ర: మంత్రులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణపై యూపీఏ ఏర్పాటు చేసిన కమిటికీ సారథ్యం వహించిన ప్రణబ్.. రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు. భారత రాజకీయాల్లో ప్రణబ్ భీష్మాచార్యులు లాంటి వారని కొనియాడారు. రాష్ట్రపతిగా తెలంగాణ బిల్లుపై సంతకం చేసి ప్రణబ్ కోట్లాది మంది తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరేలా చూశారని మంత్రులు నివాళి అర్పించారు. సంతాపం ప్రకటించిన వారిలో మంత్రులు కేటీ రామారావు, హరీశ్రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులున్నారు. సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు.. ‘భారతరత్న’ప్రణబ్ ముఖర్జీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగారు. భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఆయన ఒకరు. ప్రణబ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఆర్థిక సంస్కరణల అమలులో కీలకపాత్ర ప్రణబ్ ముఖర్జీ లేని లోటు తీరనిది. ఆయన మరణం చాలా బాధకు గురి చే సింది. లోతైన విషయం పరిజ్ఞానమున్న ప్రణబ్ రాష్ట్రపతిగా, ఆర్థిక మంత్రిగా దేశానికందించిన సేవలు మరువలేనివి. ఆర్థిక సంస్కరణల అమలులో ఆయనది కీలకపాత్ర. కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఆయన్ని కలసి అనేక విషయాలు చర్చించేవాడిని. – హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అజాత శత్రువు.. రాజకీయ దురంధరుడు ప్రణబ్ అజాత శత్రువు. గొప్ప రాజకీయ దురంధరుడు. నా గురు సమానులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ కృషి అభినందనీయం. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన సమయంలో ప్రణబ్తో ఏర్పడిన సాన్నిహిత్యం ఎంతో నేర్చుకునేందుకు ఉపయోగపడింది. ఉత్తమ పార్లమెంటేరియన్గా ప్రణబ్ ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారు. ఆయన మరణం దేశానికే కాకుండా నాకు తీరని లోటే. – కె.కేశవరావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత ప్రణబ్ మరణం తీరని లోటు ప్రణబ్ ముఖర్జీ మరణం దేశ ప్రజలకు తీరని లోటు. రాజనీతి శాస్త్రం చదువుకున్న ఆయన అందులోని అంశాలను అక్షరాలా అనుసరించారు. వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రణబ్ కృషి చేశారు. – కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు ప్రణబ్ మృతిపట్ల సీపీఐ నేతల సంతాపం సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సీపీఐ నాయకులు సురవరం సుధాకర్రెడ్డి, డా. కె.నారాయణ, అజీజ్పాషా, చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. సెక్యులర్ భావాల పట్ల నిబద్ధతతో పాటు చివరి వరకూ జాతి సమైక్యత కోసం ప్రణబ్ ముఖర్జీ గొప్ప కృషి చేశారని వారు నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత అస్తమించిన అజాతశత్రువు ప్రణబ్ -
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫోటోలు
-
రాష్ట్రపతి భవన్ను సామాన్యులకు చేరువ చేశారు : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ప్రణబ్ ముఖర్జీదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, మేథావిని దేశం కోల్పోయిందని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రణబ్ విశేషంగా కృషి చేశారని అన్నారు. రాజకీయాలు, వర్గాలకు అతీతంగా ప్రణబ్ ముఖర్జీ అందరికీ ఆరాధ్యులని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పలు పాలనా విధానాలపై ఆయన చేసిన సూచనలు సదా స్మరణీయమని చెప్పారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూతతో దేశం విషాదంలో కూరుకుపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రణబ్ భరతమాత ముద్దుబిడ్డ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఇక ప్రణబ్ ముఖర్జీ క్రమశిక్షణ, అంకిత భావంతో దేశానికి సమున్నత సేవలు అందించారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దివంగత నేతకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొప్ప నేతను కోల్పోయాం : అమిత్ షా దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని హోంమంత్రి అమిత్ షా ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని, ఆయన మాతృభూమికి ఎనలేని సేవ చేశారని ప్రస్తుతించారు. రాహుల్ సంతాపం మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రణబ్ మృతి పట్ల యావత్ జాతి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తోందని రాహుల్ అన్నారు -
కాంగ్రెస్ కుట్ర : ప్రణబ్ ప్రధాని అయ్యేవారు
సాక్షి, న్యూఢ్లిలీ : కాంగ్రెస్ పార్టీలో ఓ శకం ముగిసింది. ఆ పార్టీ సీనియర్ నేత, మూడు తరాల నాయకులకు నమ్మకమైన వ్యక్తిగా సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ మృతిచెందారు. నిజ జీవితంలో, రాజకీయాల్లోనూ అజాతశత్రుగా కీర్తిగఢించి ప్రణబ్ కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవచేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకే కాకుండా యావత్ దేశానికీ తీరనిలోటుగా పలువురు వర్ణిస్తున్నారు. ఇటీవల బ్రెయిన్ క్లాట్ కోసం సర్జరీ చేయించుకున్న ప్రణబ్ ముఖర్జీకు ఆపరేషన్ సమయంలో కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడంతో దాదాపు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచారు. నాలుగు తరాలను ముందుండి నడిపించారు.. 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్లో జన్మించిన ప్రణబ్ముఖర్జీ ఎమ్ఏ, న్యాయవాద విద్యలనూ పట్టా అందుకున్నారు. అనంతరం కొంతకాలంపాటు లెక్చరర్గా పనిచేశారు. తొలినుంచి సామాజిక దృక్పథం కలిగిన ప్రణబ్.. పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి1969 కోల్కత్తాలోని మిడ్నాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించించారు. వెంటనే ప్రణబ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తన అక్కున చేర్చుకుంది. అనంతరం 34 ఏళ్లకే కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1973లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఎంపికై నాటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మినబంటుగా పేరుబడ్డారు. ఈ క్రమంలోనే వరుసగా 1975, 1981, 1993, 1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఇందిరా గాంధీ మరణం అనంతరం రాజీవ్కు అండగా నిలబడి.. కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్నారు. పీవీ నరసింహారావు హాయంలో 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్గా నియమితులైయ్యారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఎన్నిక కావడంలో కీలకపాత్ర పోషించారు. ఇందిరా గాంధీ, రాజీవ్, సోనియా, రాహుల్ నాయకత్వంలోనూ కాంగ్రెస్కు అండగా నిలిచి.. నాలుగు తరాలను ముందుండి నడిపించారు. ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరు.. 2004లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. యూపీయే ప్రభుత్వంలో 2004 నుంచి 2012 వరకు కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు సమర్థవంతగా నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్ను గుర్తింపబడ్డారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. బీజేపీ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత అవార్డును ప్రకటించడం గమనార్హం. 2012 జూలై 25 నుంచి 2017 జూలై 25 వరకు భారత 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు. 2018లో ఆరెస్సెస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరైన తొలి మాజీ రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలో కొన్ని వర్గాల నుంచి విమర్శలతో పాటు.. అజాతశత్రుగా కూడా పేర్కొనబడ్డారు. కాంగ్రెస్ కుటిల రాజకీయం.. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా హత్య తర్వాత తానే నిజమైన వారసుడిగా భావించిన ప్రణబ్ డిమాండ్ను తోసిపుచ్చి రాజీవ్ను తెరపైకి తీసుకువచ్చారు. అనుకున్న పదవి దక్కకపోవడంతో 1984లో కాంగ్రెస్కు ప్రణబ్ గుడ్బై చెప్పారు. రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పేరుతో 1984లో ప్రణబ్ సొంత పార్టీ స్థాపించారు.1989లో రాజీవ్గాంధీ ఆయన్ని బుజ్జగించి తిరిగి కాంగ్రెస్లోకి తీసుకువచ్చారు.1991లో రాజీవ్ హత్య తర్వాత ప్రధాని అయ్యేందుకు ప్రణబ్ ప్రయత్నాలూ చేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీని కాదనుకుని పీవీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాల ఫలించకపోతే ప్రణబ్ ఎప్పుడో దేశ ప్రధాని అయ్యేవారిని ఆయన సహచరులు చెబుతుంటారు. ఆరు దశాబ్ధాల పాటు రాజకీయల్లో కొనసాగిన దాదా.. పార్లమెంటు వ్యవహారాల్లో ఆయన్ని మించిన వారు లేదనే విధంగా మెలిగారు. తెలంగాణ బిల్లుపై సంతకం.. ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణతో ప్రత్యేక అనుభందం ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ సంతకం పెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునః విభజన బిల్లుపై సంతకం చేశారు. ఆయన జారీచేసిన ప్రత్యేక గెజిట్ ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రణబ్ నాయకత్వం వహించారు. ఆసియా అత్యుత్తమ ఆర్థిక మంత్రి మరోవైపు రచయితగా కూడా ప్రణబ్ పలు పుస్తకాలను రచించారు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’ పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. -
ప్రణబ్ మృతి : సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయం అని కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్ దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. The unfortunate demise of Shri Pranab Mukherjee is a tragic loss to the nation. His invaluable contributions to the nation's progress in over 5 decades of exemplary service will always be remembered with great pride. My thoughts & prayers are with the grieving family. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 31, 2020 ముఖర్జీ సేవలు అజరామరం: గవర్నర్ బిశ్వ భూషణ్ ప్రణబ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ సేవలు అజరామరం అని కొనియాడారు. ఐదు దశాబ్ధాల పాటు దేశానికి ఎంతో సేవ అందినారని ప్రశంసించారు. బహుళపార్టీ వ్యవస్ధలో ఏకాభిప్రాయ సాధకునిగా ప్రశంశలు అందుకున్న వ్యక్తి ప్రణబ్ అని కొనియాడారు. ముఖ్యమైన చట్టాల రూపకల్పనలో ప్రణబ్ కీలక భూమికను పోషించారని గుర్తుచేశారు. ప్రొఫెసర్ గా, జర్నలిస్టు గా,రచయత గా,ఆర్థిక వేత్త గా పార్టీలకతీతంగా వారు దేశానికి చేసిన సేవ మహోన్నతం. ఆయన మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ దేశం పెద్ద రాజనీతిజ్ఞడ్ని కోల్పోయిందంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో మహోన్నత నేత అని, ఆయన భరత మాతకు ఓ రుషి మాదిరిగా సేవ చేశారని రాష్ట్రపతి కోవింద్ కొనియాడారు. అత్యంత విలువైన బిడ్డల్లో ఒకరిని కోల్పోయినందుకు దేశం శోకిస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రజలందరికీ సంతాపం తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రణబ్.. సోమవారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. India grieves the passing away of Bharat Ratna Shri Pranab Mukherjee. He has left an indelible mark on the development trajectory of our nation. A scholar par excellence, a towering statesman, he was admired across the political spectrum and by all sections of society. pic.twitter.com/gz6rwQbxi6 — Narendra Modi (@narendramodi) August 31, 2020 మాజీ రాష్ట్రపతి , భారతరత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. దేశం ఓ రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. క్రమశిక్షణ, కఠోరశ్రమ, అంకితభావంతో దేశరాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆదర్శనీయులు. pic.twitter.com/uFfS9rUQqv — Vice President of India (@VPSecretariat) August 31, 2020 -
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు. ప్రణబ్ జీవిత చరిత్ర ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్ఎల్బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా పనిచేశారు. రాజకీయ జీవితం 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక 1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక 1980-85 వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత 1973-74 కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా 1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా... 1974-75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా.. 1975-77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా.. 1980-82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా.. 1982-84లో ఆర్థికమంత్రిగా.. 1991-96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా.. 1993-95లో వాణిజ్యశాఖ మంత్రిగా.. 1995-96లో విదేశాంగమంత్రిగా.. విధులు నిర్వర్తించారు జంగీపూర్ నుంచి 2004లో లోక్సభకు ఎన్నిక 2004-06లో రక్షణశాఖ మంత్రిగా.. 2006-09లో విదేశాంగమంత్రిగా.. 2009-2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. -
‘సెప్టిక్ షాక్’లోకి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఆయన ఆరోగ్యాన్ని మరింత కుంగదీసిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నిన్నటి నుంచి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ‘సెప్టిక్ షాక్’లోకి వెళ్లారు. నిపుణులైన వైద్య బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం ప్రణబ్ డీప్ కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అంటూ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. (చదవండి: ఆస్పత్రి నుంచి అమిత్ షా డిశ్చార్జ్) సాధారణంగా ‘సెప్టిక్ షాక్’కి గురయ్యే వ్యక్తుల్లో గుండె, మెదడు, కిడ్నీలు వంటి కీలక అవయవాలు దెబ్బతినడం, బీపీ తీవ్రంగా పడిపోవడం జరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకరకంగా సెప్టిక్ షాక్లోకి వెళ్లడమంటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత శరీరంలో బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది. ఇక ప్రణబ్ ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా ట్వీట్ చేస్తున్న అతని కుమారుడు అభిజిత్ ముఖర్జీ ‘ప్రతి ఒక్కరూ తన తండ్రి కోసం ప్రార్థించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం క్లిష్టంగానే ఉందని.. కానీ అతని కీలకమైన పారామీటర్స్ అన్ని స్థిరంగా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు. I urge all my friends here to pray for the recovery of My father #PranabMukherjee . He is a fighter & with all your good wishes & prayers , He will surely recover ! At the moment he is critical but all his vital parameters are stable ! — Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 31, 2020 -
డీప్ కోమాలోకి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. డీప్ కోమాలోకి ప్రణబ్ వెళ్లారని ప్రకటించారు. ఇప్పటి వరకు అందించిన వైద్య చికిత్సతో ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులేదని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పైనే ప్రణబ్కు చికిత్స కొనసాగుతోందని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా బ్రెయిన్ సర్జరీ తర్వాత కరోనా బారినపడటంతో ప్రణబ్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. (క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) -
క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఇంకా తీవ్ర కోమాలోనే ఉన్నట్లు ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటెన్లో తెలిపింది. ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. (చదవండి: ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్కు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిన సంగతి తెలిసిందే. -
కోమాలోకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ (84) ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నామని ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఆయన కోమాలోనే ఉన్నారని ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కాగా, ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. (చదవండి: కాంగ్రెస్ నాయకత్వంపై సీనియర్లు లేఖ) -
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై తాజా అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఆయన శరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. (చదవండి : 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు) కాగా, ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందుతోంది. -
ప్రణబ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
-
మరింత విషమంగా ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని ఆయనకు వైద్యం చేస్తున్న ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్పైనే కొనసాగతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ప్రణబ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జి ట్వీట్ చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. (ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు) తండ్రిని గుర్తు చేసుకుంటూ శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా ప్రణబ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరం కాలేదన్నారు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం తనకుంది అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ ఫోటోలను ఆమె షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు’
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏ మాత్రం మార్పు లేదని ఆర్మీ హాస్పటల్ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ హాస్పటల్ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృందం ఎప్పటికపుడు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. (విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్కు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. . ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా ఉన్నారు. (కుదుటపడుతున్న ప్రణబ్ ఆరోగ్యం') -
విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రణబ్ శరీరం వైద్యం అందించడానికి సహకరిస్తూ స్థిరంగా ఉందని తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. -
'కుదుటపడుతున్న ప్రణబ్ ఆరోగ్యం'
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి ఆదివారం తెలిపింది. నేడు కూడా ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ మాత్రం ప్రణబ్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు పేర్కొన్నారు. "నిన్న ఆస్పత్రికి వెళ్లి నా తండ్రిని చూశాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదాల వల్ల ఆయన ఆరోగ్యం కుదుటపడుతోంది. ముందుకన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగవుతోంది. ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే స్పందిస్తున్నాయి. చికిత్సకు కూడా స్పందిస్తున్నారు. ఆయన త్వరలోనే మన మధ్యకు వస్తారని విశ్వసిస్తున్నా" అని తెలిపారు. (ఇంకా వెంటిలేటర్పైనే ప్రణబ్) కాగా మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆరోజు నుంచి ఆయన వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు మరోవైపు సోషల్ మీడియాలో ప్రణబ్ మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో ఆయన కుమారుడు వాటన్నింటినీ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. (కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ) -
ఇంకా వెంటిలేటర్పైనే ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి వైద్య బృందం శనివారం తెలిపింది. ఆయన పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, వెంటిలేటర్పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. ‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయనను ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణ కొనసాగుతోంది’ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (చదవండి : ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందుతోంది. -
‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించారు. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందుతోంది. ఈ కారణంగా ఆయన శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రణబ్ హాజరు కాకపోవడంతో.. ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ తన తండ్రి జ్ఞాపకాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. (చదవండి : వెంటిలేటర్పైనే ప్రణబ్) ‘చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా నాన్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మిస్ చేసుకోలేదు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం నాకుంది’అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ ఫోటోలను ఆమె షేర్ చేశారు. In his childhood, my dad & my uncle would hoist National Flag at our ancestral home in village. Since then, he never missed a year to hoist tri-colour on Independence Day. Sharing some memories from last years celebration at home. I’m sure he’ll do the same next year. Jai Hind 🇮🇳 pic.twitter.com/SX0CVO8lW6 — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 15, 2020 -
వెంటిలేటర్పైనే ప్రణబ్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందుతోంది. అయితే, పరిస్థితి దిగజారలేదనీ, ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే పనిచేస్తున్నాయని కుమార్తె శర్మిష్ఠ శుక్రవారం చెప్పారు. ‘వైద్యపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే, నిలకడగా మాత్రం ఉంది. ఆయన నేత్రాలు వెలుతురుకు కాస్తంత స్పందించడం కనిపిస్తోంది’అని ట్విట్టర్లో శర్మిష్ఠ ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రణబ్ ముఖర్జీ బాహ్య స్పర్శకు, చికిత్సకు స్పందిస్తున్నారు. 96 గంటల అబ్జర్వేషన్ సమయం నేటితో పూర్తవుతోంది’అని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో తెలిపారు. ‘దేశ ప్రజల నుంచి నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే పొందాను..అని మా నాన్న ప్రణబ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’అని అభిజిత్ కోరారు. -
కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రి గురువారం తెలిపింది. ప్రణబ్ చికిత్సకు మెల్లిగా స్పందిస్తున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ‘నా తండ్రి ఒక పోరాటయోధుడు. చికిత్సకు నెమ్మదిగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా శ్రేయోభిలాషులను కోరుతున్నాను’అని అభిజిత్ ట్వీట్ చేశారు. మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరగా ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స జరిగింది. మరోవైపు ప్రణబ్ మరణించారన్న వదంతులు ప్రబలడంతో ఆయన కుమారుడు అభిజిత్ వాటిని కొట్టిపారేశారు. ‘‘మా తండ్రి శ్రీ ప్రణబ్ బతికే ఉన్నారు. పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్టులే ఊహాగానాలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం భారత మీడియా రంగం నకిలీ వార్తల ఫ్యాక్టరీగా మారిందన్న ఆరోపణలకు అద్దం పట్టేదిలా ఉంది’’అని ట్వీట్ చేశారు. ‘‘మా తండ్రికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఆసుపత్రి నుంచి వచ్చే సమాచారం కోసం ఫోన్ అందుబాటులో ఉంచాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఎవరూ.. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు నన్ను సంప్రదించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా’’అని ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ట్వీట్ చేశారు. -
ఆ వార్తలను నమ్మొద్దు.. ప్రణబ్ కోలుకుంటున్నారు
-
ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. వాటిని ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని తెలిపారు. ఆ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, తమ తండ్రి కోలుకుంటున్నారని ట్విటర్లో వెల్లడించారు. సోషల్ మీడియాలో తమ తండ్రి అనారోగ్యంపై వచ్చే వార్తలు ఆసత్యమని, ముఖ్యంగా మీడియా గమనించాలని తెలిపారు. Rumours about my father is false. Request, esp’ly to media, NOT to call me as I need to keep my phone free for any updates from the hospital🙏 — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 13, 2020 ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable ! Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News . — Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020 -
ప్రణబ్ ముఖర్జీ : ఎంత నొప్పితో బాధపడుతున్నా..
కోల్కతా : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఎంతో నొప్పిని సైతం ఓర్చుకొని ప్రశాంతంగా ప్రణబ్ కనిపించేవారని 13 ఏళ్ల క్రితం ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ బసుదేవ్ మొండాల్ అన్నారు. '' 2007లో ముర్షిదాబాద్ నుంచి కోల్కతా వెళ్తుండగా నాడియా జిల్లాలో ప్రణబ్ ముఖర్జీ కారు ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో కారు ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో అప్పటి విదేశాంగ మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ సిటీ స్కాన్, ఎక్స్ రే వంటి సౌకర్యాలు లేనందున ఆయన్ని మా నర్సింగ్ హోంకు తీసుకువచ్చారు. (మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) అంతకుముందే నాకు పరిస్థితిని వివరించి అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాల్సిందిగా ఫోన్ రావడంతో చాలా అలర్ట్ అయ్యాను. అన్నీ సిద్ధం చేశాను. ఆ సమయంలో ముఖర్జీ తలకు బలమైన గాయం కావడంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా, వినయంగా కనిపించారు. ఇక పరీక్షలు అదృష్టవశాత్తూ ఆయనకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. ఆ తర్వాత అయన్ని అక్కడినుంచి కోల్కతా లోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత 2016లో ఓ కార్యక్రమం సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని ఆహ్వనించడానికి వెళ్లాను. అప్పటికీ ఆయన రాష్ర్టపతిగా ఉన్నారు. నన్ను చూడగానే గుర్తుపట్టి, చాలా ఆప్యాయంగా పలకరించారు. నా సేవలను గుర్తిచేస్తూ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమానికి హాజరవుతానన్న వాగ్ధానాన్ని కూడా నిలబెట్టుకున్నారు'' అంటూ డాక్టర్ మొండల్ ప్రణబ్ ముఖర్జీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రణబ్కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
ప్రణబ్ ఆరోగ్యం విషమమే
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతం లోని ఆసుపత్రిలో ప్రణబ్ 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మొదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవా లని ఆయన స్వగ్రామమైన బెంగాల్లోని మిరిటీలో మూడు రోజులుగా మృత్యుంజయ మంత్ర జపం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా..ప్రణబ్ ముఖర్జీకి ఏది మంచిదైతే భగవంతుడు తనకు అదే ఇవ్వాలని కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’అందుకున్న ఏడాదికే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం తనను బాధిస్తోందని కాంగ్రెస్ నేత కూడా అయిన షర్మిష్ట తెలిపారు. -
విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. 84 ఏళ్ల ప్రణబ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారని ఇక్కడి ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ కోసం సోమవారం ప్రణబ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ‘ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితి ఉండటంతో బ్రెయిన్ క్లాట్ను తొలగించడానికి సోమవారం అత్యవసరంగా శస్త్రచికిత్స చేశాం. ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోగా.. మరింత క్షీణించింది. వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్నారు’అని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్యం బాగాలేక ప్రణబ్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు చేసిన పరీక్షల్లో మెదడులో రక్తగడ్డకట్టినట్లు తేలింది. కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. కరోనా పాజిటివ్ ఉన్నా మెదడులో రక్తం గడ్డ పెద్దది కావడంతో వెంటనే వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం వివిధ విభాగాలకు చెందిన నిపుణులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. 2012–2017 మధ్యకాలంలో ప్రణబ్ భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు. -
మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ : బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రణబ్కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. కాగా మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. (ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం) అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ‘ప్రణబ్కు బ్రెయిన్ క్లాట్ను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్పై ఉన్నారు’అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి. దాదాకు కరోనా పాజిటివ్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కోవిడ్–19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత వారంలో తనను సంప్రదించిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం లేదా కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడమో చేయాలని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూడా అయిన ఆయన విజ్ఞప్తి చేశారు. 2012–17 మధ్యకాలంలో ప్రణబ్ రాష్ట్రపతిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్ఆర్ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్ చేసి ప్రణబ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్ గోయల్ తదితర నేతలు మాజీ రాష్ట్రపతికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు. -
మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్
-
మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వేరే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినపుడు తనకు కరోనా నిర్దారణ అయిందని ప్రణబ్ ట్వీట్ చేశారు. గతవారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అందించిన సమాచారం ప్రకారం వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్ కేసులతో 22 లక్షల కేసులను అధిగమించిందని, 44 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. అయితే రికవరీ రేటు 69.33 శాతంగా ఉందని, మరణాల రేటు కొత్త కనిష్టాన్ని (2 శాతం) చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today. I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee — Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020 -
పలువురు నేతలకు ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులతో ఫోన్లో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తిన పరిస్థితులపై వారితో చర్చించారు. ఆదివారం ప్రధాని మోదీ.. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడలతో కూడా ఫోన్లో సంభాషించారు. ఇంకా.. సమాజ్వాదీ పార్టీ అగ్ర నేతలు అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్తోనూ మాట్లాడారు. పార్లమెంట్లో వివిధ పక్షాల నేతలతో ప్రధాని మోదీ ఈనెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
జీడీపీ ఒక్కటే ముఖ్యం కాదు
-
భారత రత్న పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన భారత రత్న పురస్కారాలను గురువారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఈ అవార్డులను ముఖర్జీకి, హజారికా కొడుకు తేజ్కు, నానాజీ సన్నిహిత బంధువు విక్రమజీత్ సింగ్కు రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో అందజేశారు. నానాజీ, హజారికాలకు ఈ అవార్డును వారి మరణానంతరం ప్రకటించారు. ‘ప్రణబ్ దా’ అని సన్నిహితులు ప్రేమగా పిలుచుకునే ప్రణబ్ ముఖర్జీ.. భారత రత్న అందుకున్న ఐదో రాష్ట్రపతి. కాంగ్రెస్కు అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రణబ్ భారత్కు అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. నానాజీ దేశ్ముఖ్కు 1928 నుంచి ఆయన చనిపోయే వరకు ఆరెస్సెస్తో సంబంధాలు ఉన్నాయి. భారతీయ జన సంఘ్ స్థాపకుల్లో నానాజీ ఒకరు. కాగా, అస్సాంకు చెందిన హజారికా నేపథ్య గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, చిత్ర నిర్మాత కూడా. -
భారతరత్న అందుకున్న ప్రణబ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో గురువారం భారతరత్న పురస్కారాల ప్రదానోత్స కార్యక్రమం జరిగింది. 2019కి గాను దేశ అత్యున్నత పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్ముఖ్, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికాలకు ప్రకటించిన విషయం తెలిసిందే. నానాజీ, భూపేన్ హజారికాలకు కేంద్రం మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ రోజు జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భూపేన్ హజారికా తరఫున ఆయన కుమారుడు తేజ్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీలకు చెందిన నేతలు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. -
పీవీపై అనుచిత వ్యాఖ్యలు : చిన్నారెడ్డి వివరణ
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ లు అంటే తనకు అపారమైన గౌరవమని, వాళ్ళు గొప్ప మేధావులు కావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు గొప్ప అవకాశాలు ఇచ్చిందని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. పీవీ నర్సింహారావు, ప్రణబ్ ముఖర్జీ లపై బుధవారం తాను చేసిన ప్రకటనలపై వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పివి, ప్రణబ్ లను కాంగ్రెస్ అవమానించిందని అనడం రాజకీయమని, కాంగ్రెస్ పార్టీ వారికి గొప్ప గౌరవం ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకని తాను ప్రశ్నించానే తప్ప వాళ్ళను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. పీవీ, ప్రణబ్ అంటే ఎంతోఅభిమానం, గౌరవం ఉందని అన్నారు. తన వాఖ్యలపై కొంతకొంత అపార్థాలు చోటు చేసుకున్నాయని, ఎవరైనా బాధ పడితే చింతిస్తున్నానని అన్నారు. పివి, ప్రణబ్ లు ఎప్పటికైనా కాంగ్రెస్ గౌరవించే నేతలని ఆయన వివరణ ఇచ్చారు. (చదవండి : పీవీపై కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అనుచిత వాఖ్యలు) కాగా బుధవారం చిన్నారెడ్డి పీపీ, ప్రణబ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి చేసిన సోనియా గాంధీని, ఆమె అనుచరులను పీవీ అణగదొక్కారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి పీవీ అని విమర్శించారు. ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు. -
పీవీ, ప్రణబ్పై చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలపై ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ అని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలు మానుకొని హైదరాబాద్లో కూర్చున్న పీవీని సోనియాగాంధీ పిలిచి ప్రధానిని చేశారన్న చిన్నారెడ్డి.. ఇంత గౌరవం ఇచ్చినప్పటికీ పీవీ పార్టీని భ్రష్టు పట్టించారని దుయ్య బట్టారు. బుధవారం గాంధీభవన్లో మీడియా సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ పీవీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఆయన మాత్రం గద్దెనెక్కిన తర్వాత సోనియా సహా సీనియర్లను అణగదొక్కే ప్రయత్నం చేశారు. ప్రధాని పదవికి మరోనేత పోటీగా తయారవుతారనే ఆయన అలా వ్యవహరించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సహకరించి పీవీ మరో ఘోరతప్పిదం చేశారు. దీంతో అప్పటివరకు కాంగ్రెస్ను లౌకిక పార్టీగా విశ్వసించిన మైనారిటీలు పార్టీకి దూరమయ్యారు. దీంతో పార్టీకి ఇబ్బందులు తలెత్తడంతోనే గాంధీ కుటుంబం ఆయన్ను పక్కనబెట్టింది. కేవలం బాబ్రీని కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొడుగుతున్నారు’అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రణబ్ను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా కాంగ్రెస్దే అన్నారు. నాగ్పూర్లో ఆరెస్సెస్ సభకు వెళ్లి, సంఘ్ భావజాలాన్ని ప్రశంసించినందుకే ప్రణబ్కు బీజేపీ భారతరత్నతో సత్కరించిందన్నారు. అది కూడా ఆరెస్సెస్ నేత నానాజీ దేశ్ముఖ్తో కలిపి ఇచ్చారని చిన్నారెడ్డి గుర్తుచేశారు. ఆరెస్సెస్ భావజాలం ఉన్న వాళ్లనే బీజేపీ దగ్గరకి తీస్తోందని, దేశమంతా ఆ భావజాలాన్ని నింపాలనే లక్ష్యంతోనే ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరెస్సెస్కు అనుకూలంగా లేనందుకే బీజేపీ ఆయన్ను పొగడదని చిన్నారెడ్డి అన్నారు. మన్మోహన్సింగ్కు కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం ఇస్తోందని, పార్టీ ప్రధాన కార్యక్రమాలన్నింటిలో ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అప్పులకుప్ప మిగులు బడ్జెట్తో ఉన్నామని చెబుతున్నప్పటికీ.. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణకు 1.8లక్షల కోట్ల రూపాయల అప్పున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పిందన్నారు. ఈ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో కేసీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా నీరందించేందుకు ఎకరాకు రూ.75వేల ఖర్చు అవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం ఇప్పటికే రూ.50 వేల కోట్లు దాటిందని ఆయన తెలిపారు. వీటన్నింటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
పీవీపై కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అనుచిత వాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ అనుచరులను పీపీ అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి పీవీ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లను పీపీ తొక్కేశాడని ఆరోపించారు. బాబ్రీ మసీదును కూల్చి పీవీ పెద్ద తప్పు చేశాడని, దాని వల్ల కాంగ్రెస్కు ముస్లింలు దూరమయ్యారన్నారు. అందుకే పీవీని గాంధీ కుటుంబం పక్కన పెట్టిందని చెప్పుకొచ్చారు. ‘రాజకీయాలను మానుకొని హైదరాబాద్కు వచ్చిన పీవీని సోనియా గాంధీ పిలిచి ప్రధానిని చేశారు. కానీ పీవీ మాత్రం గాంధీ కుటుంబాన్నే అణగదొక్కే ప్రయత్నం చేశారు. గాంధీ కుటుంబం వాళ్లు వస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అందరిని తొక్కేశారు. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టింది. బాబ్రీ మసీదు కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొగుడుతున్నారు’ అని చిన్నారెడ్డి ఆరోపించారు. ప్రణబ్ కూడా పీవీలాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్పై కూడా చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ నాగపూర్లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు. ప్రణబ్ను కాంగ్రెస్ పార్టీయే దేశానికి రాష్ట్రపతి చేసిందన్నారు. బీజేపికి ప్రయోజనాలు చేకూర్చారు కాబట్టే ఆ పార్టీ నేతలు పీవీ, ప్రణబ్లను పొగుడుతున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు కాబట్టే బీజేపీ ఆయనను పొగడడం లేదని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, రాష్ట్రానికి లక్షా పదివేల కోట్ల అప్పు ఉందని పార్లమెంటులో ప్రకటించారన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం చెప్పిన లక్షా పదివేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. -
కేబినెట్ కూర్పుపై మోదీ, షా చర్చలు
న్యూఢిల్లీ: కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ కూర్పు, మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి తదితర అంశాలపై వారు కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. భేటీలో మోదీ, అమిత్ షా ఏం మాట్లాడుకున్నారనే దానిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఏ మంత్రిత్వ శాఖలను ఎవరికి కేటాయించాలనే దానిపైనే వీరు చర్చించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ కొత్తగా బలపడటం అనేది మంత్రివర్గంలో ప్రతిబింబిస్తుందని సమాచారం. అలాగే గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన మంత్రులందరికీ ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్, జవడేకర్, పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, నరేంద్ర తోమర్లకు కొత్త మంత్రివర్గంలోనూ చోటు ఖాయమైనట్లు కనిపిస్తోంది. అలాగే బీజేపీ మిత్రపక్షాల్లో శివసేన, జేడీయూలకు రెండు పదవులు (ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి), ఎల్జేపీ, శిరోమణి అకాలీదళ్కు ఒక పదవి దక్కే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే ఘోరంగా ఓడిపోయి ఒక్క సీటే గెలిచినప్పటికీ, తమిళనాడులో ఆ పార్టీ అధికారంలో ఉండటం, బీజేపీకి కీలక మిత్రపక్షం కావటంతో అన్నాడీఎంకేకు మంత్రిపదవి దక్కనున్నట్లు సమాచారం. ప్రణబ్ను కలిసిన మోదీ మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీని మోదీ మంగళవారం కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ రాజనీతిజ్ఞు డని మోదీ అభివర్ణించారు. ‘ప్రణబ్ దాను కలవడం ఎల్లప్పుడూ మంచి అనుభవం. ఆయనకున్న జ్ఞానం, దూరదృష్టి మరెవ్వరికీ ఉండవు. ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకునేలా దేశం కోసం ప్రణబ్ పనిచేశారు’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. గవర్నర్లు, సీఎంలు, ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం మోదీ ప్రమాణ స్వీకారానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రముఖ ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు ఆహ్వానాలను అందుకున్న వారిలో ప్రముఖులు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులకు కూడా ఆహ్వానాలు పంపనున్నారు. అన్ని ప్రముఖ ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఆహ్వానాలను పంపుతున్నారు. రాష్ట్రపతి భవన్లో గురువారం రాత్రి 7 గంటలకు మోదీ చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయిస్తారు. వేడుకకు విదేశీ నేతలు బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, కిర్గిజ్స్తాన్ దేశాల అధ్యక్షులు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. అలాగే నేపాల్, మారిషస్, భూటాన్ దేశాల ప్రధానులు వరుసగా కేపీ శర్మ ఓలీ, ప్రవీంద్ కుమార్ జగన్నాథ్, లొతయ్ షెరింగ్లు కూడా తాము వేడుకకు హాజరవుతున్నట్లు ధ్రువీకరించారు. అలాగే థాయ్లాండ్ ఓ ప్రత్యేక రాయబారిని పంపనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో బిమ్స్టెక్ దేశాల ప్రధానులు, అధ్యక్షులు లేదా రాయబారులు వేడుకకు వస్తున్నట్లైంది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్తున్నట్లు మమతా చెప్పారు. కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఢిల్లీ ప్రభుత్వాధికారి చెప్పారు. -
ప్రణబ్తో మోదీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ నినాదమైన సబ్కా సాథ్..సబ్ కా వికాస్..సబ్కా విశ్వాస్ సాకారం కావాలని ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. ప్రణబ్తో భేటీ సందర్భంగా మాజీ రాష్ట్రపతిని రాజనీతిజ్ఞడిగా మోదీ కొనియాడారు. ప్రణబ్ దాదాతో ఎప్పుడు కలిసినా అది అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని, అపార విజ్ఞానం సొంతమైన ఆయన అసలైన రాజనీతిజ్ఞుడని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు మోదీతో భేటీ ఆహ్లాదంగా సాగిందని, ఆయన రెండవ పర్యాయం ప్రధానిగా సేవలందించేందుకు సిద్ధమతున్న క్రమంలో శుభాకాంక్షలు అందిస్తున్నానంటూ ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. కాగా మాజీ రాష్ట్రపతిని కలుసుకునేందుకు ప్రణబ్ నివాసానికి వచ్చినందుకు ప్రధాని మోదీకి ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కూడా ధన్యవాదాలు తెలిపారు. -
వైఎస్ జగన్కు ప్రణబ్ ముఖర్జీ అభినందనలు
-
ఊహాగానాలకు ఈసీ తెరదించాలి
లక్నో, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపునకు మరో రెండురోజులు కూడా సమయంలేని నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు మంగళవారం రాజకీయంగా దుమారం సృష్టించాయి. దీనిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల తీర్పు తారుమారు వార్తలు తనను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు యంత్రాల (ఈవీఎంలు)ను చుట్టుముట్టిన ఊహాగానాలన్నిటికీ తెరదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పైనే ఉందని ఆయన చెప్పారు. తమ అధీనంలో ఉన్న ఈవీఎంలకు రక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ దిగ్గజ నేత కూడా అయిన ప్రణబ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజా తీర్పు చాలా పవిత్రమైనదని, అది ఏ అతి చిన్న సందేహానికీ తావివ్వనంత ఉన్నతంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు సమర్ధంగా నిర్వహించినందుకు ఈసీని ప్రణబ్ సోమవారం అభినందించిన సంగతి తెలిసిందే. విపక్షాల ఆందోళన ఈవీఎంల తరలింపు, ట్యాంపరింగ్ ఆరోపణల సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం నిరసన ప్రదర్శనలకు దారితీసింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంల తరలింపు ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈసీ తక్షణమే సరైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడాన్ని బీజేపీ ఖండించింది. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటర్లు తీర్పు ఇచ్చిన పక్షంలో, ఓటమిని హుందాగా అంగీకరించాలని కోరింది. ఘాటుగా స్పందించిన ఈసీ పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల స్థానంలో వేరే ఈవీఎంలను ఉంచుతున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది. అవన్నీ తప్పుడు, పనికిమాలిన, నిరాధార ఆరోపణలుగా పేర్కొంది. ఏడు విడతల్లో వినియోగించిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూముల్లో అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. టీవీలు, సోషల్ మీడియాల్లో చూపిస్తున్న దృశ్యాలకు, పోలింగ్ సందర్భంగా వినియోగించిన ఈవీఎంలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారం చేపట్టనుందని దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఈసీ పనితీరు భేష్: విపక్షాలకు ప్రణబ్ చురకలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల జల్లు కురిపంచారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని ఈసీని కొనియాడారు. విపక్షాలు ఎన్నికల సంఘాన్ని విమర్శించవద్దని ప్రణబ్ హితవుపలికారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి ప్రస్తుత కమిషనర్ల వరకు ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ఎన్నికల నిర్వహణ సంస్థలని, అవన్నీబాగా పనిచేస్తున్నాయని ప్రశంశించారు. కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్తో పలు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీపై విమర్శలు చేస్తున్న నాయకులకు ఆయన చురకలంటించారు. చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవ పడతాడని, మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగిస్తాడని చలోక్తులు విసిరారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ఆపార్టీలో చర్చనీయాంశంగా మారాయి. దిల్లీలో సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం పనితీరుతో పాటు పలు సంస్కరణలపై మాట్లాడారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి సమావేశంలో ప్రణబ్ మాట్లాడుతూ.. ‘‘ సుదీర్ఘ కాలంలో రాజ్యాంగ సంస్థలు నిర్మించబడ్డాయి. తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటి వరకు ఎన్నికల సంఘం అద్భుతంగా ఎన్నికలను నిర్వహిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 67% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలో 2/3 ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల కమిషనర్లు అందరిని ప్రభుత్వాలే నియమిస్తూ వచ్చాయి.’’అని ప్రణబ్ వ్యాఖ్యానించారు. -
ప్రజాస్వామం విజయవంతమైంది:ప్రణబ్
-
మన్మోహన్కు పీవీ పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా నెక్ట్స్ సంస్థ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని 2018 ఏడాదికిగానూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రదానం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్కు అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. ‘దేశంలోకి దిగుమతులను ప్రోత్సహించడంతోపాటు, అనుమతుల్లో తీవ్ర జాప్యం(లైసెన్స్ పర్మిట్ రాజ్)ను పీవీ రూపుమాపారు. స్వతంత్ర భారతావనిలో ఆర్థిక సంస్కరణల విషయంలో పీవీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సంక్లిష్ట సమయాల్లో కఠినమైన ఆర్థిక, విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో పీవీ నాకు ఎంతగానో సాయపడ్డారు’అని అవార్డును అందుకున్న సందర్భంగా మన్మోహన్ కొనియాడారు. -
3 లక్ష్యాలు.. 3 అవార్డులు!
‘వ్యక్తులకు బిరుదులు అలంకారం కాదు. వ్యక్తులే బిరుదులకు వన్నె తెస్తారు’ అనేది నానుడి. ఇటీవల ప్రకటించిన కొన్ని అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించడం, ప్రజాభిప్రాయ సేకరణ జరగకపోవడంతో విమర్శలు తలెత్తాయి. ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకోవడం కోసం వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ఇవ్వడం సహజమే. 2019 ఏడాదికి భారతరత్న పొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలు ఈ అవార్డుకు అర్హులే. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేయడం పట్ల బీజేపీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన సీపీఎం బలహీనపడటంతో అక్కడ ధీటైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య విద్వేషం పెరిగింది. అక్కడ మమత బెనర్జీకి పోటాపోటీగా నిలవాలని చాన్నాళ్లుగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ‘బెంగాలీ పుత్రుడు’ ప్రణబ్ పేరును చూపి సెంటిమెంట్తో ఆ రాష్ట్రంలో కేడర్ను బలోపేతం చేసుకోవాలని బీజేపీ ఆశిస్తూ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌరసత్వ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాం అట్టుడుకుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి అస్సాం గణపరిషత్ ఇప్పటికే తప్పుకుంది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలను బుజ్జగించడానికి ఆ ప్రాంత గాయకుడు అయిన హజారికాకు భారతరత్న ప్రకటించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక నానాజీ దేశ్ముఖ్కు భారతరత్నను ఇవ్వడం ద్వారా బీజేపీ ఆచితూచి అడుగులేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాయి. దీంతో బీజేపీ రెండు ఆశయాల్ని నెరవేర్చుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకటి ఆరెస్సెస్ను సంతృప్తిపరచడం, రెండోది మేధావుల వారసత్వాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే కాదు తాము కూడా గౌరవించగలమని చాటి చెప్పడం. ఎన్నికల ఎత్తుగడే కానీ.. ‘మమతా బెనర్జీకి చెక్ పెట్టి బెంగాల్లో పాగా వేయాలి. పౌరసత్వ బిల్లు వల్ల దూరమయ్యేలా కనిపిస్తున్న ఈశాన్య ప్రాంత ప్రజల్ని మళ్లీ తమ వైపు తిప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఒత్తిడి పెంచుతున్న ఆరెస్సెస్ను ఎలాగైనా శాంతపరచాలి’..ఈ లక్ష్యాలతోనే బీజేపీ అనూహ్యంగా భారతరత్నకు ముగ్గురు విశిష్ట వ్యక్తుల్ని ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నా విపక్షాలు తప్పు పట్టలేని పరిస్థితి. జీవిత కాలమంతా కాంగ్రెస్కే సేవచేసిన ప్రణబ్ 2సార్లు ప్రధాని పదవిని తృటిలో కోల్పోయారు. రాష్ట్రపతి అయ్యాక బీజేపీ ఆయనతో మంచి సంబంధాలే కొనసాగించింది. ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హజారికాతో బీజేపీకి రాజకీయ సంబంధాలున్నాయి. 2004 లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్పై పోటీచేసి ఓటమిపాలయ్యారు. పౌరసత్వ బిల్లుతో అస్సాం రాజకీయ పార్టీలతో పెరిగిన దూరాన్ని హజారికా రూపంలోనైనా తగ్గించుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నానాజీ దేశ్ముఖ్ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1977లో మొరార్జీ దేశాయ్ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తామన్నా వద్దనుకుని సామాజిక సేవకు అంకితమయ్యారు. ఓవైపు, ఆయన సేవల్ని గౌరవిస్తూనే, మరోవైపు ఆరెస్సెస్ వ్యక్తికి భారతరత్న ఇచ్చుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
భారతరత్న అర్హత ప్రణబ్ ముఖర్జీకి లేదు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గతంలో ప్రణబ్ ముఖర్జీపై తమ సంస్థ తరుపున అమెరికాలో క్రిమినల్ కేసు వేశామని చెప్పారు. అమెరికా నుండి వచ్చి ఆయనకు సమన్లు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. చాలా క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ అని, ఆయన చెప్పింది ఎప్పుడూ చేయలేదని విమర్శించారు. ఇవాళ అత్యంత విచారకరమైన రోజు అని, బ్లాక్ డే అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రణబ్కి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకని భారతరత్న అవార్డు ఇచ్చారో చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ సానుభూతి పరుడని ప్రణబ్కు అవార్డు ఇచ్చారని ఆరోపించారు. లోక్ సభలో మెజారిటీ ఉంది కదా అని ఎవరికి పడితే వారికి అవార్డు ప్రధానం చేస్తారా అని మండిపడ్డారు. లోక్ సభ స్పీకర్గా సేవాలందించిన బాలయోగికి ఎందుకని అవార్డు ఇవ్వలేదన్నారు. బాలయోగి దళితుడిని అవార్డు ఇవ్వలేదా? టీడీపీ కనీసం ఆ దిశగా కృషి చేయలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. -
ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
భారత రత్నాలు
-
రాజనీతిజ్ఞుడికి అసలైన గౌరవం!
దేశ రాజకీయాల్లో ఓ అరుదైన వ్యక్తిత్వం. విదేశాంగ, రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి భిన్నమైన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన సామర్థ్యం. దశాబ్దాల రాజకీయ జీవితంలో స్ఫూర్తిదాయక వ్యవహారశైలితో ఆదర్శంగా నిలిచిన మహామనీషి. చిన్న వయసులోనే రాజనీతిజ్ఞుడిగా, దౌత్యవేత్తగా, రచయితగా, జర్నలిస్టుగా, అధ్యాపకుడిగా ఇలా అవకాశం దొరికిన ప్రతి రంగంలోనూ సత్తా చాటుకున్న సమర్థుడు. ఇవన్నీ భారతదేశానికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురించిన కొన్ని అంశాలు మాత్రమే. 2012 నుంచి 2017 భారత 13వ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ దా.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి.. మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాల్లో వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా.. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలికి 23 ఏళ్లపాటు సీడబ్ల్యూసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడినపుడల్లా ట్రబుల్ షూటర్గా వ్యవహరించి గట్టెక్కించారు. దేశ రాజకీయాల్లో ప్రణబ్ సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఈ మహనీయుడి గురించిన కొన్ని విశేషాలు. నరనరాన దేశభక్తి 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్లోని బిర్భుమ్ జిల్లా మిరాటీలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో ప్రణబ్ దా జన్మించారు. ఆయన తండ్రి కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మి. తండ్రి స్వాతంత్య్ర పోరాటాన్ని చూస్తూనే ఆయన పెరిగి పెద్దవాడయ్యారు. చరిత్ర, రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. టీచర్గా వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రణబ్ దా.. చాలా రోజుల పాటు ‘దేశేర్ దక్’(మాతృభూమి పిలుపు) అనే పత్రికకు జర్నలిస్టుగా పనిచేశారు. తండ్రి అప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కావడంతో.. ఆయన అడుగుజాడల్లోనే ప్రణబ్ కూడా కాంగ్రెస్ ద్వారానే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఇందిర ప్రియశిష్యుడిగా.. జాతీయ రాజకీయాల్లో ప్రణబ్ జోరుకు బీజం పడింది మాత్రం 1969లోనే. ప్రణబ్ చొరవను, నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఇందిరాగాంధీ.. ఆయన్ను ప్రియశిష్యుడిగా చేసుకున్నారు. 1969లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. 1979లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవగానే.. సభలో పార్టీ ఉపనేతగా, ఇందిర కేబినెట్లో మంత్రిగా స్థానం సంపాదించారు. 1980లో రాజ్యసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రణబ్ సామర్థ్యాన్ని గుర్తించిన ఇందిర.. 1982లో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో ఇందిర తర్వాతి స్థానం ప్రణబ్దే అనుకునేవారు. అయితే 1984లో ఇందిర హత్యతో పరిస్థితి తారుమారైంది. పార్టీలో ప్రణబ్ ఎదుగుదలను ఓర్వలేని నేతలంతా ఏకమై.. పార్టీలో ఆయన్ను పక్కనబెట్టేలా రాజీవ్పై ఒత్తిడి తీసుకొచ్చారంటారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య వరకు పార్టీలో ప్రణబ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పీవీ నరసింహారావు ప్రధాని కాగానే.. ప్రణబ్కు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇవ్వడంతోపాటు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా నియమించారు. 1995–96ల్లో భారత విదేశాంగ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2004లో మళ్లీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2012 వరకు పార్టీ లోక్సభాపక్ష నేతగా ఉన్నారు. ఈ సమయంలోనే రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. సొంత కూటమి పెట్టినా.. ఇందిర మరణం తర్వాత పార్టీలో ఎదురవతున్న అవమానాలతో.. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. 1987లో రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తదనంతర పరిణామాలతో 1989లో ఈ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రచయితగా జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో.. వీలున్నపుడల్లా తన భావాలకు అక్షరరూపం ఇవ్వడాన్ని మాత్రం ప్రణబ్ మరిచిపోలేదు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. ఇందిర పాలనను, అధికారాన్ని దగ్గరగా చూసిన అనుభవం.. దౌత్యవేత్తగా ప్రపంచంలో భారత్ స్థానాన్ని అవగతం చేసుకున్న సమర్థుడిగా.. కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా దేశంలోపల సమస్యలను చూసిన వ్యక్తిగా తన అనుభవాలను, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పుస్తకాల్లో పేర్కొన్నారు. భారత 13వ రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ప్రభావవంతంగా సాగింది. లైంగిక నేరాలను తీవ్రంగా పరిగణించేలా.. ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ల్లో సవరణలు చేసిన ‘క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్స్ – 2013’కు ఆమోదముద్ర పడింది ఈయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే. మంత్రిగా ప్రణబ్.. కేంద్ర మంత్రిగా ఉన్న భారత్– అమెరికా పౌర అణు ఒప్పందంపై ఇరుదేశాల సంతకాలు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంపై అమెరికాను ఒప్పించిందీ ప్రణబ్ హయాంలోనే. జేఎన్యూఆర్ఎమ్ సహా పలు సామాజిక సంక్షేమపథకాలకు రూపకల్పన చేశారు. 1980ల్లో తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన సమయంలో.. తీసుకొచ్చిన మార్పులతో భారత ఆర్థిక వ్యవస్థ సంస్కరణవాదిగా పేరుతెచ్చుకున్నారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. 1957లో సువ్ర ముఖర్జీతో ఆయన వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. 2015లో ప్రణబ్ దా భార్య కన్నుమూశారు. దౌత్యవేత్తగా విశేషానుభవం రాజకీయవేత్తగానే కాదు.. దౌత్యవేత్తగానూ దేశానికి ప్రణబ్ దా సేవలందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకులకు బోర్డ్ ఆఫ్ గవర్నర్గా వ్యవహరించారు. కామన్వెల్త్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశాలకు 1982, 83, 84ల్లో భారత బృందానికి నేతృత్వం వహించారు. 1995లో అక్లాండ్లో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ సదస్సులోనూ భారత బృందానికి నాయకత్వం వహించారు. -
ప్రణబ్ ‘భారతరత్న’ ఆనందదాయకం
సాక్షి, అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు లభించ డం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రణబ్ ఈ అవార్డుకు అన్నివిధాలా అర్హుడన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని ప్రశంసించారు. ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా, ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త నానాజీ దేశ్ముఖ్కు మరణానంతరం భారతరత్న గౌరవం దక్కడంపై జగన్ సంతోషం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలను పొందిన తెలుగువారికి జగన్ అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు వేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ శుక్రవారం అభినందనలు తెలిపారు. ప్రణబ్ముఖర్జీకి భారతరత్నపై కేసీఆర్ హర్షం సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ప్రణబ్ ముఖర్జీ పూర్తి అర్హుడని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి, రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న చొరవను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. రాజనీతిజ్ఞుడిగా.. రచయితగా, దౌత్యవేత్తగా, పాలనాదక్షుడిగా ప్రణబ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. -
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం
-
ప్రణబ్దా భారతరత్న
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికా కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సుమారు నాలుగేళ్ల తరువాత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటిదాకా భారతరత్న పొందిన ప్రముఖుల సంఖ్య 48కి చేరింది. ప్రణబ్ ముఖర్జీ 2012–17 మధ్య కాలంలో భారత 13వ రాష్ట్రపతిగా పనిచేయగా, దేశ్ముఖ్, హజారికాలు మరణానంతరం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది ఆరెస్సెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రణబ్ ముఖర్జీ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో దేశ్ముఖ్ ఒకరు కాగా, ఈశాన్య భారత్ నుంచి సినీరంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖుల్లో హజారికా ఒకరు. దేశ ప్రజలకు తాను చేసిన దానికన్నా ప్రజలే తనకు ఎక్కువిచ్చారని ప్రణబ్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ‘ నాకిచ్చిన ఈ గొప్ప గౌరవాన్ని దేశ ప్రజల పట్ల పూర్తి కృతజ్ఞతా భావం, విధేయతతో స్వీకరిస్తున్నా. నేను ఎప్పటికీ చెప్పేదాన్నే మళ్లీ చెబుతున్నా. ఈ గొప్ప దేశ ప్రజలకు నేను చేసిన దానికన్నా నాకే వారు ఎక్కువిచ్చారు’ అని ట్వీట్ చేశారు. చివరగా 2015లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయకు భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణబ్, దేశ్ముఖ్, హజారికాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి మార్గంపై చెరగని ముద్ర: మోదీ ప్రణబ్ ముఖర్జీ, దేశ్ముఖ్, హజారికాల సేవల్ని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్లు చేశారు. దశాబ్దాల పాటు నిస్వార్థంగా ప్రజాసేవచేసిన ప్రణబ్ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞుల్లో గొప్పవారని, దేశ అభివృద్ధి మార్గంపై ఆయన చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ‘ప్రణబ్దాకు భారతరత్న రావడం పట్ల సంతోషంగా ఉంది. ఆయన తెలివి, ప్రజ్ఞకు సాటిగా నిలిచేవారు కొందరే ఉన్నారు’ అని అన్నారు. గ్రామీణాభివృద్ధిలో విశేష కృషిచేసిన దేశ్ముఖ్..గ్రామీణుల సాధికారతా విషయంలో గొప్ప మార్పులకు నాందిపలికారని కొనియాడారు. ‘అణగారిన, వెనకబడిన వర్గాల పట్ల కరుణ, విధేయత కనబరచిన దేశ్ముఖ్ నిజమైన భారతరత్న’ అని పేర్కొన్నారు. ఇక హజారికా సేవల్ని ప్రశంసిస్తూ ఆయన గేయాలు తరాలకు అతీతంగా గౌరవం పొందాయని అన్నారు. ‘హజారికా పాటలు న్యాయం, సమైక్యత, సోదరభావం అనే సందేశాలిస్తాయి. భారత సంగీత సంప్రదాయాల్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారు. భూపేన్ హజారికాకు భారతరత్న దక్కడం ఆనందంగా ఉంది’ అని మోదీ అన్నారు. ప్రజాసేవ చేసిన తమలో ఒకరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రావడం పట్ల కాంగ్రెస్ గర్విస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. హజారికా, దేశ్ముఖ్లకు కూడా ఈ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి సరసన ప్రణబ్.. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు. 2010లో మరణించే వరకు దేశ్ముఖ్ ఆరెస్సెస్తో సంబంధాలు కొనసాగించారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకల్పనలో, 1977లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. రుద్రాలీ, దార్మియాన్, గాజాగామిని, డామన్ లాంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు పలు అస్సాం సినిమాలకు హజారికా సంగీతం సమకూర్చారు. బెంగాల్ నుంచి ప్రణబ్కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. భారతరత్న పొందిన ప్రణబ్ ముఖర్జీకి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచిన ప్రణబ్ భారతరత్నకు ఎంపికవడం బెంగాల్ ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి అన్నారు. అధికార తృణమూల్, ప్రతిపక్ష సీపీఎంలు కూడా ప్రణబ్కు శుభాకాంక్షలు తెలిపాయి. ఆయన ఈ దేశానికి గొప్ప పుత్రుడు మాత్రమే కాదని, గొప్ప మానవతావాది కూడా అని తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు. సమాజ సేవకుడిగా.. నానాజీ దేశ్ముఖ్.. సమాజ సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన, బలహీన వర్గాల ఉద్ధరణకు నడుంబిగించి.. ఆ దిశగా గణనీయమైన మార్పును తీసుకొచ్చారు. గ్రామీణ స్వరాజ్యంతోపాటు దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో మార్పులకోసం తీవ్రంగా శ్రమించారు. 1916లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో నానాజీ జన్మించారు. ఆయన అసలు పేరు చండికాదాస్ అమృత్రావ్ దేశ్ముఖ్. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్గా జీవితాన్ని ప్రారంభించారు. చదువుకోవాలనే తన ఆశకు ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకిగా మారడంతో కూరగాయలు విక్రయించి వచ్చే డబ్బులతో చదువుకున్నారు. బాలా గంగాధర్ తిలక్ స్ఫూర్తిగా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. బిర్లా కాలేజీ (నేటి బిట్స్)లో విద్యాభ్యాసం చేశారు. భారతీయ జన్సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. ఆ తర్వాత బీజేపీలోనూ కీలక నేతగా బాధ్యతలు నిర్వహించారు. తను ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో ఎవరికీ రావొద్దని భావించి.. పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషిచేశారు. దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ఆయన ప్రారంభించారు. మంథన్ అనే పత్రికను స్థాపించి.. చాలా ఏళ్లపాటు తనే సొంతగా నిర్వహించారు. పుట్టింది మహారాష్ట్రలోనైనా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలోనే నానాజీ విస్తారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. 1977లో లోక్సభ ఎంపీగా గెలిచారు. 1999లో ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్చేసింది. దేశంలోనే తొలి గ్రామీణ యూనివర్సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్లోని ‘చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయ’నానాజీ ఆలోచనల ఫలితమే. 1974నాటి జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకర్తల్లో నానాజీ కూడా ఒకరు. 94 ఏళ్ల వయసులో 2010 ఆయన కన్నుమూశారు. బ్రహ్మపుత్ర కవి.. సుధాకాంత భూపేన్ హజారికా నేపథ్యమిదీ.. ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్ హజారికా..బ్రహ్మపుత్ర కవి, సుధాకాంత పేరుతో సుప్రసిద్ధులు. మానవత్వం, సోదరభావం, సార్వత్రిక న్యాయం ఉట్టిపడేలా ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషలు ముఖ్యంగా బెంగాలీ, హిందీలోకి తర్జుమా అయ్యాయి. అసోం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో ఆయన పాటలకు విపరీత ఆదరణ లభించింది. తన గాత్రంతో కొన్ని తరాలను ఉర్రూతలూగించారు. నేపథ్య గాయకుడు, సంగీతకారుడు, రచయిత, సినీ దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్ర వేసిన హజారికాను జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి. 1926 సెప్టెంబర్ 8న అస్సాంలోని సాదియాలో హజారికా జన్మించారు. పది మంది సంతానంలో పెద్దవాడైన హజారికా బాల్యం నుంచే తల్లి నుంచి అస్సామీ సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. పదేళ్ల వయసులో ఓ కార్యక్రమంలో అస్సామీ భక్తి గీతాలు ఆలపిస్తుండగా ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్ అగర్వాలా, సినీ దర్శకుడు విష్ణుప్రసాద్ రాభా దృష్టిలో పడ్డారు. తరువాత 1939లో అగర్వాలా సినిమాలో రెండు పాటలు పాడారు. 13 ఏళ్ల వయసులో సొంతంగా పాట రాశారు. 1946లో బెనారస్ హిందూ వర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన హజారికా కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. ఆ తరువాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఉపకారవేతనం లభించడంతో 1949లో న్యూయార్క్ వెళ్లారు. అక్కడ ప్రముఖ హక్కుల కార్యకర్త పాల్ రాబ్సన్తో ఏర్పడిన పరిచయం ఆయన జీవితంపై చాలా ప్రభావం చూపింది. కొలంబియా యూనివర్సిటీలోనే తనకు పరిచయమైన ప్రియంవదా పటేల్ను 1950లో వివాహమాడారు. 1953లో స్వదేశం తిరిగొచ్చారు. 1967–72 మధ్యలో అసోం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో బీజేపీ తరఫున గువాహటి నుంచి లోక్సభకు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1998–2003 వరకు సంగీత నాటక అకాడమీకి చైర్మన్గా వ్యవహరించారు. 2011 నవంబర్ 5న ముంబైలో కన్నుమూశారు. బ్రహ్మపుత్ర తీరంలో జరిగిన ఆయన అంత్యక్రియలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నెహ్రూ–గాంధీల కుటుంబానికి విధేయుడిగా పేరొందిన గురుదాస్ కామత్(63) బుధవారం తీవ్రగుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో బుధవారం ఉదయం ఏడింటికి తీవ్రగుండెపోటుకు గురైన కామత్ను హుటాహుటిన చాణక్యపురి ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన వెంట కుటుంబసభ్యులు ఎవరూ లేరు. విషయం తెలియగానే ముంబై నుంచి కామత్ కొడుకుసహా కుటుం బమంతా ఆస్పత్రికి వచ్చిం ది. బుధవారం సాయంత్రం కామత్ పార్థివదేహాన్ని ముంబైకి తరలించారు. గురువారం ముంబైలో కామత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. న్యాయవాది నుంచి కేంద్ర మంత్రిదాకా.. వృత్తిరీత్యా న్యాయవాది అయిన కామత్ తొలుత ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతగా ఎదిగారు. ఇందిరా గాంధీ హయాంలో 1976 –80 వరకు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా చేశారు. 1987లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగానూ చేశారు. ముంబై నుంచి ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఆయన గతంలో హోం వ్యవహారాల సహాయ మంత్రిగా, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన గుజరాత్, రాజస్తాన్లలో పార్టీ సంక్షిష్ట సమయాల్లో, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్లలో పార్టీ వ్యవహారాలు చూసు కున్నారు. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేపట్టాక గత కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ప్రముఖుల నివాళులు కామత్ మరణం వార్త తెలియగానే యూపీఏ చీఫ్ సోనియా గాంధీ ఢిల్లీలో ఆస్పత్రికి వచ్చి కామత్కు నివాళులర్పించారు. ‘సీనియర్ నేత కామత్ మరణం పార్టీకి తీరని లోటు. ముంబైలో కాంగ్రెస్ పునర్వైభవానికి ఆయన ఎంతగానో కృషి చేశారు’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాంగ్రెస్ నేత మల్లి కార్జున్ ఖర్గేలు కామత్ మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కామత్ గొప్ప పార్లమెం టేరియన్, సమర్థుడైన మంత్రి అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. మాస్ లీడర్ అయిన కామత్ ముంబైకర్ల సమస్యలపై పార్లమెంటు వేదికగా పోరాడేవారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. -
‘మీ వల్లే ఆర్థిక, రాజకీయ స్థిరత్వం’
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన కృషిని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. మన్మోహన్ కేబినెట్లో 2004–12 మధ్య ప్రణబ్ పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం తెల్సిందే. మణప్పురం ఫైనాన్స్ సంస్థ నెలకొల్పిన వీసీ పద్మనాభన్ స్మారక జీవితకాల సాఫల్య పురస్కారాన్ని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మన్మోహన్కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడారు. మన్మోహన్ హయాంలో ప్రవేశపెట్టిన చారిత్రక సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టాన్ని ప్రస్తావించారు. 1990 తొలి నాళ్లలో భారత్ అంతర్జాతీయ సమాజంలో విశ్వాసం కోల్పోయినప్పుడు మన్మోహన్ తన తెలివితేటలతో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పదేళ్లు సమర్థంగా నడిపి రాజకీయ అస్థిరతకు ముగింపు పలికారని ప్రశంసించారు. -
రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్
-
రాజ్యసభకు కొత్తగా నలుగురు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఇటీవల ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నామినేటెడ్ స్థానాలు భర్తీ అయ్యాయి. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త రాకేశ్ సిన్హా, లోక్సభ మాజీ సభ్యుడు రామ్ సకల్, సంప్రదాయ నృత్యకారిణి సోనాల్ మాన్సింగ్, శిల్పి రఘునాథ్ మహాపాత్రోలు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్ వీరిని ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంవో) ప్రకటించింది. ఇటీవలే పదవీకాలం ముగిసిన క్రీడాకారుడు సచిన్, నటి రేఖ, న్యాయవాది పరాశరణ్, సామాజిక కార్యకర్త అను ఆగాల స్థానంలో వీరిని ఎంపికచేశారు. వీరి పదవీకాలం 2024లో ముగుస్తుంది. రామ్ సకల్: యూపీలోని రాబర్ట్స్గంజ్ నియోజక వర్గం నుంచి 3సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా రామ్ సకల్ దళితులు, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం పోరాడారని పీఎంవో కొనియాడింది. రాకేశ్ సిన్హా: ఆరెస్సెస్ సిద్ధాంతకర్త అయిన సిన్హా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మేధో సంస్థ ‘ఇండియా పాలసీ ఫౌండేషన్’ని స్థాపించారు. ఢిల్లీ వర్సిటీ అనుబంధ కళాశాల మోతీలాల్ నెహ్రూ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్)లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. రఘునాథ్ మహాపాత్రో: 1959 నుంచి శిల్పకళలో విశేష కృషి చేస్తూ అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు. పూరీజగన్నాథ ఆలయ సుందరీకరణలో పాలుపంచుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని ఆరు అడుగుల సూర్య భగవానుడి రాతి శిల్పం ఈయన సృష్టే. పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలు లభించాయి. సోనాల్ మాన్సింగ్: ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, ఒడిస్సీ కళారూపాల్లో సేవలందిస్తున్నారు. వక్త, సామాజిక కార్యకర్త కూడా అయిన ఈమె పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. -
ప్రణబ్ ఎఫెక్ట్ : ఆరెస్సెస్కు పోటెత్తాయ్!
నాగ్పూర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో సభ్యత్వానికి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం అనంతరం ఆరెస్సెస్ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మూడింతలు పెరిగింది. అత్యధిక దరఖాస్తులు పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 7వ తేదీన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరైన ప్రణబ్, శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి ప్రసగించిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీల మధ్య సభ్యత్వం కోసం రోజుకు 378 దరఖాస్తులు రాగా, 7వ తేదీ నుంచి రోజుకు 1,779 దరఖాస్తులు వస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రణబ్ ప్రసంగాన్ని వ్యతిరేకించిన వారికి ఆరెస్సెస్ సంయుక్త కార్యదర్శి వైద్య ధన్యవాదాలు తెలిపారు. -
కాంగ్రెస్ వైఖరి తెలిసిపోయింది : ఒవైసీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఇచ్చిన ఇఫ్తార్ విందుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముస్లింలపై కపట ప్రేమను ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ముస్లిం సాధికరతపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. వారు హిందువుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారం కిందట మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగ్పూర్లో ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరవ్వడంపై విమర్శలు చేసిన ఒవైసీ.. కాంగ్రెస్ ఇఫ్తార్ విందుకు ప్రణబ్ను ఆహ్వానించడంపై కూడా ఘూటుగానే స్పందించారు. ఈ విందుకు ప్రణబ్ని ఆహ్వానించి, గౌరవించడం ద్వారా కాంగ్రెస్ వైఖరి ఎంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ ఇఫ్తార్ పేరుతో డ్రామా ఆడుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రెండేళ్ల విరామం తరువాత ఇచ్చిన ఇఫ్తార్ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు. -
ఢిల్లీలో రాహుల్ ఇఫ్తార్ విందు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతలకు బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన ఈ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కనిమొళి, జేడీఎస్ నేత డానిష్ అలీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది, బీఎస్పీ నేత సతీశ్చంద్ర మిశ్రా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ హాజరయ్యారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు వేదికగా మారనుందని భావిస్తున్న ఈ విందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీలు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. ప్రధాని వీడియో నవ్వించేలా ఉంది ప్రధాని మోదీ ట్వీటర్లో పోస్ట్ చేసిన ఫిట్నెస్ వీడియోపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. అది వింతగా, నవ్వించేలా ఉందన్నారు. బుధవారం ఇఫ్తార్ వేడుకలో మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్తో టేబుల్ పంచుకున్న రాహుల్..సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వైపు తిరిగి ‘మోదీకి దీటుగా మీరూ ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేయొచ్చుగా!’ అని అన్నారు. అక్కడే ఉన్న కనిమొళి, దినేశ్ త్రివేది, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రాలు ప్రధాని వీడియో గురించి విని నవ్వుకున్నారు. మహా కూటమి.. ప్రజల ఆకాంక్ష మోదీ,బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలతో ఏర్పాటయ్యే మహా కూటమి ప్రజల ఆకాంక్ష అని రాహుల్ గాంధీ ముంబైలో విలేకరులతో అన్నారు. ‘మహా కూటమి ఏర్పాటు బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీల కోసం మాత్రమే కాదు. అది ప్రజల ఆకాంక్ష. మహాకూటమితోనే ప్రధాని, బీజేపీ, ఆరెస్సెస్ లను ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు. -
మీడియా కథనాలపై కాంగ్రెస్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ బుధవారం ఢిల్లీలోని తాజ్ప్యాలెస్ హోటల్లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం పంపలేదన్న వార్తలు నిన్నంతా మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా స్పందిస్తూ ఆ పుకార్లను తోసిపుచ్చారు. ‘ప్రణబ్కు ఆహ్వానం పంపాం. ఆయన దానిని అంగీకరించారు. మీడియా ఇకనైనా అత్యుత్సాహం ప్రదర్శించటం ఆపితే మంచిది’ అని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల నాగపూర్లో ఆరెస్సెస్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లిన ప్రణబ్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్కు ఆహ్వానం అందలేదని వార్తలొచ్చాయి. ఈ విందులో పాల్గొనేందుకు ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులకు ఆహ్వానాలు అందినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దాదాపు మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఇఫ్తార్ కావటం, పైగా రాహుల్ అధ్యక్షుడు అయ్యాక నిర్వహిస్తున్నది కావటంతో ఈ ఇఫ్తార్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ వ్యతిరేక శక్తులను కూడగలుపుకుని 2019 ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. 1/2 Multiple media houses have raised questions on Iftaar invite to @CitiznMukherjee on behalf of Congress President. Congress President has extended an invite to Sh. Pranab Mukherjee & he has graciously accepted. Hope this will set to rest unwarranted speculation. — Randeep Singh Surjewala (@rssurjewala) 11 June 2018 2/2 To set the record straight, May I point out that Pranab Dada had attended the last Iftar get together organised by then Congress President, Smt. Sonia Gandhi too. Bereft of unwarranted issues, let compassion & friendship for all guide us in the holy month of Ramadan. — Randeep Singh Surjewala (@rssurjewala) 11 June 2018 -
ప్రణబ్కు ఇఫ్తార్ ఆహ్వానం పంపాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ బుధవారం ఢిల్లీలోని తాజ్ప్యాలెస్ హోటల్లో ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం పంపామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా స్పష్టంచేశారు. ఈ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించారన్నారు. ఇటీవల నాగపూర్లో ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లిన ప్రణబ్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్కు ఆహ్వానం అందలేదని వార్తలొచ్చాయి.ఈ విందులో పాల్గొనేందుకు ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
ప్రణబ్ ముఖర్జీకి ఊహించని పరిణామం!
న్యూఢిల్లీ : ఓ వైపు ప్రధాని పదవికి తాను అర్హుడినని, వచ్చే సార్వత్రిక ఎన్నికలతో చిరకాల కోరికను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీర్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ మరోవైపు సొంత పార్టీ కాంగ్రెసే ఆయనకు షాకిచ్చినట్లు సమాచారం. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్కు ఆహ్వానం అందలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేక కూటమిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రణబ్ను ఆహ్వానించక పోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ కీలక ఇఫ్తార్ విందుకు ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆప్ కన్వినర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని అందుకు ఈ ఇఫ్తార్ ఈవెంట్ను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకావడం కాంగ్రెస్ కూటమికి అంతగా రుచించడం లేదు. కాగా, తమకు అనుకూల పార్టీలకు ఇఫ్తార్ విందుకు ఆహ్వానాలు పంపిన కాంగ్రెస్.. ఆయా పార్టీల అధ్యక్షులు హాజరుకాని పక్షంలో ఇతర కీలక నేతలను పంపాలని కోరింది. -
ప్రధానిగా ప్రణబ్.. లేదు మా నాన్న మళ్లీ రారు!
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆరెస్సెస్ ప్రకటించే అవకాశముందని శివసేన చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ స్పందించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మళ్లీ రాజకీయాల్లో వచ్చే అవకాశమే లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ అనూహ్యంగా ఆరెస్సెస్ సదస్సులో పాల్గొని.. జాతీయవాదం, దేశభక్తి, జాతి గురించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోతే.. ప్రణబ్ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఆరెస్సెస్ రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీకి గత ఎన్నికల్లో కంటే 110 సీట్లు తక్కువ వచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శర్మిష్ట.. ‘మిస్టర్ రౌత్.. రాష్ట్రపతిగా రిటైరైన తర్వాత మా నాన్న రాజకీయాల్లోకి మళ్లి వచ్చే అవకాశమే లేదు’ అని ట్వీట్ చేశారు. -
అటో, ఇటో, ఎటో...!
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీకి ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉన్నదా? కుమార్తె శర్మిష్ఠను బీజేపీలో చేర్చి, 2019 ఎన్నికలలో ఢిల్లీ నుంచి లోక్సభకు పోటీ చేయించి, ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా నియమిస్తామని ఆయనకు బీజేపీ అధినాయకత్వం హామీ ఇచ్చిందా? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ ఆహ్వానం మన్నించి గురువారం నాగపూర్లో సుదీర్ఘకాలం ప్రచారక్ శిక్షణ పొందినవారిని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రణబ్దా వెళ్ళడం కొందరికి సంతోషం కలిగించింది. మరికొందరికి ఖేదం కలిగించింది. అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆనందశర్మ, మనీష్ తివారీ నాగపూర్ వెళ్ళడానికి మాజీ రాష్ట్రపతి అంగీకరించడాన్ని తప్పుపట్టారు. వెళ్లినా వారి తప్పులను ఎత్తిచూపండని చిదంబరం చెప్పారు. పార్టీ అధిష్ఠానం మాత్రం వేచి చూసే ధోరణిని ఆశ్రయించింది. కాకలు తీరిన కాంగ్రెస్వాది దాదాపు అర్ధశతాబ్ది కాంగ్రెస్తో మమేకమైన ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ వెళ్ళడమే విశేషం. పండిట్ నెహ్రూ భావ జాలాన్ని గుండె నిండా నింపుకున్న ప్రణబ్ అందుకు విరు ద్ధమైన ఆదర్శాలను ఆరాధించే ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాల యాన్ని సందర్శించడం అంటే దానికి గౌరవం ఆపాదించడమే. ఆ సంస్థను ప్రధాన స్రవంతికి చేరువ చేయడమే. ఆర్ఎస్ఎస్ను నిషేధించిన 1975 నాటి ఇందిరాగాంధీ మంత్రివర్గంలోనూ, 1992 నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వంలోనూ ప్రణబ్ సభ్యుడుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఖండిస్తూ ఏఐసీసీ ఆమోదించిన అనేక తీర్మానాల దస్తూరీ ఆయనదే. దైవభక్తి కలిగిన హిందువు అయినా లౌకికవాదంతో ఎన్నడూ రాజీపడని రాజకీయ వేత్త. ఆమధ్య దాద్రీలో మహమ్మద్ అఖ్లాక్ హత్యనూ, దేశంలో పెచ్చరిల్లుతున్న అసహన ధోరణులనూ నిర్ద్వంద్వంగా ఖండించిన నాయకుడు. ఆర్ఎస్ఎస్ పట్ల తన వ్యతిరేకతను దాచుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించని నూటికి నూరు పాళ్ళు కాంగ్రెస్వాది ఆయన. అటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ వేదికను సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్తో పంచుకోవడం, వారి కార్యకర్తల కవాతు తిలకించడం, సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ను భరతమాత వరిష్ఠ పుత్రుడంటూ అభివర్ణించడం కాంగ్రెస్వాదులను ఆందోళనకు గురి చేసింది. మహాత్మా గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తేనంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్న సమయంలో కాంగ్రెస్కి చెందిన అతి పెద్ద రాజనీతిజ్ఞుడు నాగపూర్ సందర్శించడం సంచలనాత్మకమైన ఘట్టమే. ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ను విమర్శించిన ప్రతిసారీ ప్రతివిమర్శ చేస్తూ వస్తున్న రాహుల్ ఇటీవలి కాలంలో స్వరం పెంచడం, ఆరోపణలలోని తీవ్రతను హెచ్చించడం, బీజేపీ నాయకులు అంతకంటే బిగ్గరగా, కటువుగా తిరుగు దాడి చేయడం, ఫలితంగా రాజకీయ వాతావరణమే వేడెక్కిపోవడం వల్ల ప్రత్యర్థులు కలుసుకొని మాట్లాడుకోవడం అన్నది అసంభవంగా కనిపిస్తున్న రోజులలో ప్రణబ్ను భాగవత్ నాగపూర్కు ఆహ్వానించడం శుభపరిణామం. ఆర్ఎస్ఎస్ను ఎంత వ్యతిరేకించినా ఆ సంస్థ ప్రతినిధు లతో మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ నిరా కరించేవారు కాదు. 22 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీకి మార్గదర్శనం చేస్తున్న ఆర్ఎస్ఎస్ ఉనికిని గుర్తిం చకపోవడం, ఆ సంస్థ ప్రతినిధులతో సమాలోచనలు జరపడానికి నిరాకరించడం పరిణతి లేని రాజకీయం. గాంధీ–నెహ్రూ వంశం వ్యతిరేకత ఒక అధ్యాపకుడుగా జీవితం ప్రారంభించి, రాజకీయాలలో ప్రవేశించి, కేంద్రంలో మంత్రి పదవులు అనేకం నిర్వహించి, అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్ఠించిన ప్రణబ్ ముఖర్జీ కేవలం కాంగ్రెస్ నాయకుడు కాదు. పార్టీలకు అతీతంగా అన్ని పక్షాలనూ కలుపుకొని పోతూ సమాజ హితం కోసం పరిశ్రమించే రాజనీతిజ్ఞుడు. కొడుకూ, కూతురూ విభేదించినా లెక్క చేయకుండా ప్రణబ్దా నాగపూర్ సందర్శించడం సరైన నిర్ణయం. నాగపూర్ సందర్శన వెనుక రాజకీయ లక్ష్యం ఉన్నదంటూ మీడియాలో, రాజకీయవర్గాలలో ఊహాగానాలు ప్రచారం కావడానికి నేపథ్యం ఉంది. 1984లో సిక్కు అంగరక్షకులు నాటి ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసినప్పుడు తనకు ప్రధాని పదవి ఇస్తారని ప్రణబ్ ముఖర్జీ ఆశించారు. అటువంటి ఆలోచన చేయడమే నేరంగా గాంధీ–నెహ్రూ కుటుంబం భావించింది. ప్రణబ్దాను పక్కన పెట్టింది. ఆయన కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి కొత్తపార్టీ పెట్టి చేయి కాల్చుకున్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్లో ప్రణబ్ ముఖర్జీ పునరావాసం సంపూర్ణంగా జరిగింది. 2004లో కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపైన చర్చించడానికి రావలసిందిగా సోనియాగాంధీని రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆహ్వానించారు. అంతలోనే డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి పితలాటకం కారణంగా ఆమెతో ప్రమాణం చేయించడానికి కలాం సంకోచించారు. ఆ విషయం సోనియాకు ఒక లేఖ ద్వారా కలాం తెలియజేశారని సుబ్రహ్మణ్యస్వామి అంటారు. మొత్తంమీద తాను ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించరాదని సోనియా నిర్ణయించారు. పదవీత్యాగం పేరుతో నాటకీయ సన్నివేశాలు కాంగ్రెస్ హృదయాలను పిండివేసిన అనంతరం యూపీఏ ప్రధానిగా మన్మోహన్సింగ్ను సోనియాగాంధీ నియమించారు. ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్ను రిజర్వుబ్యాంకు గవర్నర్గా నియమించిన ప్రణబ్కు మరోసారి ఆశాభంగం తప్పలేదు. 2007లోనే సోనియా సమ్మతిస్తే ఆయన రాష్ట్రపతి అయ్యేవారు. ఆమె ససేమిరా అన్నారు. 2011–12లో యూపీఏ సర్కారుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు మన్మోహన్ను తప్పించి ప్రణబ్కు బాధ్యతలు అప్పగించాలనే సూచనలు బలంగా వచ్చాయి. కానీ సోనియా ఒప్పుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రపతి చేయడానికి సోనియా సమ్మతించక తప్ప లేదు. సోనియా తన పట్ల సుముఖంగా లేరనే అవగాహన తోనే 1998 నుంచి రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకూ ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్లో ప్రణబ్ కొనసాగారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ ప్రధాని కావడానికి అవకాశం అంటూ ఉంటేగింటే అది బీజేపీ సహకారంతోనే సాధ్యం. ప్రణబ్కూ, మోదీకీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఉప రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన సందర్భంలో హమీద్ అన్సారీని మోదీ సూటిపోటి మాటలు అన్నారు కానీ ప్రణబ్ను పల్లెత్తు మాట అనకపోగా చాలా గౌరవంగా చూసేవారు. ఆయనను ‘గార్డియన్’గా అభివర్ణించారు. మోదీ అయినా, మరొకరైనా ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉంటేనే ప్రధాని పదవిలో ఉంటారనే వాస్తవం ప్రణబ్కూ తెలుసు. వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి మెజారిటీ లభించపోతే, 200లకు సమీపంలో లోక్సభ స్థానాలు దక్కితే ఎన్డీఏ–3 ఏర్పాటు చేయడానికి అత్యధిక ప్రాంతీయ పార్టీలకు ఆమోదయోగ్యుడైన నాయకుడు అవ సరం. మోదీని చాలామంది ప్రాంతీయ నాయకులు వ్యతిరే కిస్తారు. సంకీర్ణధర్మాన్ని నెరవేర్చడానికి అవసరమైన ఓర్పూ, నేర్పూ మోదీకి లేవనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అటువంటి ప్రత్యేక సందర్భం ఏదైనా తారసిల్లితే ఎన్డీ ఏ–3 ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్దా పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తే, ఆర్ఎస్ఎస్ ఆమోదించవచ్చు. ఆ విధంగా ప్రణబ్ చిరకాలవాంఛ తీరవచ్చు. అనేక పరిస్థితులు కలసివస్తేనే అటువంటి అవకాశం లభిస్తుంది. రాజకీయాలలో ఏదైనా సంభవమే. మలేసియా ప్రధానిగా 92 సంవత్సరాల మహతీర్ మహమ్మద్ బాధ్య తలు స్వీకరించగా లేనిది 82 ఏళ్ళ ప్రణబ్ ప్రధాని కావాలని కోరుకోవడంలో తప్పేముంది? ప్రణబ్ అంతరంగం ఏమిటో తెలియదు కానీ ఒక వాదనగా ఇది సమంజంగానే వినిపిస్తుంది. అందరికీ ఆనందం ప్రణబ్ చేసిన ప్రసంగంలో ఆర్ఎస్ఎస్కు దగ్గరైనట్టు కనిపించే ధోరణులు ఏమైనా ఉన్నాయా? దీనికి స్పష్టమైన సమాచారం చెప్పడం కష్టం. ఇరు పక్షాలనూ సంతోష పెట్టారని చెప్పవచ్చు. అస్పష్ట రాజకీయ విన్యాసాలు చేయడంలో ప్రణబ్ బహునేర్పరి. గాంధీ–నెహ్రూ వంశం వ్యతిరేకత సహా అనేక అవాంతరాలను అధిగమిస్తూ రాజకీయ ప్రస్థానం చేసిన వ్యక్తికి ఎంత సహనం, ఎంత ప్రావీణ్యం, ఎంత గడుసుదనం, ఎంత పట్టుదల ఉండాలో ఊహించుకోవచ్చు. నాగపూర్ ప్రయాణానికి ముందు ప్రణబ్ని విమర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత ప్రశంసించడం మొదలు పెట్టారు–ఒక్క మనీష్ తివారీ తప్ప. లౌకికవాదాన్నీ, భిన్నత్వంలో ఏకత్వాన్నీ, బహుళత్వాన్నీ, సహనాన్నీ పరిపాలనలో అనివార్యమైన అంశాలుగా స్పష్టంగా చెప్పినందుకు కాంగ్రెస్వాదులు సంతోషించారు. సంఘ్ పరివారం తరచుగా విమర్శించే నెహ్రూ దార్శనికత గురించి మాట్లాడినందుకు ఆనందించారు. ప్రత్యర్థులతో సమాలోచన జరపడం, చర్చాగోష్ఠులు నిర్వహించడం (ఎంగేజ్మెంట్, డైలాగ్, డిబేట్) అత్యవసరమని ఉద్ఘాటించడం వారికి నచ్చింది. పేదరికాన్ని, అనారోగ్యాన్నీ, లేమినీ పారదోలాలనీ, ప్రగతినీ, సామరస్యాన్నీ, సంతోషాన్నీ పెంపొందించాలనీ ఎన్డీఏ ప్రభుత్వానికి పరోక్షంగా ప్రబోధించారు. ఇవన్నీ కాంగ్రెస్ నాయకత్వానికి సంతృప్తి కలి గించాయి. భాగవత్ ప్రణబ్కి స్వాగతం చెప్పిన తీరునూ, హెడ్గేవార్ను మాజీ రాష్ట్రపతి కీర్తించడాన్నీ, జాతి, జాతీయత, దేశభక్తి (నేషన్, నేషనలిజం, పేట్రియాటిజం) అనే మాటలకు ప్రణబ్ చెప్పిన నిర్వచనాలు భాగవత్ నిర్వచనాలను పోలి ఉండటాన్నీ తమకు సానుకూలమైన అంశాలుగా నందకుమార్ వంటి సీనియర్ సంఘపరివారం నాయకులు భావిస్తున్నారు. అయిదు వేల సంవత్సరాల చరిత్రను రేఖామాత్రంగా చెబుతూ, బౌద్ధం పరిఢవిల్లిన కాలాన్ని ప్రస్తావించారు. చంద్రగుప్త మౌర్యుడూ, అశోకుడి వరకూ నెహ్రూ చెప్పిన చరిత్రను అనుసరించారు. ఆ తర్వాత ఆ దృక్కోణం మరుగున పడింది. మహమ్మదీ యుల దండయాత్రలను క్లుప్తంగా చెప్పారు. నెహ్రూ విశేషంగా వివరించిన అక్బర్ మతసహనం గురించి ప్రణబ్ మాట్లాడలేదు. రాజ్యాంగాన్ని ప్రశంసించారు కానీ అంబేడ్కర్ను ప్రస్తావించలేదు. ఇప్పుడు అంబేడ్కర్ని ప్రస్తుతించినా ఎవ్వరికీ అభ్యంతరం లేదు. అది వేరే విషయం. గాంధీని గాడ్సే హత్య చేసిన ఉదంతాన్ని దాటవేశారు. బాబరీ మసీదు విధ్వంసాన్నీ, అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన మతకలహాలనూ, హింసాకాండనూ ప్రస్తావించ లేదు. అందువల్ల సంఘపరివారం సైతం సంతోషంగా ఉంది. ఇటీవలి చరిత్రలో ప్రణబ్దా పోషించినటువంటి పాత్రనే బీజేపీ అగ్రనేత లాల్కృష్ణ అడ్వాణీ నిర్వహించి మూల్యం చెల్లించిన సంగతి ఈ సందర్భంగా గుర్తురాక మానదు. 2005లో అడ్వాణీ పాకిస్తాన్ సందర్శించి కరాచీలో మహమ్మదలీ జిన్నా సమాధిని చూసిన తర్వాత జిన్నాను లౌకికవాది అంటూ ప్రశంసించారు. పాకిస్తాన్ నిర్మాత జిన్నా లౌకికవాదిగా ఉండేవారనీ, ఇరుకు మనస్తత్వం కలిగిన మతవాది కారనీ అప్పుడు పాకిస్తాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం నడుపుతున్న జనరల్ ముషారఫ్కు చెప్పాలని అడ్వాణీ ఉద్దేశం. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు అపార్థం చేసుకొని, ఆయనను దేశద్రోహి అంటూ నిందించి పక్కన పెట్టారు. అటువంటి ప్రమాదాన్ని ప్రణబ్దా తప్పించుకున్నారు. అటు బీజేపీకీ, ఇటు కాంగ్రెస్కీ ఆనందం కలిగించే విధంగా ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్కు చెప్పవలసిన పాఠాలు చెప్పారు. అభ్యంతరకరమైన అంశాలను ప్రస్తావించకుండా దాటవేశారు. నెహ్రూ నుంచి గోల్వాల్కర్ వైపు కొన్ని అడుగులు వేశారు. కానీ నెహ్రూ భావజాల పరిధిని పూర్తిగా దాటలేదు. నెహ్రూ, హెడ్గేవార్ వంటి పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వాల మధ్య సమన్వయం అసాధ్యం. ఆ ప్రయత్నం చేయకుండానే ఇద్దరి అభిమానులనూ మెప్పించే విధంగా ప్రసంగించారు. భవిష్యత్తులో అవసరమైతే, అవకాశం దొరికితే పదవీరాజకీయ విన్యాసాలకు కావలసిన వెసులుబాటు మిగుల్చుకున్నారు. అందుకే ఆయనను ఎవ్వరికీ అందని మేధావి అంటారు. - కె. రామచంద్రమూర్తి -
కురువృద్ధుడి చర్య.. ఒవైసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: నగర ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ.. ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరుకావటంపై ఒవైసీ స్పందించారు. కాంగ్రెస్లో అంతర్గత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ విషయంతో తేటతెల్లమైందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మక్కా మసీదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... ‘కాంగ్రెస్ పని ఖతమైంది. 50 ఏళ్లు ఆ పార్టీతో అంటకాగిన వ్యక్తి.. ఈ దేశానికి రాష్ట్రపతిగా పని చేసిన వ్యక్తి... ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టారు. అలాంటి పార్టీపై(కాంగ్రెస్) ఇంకా ఆశలు పెట్టుకునేవారు ఉంటారా? అంటూ ఒవైసీ అక్కడ హాజరైన ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘గాంధీ హత్య సమయంలో ఆరెస్సెస్ వేడుకలు చేసుకుంది. ఆ విషయాన్ని ఉక్కు మనిషి సర్దార్ పటేల్ తన లేఖల్లో ప్రస్తావించారు. అలాంటిది ఇప్పుడు ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ ఉపన్యసిస్తే.. శభాష్ అంటూ కొందరు ప్రశంసలు గుప్పిస్తున్నారు’ అంటూ ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. దేశంలో సెక్యులరిజాన్ని ప్రధాని మోదీ, బీజేపీలు నాశనం చేస్తున్నారంటూ ఒవైసీ మండిపడ్డారు. కాగా, నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి సంఘ శిక్ష వర్గ(ఎస్ఎస్వీ) మూడో వార్షికోత్సవానికి ప్రణబ్ ముఖర్జీ హాజరై ప్రసంగించారు. ‘‘భారతదేశమంటే హిందువులు, సిక్కులు, ముస్లింలు తదితర మతాలు, కులాల, ప్రాంతాలు, భాషల సమాహారం. ఇది మాత్రమే జాతీయవాదం. అంతేగానీ ఒకే దేశం-ఒకే మతం-ఒకే ప్రాంతం అన్న భావనే మనకు వర్తించదు..’’ అని ప్రణబ్ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. అయితే ఆయన హాజరు కావటంపై కొందరు కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కొద్ది గంటలకే వారిలో కొందరు వెనక్కి తగ్గారు. -
చరిత్రలో నిలిచిపోతుంది
న్యూఢిల్లీ: ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సందర్శించటం, భారత జాతీయవాదంపై ఆయన చేసిన ప్రసంగం భారతదేశ సమకాలీన చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిపోతుందని బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ పేర్కొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ మోహన్ భాగవత్ ఆహ్వానాన్ని మన్నించిన ప్రణబ్ ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరవడాన్ని అడ్వాణీ ప్రశంసించారు. ‘సిద్ధాంతపరమైన విభేదాలున్నా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ ప్రణబ్, భాగవత్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అమూల్యమైనవి. వీరిద్దరూ భిన్నత్వం, ఐకమత్యం, భిన్నమైన విశ్వాసాల గురించి పేర్కొనడాన్ని జీవితకాల స్వయంసేవక్గా అభినందిస్తున్నాను’ అని అడ్వాణీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ఫొటో విద్రోహశక్తుల పనే: సంఘ్ ఆరెస్సెస్ కూడా ప్రణబ్ ప్రసంగాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. మాజీ రాష్ట్రపతి భారత వైభవోపేతమైన చరిత్రను, భారత మూలసూత్రాలైన బహుళత్వం, ఐకమత్యం, భిన్నత్వం గురించి మరోసారి గుర్తుచేశారని పేర్కొంది. ‘మా కార్యక్రమానికి వచ్చి జాతీయత, దేశభక్తి భావాలను బలోపేతం చేసుకునే అంశాలపై మార్గదర్శనం చేసినందుకు ప్రణబ్కు కృతజ్ఞతలు’ అని ఆరెస్సెస్ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ తెలిపారు. కాగా, గురువారం వేదికపై ప్రణబ్ ధ్వజప్రణామ్ (ఆరెస్సెస్ తరహాలో నమస్కారం) చేస్తున్నట్లుగా మార్ఫ్డ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఫొటోలో మార్పు సంఘ విద్రోహశక్తుల పనేనని.. వారే ఫొటోలను మార్ఫింగ్ చేసి ఉంటారని ఆరెసెస్స్ సహ ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య మండిపడ్డారు. ఈ శక్తులే మొదట ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ రాకుండా అడ్డుపడ్డాయని.. ఆ తర్వాత ఆరెస్సెస్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని సంఘ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అనుకున్నట్లే జరిగింది: శర్మిష్ట తమది ‘ప్రజాస్వామ్యయుత, వివిధ అంశాలపై స్వేచ్ఛగా చర్చించే కుటుంబ’మని ప్రణబ్ కూతురు శర్మిష్ట పేర్కొన్నారు. తన తండ్రి అభిప్రాయాలతో విభేదించడంలో ఎవరికీ ఇబ్బంది లేదని ఆమె తెలిపారు. అంతా తను భయపడినట్లే జరిగిందని ప్రణబ్ ఫొటోల మార్ఫింగ్పై శర్మిష్ట ఆందోళన వ్యక్తం చేశారు. సంఘ్కు ప్రణబ్ బహుళత్వం గురించి చెప్పి తన గొప్పదనాన్ని చాటుకున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అసలైన కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ఆరెస్సెస్కు నేర్పించారని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ప్రశంసించారు. ఒక మనిషిని ఆయనకు వచ్చిన ఆహ్వానం ఆధారంగా గుర్తించొద్దని.. ఆయన ప్రసంగాన్ని బట్టే నిర్ణయించాలని మరో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. అయితే ప్రణబ్ తన ప్రసంగంలో.. హెడ్గేవార్, సావర్కర్లు చెప్పిన జాతీయవాదం గురించి పేర్కొనలేదని వీహెచ్పీ మాజీ నేత ప్రవీణ్ తొగాడియా ఇండోర్లో పేర్కొన్నారు. అప్పుడెందుకలా చెప్పారు? ప్రణబ్కు మనీశ్ తివారీ ప్రశ్న న్యూఢిల్లీ: ఆరెస్సెస్ కార్యాలయానికి ప్రణబ్ వెళ్లడంపై కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయవాదంపై ప్రసంగించేందుకు ఆరెస్సెస్ వేదికపైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రణబ్ను ప్రశ్నించారు. ఎన్ఎస్యూఐలో ఉన్నప్పుడు తనలాంటి వందలాది కార్యకర్తలకు ఆరెస్సెస్ గురించి ఎందుకు చెడుగా చెప్పారని, ఇప్పుడు వారిలో ఏం ధర్మంగా, గొప్పగా కనిపించిందో స్పష్టంచేయాలన్నారు. ‘సంఘ్ను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రణబ్ ప్రయత్నిస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు. ప్రణబ్ నాగ్పూర్ వెళ్లేందుకు కారణాలేమైనా.. అవన్నీ సంఘ్ను లౌకికవాద, బహుళత్వ సమాజంలోకి తీసుకొచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నంగానే చూస్తామన్నారు. ‘ఆరెస్సెస్ వేదికద్వారానే జాతీయవాదంపై ప్రసంగించాలని ఎందుకు అనుకున్నారు? పార్టీ కార్యకర్తలుగా మాకు 1980, 90ల్లో శిక్షణ ఇస్తున్నప్పుడు మీ తరం నేతలు ఆరెస్సెస్ ఉద్దేశాలు, లక్ష్యాలపై జాగ్రత్తగా ఉండమన్నారు. 1975, 1992ల్లో ఆరెస్సెస్పై నిషేధం సమయంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు ఆరెస్సెస్ ఎందుకు తప్పనిపించింది? ఇప్పుడెందుకు గొప్ప అనిపించింది? అని ప్రశ్నించారు. -
ప్రణబ్ను ప్రశంసల్లో ముంచెత్తిన అద్వాణీ
సాక్షి, న్యూఢిల్లీ : నాగపూర్లో గురువారం జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమంలో హాజరయ్యేందుకు తనకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయాన్ని బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వాణీ ప్రశంసించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని మన్నించడంలో ప్రణబ్ చూపిన చొరవ, ముందుచూపు కొనియాడదగినవని అద్వాణీ పేర్కొన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరు కావడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన ప్రసంగాన్ని సమర్ధించారు. ఆరెస్సెస్ వేదికపై ప్రణబ్ కాంగ్రెస్ భావజాలాన్ని విస్పష్టంగా వివరించారని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం పేర్కొన్నారు. అయితే ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరు కావడాన్ని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తప్పుపట్టారు. ఆరెస్సెస్ విషప్రచారంపై గతంలో తమకు శిక్షణ తరగతులు నిర్వహించిన పాతతరం కాంగ్రెస్ నేతల్లో ఒకరైన ప్రణబ్ ఆ సంస్థ కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యారని నిలదీశారు. గతంలో దెయ్యంలా కనిపించిన ఆరెస్సెస్ ఇప్పుడు ధర్మసంస్థలా కనిపిస్తోందా అని ప్రణబ్ను ఆయన ప్రశ్నించారు. -
అప్పుడు దెయ్యం.. ఇప్పుడు ధర్మ సంస్థగా కనిపిస్తోందా..?
సాక్షి, న్యూఢిల్లీ : నాగపూర్ వేదికగా ఆరెస్సెస్ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు ప్రశంసిస్తున్నా ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లడంపై పలువురు నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకావడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తప్పుపట్టారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాలనికి వెళ్లి జాతీయవాదంపై ప్రసంగం ఎందుకు ఇవ్వదలుచుకున్నారన్న తమ ప్రశ్నకు మీరు ఇంతవరకూ సమాధానం ఇవ్వకపోవడం లక్షలాది లౌకికవాదులను ఆందోళనకు గురిచేస్తున్నదని తివారీ పేర్కొన్నారు. ఆరెస్సెస్ కార్యకలాపాలను నిరసిస్తూ గతంలో తమకు శిక్షణ ఇచ్చిన పాతతరం కాంగ్రెస్ నేతగా ప్రణబ్ ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు. గతంలో దెయ్యంలా కనిపించిన ఆరెస్సెస్ ఇప్పుడు ధర్మసంస్థలా మారిందా అని ప్రణబ్ను ఆయన ప్రశ్నించారు. కాగా ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఆరెస్సెస్ వేదికగా ప్రణబ్ కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి వివరించారని, ఆరెస్సెస్ భావజాలం తప్పని పరోక్షంగా సూచించారని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం ట్వీట్ చేశారు. పార్టీ నేతలు ఆనంద్ శర్మ, రణదీప్ సుర్జీవాలాలు సైతం ప్రణబ్ ప్రసంగాన్ని స్వాగతించారు. -
ప్రణబ్ కూతురు భయపడ్డట్టే..!
న్యూఢిల్లీ: ‘‘నాన్న(ప్రణబ్) ఏం మాట్లాడుతారనేది ఆర్ఎస్ఎస్ పట్టించుకోదు, ఆయన వచనాలేవీ వాళ్లకు గుర్తుండవు.. కొన్ని విజువల్స్ తప్ప!!’’ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లడానికి కొద్ది గంటల ముందు ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ చేసిన వ్యాఖ్యలివి. శుక్రవారం తాజాగా ఆమె మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.. ‘‘దేనిగురించైతే నేను భయపడ్డానో అదే జరిగింది. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే హెచ్చరించా. కార్యక్రమం ముగిసి కొన్ని గంటలు కూడా గడవక ముందే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నీచమైన చర్యలకు పాల్పడుతున్నాయి..’’ అని షర్మిష్ట పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగింది?: ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి ప్రసంగించిన ప్రణబ్.. ‘‘భారతదేశమంటే హిందువులు, సిక్కులు, ముస్లింలు తదితర మతాలు, కులాల, ప్రాంతాలు, భాషల సమాహారం. ఇది మాత్రమే జాతీయవాదం. అంతేగానీ ఒకే దేశం-ఒకే మతం-ఒకే ప్రాంతం అన్న భావనే మనకు వర్తించదు..’’ అని ఉద్ఘాటించారు. ప్రసంగానికి ముందు వేదికపైనున్న నేతలంతా నిలబడి ‘ఆర్ఎస్ఎస్ సెల్యూట్’ చేయగా, ప్రణబ్దా మాత్రం అటెన్షన్లో ఉన్నారే తప్ప ఆర్ఎస్ఎస్ సెల్యూట్ చేయలేదు. సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ప్రణబ్ ఫొటో ఒకటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సర్కిళ్ళలో విపరీతంగా షేర్ అయింది. అందులో ప్రణబ్ ఆర్ఎస్ఎస్ తరహాలో నలుపు టోపీ ధరించి, సేవక్ స్టైల్లో సెల్యూట్ చేస్తున్నట్లుగా మార్ఫింగ్ చేశారు. సదరు ఫొటో వైరల్ కావడంతో షర్మిష్ట మళ్లీ స్పందించారు. తాను హెచ్చరించినట్లే జరిగిందని వ్యాఖ్యానించారు. బర్నల్ అమ్మకాలు హై జంప్!: కరడుగట్టిన కాంగ్రెస్ వాది, రాహుల్ గాంధీకి రాజగురువు అయిన ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్లడంపై సొంతపార్టీ నేతలే ఘాటుగా స్పందించడం తెలిసిందే. ఇక గురు, శుక్రవారాల్లో సోషల్ మీడియా అంతటా ప్రణబ్ను గురించిన చర్చే ఎక్కువగా నడిచింది. పెద్దాయన చర్యతో ఒళ్లుమండిన కాంగ్రెస్ నేతలు బర్నల్(గాయాలకు పూసుకోడానికి) కోసం వెతుకులాడుతున్నారని బీజేపీ శిబిరం జోకులు పేల్చింది. దుకాణాల్లో బర్నల్ దొరకట్లేదని, బర్నల్ తయారీ కంపెనీల షేర్లు విపరీతంగా దూసుకెళుతున్నాయని సెటైర్లు వేసింది. అయితే, ప్రణబ్, ఆర్ఎస్ఎస్ అగ్రనేతల సమక్షంలో వారి మౌలిక సిద్ధాంతాలపై సున్నిత విమర్శలు చేయడంతో సీన్ రివర్స్ అయింది. ‘‘ఇప్పుడా బర్నల్ కావలసింది మీకే..’’ అంటూ కాంగ్రెస్ శిబిరం కౌంటర్ విసిరింది. (ఆర్ఎస్ఎస్ కేంద్రంలో ప్రణబ్ ఏం మాట్లాడారు?) -
నెరవేరిన ప్రణబ్, ఆర్ఎస్ఎస్ లక్ష్యం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తన కార్యాలయానికి ఆహ్వానించడం ద్వారా.. తాను అనుకున్న లక్ష్యాన్ని ఆర్ఎస్ఎస్ సాధించింది. ఆది నుంచి వివాదాస్పదమైన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా అనుకున్నట్లుగానే వీలైనంత ప్రచారం పొందింది. ఇక ప్రణబ్ ముఖర్జీ కూడా తెలివిగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నొప్పించక.. తానొవ్వక అన్న రీతిలో బయటపెట్టడంలో విజయం సాధించారు. పైకి చెప్పకపోయినా.. ప్రణబ్ ప్రసంగం ఆర్ఎస్ఎస్ పెద్దలకు అంతగా రుచించనట్లే కనిపించింది. ఏ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సంస్థ.. దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని తెలివిగా మనసులో మాటను ప్రణబ్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం క్షుణ్నంగా తెలిసిన ప్రణబ్.. దానిని పరోక్షంగా విమర్శించేందుకు నెహ్రూ సోషలిజంను చాటిచెప్పే ప్రయత్నం చేశారు. బౌద్ధం ఆవిర్భావం నుంచి ఎంత విధ్వంసం జరిగినా దేశం చెక్కుచెదరకుండా ఎలా కొనసాగిందో ప్రణబ్ చాటి చెప్పారు. సాంస్కృతిక ఐక్యమత్యంపై సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన అంశాల్ని ప్రస్తావించిన ప్రణబ్.. అదే సమయంలో నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ప్రస్తావిస్తూ జాతీయవాదం, దేశభక్తికి అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పటిలానే తన సొంత ధోరణిలో ప్రణబ్ ప్రసంగం కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని రాజకీయ పునరావాసంగా వాడుకునేందుకు ప్రణబ్ ఏమాత్రం ప్రయత్నించలేదన్న విషయం ఆయన ప్రసంగంతో స్పష్టమైంది. గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తూ హుందాగావ్యవహరించారు. కాంగ్రెస్ సెల్ఫ్గోల్ గతంలో ఐదుగురు భారత రాష్ట్రపతులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరైనా.. ఈ స్థాయిలో ఎన్నడూ ప్రచారం లభించలేదు. ఈ కార్యక్రమ ప్రచార బాధ్యతలు మొత్తం కాంగ్రెస్ పార్టీనే తీసుకుంది. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ప్రణబ్ హాజరుపై ఆ పార్టీ అతిగా స్పందించిందని విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించకపోయినా.. ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలతో విమర్శలు చేయించింది. సొంత చరిత్రను గుర్తుచేయాల్సింది: లెఫ్ట్ న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని వామపక్షాలు స్వాగతించాయి. ఈ విషయమై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ..‘ఆరెస్సెస్ ప్రధానకార్యాలయంలో ప్రణబ్ ఇచ్చిన ప్రసంగంలో మహత్మాగాంధీ హత్య వివరాలు అదృశ్యమయ్యాయి. గాంధీ హత్య అనంతరం అప్పటి హోంమంత్రి పటేల్ అరెస్సెస్పై నిషేధం విధించడం, బాపూ హత్యతో అప్పటి ఆరెస్సెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడం.. ఇలాంటి సొంత చరిత్రను ఆరెస్సెస్కు ఈ భేటీలో ప్రణబ్ మరింత గట్టిగా గుర్తుచేయాల్సింది’ అని ట్వీట్ చేశారు. కాగా తాము ఊహించినట్లే ప్రణబ్ మాట్లాడారనీ, ఏదేమైనా అయన ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సింది కాదని సీపీఐ వ్యాఖ్యానించింది. -
విభేదించినా విచ్చేసిన ప్రముఖులు..
తమ సిద్ధాంతాలతో విభేదించే జాతీయ నాయకులు, ప్రముఖులకు గతంలో కూడా ఆర్ఎస్ఎస్ ఆహ్వానం పలికింది. ► 1933లో బ్రిటిష్ హయాంలో సెంట్రల్ ప్రావిన్సెస్ హోం మంత్రిగా ఉన్న సర్ మోరోపంత్ జోషిని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ ఆహ్వానించారు. ► 1934 డిసెంబర్ 25న వార్దాలోని ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని మహాత్మా గాంధీ స్వచ్ఛందంగా సందర్శించారు. హెడ్గెవార్తో ఆయన చాలా సమయం సంభాషించారు. ► లోక్నాయక్ జయప్రకాష్నారాయణ్ సంఘ్ కార్యకర్తల సమావేశంలో అతిథిగా పాల్గొన్నారు. ► ప్రముఖ సామాజిక కార్యకర్త అభయ్ భాంగ్, సీబీఐ మాజీ డైరెక్టర్ జోగిందర్ సింగ్, రివల్యూషనరీ పార్టీ ఆఫ్ ఇండియా(గవాయ్)అధ్యక్షుడు ఆర్ఎస్ గవాయ్, నేపాల్ మాజీ సైన్యాధ్యక్షుడు రుక్మాంగద్ కటావాల్లు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు అతిథులుగా హాజరయ్యారు. ► 2007లో సర్సంఘ్చాలక్ కేఎస్ సుదర్శన్ ఆహ్వానంపై మాజీ ఎయిర్చీఫ్ మార్షల్ ఏవై టిప్నిస్ అతిధిగా పాల్గొన్నారు. లౌకికత్వాన్ని గౌరవించాలని, ఇతర మతాల పట్ల ఓర్పు, సహనంతో వ్యవహరించాలని ఆర్ఎస్ఎస్పై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. టిప్నిస్ వాదనను తిప్పికొడుతూ ఒక్కొక్క అంశంపై సుదర్శన్ ప్రసంగించారు. ► 1963 గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అప్పటి ప్రధాని నెహ్రూ ఆహ్వానించారని, అలాగే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాన్ని సందర్శించారని ఆర్ఎస్ఎస్ నేతలు పేర్కొన్నారు. ‘సంఘ్ శిక్షా వర్గ్’ ఏడాదికోసారి జరుగుతుంది. 1927లో హెడ్గెవార్ దీనిని ప్రారంభించినపుడు ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్’గా పిలిచేవారు. అనంతరం సంఘ్ బాధ్యతలు చేపట్టిన గోల్వాల్కర్ దీని పేరును ‘సంఘ్ శిక్షా వర్గ్’గా మార్చారు. సైద్ధాంతికంగా విభేదించినా.. అవసరాన్ని బట్టి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలు ఆర్ఎస్ఎస్తో సంప్రదింపులు, సమాలోచనలు జరిపేవారని తెలుస్తోంది. బాబ్రీ మసీదు విధ్వంసం, మండల్ కమిషన్ వివాదం అనంతరం ఆర్ఎస్ఎస్ పట్ల కాంగ్రెస్ కఠిన వైఖరి ప్రారంభమైందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సహనశీలతే భారతీయత
ప్రణబ్ స్పందించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని మన్నించినప్పటి నుంచి వస్తున్న వరుస విమర్శలకు నాగపూర్లో జూన్ 7వ తేదీననే జవాబిస్తానన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్.. చెప్పినట్లే ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం వేదికగా గురువారం ఆ విమర్శలకు జవాబిచ్చారు. అనుమానాలు తీర్చారు. సహనశీలతే భారతీయ ఆత్మ అని స్పష్టం చేశారు. జాతీయవాదం ఏ మతానికో, జాతికో సొంతం కాదని తేల్చి చెప్పారు. హిందూ, ముస్లిం, సిఖ్, ఇతర అన్ని వర్గాల సిద్ధాంతాల సమ్మేళనమే జాతీయవాదమని నిర్వచించారు. ద్వేషం సమాజ సామరస్యతను నాశనం చేస్తుందని, అభిప్రాయ బేధాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అసహనం, వితండవాదం, మతం ఆధారంగా భారత్ను నిర్వచించాలనుకునే ఏ ప్రయత్నమైనా చివరకు దేశ అస్తిత్వాన్నే పలుచన చేస్తుందని హెచ్చరించారు. కోపం, హింస, ఘర్షణల నుంచి శాంతి, సంతోషం, సామరస్యం దిశగా మనమంతా ముందుకెళ్లాలన్నారు. నాగపూర్: ద్వేషం, అసహనం దేశ అస్తిత్వాన్ని బలహీనపరుస్తాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. నాగపూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయంలో గురువారం స్వయం సేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంసేవకులు జరిపిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఆ తరువాత ప్రణబ్ స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ మన్నించడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. దేశం దృష్టి అంతా ఈ కార్యక్రమం పైనే ఉంది. కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ.. దేశం, జాతీయవాదం, దేశభక్తిపై తన ఆలోచనలను పంచుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. శతాబ్దాల భారత చరిత్ర, ముస్లిం దురాక్రమణలు, వివిధ సామ్రాజ్యాల ఏర్పాటు, బ్రిటిష్ పాలన..తదితర భారత చరిత్రలోని పలు ముఖ్యమైన ఘట్టాలను, ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు. ప్రణబ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ► ముందుగా మనం దేశం, జాతీయవాదం, దేశభక్తి అనే మూడు పదాల డిక్షనరీ అర్థాలను తెలుసుకుందాం. ► దేశమంటే.. ఒకే సంస్కృతి, ఒకే భాష, చరిత్ర, అలవాట్లను కలిగి ఉన్న ప్రజల సమూహం. జాతీయవాదం అంటే.. ఒక దేశానికి ఉండే గుర్తింపు, ఆ దేశ ప్రయోజనాలకు ఉండే మద్దతు. దేశభక్తి అంటే ఒకరికి తమ దేశంపై ఉండే ఆత్మసమర్పణ, నిబద్ధత. ► భారత్ ఓ బహిరంగ సమాజం.. పట్టు, సుగంధ ద్రవ్యాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమైంది. వీటి వాణిజ్య మార్గాల ద్వారా మన సంస్కృతి, విశ్వాసం వంటివి వ్యాపారులు, మేధావుల ద్వారా కొండలు, లోయలు, సముద్రాలు దాటి ప్రపంచమంతా వ్యాపించాయి. హిందుత్వంతో సహా బౌద్ధం మధ్య ఆసియా, చైనాలకు పాకింది. మెగస్తనీస్, హుయనుత్సాంగ్ వంటి వారు భారత సమర్థవంతమైన పాలనా విధానం, గొప్ప మౌలికవసతులతో కూడిన వ్యవస్థలను తమ పుస్తకాల్లో పేర్కొన్నారు. తక్షశిల, నలంద, విక్రమశిల, వలభి, సోమపుర, ఓదంతపురి వంటి విశ్వవిద్యాలయాలు మన పురాతన విద్యా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. చాణిక్యుడి అర్థశాస్త్రం నాటి పరిపాలన తీరుకు నిదర్శనం. ► ఆ తర్వాత దేశమంతా విస్తరించిన 16 మహాజనపదాలు, చంద్రగుప్త మౌర్యుడు గ్రీకులకు ఓడించి బలమైన భారత సామ్రాజ్యాన్ని నిర్మించడం, తర్వాత అశోకుడు ఆదర్శవంతమైన పాలనను అందించడం.. గుప్తులతోపాటు ఎందరో రాజులు ముస్లిం దురాక్రమణ దారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. 300 ఏళ్లపాటు ముస్లిం పాలకులు దేశాన్ని పాలించడం ఇవన్నీ దేశ చరిత్రలో మైలురాళ్లు. వ్యాపారం కోసం వ చ్చిన బ్రిటిషర్లు 190 ఏళ్లు దేశాన్ని తమ బానిసత్వంలో ఉంచుకోవడం మధ్యలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఇవన్నీ మనం మరిచిపోలేం. 2500 ఏళ్ల పాటు దేశంలో ఎన్నో రకాలుగా మారిన రాజకీయ పరిస్థితుల్లోనూ 5వేల ఏళ్లకు పైగా మన నాగరిత ఇంకా కొనసాగుతుండటమే భారత్ గొప్పదనానికి నిదర్శనం. ► దేశాన్ని ఒక్కటిగా ఉంచడం, జాతీయత భావాన్ని పెంపొందించడంలో జవహార్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, బాల గంగాధర్ తిలక్ తదితరులను సేవలు మరిచిపోలేనివి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి వల్లే మనమంతా ఒకే ఒకదేశంగా మారాం. ► భారతదేశం గొప్పదనం ఇక్కడి బహుళత్వం, సహనంలోనే ఉంది. శతాబ్దాలుగా మన ప్రజల సహజీవనం నుంచే ఈ బహుళత్వం పుట్టింది. లౌకికవాదం, సమగ్రత మన విశ్వాసాలు. ► మనం 130 కోట్ల మంది భారతీయలం.. 122 భాషల్లో, 1600 యాసల్లో మాట్లాడుకుంటాం. ఏడు ప్రధాన మత విశ్వాసాలను పాటిస్తాం. అయినా, ఒకే వ్యవస్థలో, జీవిస్తాం. ఒకే జాతీయజెండాను గౌరవిస్తాం. భారతీయత అనే ఒకే అస్తిత్వాన్ని కాపాడుకుంటాం. ఇదే భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. ► వివిధ అంశాలపై మనం వాదించుకోవచ్చు కానీ భిన్నాభిప్రాయాలుండకూడదని చెప్పకూడదు. పరస్పర విరుద్ధ ఆలోచనలున్నప్పటికీ చర్చల ద్వారానే వీటిని పరిష్కరించుకోవాలి. ► శాంతిపూర్వకమైన అస్తిత్వం, కరుణ, జీవితంపై గౌరవం, సామరస్యం వంటివి భారత నాగరికతలోని సహజ సూత్రాలు. ► చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగిన ప్రతిసారీ.. భారతమాత ఆత్మ క్షోభిస్తుంది. మన సామరస్యపూర్వక సహజీవనాన్ని అనవసర కోపతాపాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. అహింసాయుత సమాజం మాత్రమే ప్రజలంతా ప్రజాస్వామ్య విధానంలో భాగస్వాములయ్యేలా చేస్తుంది. ప్రత్యేకంగా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మార్గం చూపిస్తుంది. కోపం, హింస, ఘర్షణ నుంచి శాంతి, సామరస్యం, సంతోషం మార్గంలో మనమంతా పయనించాలి. ► దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఇటీవలి అంతర్జాతీయ సూచీలు తెలియజేస్తున్నాయి. సంతోషం. కానీ సంతోషకర సూచీలో మాత్రం మనం ఇంకా వెనకబడే ఉన్నాం. ► ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే రాజు సంతోషంగా ఉంటాడు. ప్రజల సంక్షేమమే రాజు సంక్షేమం. తనకు ఇంపుగా ఉన్నదానికంటే ప్రజలకు మేలు చేసే పనిని చేయడమే రాజు ముఖ్యమైన ధర్మం. ప్రజల విషయంలో రాజు ఎలా ఉండాలనేదాన్ని కౌటిల్యుడు బాగా వివరించారు. ► శతాబ్దాలుగా ఉన్న ఐకమత్యం, ఆత్మీయీకరణ, అందరూ కలిసి జీవిచడమే మన దేశ గుర్తింపు. ► ‘ఒకే భాష, ఒకే మతం, ఒకే శత్రువు అనేది మన జాతీయవాదం కాదు. (ఆరెస్సెస్ ‘ఒకే దేశం– ఒకే సంస్కృతి’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ) ► ప్రతిరోజూ మనచుట్టూ హింస పెచ్చుమీరటాన్ని గమనిస్తున్నాం. హింస, భయం, అవిశ్వాసం ఇవన్నీ మన గుండెల్లో పాతుకుపోతున్నాయి. అందుకే ప్రజలను భయం, శారీరక, మానసిక హింస నుంచి స్వతంత్రులను చేయాలి. ► దేశంలో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకువచ్చేందుకు లకి‡్ష్యంచిన హక్కుల పత్రం వంటిది భారత రాజ్యాంగం. ఇది 130 కోట్ల మంది భారతీయులు ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ► మహాత్మాగాంధీ, నెహ్రూలు పేర్కొన్నట్లు మన జాతీయతావాదం ఒక్కరికే పరిమితం కాదు, దూకుడు, విధ్వంసకరమైనది కాదు. అందరినీ కలుపుకుని పోవడమే జాతీయతావాదం. ► ప్రజలు వారి దైనందిన జీవితంలో చేయాల్సిన పనులకు సరైన మార్గదర్శకం చేయాలి. ఇదే సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది. దీంతో సహజంగానే జాతీయతావాదం పెరుగుతుంది. ‘సంఘ్’ భారతీయులందరిదీ స్వయంసేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మోహన్ భాగవత్ నాగపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేయాలని కోరుకుంటోందని, తమకు బయటివారంటూ ఎవరూ లేరని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. తమ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవడంపై చర్చించడం అర్థరహితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తరువాత కూడా ప్రణబ్ ప్రణబ్గానే ఉంటారని, సంఘ్ సంఘ్గానే ఉంటుందని అన్నారు. ఏటా తమ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని, ఆ పరంపరలోనే ఈసారి ప్రణబ్ వచ్చారని అన్నారు. భిన్నాభిప్రాయాలున్నా మనమంతా భరతమాత పిల్లలమే అన్నారు. నాగపూర్లో హెడ్గేవార్ నివాసంలో ప్రణబ్, భాగవత్ అందరినీ కలుపుకుపోతున్నాం.. ‘ఆరెస్సెస్ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. మాకు బయటివారంటూ ఎవరూ లేరు. ఆరెస్సెస్ భారతీయులందరిదీ. భారత మాత ప్రతి ఒక్కరికీ తల్లి వంటిది. హిందువులు దేశానికి వారసులు. అందరినీ కలుపుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, దేశం పేరు ప్రతిష్టలను మరింత పెంచే కార్యకర్తలను తయారుచేయడమే ఆరెస్సెస్ లక్ష్యం. కుల,మత, ప్రాంత, వర్గ భేదాల్లేకుండా దేశమంతా ఒక్కటేననే భావనను నెలకొల్పుతున్నాం. అందరినీ కలుపుకుని వెళ్లడం ద్వారా క్రమశిక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచాం. ప్రజాస్వామ్య ఆలోచనే ఆరెస్సెస్ అస్తిత్వం. దేశం కోసం పనిచేయడాన్నే మేం విశ్వసిస్తాం. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పుడే స్వాతంత్య్ర సమరంలో జైలుకెళ్లారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాతో కలిసి పనిచేశారు. జాతి నిర్మాణంలో సమాజమంతా భాగస్వామ్యమైనప్పుడే ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది’ అని భాగవత్ అన్నారు. భారతమాత గొప్ప పుత్రుడు హెడ్గేవార్ నాగపూర్: ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవార్.. భారతమాత ముద్దుబిడ్డ అని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. హెడ్గేవార్ పుట్టిన ఇంటిని సందర్శించిన అనంతరం అక్కడి సందర్శకుల పుస్తకంలో ‘భారతమాత గొప్ప పుత్రుడికి ఘనమైన నివాళులర్పించేందుకు నేను ఇక్కడికొచ్చాను’ అని ప్రణబ్ రాశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగపూర్ నగరంలోని ఇరుకు వీధులగుండా హెడ్గేవార్ నివాసానికి ప్రణబ్ను దగ్గరుండి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే ప్రణబ్ తన పాదరక్షలు తీసి లోపలకు వెళ్లారు. ఈ సందర్భంగా హెడ్గేవార్కు సంబంధించిన వివరాలను ప్రణబ్కు మోహన్ భాగవత్ వివరించారు. నాగపూర్లోని సంఘ శిక్షావర్గ తృతీయ కార్యక్రమానికి స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక అతిథులుగా ఆరెస్సెస్ ఆహ్వానించింది. ప్రణబ్ సూచనల్ని ఆచరిస్తారా: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ప్రణబ్ ప్రసంగం భారతీయ నాగరిక విలువలతో పాటు బహుళత్వం, లౌకికవాదం, అందర్ని కలుపుకుపోవడాన్ని ఆరెస్సెస్, బీజేపీలకు చూపిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ విషయమై కాంగ్రెస్ నేత సూర్జేవాలా స్పందిస్తూ.. ‘ప్రణబ్ చేసిన విలువైన సూచనల్ని అంగీకరించి ఆరెస్సెస్, బీజేపీలు తమ ఆలోననావిధానం, స్వభావం, ధోరణిని ఈరోజు మార్చుకుంటాయని ఆశిస్తున్నాం. తమ తప్పుల్ని అంగీకరించేందుకు ఆరెస్సెస్ సిద్ధమా? హింసాత్మక, అణచివేత లక్షణాలను విడిచిపెడుతుందా? మహిళలు, పేదలపట్ల అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని ఆరెస్సెస్ వదిలివేస్తుందా?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. నాగపూర్లో హెడ్గేవార్ -
ప్రణబ్ దా.. థాంక్యూ : మోహన్ భగవత్
సాక్షి, నాగ్పూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని, భారతీయులందరికీ చెందిన సంస్థ ఇదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరెస్సెస్ మూడో శిక్షా వర్గ్ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తమ ఆహ్వానాన్ని అంగీకరించి సదస్సుకు విచ్చేసిన ప్రణబ్ ముఖర్జీకి భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. ఆరెస్సెస్ సదస్సుకు ప్రణబ్ రావడాన్ని వివాదం చేయ్యొద్దని ఆయన సూచించారు. ప్రముఖులను ఆరెస్సెస్ సదస్సులకు ఆహ్వానించడం ఆనవాయితీ అని అన్నారు. ప్రణబ్తో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అపార అనుభవం ప్రణబ్ సొంతమని ప్రశంసించారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధే మన లక్ష్యమని గుర్తుచేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సహజ లక్షణమని, ఒక మతాన్ని గుప్పిట్లో పెట్టుకొని దేశ రాజకీయాలను శాసించాలనే భావనతో ఆరెస్సెస్ను స్థాపించలేదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయులేనని స్పష్టం చేశారు. -
కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ జన్మస్థలాన్ని సందర్శించిన ప్రణబ్
-
సహనమే మన శక్తి : ఆరెస్సెస్కు ప్రణబ్ ఉద్భోద
సాక్షి, నాగ్పూర్ : సహనమే మన శక్తి అని, బహుళత్వాన్ని గౌరవించి.. భిన్నత్వాన్ని సంబరంగా భావించడంలోనే మన దేశ గొప్పదనం ఇమిడి ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ‘అసహనం మన జాతీయవాద గుర్తింపు నీరుగారుస్తుంది. మతం, అధికారవాద సూత్రాలు, అసహనం తదితర అంశాల ద్వారా మన జాతీయవాదాన్ని నిర్వచించుకునే ప్రయత్నం చేయడమంటే.. మనం మన ఉనికిని దెబ్బతీసుకున్నట్టే’ అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యమే మన అత్యుత్తమ ఖజానా అని, ప్రజాస్వామ్యం అంటే కానుక కాదని, అదొక ప్రవిత్రమైన మార్గదర్శనమని ఉద్బోధించారు. గురువారం నాగ్పూర్లో నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తృతీయ శిక్షా వర్గ్ ముగింపు సదస్సులో ప్రణబ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ప్రతి రోజూ మన చుట్టు చోటుచేసుకుంటున్న హింస పెరిగిపోతూనే ఉంది. ఈ హింస అంధకారానికి ప్రతిరూపం. మన మాతృభూమి శాంతి, సామరస్యం, సంతోషం కావాలని అర్ధిస్తోంది. అందుకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిది’ అంటూ ప్రణబ్ తన ప్రసంగాన్ని ముగించారు. జాతి, జాతియత, దేశభక్తి తదితర అంశాలపై ఆయన ప్రసంగం సాగింది. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ప్రాచీనకాలం నుంచి భారత్లోని విద్యాసంస్థలకు విదేశీ విద్యార్థులు వచ్చేవారు వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అన్నది భారతీయత నుంచే వచ్చింది ఒక్కతాటిపైకి వచ్చిన భిన్న జాతుల సంస్కృతి.. భారత్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మౌర్యుల పాలన దేశాన్ని ఒక్క తాటిపైకి తెచ్చింది భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల గొప్పతనం అసహనం, ద్వేషం జాతీయతకు ముప్పు ప్రాంతం, మతం, గుర్తింపు ప్రాతిపదికగా దేశాన్ని వీడదీసేందుకు ప్రయత్నిస్తే.. అది మన గుర్తింపునకు ప్రమాదం తెస్తుంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిని దేశంలో విలీనం చేసిన ఘనత వల్లభాయ్ పటేల్ గాంధీజీ చెప్పినట్లు జాతీయవాదం ఏ ఒక్కరిది కాదు.. పైగా అదేం ప్రమాదకరం కాదు అన్ని మతాలు ముఖ్యంగా హిందు, ముస్లింలు కలిస్తేనే.. అది భారతజాతి అని నెహ్రూ చెప్పారు హెగ్డేవార్పై ప్రణబ్ ప్రశంసలు మోహన్ భగవత్తోపాటు ఆరెస్సెస్ ప్రధాన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆరెస్సెస్ వ్యవస్థాపక సర్సంఘ్చాలక్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ జన్మస్థలాన్ని ప్రణబ్ సందర్శించారు. నాగ్పూర్లోని హెగ్డేవార్ స్మారక కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్లో ఆసక్తికర సందేశాన్ని రాశారు. భారతమాత కన్న గొప్ప బిడ్డ కేబీ హెగ్డేవార్ అని ప్రశంసించిన ప్రణబ్.. ఆయనకు నివాళులర్పించేందుకు ఇక్కడి వచ్చినట్టు తెలిపారు. ‘భారతమాత కన్న గొప్పబిడ్డకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఇక్కడికి వచ్చాను’ అని ఆయన విజిటర్స్ బుక్లో రాశారు. అంతకుముందు ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రణబ్కు ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సాదర స్వాగతం పలికారు. -
ప్రణబ్ దా.. మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు (గురువారం) ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొనబోతుండటంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రణబ్ సహచరులైన కాంగ్రెస్ నేతలు ఆయన తీరుపై అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ప్రణబ్ తీరుపై స్పందించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి అత్యంత కీలకమైన అనుచరుడిగా పేరొందిన ఆయన.. ‘ప్రణబ్ దా.. మీ నుంచి ఇది ఆశించలేదు’ అని ట్వీట్ చేశారు. ప్రణబ్ తీరును ఆయన కూతురు షర్మిష్టా ముఖర్జీ కూడా తప్పుబట్టారు. నాగ్పూర్కు వెళ్లడం ద్వారా బూటకపు కథనాలను సృష్టించేందుకు బీజేపీ-ఆరెస్సెస్కు కావాల్సినంత అవకాశం కల్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను రాజకీయాలను వీడుతాను కానీ, కాంగ్రెస్ పార్టీని వీడబోనని షర్మిష్ట పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తృతీయ వార్షిక శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా గురువారం ఆ సంస్థ నిర్వహించబోయే కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధాన అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఆరెస్సెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ నాయకుడిగా, లౌకికవాదిగా జీవితమంతా బీజేపీని, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ను తీవ్రంగా విమర్శించిన ప్రణబ్ రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న అనంతరం ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొండటం రాజకీయ దుమారం రేపుతోంది. -
సంఘ్ విధానాలకు జై కొడతారా? వ్యతిరేకిస్తారా?
-
మాటలు మరచినా.. దృశ్యాలు ఉంటాయి
న్యూఢిల్లీ: ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రసంగించబోతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయాన్ని ఆయన కూతురు శర్మిష్ట ముఖర్జీ వ్యతిరేకించారు. ‘ప్రణబ్ మాటల్ని మరచిపోయినా.. ఆ దృశ్యాలు అలాగే మిగిలిపోతాయి’ అని ఆమె వ్యాఖ్యానించారు. నాగపూర్కు వెళ్లడం ద్వారా తన తండ్రి బీజేపీ నేతలకు కట్టుకథలు అల్లే అవకాశమిస్తున్నారని అన్నారు. బీజేపీ కుటిల రాజకీయాలను ఆయన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రణబ్ ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రసంగించడానికి ఒకరోజు ముందు..శర్మిష్ట బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వ్యాపించాయి. వాటిని ఆమె కొట్టిపారేస్తూ పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ను వీడాల్సి వస్తే అంతకుముందే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ‘మీ ప్రసంగంలో ఆరెస్సెస్ సిద్ధాంతాలకు మద్దతు పలుకుతారని వాళ్లకు కూడా నమ్మకం లేదు. మీ మాటల్ని మరిచిపోయినా ఆ దృశ్యాలకు బూటకపు వ్యాఖ్యలు జోడించి ప్రచారం చేస్తారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రణబ్ ఏం మాట్లాడనున్నారు?
మాజీ రాష్ట్రపతి, జీవితకాలం లౌకికవాది గా, కాంగ్రెస్ వ్యక్తిగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ నేడు (గురువారం) నాగపూర్లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యక్రమం లో ఏం మాట్లాడబోతున్నారని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగిన రాజకీయ జీవితంలో ఆయన అనేక ప్రసంగాలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనూ వివిధ సందర్భా ల్లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. వాటి లో ప్రధానంగా ప్రస్తావించదగినవి 2012లో ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చేసిన ప్రసంగం.. మరొకటి, 2017లో రాష్ట్రపతిగా చేసిన చివరి ప్రసంగం. 2012లో.. 2012లో లౌకికత, ప్రజాస్వామ్యం, సమాన త్వం తదితరాలను ప్రస్తావించినప్పటికీ.. ప్రధానంగా పేదరిక నిర్మూలన, ఉగ్రవాదం, అవినీతిపై పోరు.. తదితర అంశాలపైనే ఎక్కువగా ఆయన ప్రసంగం కేంద్రీకృతమైంది. ‘భారతదేశ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామినేనని దేశంలోని అత్యంత పేదవాడు కూడా విశ్వసించినప్పుడే అది నిజమైన అభివృద్ధి. ఆకలిని మించిన బాధ, వేదన లేదు. ఆధునిక భారతదేశ డిక్షనరీలో నుంచి పేదరికం అనే పదాన్ని లేకుండా చేసేందుకు మనమంతా కృషి చేయాలి’ అని నాడు ప్రణబ్ పేర్కొన్నారు. మన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపాలైన గుడి, మసీదు, చర్చి, గురుద్వారా.. ఇవన్నీ సఖ్యతగా సాగినప్పుడే సామాజిక సామరస్యత సాధ్యమవుతుంది’ అని కూడా నాడు ప్రణబ్ వ్యాఖ్యానించారు. 2017లో.. గత సంవత్సరం చేసిన ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధానంగా లౌకికత్వం, సామరస్య పూర్వక సహజీవనం పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ‘నా ఇన్నేళ్ల జీవితంలో నేను అర్థం చేసుకున్న కొన్ని వాస్తవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సహనశీలత, భిన్నత్వం.. వీటిలోనే మన భారతీయ ఆత్మ నిలిచి ఉంది. భారత్ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతమే కాదు.. భిన్న ఆలోచనలు, విభిన్న తాత్వికతలు, మేధో భావనలు, అత్యుత్తమ విలువలు, సృజనాత్మక కళా నైపుణ్యాలు.. ఇవన్నీ కలగలసిన చరిత్రే భారత్. శతాబ్దాల ఆలోచనల ఫలితంగా మన దేశ భిన్నత్వం రూపుదిద్దుకుంది. సాంస్కృతికంగాను, భాషా విశ్వాసాల్లోనూ భిన్నత్వం మన ప్రత్యేకత. సహనశీలత మన బలం. మన అభిప్రాయాల్లో బేధాలుండొచ్చు.. మనం వాదించుకోవచ్చు.. కానీ విభిన్న అభిప్రాయాలను గౌరవించాలని మనం శతాబ్దాలుగా మన ఆలోచనల్లో, మన రక్తంలో ఇంకించుకున్న ఉన్నత భావనను మాత్రం తొలగించుకోవద్దు. అదే మన దేశ ఔన్నత్యం. దాన్ని కోల్పోతే మన మౌలిక వ్యక్తిత్వాన్నే కోల్పోయినట్లు’ అని ప్రణబ్ ముఖర్జీ నొక్కి చెప్పారు. 2018లో.. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో స్వయం సేవకులను ఉద్దేశించి ప్రణబ్ ఏం ప్రసంగించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఆరెస్సెస్ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తారా? లేక సూచనలు, సలహాలు ఇస్తారా? ఇవన్నీ కాకుండా.. సంఘ్ సిద్ధాంతాలకు జై కొడతారా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సీనియర్లు కొందరు ఇప్పటికే తప్పుబడుతున్నారు. నాగపూర్ వెళ్లొద్దంటూ లేఖలు, ఫోన్ల ద్వారా ఆయనకు సలహా ఇచ్చారు. అయితే, ‘వీటన్నింటికీ నా స్పందనను నాగపూర్లోనే వెల్లడిస్తా’ అని ఇప్పటికే ప్రణబ్ కూడా తేల్చి చెప్పారు. కొన్నేళ్ల క్రితం ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసేసే అవార్డ్ గ్రహీత అభయ్ బంగ్ను కూడా ఆరెస్సెస్ ఆహ్వానించింది. అప్పుడూ ఆయనపై విమర్శలు వచ్చాయి. ‘నా అభిప్రాయాలు చెప్పేందుకు ఏ వేదికైనా ఒకటే’ అంటూ అభయ్ అప్పుడు స్పందించారు. అభిప్రాయాలు వెల్లడించడాన్ని లెఫ్ట్ తప్పుపట్టడాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొనడాన్ని స్వాగతిస్తున్న వారు కూడా అదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఇక ప్రణబ్ పయనమెటో తేలాలంటే.. మరి కొద్దిగంటలు వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాగ్పూర్కు ప్రణబ్ వచ్చేశారు.. అందరి కళ్లు అటువైపే!
సాక్షి, నాగ్పూర్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నాగ్పూర్కు విచ్చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తృతీయ వార్షిక శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా గురువారం ఆ సంస్థ నిర్వహించబోయే కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధాన అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. నాగ్పూర్ విమానాశ్రయంలో ప్రణబ్కు ఆరెస్సెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి.. కార్యకర్తల కవాతుతో ఆయనకు స్వాగతం తెలిపారు. ఆరెస్సెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ నాయకుడిగా జీవితమంతా బీజేపీని, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ను తీవ్రంగా విమర్శించిన ప్రణబ్ రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న అనంతరం ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొండటం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రణబ్ సహచరులైన కాంగ్రెస్ సీనియర్ నేతలు, వామపక్ష నేతలు ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాను ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నా వెనుకకు తగ్గని ప్రణబ్ ముఖర్జీ.. ఈ విషయంలో తాను ఏం చెప్పదల్చుకున్నది.. నాగ్పూర్లోనే చెప్తానని విమర్శకులకు బదులిచ్చారు. చదవండి : ప్రణబ్ దారెటు..? -
ప్రణబ్కు ఆరెస్సెస్ శ్రేణుల ఘన స్వాగతం
-
7న నాగ్పూర్లో చెప్తా
కోల్కతా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యక్రమానికి వెళ్లకూడదంటూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ను పలువురు కోరుతున్న వేళ.. వారందరికీ నాగ్పూర్లోనే సమాధానం చెబుతానని ఆయన అన్నారు. నాగ్పూర్లో జూన్ 7న సంఘ్ నిర్వహించే కార్యక్రమానికి రావాలని ప్రణబ్ను సంఘ్ ఆహ్వానించడం తెల్సిందే. ప్రణబ్ అక్కడ ఆరెస్సెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ‘తృతీయ వర్‡్ష వర్గ్’ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగానూ హాజరవుతారు. అయితే కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, జాఫర్ షరీఫ్ తదితరులు ప్రణబ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లొద్దని కోరారు. జైరాం మాట్లాడుతూ ‘ప్రణబ్ క్రియాశీల రాజకీయ జీవితంలో ఉన్నన్ని రోజులూ కాంగ్రెస్లో మా లాంటి వారికి మార్గనిర్దేశనం చేశారు. ఇప్పుడు ఆయన సంఘ్ కార్యక్రమానికి వెళ్తున్నారు. వెళ్లకుంటే బాగుంటుంది’ అని అన్నారు. ఇలాంటి మరికొందరు వ్యాఖ్యలపై ప్రణబ్ మాట్లాడుతూ ‘నేనేం చెప్పాలో అది నాగ్పూర్లోనే చెబుతాను. కార్యక్రమానికి వెళ్లొద్దంటూ నాకు చాలా లేఖలు, ఫోన్లు వచ్చాయి. కానీ నేను ఏ ఒక్క దానికీ స్పందించలేదు. నాగ్పూర్లోనే మాట్లాడతాను’ అని అన్నారు. అయితే మరో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాత్రం ప్రణబ్ను సమర్థించారు. ‘ప్రణబ్ ఇప్పటికే ఆరెస్సెస్ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఆయన ఎందుకలా చేశారో ఇప్పుడు చర్చించడం అనవసరం. సార్, మీరు వెళ్లండి. కానీ ఆరెస్సెస్ సిద్ధాంతంలోని తప్పులేంటనేది మీ ప్రసంగం ద్వారా వారికి తెలియజేయండి’ అని చిదంబరం ప్రణబ్ను కోరారు. అటు ఆరెస్సెస్ కూడా.. కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్కు ఆహ్వానం పంపడంలో తప్పేమీ లేదంటోంది. మహాత్మాగాంధీ, లోక్నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ తదితరులు గతంలో తమ కార్యక్రమాల్లో ప్రసంగించారనీ, 1963 గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనాల్సిందిగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఆరెస్సెస్ కార్యకర్తలను ఆహ్వానించారని ఆరెస్సెస్ గతంలోనే పేర్కొనడం తెలిసిందే. -
నాగ్పూర్లో చెప్తా : ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యక్రమానికి అతిథిగా హాజరుకావడంపై సదరు కార్యక్రమంలోనే స్పందిస్తానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించిన అనంతరం తనకు చాలా ఉత్తరాలు, ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. వేటికీ ఇంతవరకూ స్పందించలేదని వెల్లడించారు. ఈ మేరకు బెంగాల్ దినపత్రిక ఆనంద్ బజార్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నెల 7న జరిగే కార్యక్రమంలో ప్రణబ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతీయ జాతీయ కాంగ్రెస్(ఐఎన్సీ)తో ప్రణబ్కు 50 ఏళ్ల అనుబంధం ఉంది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ నిర్ణయంపై స్పందించకపోయినా, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ప్రణబ్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ఒక అడుగు ముందుకేసి ఈ మేరకు ఆయనకు లేఖలు రాసి, నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కూడా కోరారు. అయితే, గొప్ప నేతలను, వ్యక్తులను ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఇదేం కొత్తకాదు. గతంలో మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ్, జవహర్ లాల్ నెహ్రూలకు సైతం ఆర్ఎస్ఎస్ ఆహ్వానాలను పంపింది. -
ప్రణబ్ దారెటు?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై పడిందా? తమ కార్యక్రమానికి హాజరుకావాలని ఆరెస్సెస్ పంపిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించడం పలు సందేహాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సుమారు 50 ఏళ్లు పనిచేసినా, ప్రధాని పదవి దక్కలేదని ప్రణబ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ ఆరెస్సెస్ జాతి వ్యతిరేక, దుష్ట సంస్థ అని మండిపడ్డ ప్రణబ్..ఇప్పుడు అదే సంస్థ వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతుండటం దేనికి సంకేతమనేది అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. ఆరెస్సెస్–బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్న సమయంలో ప్రణబ్ నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరెస్సెస్ అంటరాని సంస్థ కాదనే సందేశం ఎందుకు ఇవ్వబోతున్నారన్నది ఇప్పటికైతే శేష ప్రశ్నే. నాగ్పూర్ ప్రసంగంలో తేలుతుందా! ప్రణబ్కు ఉన్న హోదా రీత్యా ఆయన్ని ప్రస్తుతానికి ఎవరూ వేలెత్తి చూపట్లేదు. స్వయంగా కాంగ్రెస్ కూడా ఆయన నిర్ణయంపై ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్రంలో, సుమారు 20 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నడిపిస్తున్న ఆరెస్సెస్తో చర్చలు జరపడానికే ప్రణబ్ ఈ ఆహ్వానానికి అంగీకరించి ఉంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల నుంచి వైదొలగలేదని నాగ్పూర్ నుంచి ఏమైనా సందేశం పంపినట్లయితే ఆయనపై ఉన్న గౌరవం పోతుందని తెలంగాణ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. వెళ్లి వాళ్ల తప్పులేంటో చెప్పండి: చిదంబరం ప్రణబ్ నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరై ఆ సంస్థ సిద్ధాంతాల్లోని తప్పులేంటో చెప్పాలని ప్రణబ్కు విజ్ఞప్తి చేశారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ ఎందుకు అంగీకరించారన్న దానిపై ఇప్పుడు చర్చించడం వృథా అని అభిప్రాయపడ్డారు. -
ప్రధానమంత్రి పదవికి ప్రణబ్ ముఖర్జీ పోటీ?
న్యూఢిల్లీ : 50 ఏళ్లుగా భారతీయ జాతీయ కాంగ్రెస్(ఐఎన్సీ) పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ పార్టీని దూరం పెట్టాలని భావిస్తున్నారా?. కాంగ్రెస్ హస్త ముద్రను తనపై నుంచి తొలగించుకుని వ్యక్తిగత గుర్తింపు కోసం ప్రణబ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యాయమ్నాయంగా నేతల్ని ఏకం చేసి 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ(82) నిలవబోతున్నట్లు జాతీయ మీడియా సంస్థ ‘ఎన్డీటీవీ’ బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడగా ఇది నిజమేనని అనిపిస్తున్నట్లు ‘ఎన్డీటీవీ’ వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలూ లేకపోలేదని కొందరు నేతలు చెప్పినట్లు వెల్లడించింది. ఆరెస్సెస్ ఆహ్వానంపై రగడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సభకు ప్రణబ్ ముఖర్జీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, దానికి ఆయన సమ్మతించడంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ వర్గాలు ఈ పరిణామంతో విస్తుబోయాయి. వచ్చే నెల 7వ తేదీన నాగ్పూర్లో ఈ కార్యక్రమం జరగనుంది. -
ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లొద్దు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అంగీకరించడం వివాదమైంది. వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రణబ్ను ఆహ్వానించగా, ప్రణబ్ ఓకే చెప్పారు. జూన్ 7న నాగ్పూర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రణబ్ నిర్ణయంపై కాంగ్రెస్ అధికారికంగా స్పందించలేదుగానీ పలు లౌకిక పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు సీకే జాఫర్ షరీఫ్ ప్రణబ్కు లేఖ రాశారు. ‘రాజకీయాల్లో లౌకికవాదిగా కొనసాగి, రాష్ట్రపతిగా పనిచేసిన మీలాంటి వారు లోక్సభ ఎన్నికల ముందు సంఘ్ కార్యాలయాన్ని సందర్శించడం సరికాదు. మీరు ఆ నిర్ణయంపై పునరాలోచన చేస్తారని ఆశిస్తున్నా. దేశం, లౌకికత్వం ప్రయోజనాల దృష్ట్యా అక్కడికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని జాఫర్ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ హెచ్ హనుమంతప్ప ఈ లేఖపై సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ స్పందిస్తూ..ఆరెస్సెస్ జాతి వ్యతిరేక, చెడ్డ సంస్థ అని ప్రణబ్ గతంలోనే ఆరోపించారని, అలాంటి వ్యక్తిని ఆహ్వానించిన సంస్థ ఆయన మాటలను అంగీకరించినట్లేనా? అని ప్రశ్నించారు. స్వాగతించిన గడ్కారీ.. ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకాబోతుండటంపై కేంద్ర మంత్రి గడ్కారీ హర్షం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కాదని, జాతీయవాదుల సంస్థ అని అన్నారు. బీజేపీని మత పార్టీ అంటే సంకుచితంగా ఆలోచిస్తున్నట్లేనని అన్నారు. ఆరెస్సెస్ నేతలతో షా, మంత్రుల భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఐదుగురు కేంద్ర మంత్రులు ఆరెస్సెస్ అగ్ర నాయకులతో సమావేశమై ప్రభుత్వ ఆర్థిక విధానాలపై చర్చలు జరిపారు. రైతులు, కార్మికులపై బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. -
దేశ రాజకీయాలలో మరో ఆసక్తికర పరిణామం
-
ప్రణబ్కు ఆర్ఎస్ఎస్ ఆహ్వానం..?
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్ జూన్ 7న నిర్వహించబోచే ‘తృతీయ వర్ష్ వర్గా’ శిక్షణ కార్యక్రమ వీడ్కోలు వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించినట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ ‘తృతీయవర్ష్ వర్గా’ పేరుతో ఈ వేడుకను నాగపూర్లోని తన ప్రధాన కార్యలయం రేష్మీ నగర్లో నిర్వహిస్తుంది. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ఓ ప్రముఖ వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో చివరి సందేశాన్ని ఇప్పించడం ఆనావాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది జూన్లో నిర్వహించబోయే ఈ వీడ్కోలు కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించినట్లు సమాచారం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే ఓ కాంగ్రెస్ నాయకుడు సంఘ్ పరివార్ తరపున ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రెకిత్తిస్తోంది. ఈ విషయం గురించి ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ‘మేము ఈ వీడ్కోలు వేడుకకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాము. ఆయన కూడా ఈ వేడుకకు రావడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అని పేర్కొన్నారు. అయితే ప్రణబ్ ముఖర్జీ ఈ వేడుకకు హజరవుతున్నారా లేదా అనే విషయం గురించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ప్రణబ్ ఈ వేడుకకు హజరయితే ఆ విషయం కాంగ్రెస్ వారికి ఇబ్బంది కలిగిస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతాన్నాయి. ఎందుకంటే సంఘ పరివార్ స్థాపన నుంచే దానికి, కాంగ్రెస్ పార్టీకి సిద్దాంతపరంగా విభేదాలు ఉన్నాయి. అంతేకాక ఇంతవరకూ రాహుల్గాంధీ కూడా ఆర్ఎస్ఎస్ పట్ల తన వైఖరిని బయటపెట్టలేదు. గతంలో రాహుల్ ఒకసారి మహాత్మగాంధీ మరణానికి ఆర్ఎస్ఎస్ బాధ్యత వహించాలనే ఆరోపణలు చేయడంతో ప్రస్తుతం పరువు నష్టం కేసును కూడా ఎదుర్కొంటున్నారు. -
ప్రజాస్వామ్య బలోపేతానికి నెహ్రూ కృషి: ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య బలోపేతానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లోనే పునాది వేశారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. నెహ్రూ జీవిత చరిత్రపై తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎ.గోపన్న రాసిన ‘జవహర్లాల్ నెహ్రూ–యాన్ ఇల్యుస్ట్రేటెడ్ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలకు తొలి ప్రతులను అందజేశారు. ఈ పుస్తకానికి ముందుమాటను ప్రణబ్ రాశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ గురించి ఆధ్యయనం, పరిశీలన భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, వంద కోట్ల జనాభాను నడిపించగల ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్మించాలన్న సంకల్పంతో ఆయన అప్పట్లోనే విశేష కృషి చేశారని, ఫలితంగా ఆధునిక ప్రజాస్వామ్య దార్శనికుడిగా నిలిచారని కొనియాడారు. దేశంలో భిన్న మతాలు, భాషలు ఉన్నా భారతీయులంతా ఒకటే అన్న స్ఫూర్తి కలిగేలా ప్రజాస్వామ్య వ్యవస్థల ఏర్పాటుకు నెహ్రూ కృషిచేశారని కీర్తించారు. నెహ్రూ జీవిత చరిత్రపై గోపన్న రాసిన పుస్తకాన్ని అభినందిస్తూ సోనియా గాంధీ సందేశం పంపారు. అంతకుముందు, నెహ్రూ 54వ వర్ధం తి సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ, అన్సారీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు యమునా నది ఒడ్డున ఉన్న శాంతివన్ నెహ్రూ స్మారకం వద్ద నివాళులర్పించారు. ‘భార త తొలి ప్రధాని నెహ్రూకు ఘన నివాళులు’ అం టూ ప్రధాని మోదీ ట్విటర్లో పోస్టు చేశారు. -
ఆ విషయంపై మీ స్పందనేంటి...?
న్యూఢిల్లీ : 2016లో ప్రచురితమైన ప్రణబ్ ముఖర్జీ పుస్తకం ‘ట్రబులెంట్ ఇయర్స్ 1980-1996’ పుస్తకంలోనీ కొంత భాగం హిందువులు మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఆ భాగాలను తొలగించవలసిందిగా ప్రణబ్ను కోరిన విషయం తెలిసిందే. ఆయన ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో కింది కోర్టు ఆదేశాల మేరకు ఈ అంశం గురించి నవంబర్ 30, 2016న హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీనికి మీ గత సమాధానం ఏంటో తెలపండని ఢిల్లీ హైకోర్టు న్యాయవాది జస్టీస్ ప్రతిభా ఎం సింగ్ శుక్రవారం భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నోటీసులు జారీ చేశారు. ఈ విషయం పై తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది. అసలేం జరిగింది... 2016, సెప్టెంబర్ 5న ప్రణబ్ ముఖర్జీ పుస్తకం ‘ట్రబులెంట్ ఇయర్స్ 1980-1996’ విడుదలయ్యింది. అయితే దీనిలో 1992 అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యం గురించి రాసిన వాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆ వాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని యూ సీ పాండే అనే సామాజిక కార్యకర్త...మరికొందరు న్యాయవాదులతో కలిసి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి తరుపు న్యాయవాది ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఇది ఆమోదయోగ్యమైన అంశం కాదని ట్రయల్ కోర్టు ముందు వాదించారు. ట్రయల్ కోర్టు కూడా దీనిలో చర్య తీసుకోవాల్సిన విషయం ఏమి లేదంటూ కేసును కొట్టివేసింది. అందువల్లే... కానీ రాష్ట్రపతి తన పదవి కాలంలో అధికారాన్ని అడ్డుబెట్టుకుని చేసే ఏ విషయం మీద అయినా సివిల్ సూట్ ఫైల్ చేయవచ్చు. దాంతో కింది కోర్టులో ఫిర్యాదు చేశారు. కింది కోర్టు రెండు నెలల్లో అభ్యంతరకరంగా ఉన్న వాఖ్యలను తొలగించాల్సిందిగా తీర్పు చేప్పింది. కానీ గడువు ముగిసినా ఎటువంటి చర్య తీసుకోలేదు. అందువల్లే ఈ విషయం గురించి మేము హై కోర్టులో ఫిర్యాదు చేశామని ఫిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టు ముందు వాదించాడు. -
ప్రణబ్ దగ్గర నేర్చుకోండి!
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. రాఫెల్ యుద్ధ విమానం, దీంతోపాటు కొనుగోలు చేసిన యుద్ధ సామగ్రి వివరాలన్నీ దేశ భద్రతకు సంబంధించిన అంశాలని దీనిపై వివరాలు కోరటం హాస్యాస్పదమన్నారు. ‘మాజీ రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ దగ్గర జాతీయ భద్రతపై పాఠాలు నేర్చుకోండ’ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్కి సూచించారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా విపక్షాలు రాఫెల్ వివరాలు వెల్లడించాలని పట్టుబడ్డటంపై జైట్లీ ఈ విధంగా స్పందించారు. ‘మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై మీరు రాజీ పడ్డారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపైనా అవినీతి బురద చల్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా మోదీ స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అందుకే ఓ సంక్షోభాన్ని, ఓ వివాదాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే రాఫెల్ వివరాలు వెల్లడి చేయాలని వివాదం చేస్తున్నారు’ అని జైట్లీ రాజ్యసభలో పేర్కొన్నారు. 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రామాయణ వ్యాఖ్యలపై దుమారం కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిపై ప్రధాని మోదీ చేసిన ‘రామాయణ’ వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలో దుమారం రేగింది. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన మోదీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. దీనికి తోడు మోదీ తనపై వ్యంగ్యంగా మాట్లాడుతున్న వీడియో క్లిప్ను హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేయటంపై రేణుక మండిపడ్డారు. ప్రధాని హోదాకు తగ్గట్లుగా మోదీ వ్యవహరించలేదని.. ఆయన క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ నేత సుష్మితాదేవ్ డిమాండ్ చేశారు. రేణుక వ్యాఖ్యలపై దుమారం కారణంగా రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. మోసపూరిత ఆర్థిక విధానంతో.. అంతకుముందు, రాజ్యసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని పట్టించుకోవటం లేదని, ఉపాధికల్పనను పూర్తిగా విస్మరించిందని.. ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానం పూర్తిగా మోసపూరితమని.. దేశంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోతోందని తీవ్రంగా దుయ్యబట్టారు. తాజా బడ్జెట్ ద్వారా వేతన జీవులు, వయోవృద్ధలుకు రూ.12వేల కోట్ల లబ్ధి చేకూరిందని ఆర్థిక మంత్రి జైట్లీ లోక్సభలో వెల్లడించారు. దీర్ఘకాల మూలధన రాబడి పన్ను పెంచటాన్ని సమర్థించుకున్న జైట్లీ.. దీని కారణంగా తలెత్తే సమస్యలను ఎలా ఎదుర్కొవాలో ప్రభుత్వానికి తెలుసన్నారు. ప్రణబ్, ఆంటోనీలూ చెప్పలేదు రూ.58వేల కోట్ల ఒప్పందాన్ని బహిర్గతం చేసేందుకు విముఖత చూపిన జైట్లీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి రక్షణ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీలు 15 సందర్భాల్లో ఇలాంటి వివరాలు వెల్లడించలేదని గుర్తుచేశారు. అప్పుడు దేశ భద్రత, జాతి ప్రయోజనాలను వారు కారణంగా చూపించారని సభకు వెల్లడించారు. ‘ధరలు, ఇతర వివరాలను బయటపెట్టడం ద్వారా.. సదరు హెలికాప్టర్/ఆయుధానికి సంబంధించిన సాంకేతిక వివరాలన్నీ బయటకొస్తాయి. అది మన రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్నీ వెల్లడిస్తుంది. ఇది శత్రువుకు తెలియజేయటానికి రక్షణ వ్యవస్థ, ప్రభుత్వం ఒప్పుకోవు’ అని జైట్లీ వెల్లడించారు. అయితే జాతి భద్రతకు సంబంధించిన వివరాలను తాము అడగటం లేదని.. పారదర్శకతను మాత్రమే కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. -
ప్రణబ్ ఫొటోపై రెచ్చిపోయిన బంగ్లా సోషల్ మీడియా
సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్లోని భారత హై కమిషన్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు బంగ్లాదేశ్కు చెందిన రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికార లాంఛనం ప్రకారం ప్రణబ్ ముఖర్జీతోపాటు బంగ్లాదేశ్ ఆహ్వానితులు కలిసి ఫొటోలు దిగారు. అందులో ఓ ఫొటోను భారత హై కమిషన్ కార్యాలయం తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. అందుకు కారణం ప్రణబ్ ముఖర్జీ కుర్చీలో కూర్చొని ఉండడం, బంగ్లాదేశ్ ఆహ్వానితులు ఆయన వెనకాల నిలబడి ఉండడం. అందులోనూ బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు హెచ్ఎం ఇర్షాద్ నిలబడి ఉండడం, ఆయన పక్కన బంగ్లాదేశ్ ప్రస్తుత స్పీకర్ శిరిని చార్మిన్ చౌధురి నిలబడడం. ఇది భారత ముందు బంగ్లాదేశ్కు తలవంపులేనంటూ బంగ్లా సోషల్ మీడియా గోల చేసింది. బంగ్లాదేశీయులు హోదాలకన్నా పెద్ద వయస్కులను ఎక్కువగా గౌరవిస్తారు. ఆ లెక్కన ప్రణబ్ ముఖర్జీని గౌరవించాలనుకున్నా ప్రణబ్కు 82 ఏళ్లుకాగా, ఇర్షాద్కు 89 ఏళ్లు. ఈ లెక్కనైనా ఇర్షాద్, ప్రణబ్ పక్కన కూర్చోవాలీ లేదా ఇర్షాద్ గౌరవార్థం ప్రణబ్ కూడా లేచి నిలబడాలికదా! అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రణబ్కు ఈ మాత్రం సంస్కతి తెలియకపోతే బంగ్లాదేశ్ సంస్కతి గురించి బాగా తెల్సిన ఆయన భార్య నుంచైనా ఆ సంస్కతిని ఆయన గౌరవించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. తరతరాలపాటు విదేశీయుల పాలనలో మగ్గిన బంగ్లాదేశీయులకు ఇప్పుడు వారి పాలకులు ఎవరు, ఎవరి పాదాలను తాకారు? ఎవరు, ఎవరి చెంతన నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? ఎవరు కూర్చున్నారు, ఎవరు నిలబడ్డారు? ఏ స్థానంలో నిలబడ్డారు? ఇత్యాది వివరాలన్నీ వారికి పట్టింపుగా మారాయి. కానీ బంగ్లాదేశ్ పాలకులు మాత్రం ఎప్పుడూ భారత్ పాలకులను గౌరవిస్తారు. 1971లో వారి విముక్తి పోరాటానికి భారత దేశం సాయం చేయడమే అందుకు కారణం. ప్రైవేటు పర్యటనపై ఇటీవల బంగ్లాదేశ్కు వచ్చిన ప్రణబ్ ముఖర్జీ బంగ్లాలో వారం రోజుల పాటు పర్యటì ంచారు. ఈ సందర్భంగా ఆయనకు భారత్ హైకమిషన్ ఆతిథ్యం లభించింది. ఈ సందర్భంగానే ఇర్షాద్, బంగ్లా స్పీకర్, దౌత్యవేత్తలతో ఆయన ఫొటో దిగడం, అది వివాదాస్పదం అవడం జరిగింది. సకాలంలో స్పందిచిన భారత్ దౌత్యకార్యాలయం ఫొటోను తొలగించింది. బంగ్లా ప్రధాన మీడియా ఈ ఫొటో వ్యవహారాన్ని పట్టించుకోలేదు. ప్రణబ్ ముఖర్జీ రాసిన తన జ్ఞాపకాల పుస్తకం ఇటీవల విడుదలవడం, అందులోని అంశాలు బంగ్లా సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన కారణంగా సోషల్ మీడియాకు కోపం వచ్చి ఉంటుంది. 2008లో జైల్లో మగ్గుతున్న బంగ్లాదేశ్ రాజకీయ నాయకులను తాను ఎలా విడిపించిందీ, బంగ్లా మాజీ ఆర్మీ చీఫ్ మొయున్ యూ అహ్మద్కు ఉద్యోగ భద్రత ఎలా కల్పించేందుకు ఎలా కషి చేసిందీ ఆయన తన జ్ఞాపకాల్లో వివరించారు. -
నాకు ప్రత్యేక తెలంగాణే ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తనకు మరేదీ ముఖ్యం కాదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు తనతో అన్నట్టు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుర్తుచేసుకున్నారు. తాజాగా తాను రాసిన ‘ద కొలిషన్ ఇయర్స్–1996–2012’ పుస్తకంలో ఈ మేరకు పేర్కొన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించిన అనంతరం కేంద్ర కేబినెట్ పదవుల పంపకాలపై మిత్రపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్న సందర్భాన్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ప్రణబ్జీ.. మీకు నా జీవితాశయం తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి. మీరు కేంద్ర ప్రభుత్వంలో నాకు ఏ శాఖను అప్పగిస్తారన్నది అంత ముఖ్యం కాదు. ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తా. కానీ దయచేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పరిశీలించండి..’’ అని తనతో కేసీఆర్ అన్నట్టు ప్రణబ్ పుస్తకంలో వివరించారు. -
అప్పుడు ఇందిరకు కూడా రాహుల్కున్న కష్టాలే : ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు గుర్తించారు. రాహుల్ కూడా తన నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాహుల్గాంధీ మాదిరిగానే సమర్ధుడని అన్నారు. రాహుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిండాన్ని బయటి వ్యక్తులు నిర్ణయించడం (జడ్జ్) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లవుతుందని అన్నారు. రాహుల్ మంచి యువకుడని, మార్పుకు అనుగుణంగా స్పందించగలవారని, దేనినైనా తనలో ఇముడ్చుకునే స్వభావం ఉన్నవారని, సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ప్రస్తుతం రాహుల్గాంధీ పరిస్థితిని ఒకప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులతో ఆయన పోల్చారు. 'నాయకుడు ముందే తయారు చేయరు. ఇందిరాగాంధీని మేడమ్ టుస్సాడ్ విగ్రహం మాదిరిగా ఎవరో తయారుచేసి పెట్టలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆమె నాయకత్వ ప్రతిభ ద్వారా ఎదిగారు. మంచి నాయకురాలు అయ్యారు. అలాగే రాజీవ్గాంధీ కూడా' అని రాహుల్ పరిస్థితిని పోల్చారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్గాంధీ అధ్యక్షుడు అవుతారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటుంది. కాంగ్రెస్ కానిస్టిట్యూషన్ ఇప్పటిది కాదు. కాంగ్రెస్ పార్టీ డెలిగేట్స్ అంతా కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అంత అంతర్గత వ్యవహారం' అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. -
దాదాకు బాగా కోపమొచ్చింది
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొంత కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఛానెల్ ఇండియా టుడే ‘టూ ది పాయింట్’ కార్యక్రమం కోసం సీనియర్ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ దాదాను ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంభాషణ బయటకు వచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా ఓ ప్రశ్నకు ప్రణబ్ సమాధానం చెప్పబోతుంటే.. మధ్యలో రాజ్దీప్ కలగజేసుకుని ఏదో అడగాలని యత్నించారు. దీంతో సహనం కోల్పోయిన ప్రణబ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ‘ మాట్లాడేటప్పుడు మధ్యలో కలగజేసుకునే అలవాటు నీకు మంచిది కాదు. ముందు నన్ను పూర్తి చెయ్యనివ్వు. నీ ముందుంది ఓ మాజీ రాష్ట్రపతి అని గుర్తుంచుకుని ప్రవర్తించు. నేను మాట్లాడేటప్పుడు విను. నా సమాధానం పూర్తయ్యాకే మరో ప్రశ్న అడుగు. నేనేం టీవీల్లో కనిపించేందుకు ఆత్రుతతో రాలేదు. మీరు పిలిస్తేనే వచ్చా’ అంటూ ప్రణబ్ మందలించాడు. అయితే చివర్లో ఇంటర్వ్యూ అయ్యాక తాను చేసిన కఠువు వ్యాఖ్యలపై ప్రణబ్ క్షమాపణలు చెప్పబోతుండగా.. వాటిని సానుకూలంగానే తీసుకున్నట్లు రాజ్దీప్ చెప్పటం కొసమెరుపు. మాములుగా అయితే ఇలాంటి వీడియోలు ఎడిటింగ్లో లేపేయటం జరుగుతుంటుంది. కానీ, రాజ్దీప్కు అలా చెయ్యటం ఎంత మాత్రం ఇష్టం లేదంట. అందుకు ఆ సంభాషణను యథాతథంగా ఉంచేశారు. అయితే రాజ్దీప్ను ఏకేసిన ప్రణబ్ అంటూ... దీనిని కొందరు మరోలా వైరల్ చెయటం సీనియర్ జర్నలిస్ట్కు చికాకు తెప్పించింది. అంతే వెంటనే మరో ట్వీట్ చేశారు. ‘మేం(జర్నలిస్టులు) బొద్దింకల్లాంటి వాళ్లం. సెలబ్రిటీలు సీతాకోకచిలుకలాంటోళ్లు. మర్యాదగా నడుచుకోవటం మేం వారి దగ్గరి నుంచే నేర్చుకుంటాం. అందుకే మేం వారిని గౌరవిస్తాం అంటూ ఓ ట్వీట్లో తెలిపారు. అయినా ఆ ట్రోలింగ్ ఆపకపోవటంతో కాస్త చికాకుగా ఇక తర్వాతి ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తే మంచిందంటూ ఆ ఎపిసోడ్కు పుల్ స్టాప్ పెట్టేశారు. Journalists are cockroaches my friend. VVIPs are butterflies who teach us manners when we question them. I respect their greater intellect. https://t.co/7jF4mABoTz — Rajdeep Sardesai (@sardesairajdeep) 14 October 2017 -
కూటమికి నేను వ్యతిరేకం
న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. తాను ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కూటమి కట్టడాన్ని తాను వ్యతిరేకించానని, దీనిపై పార్టీ నేతలతో వాదనకు దిగినట్టు చెప్పారు. ఇలాంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అస్థిత్వాన్ని దెబ్బతీస్తుందని తాను భావించానని పేర్కొన్నారు. తన తాజా పుస్తకం ‘ద కొలిషన్ ఇయర్స్: 1996 నుంచి 2012’లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 2004 సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి 2003లో కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని, అయితే దీనిని తాను సమర్థించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తేనే అస్థిత్వాన్ని కాపాడుకోగలుగుతుందని పేర్కొన్నారు. పంచమరి సదస్సులో అత్యవసరమైతే తప్ప సంకీర్ణాల జోలికి వెళ్లకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, కానీ 2003లో సిమ్లా సదస్సులో తీసుకున్న నిర్ణయం దానికి పూర్తి భిన్నమైందని చెప్పారు. సిమ్లా సదస్సులో సోనియాగాంధీ, మన్మోహన్సింగ్తో పాటు పార్టీలోని చాలామంది పంచమరి సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని మార్చాలని నిర్ణయించారని చెప్పారు. -
గుజరాత్ అల్లర్లే బీజేపీని ఓడించాయి!
న్యూఢిల్లీ: 2002 నాటి గుజరాత్ అల్లర్లు నాటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి అతి పెద్ద దెబ్బ అయి ఉండొచ్చని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అభిప్రాయపడ్డారు. వీటి ప్రభావం 2004 నాటి ఎన్నికలపై పడిందని పేర్కొన్నారు. తాను రాసిన ‘ ది కోయిలిషన్ ఇయర్స్ 1992–2012‘ పుస్తకం మూడో వాల్యూంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. పాలక ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సమయంలో చేపట్టిన షైనింగ్ ఇండియా’ ప్రచారం వ్యతిరేక ఫలితాలిచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం రామమందిర నిర్మాణం అంశం బాగా ప్రచారంలోకి వచ్చిందని, 2002లో గుజరాత్లో జరిగిన మతకలహాలు రక్తపాతానికి దారితీశాయని అందులో ప్రణబ్ చెప్పారు. -
అనుకున్నదొక్కటి, అయిందొకటి!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఉండగా తనను ప్రధానమంత్రిని చేస్తారని అనుకున్నట్టు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. 1996 నుంచి 2012 వరకు జరిగిన పరిణామాలపై తాను రాసిన ‘ద కొలిషన్ ఇయర్స్’ పుస్తకంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ‘2012 రాష్ట్రపతి ఎన్నిక సమయంలో జూన్ 2 సాయంత్రం సోనియా గాంధీని కలిశాను. రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎంపిక చేసేందుకు, వారికి ఏవిధంగా మద్దతు కూడగట్టాలనే దానిపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వంలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారని, మీకు ప్రత్యామ్నాయం ఎవరో సూచించాలని ఈ సందర్భంగా సోనియా నన్ను అడిగారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడతానని చెప్పాను. ఎటువంటి బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని అన్నాను. నా వైఖరిని సోనియా ఎంతోగానో మెచ్చుకున్నారు. భేటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయాను. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ను ఖరారు చేస్తారని అనుకున్నాను. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైతే, సోనియా.. నన్ను ప్రధానిగా ప్రతిపాదిస్తారని భావించాను. అయితే నేను ఊహించిన దానికి భిన్నంగా రాష్ట్రపతి ఎన్నిక కోసం నాతో పాటు, హమిద్ అన్సారీ పేరును సోనియా ప్రతిపాదించారు. జూన్ 13న సోనియా, మమతా బెనర్జీ కలిశారు. ప్రణబ్, హమిద్ అన్సారీలను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్టు మమతకు సోనియా తెలిపారు. మా ఇద్దరితో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అనే విషయంపై ములాయం సింగ్ యాదవ్తో చర్చించిన తర్వాత చెబుతానని మమతా బెనర్జీ తెలిపినట్టు తర్వాత నాతో సోనియా చెప్పారు. మా ఇద్దరినీ కాదని ములాయం, మమత.. ఏపీజే అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్, సోమనాథ్ ఛటర్జీ పేర్లను వారు తెరపైకి తెచ్చారు. మరోసారి సోనియాతో మమత భేటీ అయ్యారు. ప్రణబ్, అన్సారీ.. వీరిద్దరిలో ఎవరు ఆమోదయోగ్యం కాదో చెప్పాలని మమతను సోనియా కోరారు. జూన్ 14న సోనియాను కలిశాను. మమత బెనర్జీతో చర్చించిన విషయాలను నాకు చెప్పారు. ములాయంతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెప్పకపోవడం, భేటీ వివరాలను మీడియాకు వెల్లడించడంతో మమతపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించడం మంచిదని సోనియా అన్నారు. ఏకే ఆంటోని, చిదంబరం, అహ్మద్ పటేల్, నేను, ప్రధాని ఈ సమావేశంలో పాల్గొన్నాం. నా అభ్యర్థిత్వంతో పార్టీ, ప్రభుత్వంలో తలెత్తె పరిణామాల గురించి చర్చించాం. సోనియా, తాను కలిసి తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్టు ఆ రోజు సాయంత్రం నాకు మన్మోహన్ సింగ్ సమచారం ఇచ్చార’ని ప్రణబ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. 2004 సాధారణ ఎన్నికల తర్వాత ప్రధాని పదవిని చేపట్టేందుకు సోనియా గాంధీ నిరాకరించడంతో తాను ప్రధానమంత్రి అవుతానని భావించినట్టు ఆయన పేర్కొన్నారు. శరద్ పవార్ కూడా ప్రధాని పదవి ఆశించారని వెల్లడించారు. రాజీవ్ గాంధీ తర్వాత కీలక సమయంలో పివి నరసింహారావు సుస్థిరమైన నాయకత్వం అందించారని ప్రశంసించారు. ఆర్థిక, విదేశాంగ విధానాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని గుర్తు చేశారు. -
సొంత నేతలే మోదీని విమర్శిస్తుంటే...
సాక్షి, న్యూఢిల్లీ : రెండు దఫాలు అధికారంలో కొనసాగిన యూపీఏ ప్రభుత్వం.. మూడోసారి మాత్రం దారుణంగా పరాభవాన్ని మూటగట్టుకుంది. కారణాలేవైనా తమ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ.. ఈ మూడేళ్లలో రాష్ట్రపతిగా కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ మోదీ ప్రభుత్వంతో సత్సంబంధాలనే కొనసాగించటం అప్పట్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆయన రాష్ట్రపతి భవన్ను వీడి నాలుగు నెలలు అయ్యింది. ఇంతకాలం ఎక్కడా కనిపించని ఆయన.. ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓవైపు బీజేపీ సీనియర్ నేతలే సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వేళ.. మోదీ ప్రభుత్వానికి ప్రణబ్ పలు సూచనలు చేయటం గమనార్హం. ‘మార్పుతో కూడిన నిర్ణయాలను వెను వెంటనే తీసుకోవటం మంచిది కాదు. అవి మంచి ఫలితాను ఇవ్వకపోగా.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయి అని ప్రణబ్ చెప్పారు. ఇక జీఎస్టీ మంచి నిర్ణయమే అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉత్పన్నం కావటం సాధారణమేనని.. వాటిని మోదీ సర్కార్ అధిగమించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా-పాకిస్థాన్లతో భారత్ దౌత్యపరమైన అంశాల ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. యుద్ధం అనేది ఎప్పటికీ శాశ్వత పరిష్కారం కాలేదని.. కేవలం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని... ఆ సూత్రాన్నే తానూ బలంగా నమ్ముతానని చెప్పారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనావేస్తూ... ‘కాంగ్రెస్ పార్టీ పని అయిపోలేదు. అది 132 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. తిరిగి పుంజుకుంటుంది’ అని ప్రణబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాష్ట్రపతిగా ఉన్న సమయంలో అనుభవాలతోపాటు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లతో తన అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. మన్మోహన్ సింగ్ తో ఎలాంటి విభేధాలు లేవన్న దాదా.. తాను ప్రధాని రేసు నుంచి వైదొలగటానికి హిందీ భాష రాకపోవటం కూడా ఓ కారణమని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం ఓ కారణం కాగా, బీజేపీ నేత పీయూష్ గోయల్ అంచనాలు ఆ పార్టీ అందుకోవటం ఆశ్చర్యం ప్రణబ్ కలిగించిందన్నారు. ప్రణబ్ వెలువరించిన పలు ఆసక్తికర విషయాలతో కూడిన ఈ ఇంటర్వ్యూను ప్రముఖ పాత్రికేయుడు రాజ్ చెంగప్ప చేయగా.. అక్టోబర్ 23 ఇండియా టుడే సంచికలో ప్రచురితం కానుంది. -
ప్రణబ్ దా, మీరు నాకు పితృ సమానులు
మీ మార్గదర్శకత్వం నాలో స్ఫూర్తి నింపింది మీతో కలసి పని చేయడం గొప్ప గౌరవం ప్రణబ్కు ప్రధాని మోదీ ఉద్వేగభరిత లేఖ మోదీ లేఖ హృదయాన్ని తాకింది: ప్రణబ్ న్యూఢిల్లీ: ‘‘ప్రణబ్ దా, మీరు నాకు తండ్రిలాంటి వారు.. గొప్ప మార్గదర్శకులు’’అని ప్రణబ్ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేసిన చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఉద్వేగభరితమైన లేఖ రాశారు. రెండు విభిన్న రాజకీయ సిద్ధాంతాలను నమ్మిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధాన్ని ఈ లేఖ లోకానికి చాటిచెప్పింది. ప్రణబ్ ఈ లేఖను గురువారం ట్వీటర్లో పంచుకున్నారు. ‘‘రాష్ట్రపతిగా చివరి రోజున నేను ప్రధాని మోదీ నుంచి ఒక లేఖను అందుకున్నాను. ఆ లేఖ నా హృదయాన్ని తాకింది. దీనిని మీ అందరితో పంచుకుంటున్నా’’అని ప్రణబ్ ట్వీట్ చేశారు. దీనికి మోదీ స్పందిస్తూ.. ‘‘ప్రణబ్ దా, మీతో కలసి పనిచేయడాన్ని ఆస్వాదించా’’నని పేర్కొన్నారు. ‘‘మూడేళ్ల క్రితం నేను ఢిల్లీకి ఒక స్థానికేతరునిగా వచ్చాను. అప్పుడు నా ముందు ఉన్న లక్ష్యం చాలా పెద్దది.. సవాల్తో కూడుకున్నది. ఇలాంటి సమయంలో మీరు నాకు పితృ సమానులుగా.. మార్గదర్శకునిగా ఉన్నారు. మీ జ్ఞానం, మార్గనిర్దేశనం, వాత్సల్యం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ఇచ్చాయి. మీ మేధాశక్తి నాకు నిరంతరం మేలు చేసింది. మీరు నాపై ఎంతో ప్రేమ, వాత్సల్యం, శ్రద్ధ చూపారు. వరుస సమావేశాలు, పర్యటనలతో గడిపే నాకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెపుతూ మీరు చేసిన ఒక ఫోన్ కాల్ నాకు ఎంతో శక్తిని ఇచ్చేది. మన పార్టీలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు వేర్వేరు. మన అనుభవాల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. నా పాలనా అనుభవం అంతా నా రాష్ట్రం నుంచి పొందిందే. కానీ మీరు జాతీయ రాజకీయాలు, విధానాల్లో ఎంతో ముందున్నారు. సమాజానికి సేవ చేయాలనే తలంపుకలిగిన తరం నుంచి వచ్చిన నాయకులు మీరు. మీరు దేశ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత. నిస్వార్థ ప్రజాసేవకునిగా, అసాధారణమైన నాయకునిగా మిమ్మల్ని చూసి దేశం ఎప్పుడూ గర్విస్తుంది. మీరు అందించిన స్ఫూర్తి మాకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశనం చేస్తుంది. రాష్ట్రపతి జీ.. ప్రధానమంత్రిగా మీతో కలసి పనిచేయడం నాకు ఎంతో గౌరవం’’అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. జూలై 24న రాష్ట్రపతి బాధ్యతల నుంచి ప్రణబ్ తప్పుకోవడానికి ముందురోజు ఈ లేఖను మోదీ రాశారు. కాగా, ప్రధాని లేఖ రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై చూపించిన గౌరవాన్ని తెలిపిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. -
మీరు నా తండ్రిలాంటి వారు!
ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని మోదీ లేఖ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు రాసిన లేఖను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ట్విట్టర్లో షేర్చేసుకున్నారు. రాష్ట్రపతిగా తన చివరిరోజున ఈ లేఖను అందుకున్నానని, ఈ లేఖ తనను కదిలించిందని ఆయన తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ తనపై ఎంతో ప్రేమను, వాత్సల్యాన్ని చూపారని ప్రధాని మోదీ ఈ లేఖలో పేర్కొన్నారు. 'ప్రణబ్ దా.. మన రాజకీయ ప్రస్థానాలు విభిన్నమైన రాజకీయ పార్టీల్లో రూపుదిద్దుకున్నాయి. అయినా, మీ మేధోబలం, విజ్ఞత చేతనే మనం కలిసి సమిష్టతత్వంతో పనిచేయగలిగాం' అని అన్నారు. 'మూడేళ్ల కిందట ఒక బయటి వ్యక్తిగా నేను ఢిల్లీకి వచ్చాను. నా ముందు ఉన్న కర్తవ్యం ఎంతో పెద్దది. సవాలుతో కూడుకున్నది. ఈ సమయంలో మీరు ఎప్పుడు తండ్రిలాగా, గురువులాగా నాకు అండగా నిలిచారు' అని మోదీ అన్నారు. 'మీ మేధస్సు, మార్గదర్శకత్వం, వ్యక్తిగత అనుబంధం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని ఇచ్చాయి. మీకున్న జ్ఞానం అపారమైన విషయం జగమెరిగినది. మీ మేధోనైపుణ్యం మా ప్రభుత్వానికి, నాకు ఎంతోగానో సహకరించాయి' అని మోది అన్నారు. విన్రమ ప్రజాసేవకుడిగా, అసాధారణ నాయకుడిగా రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించిన ప్రణబ్ ముఖర్జీని చూసి దేశం గర్వపడుతున్నదని మోదీ కొనియాడారు. తన మద్దతు, స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని మార్గదర్శకత్వాన్ని అందించినందుకు ప్రణబ్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రణబ్ ఇక కాంగ్రెస్ కీలక సలహాదారా? కూతురి క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ భారత రాజకీయాల్లో తలపండిన నేత. సుదీర్ఘ పరిపాలన అనుభవం ఆయనకు మెండుగా ఉంది. దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఆయన ప్రస్తుతం పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయన ఏం చేయనున్నారు? తిరిగి కాంగ్రెస్ పార్టీకోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనిచేస్తారా? సలహాలు అందిస్తారా? గతంలో మాదిరిగా ఇంటి వద్ద ఉండే కాంగ్రెస్లో చక్రం తిప్పుతారా అని చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రణబ్ ముఖ్య రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నారని ఊహాగానాలు బయలుదేరాయి. కాంగ్రెస్ పార్టీ నేత మణి శంకర్ అయ్యర్ ఓ మీడియాతో మాట్లాడుతూ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తారని ఆశిస్తున్నానని అయితే, ఈ విషయంలో తనకు కూడా స్పష్టంగా తెలియదని వ్యాఖ్యానించినప్పటి నుంచి ఈ చర్చ మొదలైంది. అయితే, వీటికి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముగింపు పలికారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తన తండ్రి ఒక రారని అన్నారు. 'ఒకసారి రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టాక ఆయన రాజకీయాలకు అతీతంగా వెళ్లారు. గొప్ప రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న మా నాన్న గొప్ప నిధిలాంటివారు. అయితే, ఏ పార్టీలోని ఏ నేత అయినా ఆయన అనుభవం నుంచి పాఠాలు కావాలంటే కచ్చితంగా సహాయం చేస్తారు. అయితే, ఇది ఏ ఒక్క పార్టీకో కాదు.. అన్ని పార్టీలకు వర్తిస్తుంది. గతంలో కూడా పలువురికి ఆయన సలహా ఇచ్చారు. అందుకే ఆయనను అన్ని పార్టీల వాళ్లు గౌరవిస్తారు' అని చెప్పారు. -
మిస్టర్ ప్రెసిడెంట్
-
రాష్ట్రపతిగా ప్రణబ్ చివరి సందేశం..
-
అహింసా పరమోధర్మః
► రాజ్యాంగమే నా పవిత్ర గ్రంథం.. పార్లమెంటే దేవాలయం ► రాష్ట్రపతిగా చివరి సందేశంలో ప్రణబ్ న్యూఢిల్లీ: భిన్నత్వం, సహనంలోనే భారతదేశ ఆత్మ ఇమిడి ఉందని, అహింసాయుత సమాజంలోనే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా పాలుపంచుకోగలరని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. నేడు రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ చివరిసారిగా సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. బహిరంగంగా అభిప్రాయాల్ని వెల్లడించే హక్కును పరిరక్షించాలని ఆకాక్షించారు. సహనమే దేశానికి గొప్ప బలమని పేర్కొన్న ప్రణబ్.. దయ, సహానుభూతి దేశ నాగరికతకు నిజమైన పునాదులని పేర్కొన్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా, పార్లమెంట్ను ఆలయంగా భావించానని చెప్పారు. రాష్ట్రపతిగా ప్రణబ్ చివరి ప్రసంగ పాఠం.. ‘ప్రతిరోజు.. మన చుట్టూ హింస పెరిగిపోతోంది. అజ్ఞానం, భయం, అపనమ్మకం వల్లే ఈ హింస చోటుచేసుకుంటుంది. భౌతిక దాడులు, మాటలతో వేధించడం వంటి పలు రకాల హింసాత్మక చర్యల నుంచి స్వేచ్ఛగా చర్చించే హక్కుకు విముక్తి కల్పించాలి. అహింసాయుత సమాజంతోనే అన్ని వర్గాల ప్రజలకు సమాజంలో పాలుపంచుకునే అవకాశం సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్య సమాజ స్థాపన కోసం అణగారిన, వంచనకు గురైన ప్రజల్ని సమాజంలో భాగస్వాముల్ని చేయాలి. అందరినీ భాగస్వాముల్ని చేయాలి భారతదేశం అంటే కేవలం ఒక భౌగోళికమే ప్రాంతం కాదు. ఉన్నత ఆలోచనలు, తత్త్వజ్ఞానం, వివేకం, పారిశ్రామిక మేధస్సు, ఆవిష్కరణలు, ఎన్నో అనుభవాల సమాహారం ఈ దేశం.. ఎన్నో శతాబ్దాలుగా విభిన్న ఆలోచనల సమాగమం నుంచే భిన్నత్వం రూపుదిద్దుకుంది. విభిన్న సంస్కృతులు, నమ్మకాలు, భాషలు, మన దేశాన్ని ప్రత్యేకంగా రూపుదిద్దాయి. ఇతరులతో అంగీకరించినా, అంగీకరించపోయినా.. మనకు వాదించే అధికారం ఉంది. అయితే ప్రజాభిప్రాయాల్లో తేడాలు తప్పనిసరన్న అంశాన్ని మనం తోసిపుచ్చకూడదు. లేదంటే మన ఆలోచనల మౌలిక స్వరూపం దెబ్బతింటుంది. అందరికి ఆర్థిక ప్రయోజనాలు అందడం సమాజంలో ఎంతో ముఖ్యం. వరుసలో చివర ఉన్న వ్యక్తికి కూడా పథకాల ఫలితాలు అందాలి. ఆనందకర జీవితం గడిపడం అందరి హక్కు. ఉత్తమ పాలన, అందరి భాగస్వామ్యం, పేదరిక నిర్మూలనతోనే అది సాధ్యమవుతుంది. ప్రపంచస్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాలి ప్రపంచ ప్రమాణాల స్థాయికి చేరేలా దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్ని మెరుగుపర్చాలి. కంఠతా పట్టే విధానం కాకుండా జిజ్ఞాస రేకెత్తించే విద్యాసంస్థలుగా యూనివర్సిటీలు ఉండాలి. సృజనాత్మక ఆలోచన, ఆవిష్కరణ, వైజ్ఞానిక ఉత్సుకతను ఉన్నత విద్యాలయ్యాల్లో ప్రోత్సహించాలి. అవసరం కంటే అత్యాశకు పోతే.. ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తుంది. రోజూ అప్రమత్తంగా ఉండేవాడిని నా 50 ఏళ్ల ప్రజా జీవితంలో భారత రాజ్యాంగమే పవిత్ర గ్రంధం. పార్లమెంట్ను దేవాలయంగా భావించా.. ప్రజలకు సేవ చేయాలన్నదే నా ఆకాంక్ష.. ఈ ఐదేళ్లలో ప్రతీ రోజు నా బాధ్యత విషయంలో ఎప్పుడు అప్రమత్తంగా ఉండేవాడిని. దేశ వ్యాప్తంగా పర్యటనల నుంచి, యువత, మేధావులతో మాట్లాడడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఆ సంభాషణలు నాలో ఏకాగ్రతను నింపడమే కాకుండా.. ఎంతో ప్రేరేపించాయి. ఐదేళ్లలో రాష్ట్రపతి భవన్లో మానవీయ విలువలు పాటించడం, ఆనందకర వాతావరణ కల్పనకు ప్రయత్నించాం. ఉల్లాసం, అభిమానం, నవ్వు, సరదా, మంచి ఆరోగ్యం, సానుకూల దృక్పథంతో కూడిన పనులతో ఆనందం ముడిపడి ఉంటుందని కనుగొన్నా. నవ్వుతూ మాట్లాడడం, సరదాగా ఉండడం, ప్రకృతితో మమేకం వంటివి ఇక్కడి వారి నుంచి నేర్చుకున్నా. పశ్చిమబెంగాల్లోని మారుమూల గ్రామం మిరాఠిలో విద్యార్థిగా మొదలైన ప్రణబ్ ముఖర్జీ జీవన ప్రస్థానం.. అనంతరకాలంలో భారత రాజకీయరంగంలో అత్యున్నత స్థాయికి చేరింది. ప్రణబ్ ముఖర్జీ పుట్టిన తేదీ: 11 డిసెంబర్ 1935, మిరాఠి గ్రామం, కిర్ణాహార్, బీర్బూమ్ జిల్లా (పశ్చిమబెంగాల్) తండ్రి: కమద కింకర్ ముఖర్జీ తల్లి: రాజ్యలక్ష్మి వివాహం: 13 జూలై 1957 సంతానం: ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె విద్యార్హతలు: ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్ఎల్బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ),సూరీ, కలకత్తా వర్సిటీ వృత్తి: రాజకీయనేత, సామాజిక సేవ, టీచర్, జర్నలిస్టు, రచయిత రాజకీయ పార్టీ: కాంగ్రెస్ నియోజకవర్గం: జంగీపూర్ అలంకరించిన పదవులు ♦ 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక ♦ 1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక. ♦ 1980–85వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత ♦ 1973–74కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా ♦ 1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా... ♦ 1974–75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా.. ♦ 1975–77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా.. ♦ 1980–82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా.. ♦ 1982–84లో ఆర్థికమంత్రిగా విధులు నిర్వర్తించారు ♦ 1991–96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా.. ♦ 1993–95లో వాణిజ్యశాఖ మంత్రిగా.. ♦ 1995–96లో విదేశాంగమంత్రిగా.. ♦ జంగీపూర్ నుంచి 2004లో లోక్సభకు ఎన్నిక. జూన్ నుంచి లోక్సభలో అధికారపక్ష నేతగా ఉన్నారు ♦ 2004–06లో రక్షణశాఖ మంత్రిగా.. ♦ 2006–09లో విదేశాంగమంత్రిగా.. ♦ 2009–2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు మరికొన్ని పదవుల్లో.. ♦ 2004 నుంచి ఇప్పటివరకు 83 మంత్రుల బృందాలకు (జీఓఎం), సాధికారక మంత్రుల బృందాల (ఈజీఓఎం)కూ సారథి. ♦ యూపీఏ–1 హయాంలో దాదాపు 60 జీఓఎం, ఈజీఓఎంలకు నేతృత్వం. ♦ లోక్పాల్ సంయుక్త కమిటీకి సారథ్యం. ♦ పచ్మడీలో మేథమదన సదస్సులో.. సంకీర్ణ ప్రభుత్వాల దిశగా ముందుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్న ముసాయిదా కమిటీకి నేతృత్వం ♦ దశాబ్దాలుగా అమలవుతున్న పార్టీ మేనిఫెస్టో ముఖ్య రూపకర్త ♦ చిన్న రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ కమిటీకి సారథ్యం ♦ పొత్తుల కోసం డీఎంకే, వివిధ పార్టీలతో చర్చలు జరిపారు ప్రజలతో మమేకమవుతా.. రాష్ట్రపతి పదవి ముగిశాక భవిష్యత్ ప్రణాళికలపై ఈ ఏడాది తొలినాళ్లలో ఓ కార్యక్రమంలో ప్రణబ్ చెప్పిన మాట ఇది. -
ప్రణబ్ హితవచనం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం పదవినుంచి వైదొలగి రాంనాథ్ కోవింద్కు ఆ బాధ్యతలు అప్పజెబుతారు. పదవిలో ఉన్నప్పుడు చెప్పిన తరహా లోనే వీడ్కోలు ప్రసంగంలో సైతం ప్రణబ్ ముఖర్జీ కొన్ని కీలకమైన అంశాల్లో హితబోధ చేశారు. అటు పాలకులకూ, ఇటు ప్రతిపక్షాలకు కూడా కర్తవ్యాన్ని గుర్తుచేశారు. ‘స్వీయ సమర్ధన’ కంటే ‘స్వీయ సవరణ’ ప్రధానమని సూచించారు. వర్తమాన రాజకీయ రంగంలో ఇది అన్ని పార్టీలూ గ్రహించాల్సిన విషయం. తామో, తమ పార్టీ వారో, తమ పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాలవారో తప్పు చేశారన్నప్పుడు వెనువెంటనే పార్టీ నేతల దగ్గర నుంచి వచ్చేది స్వీయ సమర్ధన. తప్పు చేయడం, దొరికిపోతే దబాయించి నోరు మూయించాలని చూడటం... ఏదీ చెప్పలేకపోతే జవాబు దాటేయడం ఇప్పుడు కనిపిస్తున్న ధోరణి. పైగా వాళ్ల ఏలుబడిలో జరగలేదా అని ఎదురు ప్రశ్నించడం కూడా ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి ‘మూక దాడుల’ వరకూ అన్నిటి విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. కనుకనే ప్రణబ్ చేసిన హితబోధకు ప్రాధాన్యముంది. రాష్ట్రపతి పదవిలో ఉండే వారికి పరిమితులుంటాయి. ఆ పదవి ఉత్త రబ్బరు స్టాంపులాంటిదని చాలామంది విమర్శిస్తారుగానీ సమర్ధులైనవారు ఆ పీఠంపై ఉంటే ఆ పరిమితుల్లోనే ఎంతో కొంత చేయగలుగుతారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి, లోటుపాట్ల గురించి పాలకులుగా ఉన్నవారు కలిసినప్పుడు నేరుగా వారివద్దే తన మనోగతాన్ని తెలియ జేయగలుగుతారు. బహిరంగంగా మాట్లాడేటపుడు రేఖామాత్రంగా మాత్రమే ప్రస్తావిస్తారు. ప్రణబ్ ఆదివారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో చేసిన ప్రసం గాన్నిగానీ, జాతినుద్దేశించి సోమవారం చేసిన ప్రసంగాన్నిగానీ ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని చూడాలి. గణతంత్ర వ్యవస్థ తన పౌరులందరిపట్లా బాధ్యత కలిగి ఉండాలని ఆయన గుర్తుచేశారు. పౌరుల్లో సౌహార్దతను పెంపొందించడం, వ్యక్తి గౌరవప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చూడటం, దేశ సమైక్యత కోసం పాటుపడటం ముఖ్యమని గుర్తుచేశారు. ఆ విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ సూచనలను పాలకులు మాత్రమే కాదు... బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సి ఉంటుంది. ఆయన పార్లమెంటు నడుస్తున్న తీరు గురించి కూడా ఆవేదన వ్యక్తపరిచారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలు కేవలం చట్టాలు చేసే సభలు మాత్రమే కాదు... అవి దేశ ప్రజల ఆకాంక్షలకూ, దేశంలో జరగాల్సిన సామాజిక మార్పులకూ సాధనాలుగా ఉండాలి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. కానీ మన సభలు ఘర్షణలకూ, బలప్రదర్శనలకూ వేదికలవు తున్నాయి. బాధ్యతాయుతమైన చర్చలు జరగాల్సిందిపోయి నేలబారు రాజకీ యాలే తాండవమాడుతున్నాయి. తటస్థ పాత్ర పోషించి అన్ని అభిప్రాయాలకూ చోటిస్తూ...ప్రభుత్వ పక్ష బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యం వర్థిల్లడానికి పనిచేయాల్సిన సభాధ్యక్షులు పాలక పక్షాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి, క్లిష్ట సమయాలు ఎదురైనప్పుడు ప్రభుత్వాలను గట్టెక్కించడమే తమ ధ్యేయమన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా చర్చలకు బదులు రచ్చే మిగులుతోంది. రోజుల తరబడి సభలు స్తంభించిపోవడం రివాజుగా మారింది. పార్లమెంటు మొద లుకొని శాసనసభల వరకూ ఈ తంతు నడుస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా చట్టసభల సమావేశాలను ప్రత్యక్షంగా ప్రసారం చేసే సంప్రదాయం కూడా మొద లైంది. ఈ రభసనంతటినీ సాధారణ పౌరులు విస్తుపోయి చూస్తున్నారు. ఎన్నో రకాల హామీలు గుప్పించి ప్రజాప్రతినిధులుగా ఎంపికవుతున్నవారు చేస్తున్న నిర్వా కం ఇదా అని దిగ్భ్రాంతి చెందుతున్నారు. పాలకులుగా ఉన్నవారు ప్రతిపక్షాలను సభ నుంచి బయటకు గెంటేస్తే సమస్య ఉండదన్నట్టు వ్యవహరిస్తున్నారు. సభ సక్రమంగా జరగకపోతే అది ప్రధానంగా తమ వైఫల్యం కిందికొస్తుందన్న ఊహే వారికి రావడం లేదు. కొంత సంయమనం పాటిస్తే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి ఆస్కారం కలుగుతుందని ఇటు విపక్షాలు సైతం అనుకోవడం లేదు. సభను స్తంభింపజేయడం కాక ఏం చేసైనా చర్చ జరిగేలా చూడటం అవసరమని భావించడం లేదు. కీలకమైన సమస్యలు వచ్చిపడినప్పుడు ఏదో ఒక అంశంపై గొడవ జరిగేలా చూసి తప్పించుకోవచ్చునని ప్రభుత్వాలు ఎత్తులు వేస్తున్నాయి. ప్రణబ్ ప్రసంగించిన మర్నాడే లోక్సభ జరిగిన తీరు గమనిస్తే మన ప్రజా ప్రతినిధుల్లో ఎప్పటికైనా మార్పొస్తుందా అన్న అను మానం కలుగుతుంది. గోరక్షణ పేరిట దేశంలో సాగుతున్న హింసపై తక్షణ చర్చకు పట్టుబట్టిన విపక్షాలు నిరసన చెప్పడం వరకూ అర్ధం చేసుకోవచ్చు. కానీ స్పీకర్ టేబుల్పై ఉన్న కాగితాలను చించి పోగులు పెట్టడం ఏం మర్యాద? తన వాదనే మిటో ప్రభుత్వాన్ని చెప్పనిచ్చి, అందులోని లొసుగులను బయటపెడితే ఇంతకన్నా ఎక్కువ ప్రయోజనం సిద్ధించేది. ప్రణబ్ ప్రసంగం మరో కీలకాంశాన్ని స్పృశించింది. అది చట్టసభల ప్రమేయం లేకుండా, చట్టాలు చేయకుండా దొడ్డిదోవన ఆర్డినెన్స్లు తీసుకొచ్చే ధోరణి పెరగడానికి సంబంధించింది. ఆయనన్నట్టు ఆర్డినెన్స్ మార్గాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచింది కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగ పడటానికి మాత్రమే. అదే రివాజుగా మారితే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధమే ముంటుంది? యూపీఏ పాలనలో అయినా, ఇప్పుడు ఎన్డీఏ పాలనలో అయినా జరుగుతున్నది ఇదే. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక భూసేకరణ చట్టంపై ఒకటికి రెండుసార్లు ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది. శత్రు ఆస్తుల చట్టంపై అయిదుసార్లు సవరణ ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది. చట్టసభలు సజావుగా సాగకపోవడం, ఆర్డినెన్స్ జారీ, ప్రైవేటు బృందాల హింస ప్రజాస్వామ్యానికి అనారోగ్య సూచన. ఇలాంటి చెడు ధోరణులను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని అందరూ గుర్తెరగాలి. -
రాష్ట్రపతిగా ప్రణబ్ చివరి సందేశం..
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని ఓ చిన్న గ్రామంలో విద్యాభ్యాసం మొదలుపెట్టి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యున్నత శిఖరంగా భావించే రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం ముగిసింది. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా ప్రణబ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటు తనకు దేవాలయం వంటిదని, ఎప్పటికీ దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కోవింద్ భవిష్యత్తులో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని తాను ఐదేళ్ల క్రితమే ప్రమాణం చేశాననీ, దేశానికి తాను చేసిన దానికంటే తనకు దేశమే ఎక్కువ ఇచ్చిందన్నారు. భారత్ అంటే భూభాగం మాత్రమే కాదని, భిన్న జాతులు, భిన్న అభిప్రాయాల కలయిక అని అభివర్ణించారు. ప్రభుత్వాలు పేదల ప్రజల సంక్షేమంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రజలంతా సహనంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లపాటు రాజ్యాంగమే తనను నడిపించిందని ఈ సందర్భంగా ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ శతాబ్దంలో భిన్నత్వంలో కొనసాగుతున్న జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు, శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల ప్రగతిపై చర్చ జరగాలన్నారు. సంక్షోభంలో ఉన్న సేద్యాన్ని లాభసాటిగా మార్చాలని, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా కొత్త సేద్యాన్ని ఆవిష్కరించాలని సూచించారు. 50 ఏళ్ల ప్రజా జీవితంలో రాజ్యాంగమే తనకు పవిత్రగ్రంథంగా నిలిచిందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని ప్రణబ్ ఆకాంక్షించారు. -
ఆర్డినెన్సుల సంప్రదాయం సరికాదు!
అత్యవసర పరిస్థితుల్లోనే దీన్ని వాడాలి ► పార్లమెంటు స్తంభనతో విపక్షాలకే నష్టం ► పార్లమెంటేరియన్గా జ్ఞాపకాలు మరువలేనివి ► ఎంపీల వీడ్కోలు సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ► మోదీ, ఇందిరపై ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు న్యూఢిల్లీ: ప్రభుత్వం తరచూ ఆర్డినెన్సులు తీసుకొచ్చే సంప్రదాయాన్ని మానుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఎంపీలంతా కలిసి ఆదివారం ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేశారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్లు ప్రణబ్ ముఖర్జీకి సెంట్రల్ హాల్లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. ‘తప్పనిసరి, అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్సును వినియోగించాలని నేను బలంగా విశ్వసిస్తాను. సాధారణ, ఆర్థికపరమైన అంశాల్లో ఆర్డినెన్సుపై ఆలోచించకూడదు’ అని సూచించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అంశాలు లేదా హౌజ్ కమిటీ ముందు పెండింగ్లో ఉన్న అంశాలపై ఆర్డినెన్సు తీసుకురావటం సరైంది కాదన్నారు.శత్రు ఆస్తుల చట్టం–1968కు సవరణలు తీసుకొచ్చేందుకు విఫలమైన ప్రభుత్వం దీనిపై ఐదుసార్లు ఆర్డినెన్సులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బిల్లు మార్చినెలలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. మోదీ సహకారం మరువలేనిది ప్రతి అడుగులోనూ ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన సూచనలు, సహకారం మరువలేనివని ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. ‘దేశంలో గుణాత్మక పరివర్తన తీసుకొచ్చేందుకు మోదీ బలమైన కాంక్ష, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఏర్పడిన బంధం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనకు మార్గదర్శకత్వం చేశారని గుర్తుచేసుకున్న ప్రణబ్.. దృఢచిత్తం, స్పష్టమైన ఆలోచనలు, నిర్ణయాత్మకమైన కార్యాచరణే ఆమెను ఉన్నతమైన వ్యక్తిగా నిలిపాయన్నారు. తప్పును తప్పు అని చెప్పటంలో సంశయించేవారు కాదన్నారు. ఎమర్జెన్సీ తర్వాత లండన్లో ఇందిర మాట్లాడుతూ‘ఈ 21 నెలల్లో అన్ని వర్గాల భారతీయులను పరాధీనులుగా మార్చాం’ అని తప్పును ఒప్పుకున్నట్లు ప్రణబ్ తెలిపారు. రచ్చకాదు.. చర్చ జరగాలి 1969లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయినపుడు అధికార, విపక్షాల్లోని గొప్ప పార్లమెంటేరియన్ల ప్రసంగాలు విని ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. సభలో చర్చలు, వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాల విలువ తనకు బాగా తెలుసని రాష్ట్రపతి చెప్పారు. తరచూ పార్లమెంటును స్తంభింప చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విపక్షానికే చేటుచేస్తాయని కూడా ప్రణబ్ సుతిమెత్తగా హెచ్చరించారు. ‘స్వాతంత్య్రానంతరం దేశ సోదరభావం, గౌరవం, ఐకమత్యాన్ని ప్రోత్సహించేందుకు మనం నిర్ణయించుకున్నాం. ఈ విధానాలే మన దేశానికి ధ్రువతారగా మారాయి’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘నేను ఎంపీగా ఉన్న రోజుల్లో పార్లమెంటులో చర్చలు, వాదోపవాదాలు జరిగేవి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. పార్లమెంటులో తరచూ ఆందోళనలు జరగటం వాయిదా పడటం వల్ల విపక్షానికే నష్టం జరుగుతుందని అర్థం చేసుకున్నా’ అని ప్రణబ్ వెల్లడించారు.‘సప్తవర్ణ శోభితమైన జ్ఞాపకాలు, దేశ ప్రజలకు వినయపూర్వకమైన సేవకుడిగా పనిచేసినందుకు సంతోషకరమైన, సఫలీకృతమైన భావనతో ఈ భవనాన్ని (పార్లమెంటును) వీడుతున్నాను’ అని ప్రణబ్ ఉద్వేగంగా తన ప్రసంగాన్ని ముగించారు. ప్రణబ్ గురుసమానులు: సుమిత్ర రాజ్యాంగం, పార్లమెంటరీ నియమ, నిబంధనలపై పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ అంటే ఎంపీలకు ఎనలేని గౌరవమని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. చాలా మంది పార్లమెంటేరియన్లకు ప్రణబ్ గురువులాంటివారన్నారు. ప్రజలంతా దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పునరంకితం అవ్వాలని ఆయన తరచూ కోరేవారని హమీద్ అన్సారీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ప్రణబ్ ముఖర్జీ పాత్రను ఎంపీలు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్కు ఎంపీల తరపున ‘కాఫీ టేబుల్’ పుస్తకాన్ని స్పీకర్ బహూకరించారు. న్యూఢిల్లీ: కొత్త రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని రెండు బంగ్లాలు చారిత్రక ప్రాధాన్యం సంతరించు కున్నాయి. మంగళవారం పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీ రాజాజీ మార్గ్లోని 10వ నంబర్ భవనం స్వాగతం పలకడానికి ముస్తాబవు తోంది. మాజీ రాష్ట్రపతి కలామ్ 2015లో మరణిం చేవరకు ఈ బంగ్లాలోనే నివసించారు. తర్వాత దీన్ని కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు కేటా యించారు. భవనాన్ని ప్రణబ్కు కేటాయించడంతో శర్మ అక్బర్ రోడ్డులోని 10వ నంబర్ ఇంటికి మారారు. యాదృచ్ఛికంగా ఇదే భవనంలో కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ తాత్కా లికంగా నివసిస్తుండటం విశేషం. రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఆయన ఈ బంగ్లాలోనే నివసిస్తున్నారు. 10, అక్బర్ రోడ్డు నుంచే కోవింద్ రాష్ట్రపతి భవన్లోకి అడుగుపెట్టనున్నారు. ప్రణబ్తో మరువలేని జ్ఞాపకాలు! న్యూఢిల్లీ: భారత 13వ రాష్ట్రపతిగా తన పదవికి మంగళవారం రాజీనామా చేయనున్న ప్రణబ్ ముఖర్జీ వ్యక్తిత్వం, తమతో ఆయన అనుబంధాన్ని పాత మిత్రులు గుర్తుచేసుకుంటున్నారు. రాజకీయ చాణక్యుడిగా, ఆర్థిక, విదేశాంగ విధానాల నిపుణుడిగానే కాదు.. క్లిష్ట సమయాల్లో పార్టీని ఆదుకోవటంలో ప్రణబ్ గొప్పదనం మరిచిపోలేనిదంటున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ఆమె కేబినెట్ మంత్రిగా ప్రణబ్ మధ్య చాలా కీలకాంశాలపై వ్యక్తిగతంగా చర్చ జరిగేదని.. అంతలా ప్రణబ్ను ఇందిర విశ్వసించేవారన్నారు. ‘ఇందిర, ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాలపై ఎంత ప్రయత్నించినా ప్రణబ్ నోటినుంచి ఒక్క మాట కూడా రాబట్టలేరు’ అని ప్రణబ్ ముఖర్జీకి సన్నిహితుడైన జర్నలిస్టు జయంత ఘోష్ తెలిపారు. ‘ఆరోగ్య సమస్యలు తలెత్తాక పొగతాగటం మానేశారు. అలవాటు మానుకోలేని కారణంగా నికోటిన్ లేకున్నా ఉట్టి పైప్లనే నోట్లో పెట్టుకునేవారు’ అని ఘోష్ గుర్తుచేసుకున్నారు. ముఖ్యనేతలు, దేశాధినేతలు, విదేశీ ప్రముఖులు బహుమతులుగా ఇచ్చిన 500కు పైగా పైప్ల కలెక్షన్ను రాష్ట్రపతి భవన్ మ్యూజియంకు ప్రణబ్ కానుకగా ఇచ్చారు. ‘ప్రణబ్కు రాజకీయాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలాబాగా తెలుసు. ప్రభుత్వానికి సమస్యలు రానీయకుండా రాజ్యాంగాన్ని కాపాడటం కూడా ఆయనకు తెలుసు. భారత అత్యుత్తమ రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు’ అని కేంద్ర కేబినెట్లో మాజీ సహచరుడు శివ్రాజ్ పాటిల్ తెలిపారు. రక్షణ, ఆర్థిక, విదేశాంగ, హోం వంటి వివిధ శాఖల బాధ్యతలు నిర్వహించినా ప్రభుత్వంలో ఆయనే ఎప్పుడూ నెంబర్ 2గా ఉండేవారన్నారని మరికొందరు పేర్కొన్నారు. -
‘ఆమె నా రాజకీయ గురువు’
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుకు ఆమోదం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రేపటితో పదవీకాలం ముగియనుండటంతో ఆయనకు పార్లమెంట్ సెంట్రల్ హాల్గా ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. 1969 జూలైలో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టానని తెలిపారు. ఐదుసార్లు రాజ్యసభకు, రెండు సార్లు లోక్సభ సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేశారు. తాను పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు స్వాతంత్ర్య సమరయోధులు, అపర మేధావులు ఉన్నారని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. తన రాజకీయ గురువు ఇందిరా గాంధీ అని ప్రకటించారు. ఇందిరా, పీవీ నరసింహారావు, వాజపేయి నుంచి ఎంతో నేర్చుకున్నాని అన్నారు. పార్లమెంట్లో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం ఉందన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఆర్డినెన్స్ తేవాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో సమయం వృధా అవుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మంచి సహకారం అందిందని తెలిపారు. రాష్ట్రపతిగా తనకు ఎన్నో మధుర స్మృతులు మిగిల్చినందుకు పార్లమెంట్ సభ్యులకు ప్రణబ్ ధన్యవాదాలు తెలిపారు. -
ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని ఘనంగా సన్మానించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ప్రస్తుత ఎంపీల సంతకాలు, తన ప్రసంగంతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్కు సుమిత్రా మహాజన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అందరికీ ప్రణబ్ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఆయన నిండునూరేళ్లు ఆయురాగ్యోగాలతో ఉండాలని ఆకాంక్షించారు. వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినందుకు ప్రణబ్ ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు. -
రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు
-
రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు
న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయబోతున్న ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీడ్కోలు విందు ఇచ్చారు. హైదరాబాద్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రణబ్కు మోదీ ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా విజిటర్స్ పుసక్తంలో రాష్ట్రపతి సంతకం చేశారు. విందులో కాబోయే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. నేడు పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎంపీలు వీడ్కోలు పలుకుతారు. -
ఈసారి సాధారణ పౌరుడిలా వస్తా: ప్రణబ్
జంగీపూర్: ఈసారి పశ్చిమబెంగాల్కు సాధారణ పౌరుడిగానే తిరిగివస్తానని రాష్ట్రపతి ప్రణబ్ తెలిపారు. తన తండ్రి కమద కింకార్ స్మత్యర్థం 2010 నుంచి జంగీపూర్లో నిర్వహిస్తున్న కేకేఎం ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రణబ్ శుక్రవారం ప్రారంభించారు. ఈసారి రాష్ట్రానికి 130 కోట్ల భారతీయుల్లో ఒకడిగా, సాధారణ పౌరుడిగానే తిరిగివస్తానన్నారు. తర్వాత తన ఇంటికి చేరుకున్న ఆయన పలువురు గ్రామస్తులను కలుసుకున్నారు. సత్యభారతి ఫౌండేషన్ కొత్తగా ఏర్పాటుచేసిన ఓ పాఠశాలను ప్రారంభించిన ప్రణబ్ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. జంగీపూర్ నుంచి ప్రణబ్ 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. -
ప్రథమ పౌరుడు ఆచరించి చూపారు..
ముర్షిదాబాద్: అంబులెన్స్కు దారి చూపి ప్రాణాలు కాపాడండి.. అని వాహనాలపై ఉన్న రాతలను చూడటమే కానీ, ఆచరించే వారు చాలా తక్కువ. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మాత్రం ఆచరించి చూపారు. ప్రజలకు మార్గదర్శనం చేశారు. ఏం జరిగిందంటే.. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ శుక్రవారం ఉదయం కనిదిఘి గ్రామంలో స్కూల్ను ప్రారంభించాల్సి ఉంది. అందుకోసం ఆయన విమానంలో ముర్షిదాబాద్ చేరుకుని అక్కడి నుంచి తన 20 వాహనాలతో బయలుదేరారు. వాహనాలు 34వ జాతీయ రహదారిపై ఉండగా వెనుక నుంచి అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ వచ్చింది. దీంతో రాష్ట్రపతి వ్యక్తిగత అధికారుల సూచనలతో కాన్వాయ్ వాహనాలు పక్కకు తొలిగాయి. ఫలితంగా ఆ అంబులెన్స్ ఎటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్లిపోయింది. అయితే అంబులెన్స్ లో ఎవరున్నదీ తెలియరాలేదు. ప్రస్తుతం రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా బెంగాల్ లో ఉన్నారు. -
ఆయన నన్ను తండ్రిలా చూసేవారు: మోదీ
-
ఆయన నన్ను తండ్రిలా చూసేవారు: మోదీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తన అనుబంధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసుకున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్న సందర్భంగా మోదీ తన మనసులో మాటలను వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ తనను ఓ తండ్రిలా ఆదరించారని మోదీ తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై తండ్రి ఎలా శ్రద్ధ తీసుకుంటారో, నా ఆరోగ్యంపై ప్రణబ్ కొన్నిసార్లు ఆందోళన చెందడం.. ఆయనలో మానవత్వకోణాన్ని చూపిస్తుందన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని, ఆయన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రధాని మోదీ తాను ఢిల్లీకి వచ్చిన తొలి రోజులను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. ఆ సమయంలో ఉన్నతస్థాయిలో ఉన్న ప్రణబ్ నాకు మార్గనిర్దేశం చేశారు. ప్రణబ్ లాంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని ప్రధాని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ను నిలపగా, విపక్షాల అభ్యర్థిగా లోక్సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నాయకురాలు మీరాకుమార్ ఎన్నికల బరిలో ఉన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
‘సంరక్షక’ దాడులపై రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిల్లీ: కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సంరక్షకత్వం పేరుతో చేస్తున్న దాడులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సమాజ మౌలిక సూత్రాలను కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ 70వ స్వాతంత్య్ర వార్షికోత్సవాల సందర్భంగా శనివారమిక్కడ నేషనల్ హెరాల్డ్ పత్రిక వెలువరించిన స్మారక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘మూక ఉన్మాదం తారస్థాయికి చేరి, నిర్హేతుకంగా, నియంత్రించలేని విధంగా మారినప్పుడు మనం కాస్త ఆగి ఆలోచించాలి.. నేను సంరక్షకవాదం గురించి మాట్లాడటం లేదు. మన కాలపు మౌలిక సూత్రాలను కాపాడుకోవడానికి మనం తగినంత అప్రమత్తంగా ఉన్నామా? లేదా అనే విషయంపై మాట్లాడుతున్నాను’ అని పేర్కొన్నారు. 200 భాషలు, ఏడు మతాలు, 130 కోట్ల జనాభా గల దేశం ఒకే రాజ్యాంగం, జెండా కింద శాంతి సామరస్యాలతో కొనసాగడం గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని ఉల్లంఘించారనో, మరొకటనో ఒక వ్యక్తిపై దాడి చేస్తున్న దృశ్యాలను టీవీల్లో, పత్రికల్లో చదివినప్పుడు కాస్త ఆగి ఆలోచించాలని కోరారు. ఈ విషయంలో ఎవరూ తమ బాధ్యత నుంచి తప్పించుకోకూడదని, మనం ఏం చేశామని భావి తరాలు వివరణ కోరతాయని అన్నారు. ఈ ప్రశ్నను తనకు తాను కూడా వేసుకుంటున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా, రాహుల్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ వెబ్సైట్ను ప్రారంభించిన ప్రణబ్.. ‘ఒక స్వాతంత్య్ర పోరాట సైనికుడు తిరిగి అవతరించాడు’ అని ఆ పత్రికను కొనియాడారు. సమైక్య భావనపై దాడి: సోనియా చట్టాన్ని అమలు చేయాల్సిన వారి నుంచే ‘సంరక్షక’ హింసకు మద్దతు లభిస్తోందని సోనియా మండిపడ్డారు. మత విద్వేషం, నిరంకుశత్వం పెరిగాయని, ఎవరేం తినాలో ఆదేశిస్తున్నారన్నారు. దేశ సమైక్య భావనపై దాడి జరుగుతోందంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు సంధించారు. ప్రశ్నించకుండా, నిజాలు చెప్పకుండా, తమను పొగడాలని, అదుపాజ్ఞల్లో ఉండాలని కొందరు మీడియాపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కాగా, విదేశాలకు వెళ్లిన రాహుల్ శనివారం తిరిగొచ్చారు. -
జీఎస్టీ ఆవిష్కరణ వేడుక
-
‘సహకార’ స్ఫూర్తికి నిదర్శనం
► జీఎస్టీతో దేశంలో గొప్ప మార్పునకు నాంది ► నా కల నేరవేరినందుకు సంతృప్తిగా ఉంది ► కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం శుభపరిణామం ► జీఎస్టీ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రావటం గొప్ప మార్పునకు నాంది అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ పన్ను విధానం భారత ప్రజాస్వామ్య పరిపక్వత, వివేచనకు నిదర్శనమన్నారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దీన్ని సాకారం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా రాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సమాఖ్య వ్యవస్థకు కొత్త ఉదాహరణగా నిలిచి ఏకాభిప్రాయంతో జీఎస్టీని అమల్లోకి తీసుకురావటం శుభపరిణామమన్నారు.జీఎస్టీ మండలి కూడా 18సార్లు సమావేశమై వివిధ పన్నురేట్లు, పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులపై చర్చోపచర్చలు జరిపి ఓ అద్భుతమైన విధానాన్ని రూపొందించటాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా జీఎస్టీ అమలుకు దేశమంతా ఏకమవటం గొప్ప మార్పునకు సంకేతమన్నారాయన. జీఎస్టీ మండలి ఇకమీదట కూడా ఈ పన్ను విధానం అమలుతీరును నిరంతరం పర్యవేక్షిస్తూ సరైన మార్పుల దిశగా చొరవతీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ‘పన్ను విధానంలో కొత్త శకం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పన్ను విధానం విషయంలో ఏకాభిప్రాయం రావటం గొప్ప పరిణా మం. ఇది ఒకరోజులో సాధ్యమైంది కా దు. దీని వెనక చాలా కృషి ఉంది. రాజకీయాలకు అతీతంగా నాయకులు దేశ అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని పనిచేశారు’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి రావటంలో కృషిచేసినవారికి అభినందించారు. వ్యక్తిగతంగా సంతృప్తికరం ‘2011 మార్చి 22న పార్లమెంటులో జీఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును అప్పటి ఆర్థిక మంత్రిగా నేనే ప్రవేశపెట్టాను. అప్పుడు దీనికి కాస్త వ్యతిరేకత వచ్చింది. కానీ కొంతకాలానికే సానుకూల మార్పు కనిపించింది. ఇందులో భాగంగా చాలా మంది మంత్రులు, సీఎంలు, అధికారులను కలిశాను. వారంతా నిర్మాణాత్మక సూచనలు చేశారు. కొంత సమయం తీసుకున్నా జీఎస్టీ తప్పకుండా అమల్లోకి వస్తుందనే నమ్మకం నాకుండేది. అందుకే ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. గతేడాది సెప్టెంబర్8న జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తన కల సాకారమవుతుందనే నమ్మకం కలిగిందన్నారు. జీఎస్టీ అమలు ప్రారంభంలో సమస్యలు తప్పవని వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రణబ్ సూచించారు. జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక సామర్థ్యం మెరుగుపడటంతోపాటుగా.. పన్ను విధానం, దేశీయ, విదేశీ పెట్టుబడులకు మేలు జరుగుతుందన్నారు. జీఎస్టీ విజయవంతంగా అమలవటంలో దేశప్రజలంతా భాగస్వాములు కావాలని రాష్ట్రపతి కోరారు. -
దేశమంతా ఏకమై ముందుకు సాగాలి
2011లోనే జీఎస్టీ కోసం ప్రయత్నించా: ప్రణబ్ కోల్కతా: కులాలు, మతాల ఆధారంగా కాకుండా దేశమంతా ఏకమై.. ఒకటిగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆకాంక్షించారు. ఇటీవల దేశంలో ఓ మతం వారిపై దాడులు పెరుగుతున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కోల్కతాలో ఐసీఏఐ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన ‘130 కోట్ల మంది ప్రజలు, ఏడు మతాలు, 200 భాషలు, 1,800 మాండలికాలు భారత్లో ఉన్నాయి. ఇది భారతీయ ఆచార వ్యవహారాల గొప్పతనం. ’ అని అన్నారు. వస్తు, సేవల పన్ను తీసుకురావడాన్ని ప్రణబ్ ప్రశంసించారు. ‘రేపటి నుంచి దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ కిందకు వస్తుంది. ఒక జాతి, ఒకే పన్ను. అదే జీఎస్టీ. జీఎస్టీ తీసుకురావడానికి అవసరమైన రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును నేను 2011లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాను. కానీ అది ఆమోదం పొందలేదు’ అని ప్రణబ్ చెప్పుకొచ్చారు.‘గణతంత్ర భారతదేశ రాష్ట్రపతిగా ఇదే నా చివరి కోల్కతా పర్యటన’ అని ప్రణబ్ అన్నారు. -
అర్ధరాత్రి అట్టహాసంగా..
నేడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీ ప్రారంభోత్సవం ► రాత్రి 10.45 గంటలకు కార్యక్రమం మొదలు.. రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రి ప్రసంగాలు ► జీఎస్టీ అమలుకు సూచికగా 12 గంటలకు మోగనున్న భారీ గంట ► కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్, డీఎంకే నిర్ణయం స్వతంత్ర భారతావనిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణగా అభివర్ణిస్తున్న జీఎస్టీ (వస్తు,సేవల పన్ను) చట్టం శుక్రవారం(నేటి) అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగే ఆరంభ వేడుకలో రాష్ట్రపతి, ప్రధానితో సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు కూడా హాజరవుతారు. వివిధ రంగాల నిపుణుల్ని ఆహ్వానించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా మోదీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శుక్రవారం రాత్రి 10.45 గంటలకు కార్యక్రమం మొదలై 80 నిమిషాలు కొనసాగనుంది. రాష్ట్రపతి రాకకు ముందు జీఎస్టీపై 10 నిమిషాల నిడివిగల షార్ట్ఫిల్మ్ ప్రదర్శిస్తారు. వేదికపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవేగౌడ ఆసీనులవుతారు. అనంతరం ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ క్లుప్తంగా జీఎస్టీ గురించి వివరిస్తారు. ప్రధాని, రాష్ట్రపతి 25 నిమిషాల చొప్పున ప్రసంగిస్తారు. రెండు నిమిషాల వీడియో క్లిప్ ప్రదర్శించాక... సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీ అమలులోకి వచ్చిందనేందుకు సూచికగా పెద్ద గంటను మోగిస్తారు. ⇒ కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, ఎంపీలతో పాటు రతన్ టాటా, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, న్యాయకోవిదులు సోలీ సొరాబ్జీ, కేకే వేణుగోపాల్, హరీష్ సాల్వే, ఆర్బీఐ మాజీ గవర్నర్లు సి.రంగరాజన్, బిమల్ జలాన్, వైవీ రెడ్డి, డి.సుబ్బారావు, ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, మెట్రో నిపుణుడు శ్రీధరన్... ఇలా వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులైన 100 మందికి ఆహ్వానాలు పంపారు. ⇒ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల్ని కూడా ఆహ్వానించారు. సీఐఐ, ఫిక్కీ, అసోచామ్ల చైర్మన్లు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. ⇒ ఈ కార్యక్రమం పకడ్బందీ నిర్వహణ కోసం గురువారం రాత్రి రిహార్సల్స్ కూడా నిర్వహించారు. కాంగ్రెస్ దూరం... జీఎస్టీ ప్రత్యేక సమావేశానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మన్మోహన్ సింగ్, ఇతర నేతలతో గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశానంతరం ఈ నిర్ణయం వెలువడింది. సమావేశానికి కాంగ్రెస్ హాజరు కావడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యవ్రత్ చతుర్వేది చెప్పారు. అయితే జీఎస్టీ కాంగ్రెస్ ఆలోచనని, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారని... అందువల్ల సమావేశానికి దూరంగా ఉండడం మంచిది కాదని మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తదితరులు వాదించినట్లు సమాచారం. వ్యాపారవర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంత హడావుడిగా జీఎస్టీని అమల్లోకి తేవాల్సిన అవసరం ఏముందని మరికొందరు వాదించారు. చివరకు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దేశానికి స్వాతంత్య్రం రోజున ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అర్ధరాత్రి ప్రసంగం ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ని మోదీ అనుకరించడంపై కూడా కాంగ్రెస్ అసహనంగా ఉంది. జీఎస్టీపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా గైర్హాజరు కానుంది. డీఎంకే, సీపీఐ కూడా సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించాయి. సీపీఎం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గైర్హాజరుకానున్నారు. గైర్హాజరు నిర్ణయంపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పునరాలోచన చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. జీఎస్టీపై అన్ని రాష్ట్రాలు, పార్టీలతో సంప్రదించాకే నిర్ణయాలు తీసుకున్నామని.. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రసంగాన్ని గుర్తుచేసేలా... పార్లమెంటు భవన సముదాయంలోని సెంట్రల్ హాల్ వృత్తాకారంలో ఉంటుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక నిలిచింది. 70 ఏళ్ల క్రితం... 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి... భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చిన క్షణాన ప్రధాని నెహ్రూ జాతినుద్దేశించి ఇక్కడి నుంచే ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర రజతోత్సవ, స్వర్ణోత్సవ వేడుకలకు కూడా సెంట్రల్ హాల్ వేదికైంది. ఇక మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన రాజ్యాంగాన్ని రచించిన కమిటీ సమావేశాలు ఇక్కడే నిర్వహించారు. ప్రతి సంవత్సరం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు సెంట్రల్ హాల్లోనే రాష్ట్రపతి ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొత్త రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించేది కూడా సెంట్రల్ హాలులోనే. ఇతర దేశాధినేతలు భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించేది కూడా ఇక్కడే. అందుకే మోదీ ప్రభుత్వం జీఎస్టీ ప్రారంభానికి ఈ చారిత్రక భవనాన్ని ఎంచుకుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇదే నా చివరి పర్యటన: రాష్ట్రపతి
కోల్కతా(పశ్చిమబెంగాల్): అధికార హోదాలో ఇదే తన చివరి పర్యటన కావచ్చని భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అన్నారు. గురువారం ఆయన కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో జరిగిన పీసీ మహలనోబిస్ 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ కాలం ముగిసే సమయంలోనే మరోసారి ఇక్కడి పరిశోధకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించటం చాలా ఆనందంగా ఉందన్నారు. సమాజం ఎదుర్కొనే సవాళ్లను, సమస్యలను స్వీకరించి వాటికి పరిష్కారాలను కనుగొనాలని కోరారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, కొన్ని సంస్కరణల ఫలాలు ఇప్పటికే అందుతున్నాయని చెప్పారు. వచ్చే నెలలో ప్రణబ్ముఖర్జీ రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.