Pranab Mukherjee
-
ప్రణబ్ స్మారకం..స్థలం కేటాయించిన కేంద్రం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ(Pranab Mukherjee) స్మృతి వననానికి కేంద్రం స్థలం కేటాయించింది. రాజ్ఘాట్ కాంప్లెక్స్లోని రాష్ట్రీయ స్మృతి స్థల్లోనే ప్రణబ్ ముఖర్జీ స్మారక వనానికి స్థలం కేటాయించారు. ఈ విషయమై కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన లేఖను ప్రణబ్ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ విడుదల చేశారు.తన తండ్రి స్మారకానికి స్థలం కేటాయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీని(Narendra Modi) ప్రత్యేకంగా కలిసిన షర్మిష్ట ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక ఊహించని,గొప్ప నిర్ణయమని కొనియాడారు.కాగా, ఇటీవల మాజీ ప్రధాని స్మారక చిహ్నం నిర్మాణానికి స్థలం కేటాయించడంపై వివాదం సందర్భంగా షర్మిష్ట కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు.తన తండ్రి ప్రణబ్ మరణించినపుడు కాంగ్రెస్(Congress) చేసిన అన్యాయాన్ని బయటపెట్టారు. ఇంతలోనే ప్రణబ్ముఖర్జీ స్మారక సమాధికి కేంద్రం స్థలం కేటాయించడం గమనార్హం. కాగా, ప్రణబ్ముఖర్జీ భారత రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు పనిచేశారు. 2020 ఆగస్టులో ఆయన తుదిశ్వాస విడిచారు. -
ప్రణబ్ చనిపోతే మీరేం చేశారు.. కాంగ్రెస్పై శర్మిష్ఠా ముఖర్జీ సీరియస్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పెద్దలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్ హైకమాండ్ను ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు లేఖ రాయడంపై ఆమె మండిపడ్డారు.మాజీ ప్రధాని మన్మోహన్కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ఈ అంశంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్ను శర్మిష్ఠా ముఖర్జీ ప్రశ్నించారు.తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే నివాళులర్పించడానికి కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తనకు చెప్పారని ఆమె అన్నారు. అయితే, తర్వాత అది నిజం కాదని ప్రణబ్ రాసుకున్న డైరీ ద్వారా తనకు తెలిసిందని శర్మిష్ఠ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె మండిపడుతున్నారు.ఇదిలా ఉండగా.. 92 ఏళ్ల మన్మోహన్ అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మన్మోహన్ పార్థివదేహాన్ని శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అక్కడ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తారని, అనంతరం 9:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉదయం 11:45 గంటలకు స్థానిక నిగమ్బోధ్ ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచారు.When baba passed away, Congress didnt even bother 2 call CWC 4 condolence meeting. A senior leader told me it’s not done 4 Presidents. Thats utter rubbish as I learned later from baba’s diaries that on KR Narayanan’s death, CWC was called & condolence msg was drafted by baba only https://t.co/nbYCF7NsMB— Sharmistha Mukherjee (@Sharmistha_GK) December 27, 2024 -
Pranab Mukherjee: 13 అశుభం.. ఆ మాజీ రాష్ట్రపతికి అత్యంత శుభం?
ఈరోజు డిసెంబరు 11.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జన్మదినం. ఆయన 1935, డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా మిరాటి గ్రామంలో జన్మించారు. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. 2020 ఆగస్టులో కన్నుమూసిన ప్రణబ్ ముఖర్జీ జీవితంలో 13వ నంబరుకు ప్రత్యేక స్థానముంది.చాలామంది 13వ నంబరును అశుభ సంఖ్యగా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో 13వ నంబరుపై ఉండే భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా అంటారు. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలలోని ప్రజలు 13 సంఖ్యను అశుభ సూచికగా చెబుతారు. దీనివెనుక పలు కారణాలను కూడా చెబుతుంటారు. అయితే ఇదే 13వ సంబరు ప్రణబ్ ముఖర్జీ జీవితంలో అదృష్ట సంఖ్యగా మారింది. ఆయన జీవితంలోని అన్ని ముఖ్యమైన సంఘటనలు 13వ నంబర్తో ముడిపడి ఉన్నాయి.ప్రణబ్ ముఖర్జీ వివాహందివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వైవాహిక జీవితం 13వ సంఖ్యతో ప్రారంభమైంది. ఆయన 1957, జూలై 13న వివాహం చేసుకున్నారు.రాజ్యసభకు..ప్రణబ్ ముఖర్జీ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి సన్నిహితునిగా పేరొందారు. ఆమె ప్రణబ్ ముఖర్జీని 1969లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు పంపారు. ప్రణబ్ ముఖర్జీ మొదటిసారిగా 1969 జూలై 13న పార్లమెంటులో ప్రవేశించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా..యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ప్రణబ్ ముఖర్జీ పేరు తెరపైకి వచ్చిన తేదీ కూడా 13 కావడం విశేషం. 2012, జూన్ 13న యూపీఏ ముందుకు రెండు పేర్లు వచ్చాయి. ఒకరు ప్రణబ్ ముఖర్జీ. మరొకరు హమీద్ అన్సారీ. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ పేర్లను మమతా బెనర్జీ అందరి ముందుకు తీసుకువచ్చారు.13వ రాష్ట్రపతిగా..ప్రణబ్ ముఖర్జీ దేశ 13వ రాష్ట్రపతి అయ్యారు. ఈ సమయంలో ఆయనకు ప్రభుత్వం 13వ నంబరు బంగ్లాను కేటాయించింది. ప్రణబ్ ముఖర్జీ 1996 నుండి 2012 వరకు ఢిల్లీలోని తల్కటోరిలోని 13వ నంబర్ బంగ్లాలో నివసించారు. 13వ నంబర్తో ప్రణబ్ ముఖర్జీకి ఉన్న అనుబంధం ఆయన జీవితంలోని చిరస్మరణీయ క్షణాలుగా మారాయి. ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
కాంగ్రెస్ పరిస్థితిపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
ఒక నిర్దిష్ట నాయకుని నాయకత్వంలో పార్టీ నిరంతరం ఓడిపోతుంటే, దాని గురించి ఆలోచించడం చాలా ముఖ్యమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, రచయిత శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజస్థాన్లోని జైపూర్ల జరిగిన 17వ లిటరేచర్ ఫెస్టివల్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2014, 2019లలో రాహుల్ గాంధీ ఘోరంగా ఓడిపోయారనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అని, దానిని ఎలా బలోపేతం చేయాలనే దానిపై కాంగ్రెస్ నేతలంతా ఆలోచించాలని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీలోని సంస్థాగత ఎన్నికలు, విధానపరమైన నిర్ణయాలు... ఇలా ప్రతి స్థాయిలోనూ అట్టడుగు స్థాయి కార్యకర్తలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నారని శర్మిష్ట పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన సిద్ధాంతాలు ఉంటాయని, ఎవరి భావజాలంతోనూ మనం ఏకీభవించకపోయినప్పటికీ, వారి భావజాలం తప్పుకాదని అర్థం చేసుకోవాలని శర్మిష్ట అన్నారు. తమ తండ్రి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు, పార్లమెంటులో ప్రతిష్టంభన సమయంలో ఇతర పార్టీ సభ్యులతో చర్చించడంలో ఆయనకున్న నేర్పు కారణంగా ఆయన ఏకాభిప్రాయ నిర్మాతగా గుర్తింపు పొందారన్నారు. ప్రజాస్వామ్యం అంటే మాట్లాడటం మాత్రమే కాదని, ఇతరుల మాట వినడం కూడా చాలా ముఖ్యమని, ప్రజాస్వామ్యంలో చర్చలు ఉండాలన్నది ప్రణబ్ ముఖర్జీ సిద్ధాంతమని షర్మిష్ట పేర్కొన్నారు. -
PRANAB, MY FATHER: రాహల్కు పరిణతి లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణతి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్ కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ–నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్ కు వచ్చింది గానీ వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు‘ అని కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. ‘కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా? ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా? ఏమో! నాకైతే తెలియదు‘ అంటూ అనుమానాలు వెలిబుచ్చారట. ’ప్రణబ్: మై ఫాదర్’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు చించివేశారని తెలిసి ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని చెప్పారు. ‘అలా చేయడానికి ఆయన ఎవరసలు? కనీసం కేబినెట్ సభ్యుడు కాదు. పైగా అప్పుడు ప్రధాని (మన్మోహన్ సింగ్) విదేశాల్లో ఉన్నారు. తన చర్య పార్టీపై, ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆలోచించరా? సొంత ప్రభుత్వ ఉత్తర్వులను అలా మీడియా ముందు ముక్కలు చేయడం 2014లో యూపీఏ కూటమి ఓటమికి కూడా ఒక కారణమైంది‘ అని ప్రణబ్ మండిపడ్డారట. ‘రాహుల్ హుందాగానే ప్రవర్తిస్తారు. కానీ దేన్నీ సీరియస్గా తీసుకోరు. బహుశా ఆయనకు అన్నీ చాలా సులువుగా లభించడమే కారణం కావచ్చు. రాహుల్ మాత్రం అత్యంత కీలక సమయాలు, సందర్భాల్లో కూడా చీటికీమాటికీ దేశం విడిచి ఎటో మాయమవుతారు. ఇది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తప్పుడు సందేశమే ఇచ్చింది‘ అని ప్రణబ్ అభిప్రాయపడ్డట్టు శర్మిష్ఠ తెలిపారు. -
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతమే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని తెలిసే తెలంగాణ ప్రకటించారని, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారంటే భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పినంత దరిద్రంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడారో కేటీఆర్ తెలుసుకుని మాట్లాడాలని, పనికిమాలిన మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నాడు కేసీఆర్ ఆన్ రికార్డు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఎంపీ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తెలంగాణ కావాలని.. ‘మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. వైఎస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నాతో సహా 41 మంది ఎమ్మెల్యేలం తెలంగాణ కావాలని అడిగినందుకే ప్రణబ్ముఖర్జీ కమిటీ వేశారు. అప్పుడు కేటీఆర్ రాజకీయాల్లో లేడు. అమెరికాలో ఉన్నాడు. ఆ తర్వాత కేసీఆర్కు చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకోం.’ అని కోమటిరెడ్డి హెచ్చరించారు. వాళ్లకు టికెట్లు క్యాన్సిల్ చేయండి కట్టె పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన దానం నాగేందర్, కేసీఆర్ను ఫుట్బాల్లా తంతానన్న తలసాని శ్రీనివాస్యాదవ్, పట్నం మహేందర్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ... ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా ఉందని, ఈ మంత్రులను ముందు కేబినెట్ నుంచి తొలగించి, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఇచ్చిన టికెట్లను క్యాన్సిల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బానిసత్వ పార్టీ ఎవరిదో అందరికీ తెలుసునని, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రి మహమూద్అలీలు ప్రగతిభవన్ వరకు వస్తే 100 కిలోమీటర్ల స్పీడ్తో వెనక్కు పంపింది ఎవరని ప్రశ్నించారు. ప్రగతిభవన్ లోపలికి రానివ్వకపోతే ఏడ్చానని రాజేందర్ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సర్పంచ్ కూడా ఆయనను సులువుగా కలవగలిగేవారని చెప్పారు. ఎన్నికల ఆలస్యంపై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యమవుతాయని, ఫిబ్రవరి వరకు తీసుకెళ్తారని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పద మని కోమటిరెడ్డి చెప్పారు. బీజేపీతో అమిత్షాతో భేటీ అయి కవితను జైలుకు పంపవద్దని ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇప్పుడు ఆయన ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయని చెప్పకపోతే తమకు తెలియదా? అని వ్యాఖ్యానించారు. -
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
చట్టసభల్లో నిరసనకు హద్దులుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో నిరసనలు తెలపడంలో తప్పు లేదని, అదే సమయంలో సభా గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాల్లోని లోపాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజా ప్రతినిధుల హక్కు అయినప్పటికీ, అవి భావోద్వేగాలకు దారి తీసి పరిమితులు దాటకూడదని హితవు పలికారు. చట్టసభల్లో కార్యకలాపాలకు తరచూ అంతరాయాలు కలుగుతుండటం, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితులు చోటు చేసుకోవడంపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలి స్మారకోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో అంతరాయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రణబ్ ముఖర్జీ లెగసీ ఫౌండేషన్ వర్చువల్ వేదికగా నిర్వహించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని, సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. చట్టసభల్లో అంతరాయాలతో జవాబుదారీతనం కొరవడి, ఏకపక్ష ధోరణి ఏర్పడే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ బుద్ధి కుశలత, అసాధారణ జ్ఞాపకశక్తి అనేక వివాదాస్పద అంశాలకు సమాధానాన్ని చూపిందన్న ఉపరాష్ట్రపతి, పన్ను సంస్కరణలను స్వయంగా ఆర్థికమంత్రిగా సేవలందించిన ప్రణబ్ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో నాగపూర్లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. శిక్షణా శిబిరంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, హుందాగా వ్యవహరించగల ప్రణబ్ వ్యక్తిత్వానికి ఇది ఉదాహరణ అన్నారు. జాతీయవాదం గురించి మాటల్లో చెప్పే వారికి, నిజమైన జాతీయవాదాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రణబ్ విశేష సేవలు: మోదీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దార్శనికతగల గొప్ప నేత అని ప్రధాని మోదీ శ్లాఘించారు. అత్యుత్తమ ప్రజాజీవితం, పరిపాలనా దక్షత, సునిశిత దృష్టి కలిగిన ఆయన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రథమ స్మారకోపన్యాసంలో ప్రధాని ఈ మేరకు పేర్కొన్నారు. అమోఘ ప్రజ్ఞాపాటవాలు కలిగిన ప్రణబ్ దేశాభివృద్ధికి గుర్తుంచుకోదగ్గ సేవలందించారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య విలువలను ఆయన పరిపుష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ఖలీదా జియా వర్చువల్గా ప్రసంగించారు. యువ ఎంపీగా బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పాటునందిం చారని ప్రణబ్ను కొనియాడారు. బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ 1971 జూన్లో రాజ్యసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తుకు తెచ్చుకున్నారు. భూటాన్ రాజు జింగ్మే కేసర్ నామ్గ్యాల్ వాంగ్చుక్ తన ఉపన్యాసంలో.. ప్రణబ్తో పలుమార్లు తాను భేటీ అయ్యాయని చెప్పారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాననీ, ఆయన లోటు తీర్చలేనిదని తెలిపారు. ప్రణబ్ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012–17 మధ్య కాలంలో పనిచేశారు. కాంగ్రెస్ నేత అయిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. -
కాంగ్రెస్కు షాక్.. టీఎంసీలోకి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
కోల్కతా: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. కోల్కతాలోని పార్టీ కార్యాలయంలో సోమవారం అభిజిత్ ముఖర్జీకి, టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయినవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో... ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు అభిజిత్ ముఖర్జీ. Warmly welcoming Shri @ABHIJIT_LS into the Trinamool family! We are certain that your contribution towards fulfilling @MamataOfficial's vision for a brighter Bengal shall be valued by all. pic.twitter.com/oSQgmfxVCR — All India Trinamool Congress (@AITCofficial) July 5, 2021 అయితే 2019లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ మొదలు పెట్టిన మతపరమైన హింసను మమతా బెనర్జీ సమర్థవంతంగా అదుపు చేశారని అభిజిత్ చెప్పారు. దేశమంతటా బీజేపీని కంట్రోల్ చేసే శక్తి ఆమెకు ఉందన్నారు. కాంగ్రెస్లో ప్రాథమిక సభ్యత్వం తప్ప తనకు ఎలాంటి పొజిషన్ లేదని... టీఎంసీలోనూ సాధారణ కార్యకర్తగానే చేరినట్టు అభిజిత్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు. అయితే అభిజిత్ ముఖర్జీ నిర్ణయంపై ఆయన సోదరి షర్మిష్ట స్పందిస్తూ.. విచారకరం అంటూ ట్వీట్ చేశారు. SAD!!! — Sharmistha Mukherjee (@Sharmistha_GK) July 5, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు చూసుకున్నారు అభిజిత్ ముఖర్జీ. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జట్టు కట్టడంపై అభిజిత్ ముఖర్జీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ ఓట్ల వాటా పెరిగి ఉండేదని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అభిజిత్ ముఖర్జీ పేర్కొన్నారు. -
ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ పార్లమెంట్లో తరచుగా మాట్లాడాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ‘ప్రెసిడెన్షియల్ ఈయర్స్ 2012– 2017’ పుస్తకంలో సూచించారు. ప్రణబ్ ముఖర్జీ చనిపోవడానికి ముందు చివరగా రాసిన ఈ పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది. పార్లమెంటులో విపక్ష సభ్యుల భిన్నాభిప్రాయాలను ప్రధాని వినాలని, తన అభిప్రాయాలను వివరించి, వారిని ఒప్పించాలని ఆ పుస్తకంలో ముఖర్జీ సూచించారు. ఏ ప్రధానైనా సరే.. సభలో ఉంటే చాలు, సభ నిర్వహణ వేరుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్పేయి, మన్మోహన్ సింగ్.. వీరంతా సభలో తమదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ తన పూర్వ ప్రధానుల నుంచి ఈ విషయంలో స్ఫూర్తి పొందాలి. స్పష్టమైన నాయకత్వాన్ని చూపాలి. తన అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు పార్లమెంటును వేదికగా వాడుకోవాలి’ అని సూచించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో స్వపక్ష, విపక్ష నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ క్లిష్ట సమస్యలను పరిష్కరించేవాడినని వివరించారు. సభ సజావుగా సాగడమే తన ప్రథమ లక్ష్యంగా ఉండేదన్నారు. దురదృష్టవశాత్తూ 2014–19 మధ్య ఎన్డీయే ప్రభుత్వంలో ఈ స్ఫూర్తి కొరవడిందన్నారు. అయితే, విపక్షం కూడా దారుణంగా, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించిందని విమర్శించారు. పార్లమెంట్లో గందరగోళం కొనసాగడం వల్ల ప్రభుత్వం కన్నా విపక్షమే ఎక్కువ నష్టపోతుందని తెలిపారు. దీన్ని సాకుగా చూపి సభా సమయాన్ని కుదించే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుందన్నారు. దేశం ప్రధాని పాలనపైననే ఆధారపడి ఉంటాయన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నుడై ఉండే పరిస్థితి మన్మోహన్ సింగ్దని, దాంతో ఆ ప్రభావం పాలనపై పడిందని ప్రణబ్ విశ్లేషించారు. ఆత్మకథలో సంచలన విషయాలు.. ‘ప్రధానమంత్రి నర్రేంద మోదీ, నవాజ్ షరీఫ్ వ్యక్తిగత కార్యక్రమం కోసం పాకిస్తాన్ వెళ్లాడరు. లాహోర్కు వెళ్లడం సరైన నిర్ణయం కాదు సర్జికల్ స్ట్రైక్ అనేది ఆర్మీ సాధారణంగా చేసే ప్రక్రియ మాత్రమే. నాకు అవకాశం ఇస్తే తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేవాడిని. తాను యూపీఏ-2లో ఆర్ధిక మంత్రిగా కొనసాగితే.. మమతా బెనర్జీ కూటమిలోనే కొనసాలా చేసేవాడిని. 2004లో నేను ప్రధానినైతే 2014లో...కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైన ఓటమి పాలయ్యేది కాదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. నేను రాష్ట్రపతిగా వెళ్లిన తరువాత... కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా అంశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. సోనియాగాంధీ పార్టీని నడపంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. మహారాష్ట్రలో సరైన నాయకులను కాకుండా ఇతరులపై పార్టీ ఆధారపడింది.’ అని తన ఆత్మకథ ‘ప్రెసిడెన్షియల్ ఈయర్స్ 2012– 2017లో పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని అంశాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
కొడుకుగా అది నా హక్కు: మాజీ ఎంపీ
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ప్రచురణ అంశంపై చెలరేగిన వివాదంపై ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ స్పందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే తాను ఆ బుక్ను పూర్తిగా చదివిన తర్వాతే పబ్లిష్ చేయాలని బుధవారం పునరుద్ఘాటించారు. ఈ మేరకు.. ‘‘కొందరు భావిస్తున్నట్లుగా, మా నాన్న చివరి జ్ఞాపకానికి సంబంధించిన అంశానికి నేనెంత మాత్రం వ్యతిరేకం కాదు. అయితే ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ గురించి తెలుసుకోవడం ఒక కొడుకుగా నాకున్న హక్కు. ఒకవేళ నాన్న బతికుండి ఉంటే, పుస్తకం పూర్తైన తర్వాత ఆయన కూడా ఇదే చేసేవారు. ఫైనల్ అవుట్పుట్ చూసేవారు. గతంలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా నేను అదే చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నా. నేను ఆ పుస్తకం చదివేంత వరకు ప్రచురణ ఆపేయండి. చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడవద్దు’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పేరిట ప్రణబ్ ముఖర్జీ రాసిన రూపా పబ్లికేషన్స్ విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్పై చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి. ఈ క్రమంలో జనవరిలో బుక్ను రిలీజ్ చేయనున్నట్లు పబ్లికేషన్స్ ప్రకటించగా.. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా అభిజిత్ ముఖర్జీ వెల్లడించగా, ఆయన సోదరి శర్మిష్ట మాత్రం చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అక్కాతమ్ముళ్ల తలెత్తిన భేదాభిప్రాయాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఈ మేరకు స్పందించడం గమనార్హం.(చదవండి: ప్రణబ్ పుస్తకం.. ఇంట్లోనే వైరం) 1/2 Contrary to the opinion of some , I am not against the publishing of my father's Memoir but I have requested D publisher to allow me to go through it's contents before final roll out & I believe my request is quite legitimate & within my rights as his Son . — Abhijit Mukherjee (@ABHIJIT_LS) December 16, 2020 -
ప్రణబ్ పుస్తకం.. ఇంట్లోనే వైరం
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ఆయన ఇంట్లోనే విభేదాలకు దారి తీసింది. ఆ పుస్తకాన్ని తన అనుమతి లేకుండా ప్రచురించ కూడదని కుమారుడు అభిజిత్ ముఖర్జీ చెబుతూ ఉంటే, పుస్తకం విడుదలకు అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని ఆయన సోదరి శర్మిష్ట ముఖర్జీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు పొందిన ప్రణబ్ ముఖర్జీ రాసిన ఈ చివరి పుస్తకంలో ఆయన సోనియాగాంధీ పైనా, మన్మోహన్ సింగ్పైనా చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి. తాను రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని చెబుతూ తనకు తెలిసిన ఇన్సైడ్ సమాచారాన్ని ప్రణబ్ ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం అక్కా తమ్ముళ్ల మధ్య విభేదాలకు దారి తీయడం చర్చనీ యాంశంగా మారింది. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. దీనిపై అభిజిత్ సోదరి శర్మిష్ట తీవ్రంగా ప్రతిస్పందించారు. చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్ చేశారు. -
ప్రణబ్ ముఖర్జీకి లోక్సభ నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్ సేవలను సభ కొనియాడింది. ఏ పదవిలో ఉన్నా ప్రణబ్ ముఖర్జీ ఆ పదవికి వన్నె తెచ్చారని స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. ఇటీవల మృతి చెందిన తమిళనాడు ఎంపీ వసంత్కుమార్, పండిత్ జస్రాజ్, అజిత్ జోగి, చేతన్ చౌహాన్ తదితరులకు సభ సంతాపం తెలిపింది. అలాగే కరోనాతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన కరోనా యోధులకు కూడా పార్లమెంట్ నివాళి అర్పిచింది. అనంతరం సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్ –19 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్–19 నెగెటివ్ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, లోక్సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. ఇక విజృంభిస్తున్న కరోనా, కుదేలైన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలు.. తదితర వైఫల్యాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం సిద్ధమవుతోంది. చైనా ఆక్రమణలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఆక్రమణలపై సభలో చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరీ, కే సురేశ్లు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు మావన హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అంశంపై సీపీఎం, నీట్ నిర్వహణను వ్యతిరేకిస్తూ, అలాగే 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే, సీపీఎం.. లోక్సభలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. -
కర్మయోగి.. అజాత శత్రువు
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధిలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రణబ్ మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకున్ని కోల్పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో ప్రణబ్ నిలిచిపోయారని కొనియాడారు. సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సూచన మేరకు సీఎం కేసీఆర్.. ప్రణబ్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రణబ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సీఎం మాట్లాడుతూ, ‘ప్రణబ్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన కర్మయోగి ప్రణబ్. 1970 తర్వాత దేశ అభివృద్ధిలో ఆయన లేని పేజీ ఉండదంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో ఎదిగారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయ్యాక పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధనలో ఆయనది అమోఘమైనపాత్ర. మిత్రపక్షాలను కలుపుకొనిపోవడంలో కుడిఎడమలను సమన్వయం చేసిన సవ్యసాచిలా మన్ననలు పొందారు. పార్లమెంట్ విలువలకు నిలువెత్తు ప్రతీక’అని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ప్రణబ్.. తెలంగాణతో ప్రణబ్కు ఉన్న సంబంధాన్ని సీఎం గుర్తు చేశారు. ‘రాష్ట్ర ఏర్పాటుపై పార్టీల అభిప్రాయ సేకరణకు నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా, ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారానికై అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా, రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు’అని సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులేశారు: భట్టి ‘ప్రణబ్ దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశంలో ఉత్పన్నమైన అనేక సమస్యలను ట్రబుల్ షూటర్గా పరిష్కరించేవారు. లోక్సభ, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారు.తెలంగాణ సాధనకు మార్గదర్శనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, దేశానికి విశేష సేవలు అందించినందుకు గర్విస్తున్నాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొ న్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తదితరులు ప్రణబ్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుధీర్రెడ్డి మాట్లాడి సంతాప తీర్మానాలను బలపరిచారు. అనం తరం ప్రణబ్ సేవలను స్పీకర్ పోచారం గుర్తు చేశారు. సభ ప్రణబ్ ముఖర్జీ మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపింది. 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర శాసనమండలి నివాళులర్పించింది. సమావేశాలు ప్రారంభమైన అనం తరం సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి ప్రణబ్కు శ్రద్ధాంజలి ఘటించారు. -
ప్రియనేతకు తుదివీడ్కోలు
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరుల అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులు, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ఆయనకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికారు. లోధి రోడ్లోని విద్యుత్ దహన వాటికలో మంగళవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాల మధ్య ప్రణబ్ ముఖర్జీకి ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ఇతరులు పీపీఈ కిట్స్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతికి ఆర్మీ దళం గన్ సెల్యూట్తో గౌరవ వందనం సమర్పించింది. అంతకుముందు ప్రణబ్ మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో త్రివర్ణ పతాకం కప్పి దహనవాటికకు తీసుకువచ్చారు. పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న అదే ఆసుపత్రిలో ప్రణబ్కు వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్స సైతం నిర్వహించారు. అదే సమయంలో ఆయనకు కరోనా కూడా సోకింది. భారత రత్న పురస్కార గ్రహీత అయిన ప్రణబ్ మృతికి సంతాప సూచకంగా కేంద్రం సోమవారం నుంచి 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖుల నివాళి ప్రణబ్ నివాసంలో ఆయన భౌతిక కాయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్వీర్ సింగ్ (నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా (ఎయిర్ఫోర్స్), సీనియర్ కాంగ్రెస్ నేతలు, పార్టీలకతీతంగా సీనియర్ నేతలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాజీ ప్రధాని, చిరకాల సహచరుడు మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తదితరులు ప్రణబ్కు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రణబ్ నివాసంలోని ఒక గదిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా, ప్రముఖుల సందర్శనార్థం మరో గదిలో ఏర్పాటు చేసిన ప్రణబ్ చిత్రపటానికి నాయకులు పుష్పాంజలి సమర్పించారు. ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు రాజాజీ మార్గ్లోని ప్రణబ్ నివాసానికి తరలివచ్చారు. వారంతా క్రమశిక్షణతో అభిమాన నేతకు అశ్రు నివాళి అర్పించారు. కొందరు అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ముఖాన్ని కప్పి ఉంచే ఫేస్ షీల్డ్ను సైతం ధరించారు. కోవిడ్ ముప్పు నేపథ్యంలో అంతిమయాత్రకు అధికారికంగా ఉపయోగించే వాహనంలో కాకుండా, మరో వాహనంలో ప్రణబ్ భౌతిక కాయాన్ని లోధి రోడ్లోని శ్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్స్ ధరించిన సిబ్బంది మృతదేహాన్ని వాహనంలోకి చేర్చారు. ప్రణబ్ చిత్రపటం వద్ద పుష్పాలతో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వగృహంలో మ్యూజియం పశ్చిమబెంగాల్లోని జంగీపూర్లో ఉన్న తమ స్వగృహంలో ఒక అంతస్తును తమ తండ్రి జ్ఞాపికలతో ఒక మ్యూజియంగా రూపొందిస్తామని, ఒక గ్రం«థాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి స్మృత్యర్థం ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్ను విడుదల చేయాలని అభిజిత్ కోరారు. తన తండ్రి కోసం ఆగస్టు 4న జంగీపూర్లోని తమ వ్యవసాయ క్షేత్రం నుంచి ఒక పనస పండును తీసుకువచ్చానని గుర్తు చేసుకున్నారు. ‘అవి ఇక్కడ కూడా లభిస్తాయి. కానీ మా సొంత క్షేత్రం నుంచి ఆయన కోసం తీసుకురావాలనిపించింది. ఆయన ఆ పండును సంతోషంగా స్వీకరించారు. అప్పుడు అదృష్టవశాత్తూ ఆయన షుగర్ లెవల్స్ కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ఆయన కోరికను తీర్చినందుకు చాలా సంతోషించాను’అని గద్గద స్వరంతో పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో కావచ్చు, జీవితంలో కావచ్చు.. ఎప్పుడు కూడా కక్షపూరితంగా ఉండవద్దు’అని తన తండ్రి పలుమార్లు తనతో చెప్పారన్నారు. ప్రణబ్కు శాయశక్తులా చికిత్స అందించిన వైద్యులకు అభిజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ లోకంలో ఆయన పోషించాల్సిన పాత్ర ముగిసిందనుకుంటా. ఒక సాధారణ వ్యక్తి కోరుకునే అన్నింటినీ ఆయన పొందారు’అని వ్యాఖ్యానించారు. చైనా, యూఎస్ల్లో.. పశ్చిమబెంగాల్లోని ప్రణబ్ స్వగ్రామం మిరాటీలో గ్రామస్తులు ప్రియతమ నేతకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ‘దాదాపు ప్రతీ దుర్గాపూజ ఉత్సవానికి కచ్చితంగా స్వగ్రామానికి వచ్చేలా ప్రణబ్ ప్రయత్నించేవారు. ఆయన లేకుండా దుర్గాపూజ ఉత్సవం ఎప్పటిలా ఎన్నటికీ జరగబోదు’అని గ్రామంలోని ఆలయ పూజారి బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనా విదేశాంగ కార్యాలయం ప్రణబ్ చిత్రపటానికి నివాళులర్పించింది. అమెరికా, భారత్ కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ప్రణబ్ విశేష కృషి చేశారని అమెరికా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తెలిపారు. గొప్ప నేతను దేశం కోల్పోయింది ప్రణబ్ ముఖర్జీ మృతికి మంగళవారం కేంద్ర కేబినెట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఒక గొప్ప నాయకుడిని, అద్భుతమైన పార్లమెంటేరియన్ను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించింది. ‘పాలనలో అనితరసాధ్యమైన అనుభవం ఉన్న నేత. దేశ విదేశాంగ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక మంత్రిగా గొప్ప సేవలందించారు’అని కేబినెట్ ఒక తీర్మానంలో ప్రశంసించింది. జాతిజీవనంపై తనదైన ముద్రను వదిలివెళ్లారని, ఆయన మృతితో శిఖరాయమాన దార్శనిక నేతను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి ప్రణబ్ అందించిన సేవలను భారతీయులు తరతరాలు గుర్తుంచుకుంటారని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ప్రణబ్ నివాసం వద్ద సెల్యూట్ చేస్తున్న సైనిక జవాన్లు -
కనెక్ట్ అయ్యారు
ప్రణబ్ హిందీ సినిమాలు చూడరు... ‘పీకూ’ చిత్రం మాత్రం ఇష్టంగా చూశారు. దీపికలో కూతుర్ని చూసుకున్నారు. అసలు ఆయన జీవితంలోని ప్రతి దశా.. ఒక స్త్రీమూర్తితో కనెక్ట్ అయి ఉన్నదే. అమ్మ రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ.. భార్య సువ్రా, కూతురు శర్మిష్ట.. రాజకీయాల్లో శ్రీమతి ఇందిరాగాంధీ.. ప్రణబ్ని నడిపించారు.. మహిళా సాధికారవాదిగా మలిచారు. ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది అనేవారు ప్రణబ్ ముఖర్జీ. ఆయనే అంటుండే ఇంకో మాట.. మహిళలు రాజకీయాల్లో వస్తే ఆ వెలుగులో సమాజం అభివృద్ధి అక్షరాలు దిద్దుకుంటుందని. ఇకనమిక్స్ పండిట్ ఆయన. మాటలు మరీ ఇంత సుకుమారంగా ఉండవు. ఉద్దేశం మాత్రం స్త్రీలకు.. నడిపించే సామర్థ్యం ఉందనే. ఎలా తెలుసు? ఆయనా ఒక మహిళ చూపిన దారిలోనే నడిచారు కనుక. ఒక మహిళ కాదు.. కొంతమంది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రణబ్కు దారి చూపిన మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. చాలా నేర్పించారు ఆమె ఈయనకు. ఒక్క ఇంగ్లిష్, హిందీ మాత్రం నేర్పించలేకపోయారు. అవి రెండూ ప్రణబ్కు రావని కాదు. వినసొంపుగా మాట్లాడ్డం సాధన చేయమనేవారు. ముఖ్యంగా ఇంగ్లిష్ను! ‘ఉచ్చారణను ఇంప్రూవ్ చేసుకోవయ్యా..’ అని ఆమె అంటే.. ‘సర్కిల్ నుంచి స్క్వేర్ను తయారు చేయాలని ప్రయత్నించకండి మేడమ్’ అని ఈయన నవ్వేవారు. ఇక పార్లమెంట్ చర్చా సమావేశాల్లోనైతే కొన్నిసార్లు శ్రీమతి గాంధీనే ప్రణబ్ మీదుగా గట్టెక్కేవాళ్లు. 1983లో లోక్సభలో చరణ్సింగ్ ఏవో కాగితాలు గాల్లోకి ఝుళిపిస్తూ.. ‘చూడండి. బడ్జెట్ ప్రసంగ పత్రాలివి. ప్రసంగానికంటే ముందు ఐ.ఎం.ఎఫ్.కి లీక్ అయ్యాయి’ అని ‘ఉమామహేశ్వరస్య ఉగ్రరూపస్య’ అయ్యాడు. శ్రీమతి గాంధీ ప్రధాని. అదెలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఆర్థికమంత్రి ప్రణబ్ కోసం చూశారు. చరణ్కి సమాధానం ఇవ్వాలి కదా. ఆ సమయంలో ప్రణబ్ రాజ్యసభలో ఉన్నారు. వెంటనే పిలిపించారు. ఆయన వచ్చేసరికి కూడా చరణ్ ఆగ్రహంతో ఊగిపోతూనే ఉన్నారు. ఆయన్ని మరికొంత సేపు మాట్లాడనిచ్చి.. అప్పుడు చెప్పారు ప్రణబ్.. ‘డేటు చూడండి. అవి గత ఏడాది నేను సమర్పించిన బడ్జెట్ ప్రసంగ పత్రాలు’అని! కాంగ్రెస్ బెంచీలు భళ్లున నవ్వాయి. శ్రీమతి గాంధీకి గొప్ప ఉపశమనం లభించింది. ప్రణబ్ ముఖర్జీ.. శ్రీమతి గాంధీకి సహచరులు మాత్రమే కాదు. సన్నిహితులు కూడా. కోపం వస్తే తిట్టేంత చనువుంది ఆమెకు. 1980 లోక్సభ ఎన్నికల్లో ఆమె వద్దంటున్నా కూడా పోటీ చేశారు ప్రణబ్. ఘోరంగా ఓడిపోయారు. శ్రీమతి గాంధీకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే కోల్కతా ఫోన్ చేశారు. ‘నువ్వు ఓడిపోతావని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆఖరికి గీతకు కూడా. కానీ నువ్వు వినలేదు. నాకు చిక్కులు తెచ్చిపెట్టావు’ అన్నారు. (ప్రణబ్ భార్య సువ్రా. శ్రీమతి గాంధీ, మరికొందరు స్నేహితులు ఆమెను గీత అని పిలిచేవారు). ప్రణబ్ మౌనంగా ఉన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనకు ఇంకో కాల్ వచ్చింది. సంజయ్ గాంధీ! ‘‘మమ్మీ.. మీ మీద చాలా కోపంగా ఉన్నారు. గురుతుల్యులు శ్రీమతి గాంధీ మీరు లేకుండా కేబినెట్ ఏమిటి అని కూడా అంటున్నారు. విమానంలో రేపటి కల్లా ఢిల్లీలో ఉండండి’’ అని చెప్పారు సంజయ్. ప్రణబ్ మీద శ్రీమతి గాంధీ నమ్మకం అంతటిది! ఆమె పట్ల ప్రణబ్ గమనింపు కూడా అంతలానే ఉండేది. బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ మొదటిసారి కలిసినప్పుడు శ్రీమతి గాంధీ ఏం తిన్నారో కూడా ఆయనకు గుర్తుంటుంది. రెస్పెక్ట్ విత్ కేరింగ్ అనుకోవాలి. భార్య సహా ప్రతి మహిళను ఆయన గౌరవంగా చూస్తారు. సఫ్దర్జంగ్ రోడ్డులో ప్రధాని వాజపేయి, ప్రణబ్ ముఖర్జీ ఇరుగు పొరుగుగా ఉన్నప్పుడు వాజపేయి దత్తపుత్రిక నమిత పెళ్లి కుదిరింది. పెళ్లి పనులన్నీ వాజపేయి అభ్యర్థనపై ప్రణబ్ భార్యే దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఆ పనుల్లో భార్యకు సహాయంగా ఉన్నారు ప్రణబ్! ప్రణబ్ తన జీవితంలో తొలిసారి చూసిన హిందీ సినిమా ‘రంగ్ దే బసంతి’. అది కూడా ఆయన చూడాలన్న ఆసక్తి కొద్దీ ఏం చూడలేదు. సెన్సార్ బోర్డు చీఫ్ షర్మిల ఠాగోర్ వచ్చి అడిగితే బలవంతంగా సరేనన్నారు. ఆమె ఎందుకు చూడమని అడిగారంటే.. అందులో భారత రక్షణ శాఖ మంత్రిపై ప్రతీకారం తీర్చుకునే కథాపరమైన అనివార్యత ఏదో ఉంది. ముందే చూపిస్తే తర్వాత తిట్లు పడవు కదా అని షర్మిల ఆలోచన. అప్పుడు మన రక్షణ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీనే. సినిమాను మహదేవ్ రోడ్డులోని ఓ థియేటర్లో ఆయన కోసం ప్రదర్శించి చూపించారు. సినిమా మధ్యలోనే బయటికి వచ్చేశారు ప్రణబ్. షర్మిల బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారు. ప్రణబ్ ఆమె వైపు చూసి, ‘దేశాన్ని కాపాడ్డం నా పని. సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కాదు’ అని నిష్క్రమించారు. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు షర్మిల. ‘రంగ్ దే బసంతి’ తర్వాత బహుశా ప్రణబ్ చూసిన రెండో హిందీ సినిమా ‘పీకూ’ అయుండొచ్చు. రాష్ట్రపతి భవన్లో వేసిన షోలో అడ్వాణీ తో కలిసి ఆ సినిమా చూశారు. వృద్ధుడైన తండ్రి, ఆయన కూతురు మధ్య ఉండే అనుబంధం ఆ సినిమా. నాయకులిద్దరూ కనెక్ట్ అయ్యారు. ఇద్దరికీ కూతుళ్లున్నారు మరి. ఒక విధంగా ప్రణబ్ది మహిళల వల్ల రూపు దిద్దుకున్న జీవితం. ఇంట్లో.. తల్లి రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ, భార్య సువ్రా, కూతురు శర్మిష్ట, రాజకీయాల్లో శ్రీమతి గాంధీ. అందుకే కావచ్చు ఆయనలో ఒక మహిళా సంక్షేమ, సాధికార, హక్కుల పరిరక్షణ యోధుడు కనిపిస్తాడు. భారత సైన్యంలో యుద్ధ విధుల్లోకి మహిళల ప్రవేశం ఆయన చొరవ కారణంగానే సాధ్యమయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గట్టి మద్దతు ఇచ్చిన వారిలో ఆయన ప్రథములు. మహిళల కోసం చట్టాలు చేసి ఊరుకుంటే సరిపోదని, చిత్తశుద్ధితో వాటిని అమలు పరచాలని ఆయన అంటుండేవారు. రాష్ట్రపతిగా 2012–17 మధ్య, ఇతర హోదాలలో అంతకుముందు, ఆ తర్వాత మహిళాభ్యున్నతికి, అభివృద్ధికి అనేక ప్రయత్నాలు చేశారు. సూచనలు ఇస్తూ వచ్చారు. చివరిసారి ఆయన మహిళల గురించి మాట్లాడింది.. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో జరిగిన ‘బేటీ పఢావో అభియాన్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా. ‘ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది’ అని అక్కడే ఆయన మరోసారి జాతి ప్రజలకు గుర్తు చేశారు. కూతురు శర్మిష్ఠ -
ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
-
అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
సాక్షి, విజయవాడ: పట్టణంలో పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజనలో 2.20 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 90 శాతం సంక్షేమ పథకాలను ఆయన ప్రజల వద్దకే తీసుకువచ్చారన్నారని ఆయన తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుని జూమ్ ద్వారా కులాలను, మతాలను రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇకనైన కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని, ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. -
ప్రణబ్కు నివాళులు అర్పించిన ప్రముఖులు
-
విడిది.. విశిష్ట అతిథి
సాక్షి, హైదరాబాద్: ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో దక్షిణాది విడిది అయిన బొల్లారంలోని ఆర్పీ భవనాన్ని నాలుగుసార్లు సందర్శించారు. 2012లో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది డిసెంబర్ నెలాఖరులో హైదరాబాద్లోని రాష్ట్రపతి భవన్కు శీతాకాల విడిదికి వచ్చారు. 2013 నూతన సంవత్సర వేడుకలను ఆయన ఇక్కడే జరుపుకొన్నారు. తిరిగి 2013 డిసెంబర్లోనూ ఇక్కడకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో మాత్రం ఆయన శీతాకాల విడిదికి హైదరాబాద్కు రాలేదు. మరుసటి ఏడాది డిసెంబర్కు బదులు జూలైలోనే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. ఆ ఏడాది కేవలం మూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. చివరిసారిగా 2016 డిసెంబర్లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. నక్షత్రవాటిక, దానిమ్మ తోటల ఏర్పాటు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్లోని నక్షత్ర వాటిక మాదిరిగానే, బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ నక్షత్ర వాటిక ఏర్పాటు చేయించారు. ఇందులో 27 నక్షత్రాలు (రాశులు) ప్రతిబింబించేలా 27 రకాల మొక్కలు ఏర్పాటు చేశారు. 99 ఎకరాల సువిశాల రాష్ట్రపతి నిలయంలో సగానికిపైగా స్థలం వృథాగానే ఉండేది. ఈ నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చిన ఆయన ఖాళీ స్థలాల్లో పండ్ల తోటలు, పూలమొక్కలు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్పటికే ఉన్న మామిడి, ఉసిరి, సపోటా తోటలకు అదనంగా దానిమ్మ తోటను ఏర్పాటు చేశారు. నేనున్నానంటూ భరోసానిచ్చారు: పీవీ వాణిదేవి సాక్షి, సిటీబ్యూరో: ‘నాన్న పీవీతో ప్రణబ్ ముఖర్జీది సుదీర్ఘ బంధం. నాన్న మరణం తర్వాత ఆయన మా కుటుంబానికి నేనున్నానన్న భరోసానిచ్చారు. కొన్ని సందర్భాల్లో పార్టీ పట్టించుకోకున్నా.. ఆయన మా కుటుంబానికి అండగా నిలిచారు. ప్రణబ్ మరణం దేశానికి తీరనిలోటు’ అని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు పీవీ వాణీదేవి అన్నారు. ప్రణబ్ మరణంపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 2012 డిసెంబరులో తొలిసారిగా పీవీ నర్సింహారావు స్మారక ఉపన్యాసాన్ని ప్రణబ్ ముఖర్జీయే ఇచ్చారని, ఆ రోజు తమ కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఫొటోలు తీయించారని వాణీదేవి గతాన్ని జ్ఞాపకం చేశారు. ప్రణబ్కు సీజీఆర్, గ్రేస్ నివాళి లక్డీకాపూల్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్), తూర్పు కనుమల పరిరక్షణ వేదిక (గ్రేస్) ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆయన మరణంతో దేశం పర్యావరణం పట్ల ఎంతో జ్ఞానం, స్పృహ కలిగిన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని అభిప్రాయపడింది. అర్ధ శతాబ్దానానికిపైగా వివిధ రూపాల్లో, హోదాల్లో ఆయన దేశానికి అందించిన సేవలు అనితర సాధ్యం, చిరస్మరణీయం అని పేర్కొంది. ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డి, లీలా లక్ష్మారెడ్డి (సీజీఆర్), దిలీప్రెడ్డి (గ్రేస్) ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు. -
ప్రణబ్కు ప్రముఖుల నివాళి
‘‘ప్రణబ్ ముఖర్జీ ఒక దిగ్గజం. మాతృదేశానికి యోగిలాగా సేవ చేశారు. భరతమాత ప్రియతమ పుత్రుడి మరణానికి దేశమంతా దుఃఖిస్తోంది. ఆధునికతను, సాంప్రదాయంతో మేళవించిన మనీషి భారత రత్న ప్రణబ్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’’ – రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ‘‘దేశం ఒక పెద్దమనిషిని కోల్పోయింది. కష్టించే గుణం, క్రమశిక్షణ, అంకితభావంతో ఆయన కిందిస్థాయి నుంచి దేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్ధాయికి ఎదిగారు. సుదీర్ఘ ప్రజాసేవలో ఆయన నిర్వహించిన ప్రతిపనికీ గౌరవం తెచ్చారు. ఓం శాంతి.’’ – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘‘2014లో ఢిల్లీకి నేను వచ్చినప్పటినుంచి ప్రణబ్ దార్శనికత, ఆయన ఆశీస్సులు నాకు మద్దతుగా నిలిచాయి. ఆయనతో అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రపతి భవన్ను వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంస్కృతిక కేంద్రంగా ఆయన మార్చారు. కీలక విధాన నిర్ణయాల్లో ఆయన సలహాలను ఎన్నటికీ మరువలేను. దేశ అభివృద్ధి పథంలో ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన్ని అన్ని రాజకీయ పక్షాలు గౌరవించేవి. సమాజంలో అన్ని వర్గాల అభిమానం చూరగొన్న వ్యక్తి భారతరత్న ప్రణబ్’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ప్రణబ్ చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. అన్ని రాజకీయ పక్షాలనేతలతో సుహృద్భావనతో మెలిగేవారు. అంకితభావంతో దేశానికి సేవ చేశారు. ఐదుదశాబ్దాలుగా అటు దేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ పయనంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన లేని లోటు తీర్చలేదని, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి.’’ – కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ‘‘ప్రణబ్ లేరన్న వార్త తీవ్ర విచారం కలిగించింది. ఆయన మరణంతో స్వతంత్ర భారతావనికి చెందిన ఒక గొప్పనాయకుడిని దేశం కోల్పోయింది. ఆయనతో కలిసి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన మేధస్సు, విజ్ఞానం, వివిధ ప్రజా విషయాలపై ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను.’’ – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘‘ప్రణబ్ ముఖర్జీ మృతి తీవ్ర వేదన కలిగిస్తోంది. అంకిత భావంతో దేశానికి సేవ చేసిన అనుభవజ్ఞుడు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణం దేశానికే గర్వకారణం. దేశ రాజకీయ యవనికపై ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓం శాంతి.’’ – హోం మంత్రి అమిత్షా ‘‘ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం బాధాకరం. దేశానికి ఆయన అనేక రూపాల్లో అంకితభావంతో సేవలనందించారు. అన్నిపార్టీలు ఆయన మేధస్సును గౌరవించేవి.’’ – బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘‘ ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్తతో దేశం తీవ్రవేదన చెందింది. దేశప్రజలతో పాటు ఆయనకు నా నివాళి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ – కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ‘‘ దేశప్రయోజనాలకే ప్రణబ్ పెద్దపీట వేసేవారు. రాజకీయ అస్పృశ్యతను ఆయన దరిచేరనీయలేదు. ఆర్ఎస్ఎస్కు ఆయన ఒక మార్గదర్శి. సంఘ్కు ఆయన లేని లోటు పూడ్చలేనిది.’’ – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘ ప్రణబ్ ముఖర్జీ ఒక పరిపూర్ణ పెద్దమనిషి. ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన మృతికి నా నివాళి.’’ – లతా మంగేష్కర్ ‘‘ భారత్ ఒక దిగ్గజ రాజకీయవేత్తను, గౌరవనీయుడైన నాయకుడిని కోల్పోయింది.’’ – అజయ్దేవగన్ ‘‘దశాబ్దాలుగా ప్రణబ్ దేశానికి సేవలనందించారు.ఆయన మృతి తీవ్ర విచారకరం.’’ – సచిన్ టెండూల్కర్ ‘‘ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి.’’ – విరాట్కోహ్లీ -
రాష్ట్రపతిగా ప్రణబనాదం
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలు మరపురానివి. మరువలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా, ఉత్తేజంగా రాష్ట్రపతిగా ప్రణబ్ ఉరిమే ఉత్సాహంతో పనిచేశారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత ఇంచుమించుగా అంతటి పేరు తెచ్చుకొని రాష్ట్రపతి భవన్కు పునరుజ్జీవనం తీసుకువచ్చారు. 2012–2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఇ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికంగా నిర్వహించారు. కేంద్రం అడుగులకి మడుగులు ఒత్తకుండా అన్నివైపుల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి కీలక శాఖలు నిర్వహించిన అనుభవం రాష్ట్రపతిగా ఆయన తీసుకునే నిర్ణయాలకు బాగా పనికివచ్చింది. తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆచితూచి అడుగులు పార్లమెంటు ఆమోదించిన బిల్లులు సంతకం కోసం రాష్టపతి దగ్గరకి వస్తే ఆయన వెంటనే ఆమోదించేవారు కాదు. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, నష్టాలేంటి అన్న అంశాలన్నీ నిశితంగా పరిశీలించేవారు. భూసేకరణ, పునరావాస చట్టంపై బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వివిధ అంశాలపై ఆర్డినెన్స్లు ఎక్కువగా తీసుకువస్తోందని దాదా ఆగ్రహించారు. ప్రజలకు చేరువగా భారతీయ చారిత్రక వైభవాన్ని, వారసత్వ సంపదని కాపాడుతూనే రాష్ట్రపతి భవన్ను ప్రజలకి చేరువ కావడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం ద్వారా రచయితలు, కళాకారులు, సృజనాత్మకత ఉన్నవారికి రాష్ట్రపతి భవన్ తలుపులు బార్లా తెరిచారు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న వారు రాష్ట్రపతి భవన్లో ఉంటూ ప్రాజెక్టులు నిర్వహించే సదుపాయం కల్పించారు. రాష్ట్రపతి భవన్కు ఎక్కువ మంది అతిథులు వచ్చేలా చర్యలు చేపట్టారు. క్షమాభిక్ష పిటిషన్లు ఉరిశిక్ష పడిన వారు దరఖాస్తు చేసుకునే క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఖాతాలో ఎక్కువగా తిరస్కరణలే ఉన్నాయి. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు పర్యాటక ప్రాంతంగా.. భారత్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రాష్ట్రపతి భవన్ను నిలపడానికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేశారు. రాష్ట్రపతి భవన్, మొఘల్ గార్డెన్స్, మ్యూజియం సందర్శించడానికి ప్రజలకు అనుమతులు ఇచ్చారు. ప్రణబ్ హయాంలో భారీగా ప్రజలు రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. 2017లో జరిగిన ఉద్యానోత్సవ్కి 7 లక్షల మంది వరకు హాజరవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’ ప్రణబ్ ముఖర్జీ హయాంలోనే రాష్ట్రపతి భవన్ మొదటిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టింది. 2014 జూలై 1న ట్విట్టర్లో అకౌంట్ ప్రారంభించి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ విరమణ చేసినప్పుడు 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజల మనిషి అయిన ప్రణబ్ ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’పేరును వాడారు. కొత్త మ్యూజియం రాష్ట్రపతి భవన్లో గుర్రపు శాలలు ఉండే ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఇందులో మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ఫొటోలను ఉంచారు. పురాతన ఆయుధాలు, ఫర్నీచర్ కూడా ఈ మ్యూజియంలో కనువిందు చేస్తాయి. -
బహుముఖ ప్రజ్ఞాశాలి... ప్రణబ్దా!
న్యూఢిల్లీ: బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ. దాదాపు 5 దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితం ఆయన సొంతం. చివరగా, అత్యున్నత రాజ్యాంగ పదవి ఆయన రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు విధులు నిర్వర్తించారు. అన్ని పార్టీలకు ఆమోదనీయ నేతగా ఆయన ఆ పదవి చేపట్టారు. 2019లో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’పొందారు. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రణబ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు గాంచారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు.. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేతగా, కుడి భుజంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ, రక్షణ, ఆర్థిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సంస్కరణల అమలుకు సాయమందించారు. తండ్రి సమరయోధుడు 1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. 1952–64 మధ్య పశ్చిమబెంగాల్ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యుడిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్గా కొంతకాలం పనిచేశారు. 1969 నుంచి అప్రతిహతంగా.. 1969లో ప్రణబ్ ముఖర్జీ క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సమయంలో జరిగిన మిడ్నాపుర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్ విజయంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యా న్ని కాంగ్రెస్ నాయకురాలు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గుర్తించి, పార్టీలో చేర్చుకున్నారు. 1969 జూలైలో రాజ్యసభకు పంపించారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై, పలుమార్లు సభా నాయకుడిగా విశేష సేవలందించారు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఆశీస్సులు, తన సామర్ధ్యంతో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ను ఆర్బీఐ గవర్నర్గా నియమించింది ప్రణబ్ ముఖర్జీనే కావడం విశేషం. 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రణబ్ ప్రఖ్యాతి గాంచారు. అయితే, ఇందిరాగాంధీ హత్య అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీలో, ప్రభుత్వంలో ప్రణబ్ను పక్కనపెట్టడం ప్రారంభమైంది. చివరకు, ఆయనను పశ్చిమబెంగాల్ పీసీసీ వ్యవహారాలు చూసుకొమ్మని కలకత్తాకు పంపించేశారు. ► ప్రణబ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు. ► దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి. ► ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్ను ప్రదానం చేశాయి. కుటుంబం ప్రణబ్కు మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద రు కుమారులు... ఇంద్రజిత్, అభిజిత్. కూతు రు షర్మిష్ట. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం లో షర్మిష్ట కీలకమైన సందర్భాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు. ప్రణబ్ అర్ధాంగి సువ్ర ముఖర్జీ 2015లో మరణించారు. 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అపారమైన జ్ఞాపకశక్తి, లోతైన విషయపరిజ్ఞానం, సమకాలీన అంశాలపై విస్తృత అవగాహన, పదునైన మేధోశక్తి... ప్రణబ్ను విశిష్టమైన రాజకీయవేత్తగా నిలిపాయి. 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింçహారావు, మన్మోహన్ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు. ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత. 1980–85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు. 2004–2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు. విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించడంలో దిట్ట. పార్టీలకతీతంగాఅందరి విశ్వాసం చూరగొన్నారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్కు స్వాతంత్య్రానంతర దేశ రాజకీయ చరిత్ర, పాలనా వ్యవహారాలు కొట్టినపిండి. దీంతో దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు. 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్– అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సహ చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, ఆధార్, మెట్రో రైలు ప్రాజెక్టులు లాంటి మన్మోహన్ సర్కారు నిర్ణయాల్లో ఆయనది ముఖ్యభూమిక. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ఏడాది తర్వాత జూన్, 2018లో నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంచలనం సృష్టించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ప్రణబ్ముఖర్జీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ప్రధాని కాలేకపోయారు 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1987లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రణబ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. రాజీవ్గాంధీతో సయోధ్య అనంతరం 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్లో విలీనం చేశారు. 1991లో రాజీవ్ హత్య తరువాత కేంద్ర రాజకీయాల్లో మళ్లీ ప్రణబ్ క్రియాశీలకం అయ్యారు. ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆ తరువాత కీలకమైన విదేశాంగ శాఖ అప్పగించారు. సోనియా రాజకీయాల్లోకి రావడానికి ప్రణబ్ వ్యూహమే కారణమని భావిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా స్వీకరించిన తరువాత, ప్రణబ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా నిరాకరించిన సమయంలో ప్రధానిగా అనుభవజ్ఞుడైన ప్రణబ్ పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ అనూహ్యంగా మన్మోహన్ ప్రధాని అయ్యారు. మన్మోహన్ కేబినెట్లోనూ ప్రణబ్ కీలకంగా ఉన్నారు. 2007లోనే ప్రణబ్ను రాష్ట్రపతిని చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ కేబినెట్లో ఆయన సేవలు అవసరమని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నారు. 2012లో రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు కాంగ్రెస్తోనే అనుబంధం కొనసాగింది. ఏకంగా 23 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీలో ఉన్నారు. మూడోసారి... కలిసొచ్చింది ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా... ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలనే బలమైన కోరిక మాత్రం ప్రణబ్ దాకు చాలాకాలం సాకారం కాలేదు. 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్పూర్ నుంచి లోక్సభకు పోటీచేసిన ప్రణబ్ముఖర్జీ ఓటమిపాలయ్యారు. తర్వాత 2004 దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోలేదు. మూడు కారణాలతో తాను మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగానని దాదా తన ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలో రాసుకున్నారు. ‘రాజ్యసభ సభ్యుడు మంత్రి కాగానే సాధ్యమైనంత తొందరగా లోక్సభకు ఎన్నిక కావడం మంచిదనేది నెహ్రూ విధానం. ఇదెప్పుడూ నా దృష్టిలో ఉండేది. రెండోది... 1984 తర్వాత ప్రతి ఎన్నికల్లో జాతీయ ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాను. ప్రచార కమిటీకి చైర్మన్గా ఉంటూ ప్రజాతీర్పును ఎదుర్కొనకపోతే ఎట్లా? అనేది నా మదిని తొలుస్తుండేది. మూడోది... నేను పోటీచేయాల్సిందేనని బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టి డిమాండ్ వచ్చింది. అందుకే 2004లో ముర్షిదాబాద్ నుంచి బరిలోకి దిగా’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లు ఎంపీగా చేసిన అబుల్ హస్నత్ ఖాన్ (సీపీఎం) ఆయన ప్రత్యర్థి. స్థానిక బీడీ కార్మికుల్లో బాగా పట్టున్న నేత. గెలుస్తానని స్వయంగా తనకే నమ్మకం లేనప్పటికీ... ప్రణబ్ను ముచ్చటగా మూడోసారి అదృష్టం వరించింది. దాదాపు 36 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే... పదవీకాలం ముగియగానే మళ్లీ రాజ్యసభకు పంపిస్తానని సోనియాగాంధీ అప్పటికే ఆయనకు హామీ ఇచ్చారు. పైగా ఓట్ల లెక్కింపు కోసం ప్రణబ్ ముర్షిదాబాద్కు వెళుతున్నపుడు... ఓటమి ఖాయమయ్యే దాకా వేచి ఉండొద్దు. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వచ్చేయమని సోనియా చెప్పారట. నాలుగో పుస్తకం... రాష్ట్రపతిగా తన ప్రయాణాన్ని ప్రణబ్ ముఖర్జీ చాలా విపులంగా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 11వ తేదీన ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం... ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ను విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ సోమవారం వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు. రాష్ట్రపతి భవన్ పనితీరుపై సమగ్ర అవగాహన కల్పించడమే కాకుండా, అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, నోట్లరద్దు... వంటి అంశాల్లో అసలేం జరిగిందో తాజా పుస్తకం వివరిస్తుందని రూపా పబ్లికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సర్జికల్ స్ట్రయిక్స్, ప్రధాని నరేంద్ర మోదీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ప్రణబ్ సంబంధాలపై కూడా ఇందులో వివరించారని తెలిపింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పనితీరుపై కూడా ఆయన తన అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. 2019లో రెండోసారి ఎన్నికల్లో గెలిచాక ప్రధాని మోదీకి మిఠాయి తినిపిస్తున్న ప్రణబ్ముఖర్జీ రాష్ట్రపతి కోవింద్ నుంచి భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రణబ్ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రణబ్ -
అనుభవశాలి కనుమరుగు
దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం గడించి, ఎన్నో పదవుల్లో రాణించి సమర్థుడిగా పేరుతెచ్చుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం కన్నుమూశారు. వేరే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు తనకు కరోనా సోకిందని నిర్ధారణ అయిందని గత నెల 10న ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. మెదడులో ఏర్పడిన అవరోధాన్ని తొలగించడానికి అదేరోజు ఆయనకు శస్త్రచికిత్స కూడా చేశారు. ఆనాటినుంచీ ఆయన సురక్షితంగా కోలుకుని బయటపడాలని దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ప్రణబ్ ఆరోగ్యం కుదుటపడుతోందని గత నెల 16న ఆయన కుమారుడు ట్వీట్ చేశారు కూడా. కానీ ఆ మరుసటి రోజునుంచే దురదృష్టవశాత్తూ ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడం మొదలుపెట్టింది. మధ్యలో కొద్దికాలం మినహా ప్రణబ్ ముఖర్జీ 1969లో కాంగ్రెస్లో చేరింది మొదలు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆ పార్టీతోనే ప్రయాణించారు. ఇందిరాగాంధీకి విశ్వాసపాత్రుడిగా మెలిగి 1973లో తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. రెవెన్యూ, బ్యాంకింగ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను స్వతంత్రంగా చూస్తున్న సమయంలో స్మగ్లర్ హాజీ మస్తాన్ నేర సామ్రాజ్యంపై దాడులు చేయించినప్పుడు మీడియాలో ఆయన పేరు మార్మోగింది. ఎమర్జెన్సీ పర్యవసానంగా 1977లో కాంగ్రెస్ ఓటమిపాలయ్యాక తాత్కాలికంగా తెరమరుగైనా 1982లో ఆ పార్టీ తిరిగి అధికారంలోకొచ్చినప్పుడు ప్రణబ్కు ఇందిరాగాంధీ కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను అప్పగించారు. స్వతంత్రంగా ఆలోచించడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మొదటినుంచీ ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. దేనికో ప్రభావితం కావడం, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం మొదటినుంచీ ఆయనకు పడదు. ఆయన హయాంలోనే భిన్న రంగాలకు సేవచేసేందుకు అనువుగా అనేక సంస్థలు మొగ్గతొడిగాయి. గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంకు వగైరాలు ప్రణబ్ చలవేనంటారు. అనునిత్యం ఎన్నో సవాళ్లు, సమస్యలు వచ్చిపడే రాజకీయ రంగంలో మానసిక ఒత్తిళ్లకు లోనుకాకుండా వుండటం అసాధ్యం. పరస్పర విరుద్ధమైన ప్రయోజనాల కోసం సంఘర్షించే భిన్న వర్గాలను ఒక తాటిపైకి తీసుకురావడం కూడా కష్టం. కానీ ప్రణబ్ వీటిని స్థిరచిత్తంతో ఎదుర్కొన్నారు. సమస్యను జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని, అన్ని వర్గాలతో ఓపిగ్గా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడంలో ప్రణబ్కు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ప్రభుత్వంలోనైనా, పార్టీలోనైనా ఆయన తీరు అదే. అందుకే ఆయన్ను ‘సంక్షోభ పరిష్కర్త’గా చూసేవారు. ఆర్థికమంత్రిగా వున్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) రుణాన్ని వెనక్కి తిప్పి పంపడం ఒక సంచలనం. సంస్కరణలవైపు మొగ్గుచూపినా వాటిని సంయమనంతో అమలు చేయడం ప్రణబ్ ప్రత్యేకత. ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్గాంధీ అధికారంలోకొచ్చాక ప్రణబ్ ప్రభ మసకబారడం మొదలైంది. తనను ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పంపారని అలిగిన ప్రణబ్ సొంతంగా రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ను స్థాపించారు. 1987 ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో మౌనంగా వుండిపోయారు. రాజీవ్ మరణానంతరం పీవీ నరసింహారావు హయాంలో తిరిగి కాంగ్రెస్లో చేరి పూర్వ వైభవాన్ని పొందగలిగారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకొచ్చినప్పుడు ప్రధాని పదవి చేపట్టడానికి సోనియాగాంధీ నిరాకరించాక అందరి దృష్టీ ప్రణబ్పైనే పడింది. పార్టీలో ఆయన్ను మించిన అనుభవశాలురు లేరు. కానీ రాజీవ్తో వున్న అనుభవంరీత్యా ఆయనేమీ ఆశించలేదు. ఇందిర హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేస్తూ రిజర్వ్బ్యాంకు గవర్నర్గా తాను నియమించిన మన్మోహన్ సింగ్ను ప్రధాని పదవికి ఎంపిక చేస్తే మారుమాట్లాడకుండా శిరసావహించారు. రెండోసారి 2009లో కూడా ప్రధాని పదవికి ప్రణబ్ పేరు ప్రస్తావనకొచ్చింది. కానీ అప్పుడూ ఆయనకు అది దక్కలేదు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రణబ్ తీరుపై సోనియాగాంధీకున్న భయాందోళనలే ఇందుకు కారణమంటారు. అయితే 2012లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఆయన తన అభీష్టాన్ని దాచుకోలేకపోయారు. రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ తొలి చాయిస్ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీయేనని అప్పట్లో మీడియాలో కథనాలొచ్చాయి. సంక్షోభ పరిష్కర్తగా వుండే ప్రణబ్ అనుభవాన్ని వదులుకోలేకే ఇలాంటి ఆలోచన చేసినట్టు కాంగ్రెస్ లీకులిచ్చినా 2014లో బొటాబొటీ మెజారిటీ వచ్చే పక్షంలో ఆయన సహకరించకపోవచ్చునన్న సంశయం సోనియాగాంధీకి వుందంటారు. ఏమైతేనేం రాష్ట్రపతి పదవికి ఆయన్ను ఎంపిక చేయక తప్పలేదు. సాధారణంగా రాజకీయాల్లో మునిగి తేలేవారికి పుస్తక రచన సంగతలావుంచి పుస్తకాలు చదవడానికి కూడా సమయం చిక్కదు. కానీ ప్రణబ్ ఇందుకు భిన్నం. ఆయన ఎన్ని సమస్యల్లో తలమునకలైవున్నా గ్రంథ పఠనానికి, అధ్యయనానికి సమయం కేటాయించుకునేవారు. రాష్ట్రపతి అయ్యాక తీరిక దొరకడం వల్ల కావొచ్చు...ఆయన తన అనుభవాలను రంగరించి మూడు పుస్తకాలు తీసుకొచ్చారు. పదవినుంచి వైదొలగాక మరో గ్రంథాన్ని రాశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనకెదురైన అనుభవాలు, వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలపై తన మనోభీష్టాన్ని వాటిల్లో వ్యక్తం చేశారు. అయితే సంక్షోభ పరిష్కర్తగా పేరున్నందువల్ల కావొచ్చు... ఎక్కడా ఆయన వివాదాస్పద అంశాల జోలికి పోలేదు. ఎవరినీ నొప్పించే ప్రయత్నం చేయలేదు. చివరకు రాజీవ్ తనను తొలుత కేంద్ర కేబినెట్ నుంచీ, ఆ తర్వాత పార్టీనుంచి సాగనంపడంపై ప్రచారంలో వున్న కథనాలను సైతం ఆయన కొట్టిపడేశారు. ఉద్దేశపూర్వకంగానే కొన్ని జ్ఞాపకాలను పంచుకోవడం లేదని కూడా ఆ పుస్తకాల్లో తేల్చిచెప్పారు. అయిదు దశాబ్దాలపాటు దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి కనుమరుగైన ప్రణబ్కు ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది. -
ప్రణబ్దా.. అల్విదా
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ దురంధరుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. అనారోగ్యంతో గత 21 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ప్రణబ్.. సోమవారం సాయంత్రం మృతి చెందారు. సాయం త్రం 4.30 గంటల సమయంలో గుండెపోటుతో ప్రణబ్ మరణించారని వైద్యులు ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అదే హాస్పిటల్లో ఆగస్టు 10న ఆయనకు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. అదే సమయంలో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో పాటు కరోనా కూడా సోకడంతో అప్పటి నుంచి ప్రణబ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పైనే కోమాలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను నేడు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్లోని çశ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబం వెల్లడించింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులను ప్రణబ్ అధిష్టించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశ రాజకీయ చిత్రపటంపై చెరగని ముద్ర వేసిన నేతగా పేరుగాంచారు. జీవితాంతం రాజకీయ దురంధరుడిగా, అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా దేశ ప్రజలు, సహచరుల మన్ననలు పొందారు. ఎన్నో సంక్షోభాల నుంచి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా గట్టెక్కించిన ట్రబుల్ షూటర్గా ఆయన గుర్తుండిపోతారు. 2019లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో ఆయనను గౌరవించింది. ప్రణబ్కు ఒక కుమార్తె షర్మిష్ట, ఇద్దరు కుమారులు అభిజిత్ ముఖర్జీ, ఇంద్రజిత్ ముఖర్జీ ఉన్నారు. భార్య సువ్రా ముఖర్జీ 2015లో చనిపోయారు. ప్రణబ్ మృతి వార్తను మొదట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీటర్ ద్వారా ప్రకటించారు. ఒక శకం ముగిసింది ప్రణబ్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రణబ్ మృతితో ఒక శకం అంతరించిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజా జీవితంలో శిఖరసమానుడు ప్రణబ్. ఒక యోగిలా మాతృభూమికి సేవ చేశారు. గొప్ప కుమారుడిని కోల్పోయిన భారతదేశం శోకతప్తమయింది. ఆయన కుటుంబానికి, మిత్రులకు, దేశ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’అని ఆయన ట్వీట్ చేశారు. సంప్రదాయం, ఆధునికత.. జ్ఞానం, వివేచన కలగలసిన నేతగా ప్రణబ్ను రాష్ట్రపతి ప్రశంసించారు. 2012 నుంచి 2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ ప్రణబ్ ఆప్తుడని కొనియాడారు. శిఖరాయమాన దార్శనికుడిగా, అత్యుత్తమ విజ్ఞాన ఖనిగా ఆయనను అభివర్ణించారు. ‘భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల దేశం యావత్తూ ఆవేదన చెందుతోంది. భారత దేశ అభివృద్ధి పథంపై తనదైన ముద్ర వేసిన నాయకుడు ప్రణబ్’అని ట్వీట్ చేశారు. ‘అనేక దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆర్థిక, ఇతర వ్యూహాత్మక మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రతో సేవలందించారు. ఆయన గొప్ప పార్లమెంటేరియన్. చర్చలకు బాగా సిద్ధమై వచ్చే నాయకుడు. గొప్ప వక్త. అంతే స్థాయిలో హాస్య స్ఫూర్తి ఉన్న నేత’అని మోదీ ట్వీట్ చేశారు. ప్రణబ్కు పాదాభివందనం చేస్తున్న ఫొటోతో పాటు మరికొన్ని ఫొటోలను ఆయన తన ట్వీట్కు జతచేశారు. ఇక ముందు ఎలా? పార్టీలో సీనియర్ సహచరుడు ప్రణబ్ మృతిపై తన సంతాపాన్ని ఒక లేఖ ద్వారా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆయన కూతురు షర్మిష్టకు తెలియపరిచారు. గత ఐదు దశాబ్దాల ప్రణబ్ జీవితం.. యాభై ఏళ్ల దేశ చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తుందని సోనియా అందులో కొనియాడారు. ‘ప్రణబ్దా దేశ చరిత్రలో, కాంగ్రెస్ ప్రస్థానంలో విస్మరించలేని భాగం. ముందు చూపు, విజ్ఞానం, అనుభవం, అద్భుత అవగాహనతో కూడిన ఆయన సలహాలు, సూచనలు లేకుండా ఇక ముందు ఎలా సాగుతామనేది ఊహించలేకుండా ఉన్నాం. నిర్వహించిన ప్రతీ పదవికీ ఒక దిశానిర్దేశం చేసిన నాయకుడు ఆయన. పార్టీలకు అతీతంగా అందరు నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేత. గొప్ప అంకితభావంతో దేశసేవ చేశారు’అని ప్రశంసించారు. వారం పాటు సంతాపం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రణబ్ మృతికి సంతాపసూచకంగా ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో జాతీయ పతాకం సగం వరకు అవనతం చేస్తారని తెలిపింది. బెంగాల్ నుంచి ప్రారంభం.. ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం 1969లో పశ్చిమబెంగాల్లో ప్రారంభమైంది. ఆ క్రమంలో ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయ నేతగా కాంగ్రెస్ పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. ఇతర సీనియర్ మంత్రులున్నప్పటికీ.. ప్రధాని ఇందిర తరువాత ఆమె మంత్రివర్గంలో నెంబర్ 2గా నిలిచారు. అయితే, ఇందిర మరణం అనంతరం పార్టీకి కొంతకాలం దూరమయ్యారు. తరువాత, ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆ తరువాత విదేశాంగ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. తదనంతర పరిణామాల్లో సోనియాకు విశ్వసనీయ సహచరుడిగా, కీలక వ్యూహకర్తగా, సంక్షోభ నివారణ నిపుణుడిగా కాంగ్రెస్ పార్టీలో పేరుగాంచారు. ప్రభుత్వ విధుల్లోనూ ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను అత్యంత ప్రతిభా సామరŠాధ్యలతో నిర్వహించారు. 47 ఏళ్ల వయస్సులోనే ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇందిర మరణం అనంతరం ఒకసారి, రాజీవ్ మృతి తరువాత మరోసారి ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఆయనకు తృటిలో చేజారింది. ప్రణబ్ 7 సార్లు ఎంపీగా ఉన్నారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో.. విరుద్ధ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న ప్రధాని మోదీతోనూ ఆయన సత్సంబంధాలను కొనసాగించడం విశేషం. -
దేశం ఓ వజ్రాన్ని కోల్పోయింది: చిరంజీవి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఈ రోజు సాయంత్రం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్ మృతి పట్ల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రణబ్ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. ‘ప్రణబ్ ముఖర్జీ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. అతనితో నేను గడిపిన క్షణాలను ఎప్పటికి గుర్తుంటాయి. ఒక గొప్ప జ్ఞానం, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని సాధించిన వ్యక్తి మీరు. మిమ్మల్ని మిస్ అవుతాము సర్.. దేశం ఈ రోజు ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రణబ్ దా..’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (ప్రణబ్ కుమార్తె భావోద్వేగ ట్వీట్) Deeply saddened by the demise of Shri #PranabMukherjee Will always treasure & cherish my interactions with him..An accomplished man of great wisdom & an illustrious political career..Will miss you Sir..The country has lost a precious diamond today...Rest in peace Dear Pranab Da! — Chiranjeevi Konidela (@KChiruTweets) August 31, 2020 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడం బాధగా ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. తన అత్యంత మేధోశక్తికి, ఉత్తమ నాయకునికి ఈ దేశం సంతాపం ప్రకటిస్తుందన్నారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు చేతులు జోడింది హృదయపూర్వక సంతాపం తెలిపారు. వీరితోపాటు అజయ్ దేవ్గణ్, తాప్సీ, రితేష్ దేశ్ముఖ్, లతా మంగేష్కర్, రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ దావన్, శిల్పా శెట్టి, శ్రీను వైట్ల వంటి పలువురు ప్రముఖులు ప్రణబ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.(దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం) Saddened to hear about the demise of our former President Shri Pranab Mukherjee. The nation mourns one of its most intellectual and inspiring leaders. Heartfelt condolences to the family and loved ones in this hour of grief. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2020 కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణ..బ్ ఆగస్టు 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా మెదడుకు డాక్టర్లు. సర్జరీ చేయగా..ఆస్పత్రిలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో కొంత కాలంగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందారు. రేపు ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మరణంతో దేశంలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాలు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. (చదవండి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత) అలాగే రాష్ట్రపతి భవన్తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. రేపు ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, గత కొంతకాలంగా కోవిడ్తో పాటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రంతుది శ్వాస విడిచారు. -
‘దాదా లేని ఢిల్లీని ఊహించలేం’
కోల్కతా : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మనల్ని వీడి వెళ్లడం బాధాకరమని, ఆయన మరణంతో ఓ శకం ముగిసిందని అన్నారు. దశాబ్ధాలుగా ప్రణబ్ ముఖర్జీ తనను తండ్రి మాదిరిగా ఆదరించారని చెప్పారు. ఎంపీగా తాను తొలిసారి గెలిచినప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీ తన సీనియర్ కేబినెట్ సహచరుడిగా ఆపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆయనతో అనుబంధం మరువలేనిదని మమతా పేర్కొన్నారు. దివంగత నేతతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, ప్రణబ్ దాదా లేకుండా ఢిల్లీ పర్యటన ఊహించలేనిదని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకూ అన్ని అంశాల్లోనూ ఆయన లెజెండ్ అని కొనియాడారు. ప్రణబ్ లేని లోటు పూడ్చలేనిదని ఆయన కుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ట ముఖర్జీలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి : ‘మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం’ It is with deep sorrow I write this. Bharat Ratna Pranab Mukherjee has left us. An era has ended. For decades he was a father figure. From my first win as MP, to being my senior Cabinet colleague, to his becoming President while I was CM...(1/2) — Mamata Banerjee (@MamataOfficial) August 31, 2020 -
‘మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం’
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. అందరికీ వందనం అంటూ ట్వీట్ను ప్రారంభించిన శర్మిష్ట ‘నాన్నా..అందరికీ మీ తుది వీడ్కోలు పలికేందుకు మీ అభిమాన కవి కోట్ను ఉదహరించే స్వేచ్ఛ తీసుకుంటున్నాను..దేశ సేవలో, ప్రజా సేవలో మీరు పూర్తిగా, అర్ధవంతమైన జీవితం గడిపారు..మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఇక ఆర్మీ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మరణించారని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రణబ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “সবারে আমি প্রনাম করে যাই” I bow to all🙏 Baba, taking the liberty to quote from your favourite poet to say your final goodbye to all. You have led a full, meaningful life in service of the nation, in service of our people. I feel blessed to have been born as your daugher. pic.twitter.com/etYfZXzZ1j — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 31, 2020 చదవండి : రాష్ట్రపతి భవన్ను సామాన్యులకు చేరువ చేశారు : మోదీ -
తెలంగాణతో విడదీయలేని అనుబంధం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రియతమ నేత, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం ఎంతో బాధాకరం. దూరదృష్టి కలిగిన నేత, మంచి వక్త, రచయిత, గొప్ప పార్లమెంటేరియన్ అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. భారతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ మరణం కేవలం దేశానికే కాదు.. మానవాళికీ తీరని లోటు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షకుడిగా పేరొందిన ప్రణబ్ మరణంతో దేశం ఓ గొప్ప నేత, పాలనాదక్షుడు, మానవతావాదిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరి.. స్వర్గలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’అని గవర్నర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణతో విడదీయలేని అనుబంధం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ అంశంతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు’అని సీఎం తన సంతాప సందేశంలో గుర్తు చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర డిమాండ్లో న్యాయం ఉందని ప్రణబ్ భావించేవారు. నేను కలసిన ప్రతీసారి ఎన్నో విలువైన సూచనలు చేసేవారు. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత నాకు దక్కిందని ప్రత్యేకంగా అభినందించారు. ప్రణబ్ రాసిన ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్కు తెలంగాణ అంశమే తప్ప పోర్ట్ఫోలియో అక్కరలేదని పేర్కొన్నారు’అని ప్రణబ్తో అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా ప్రణబ్ గుర్తించినట్లు అర్థమవుతోందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. యాదాద్రి దేవాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారని గుర్తు చేశారు. ప్రణబ్ మరణం తీరని లోటని సీఎం పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ప్రణబ్కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారం పాటు సంతాప దినాలు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి నివాళిగా వారం రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలు పాటిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. వారం రోజుల పాటు ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. తెలంగాణ రుణపడి ఉంటుంది: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రాజకీయ కురువృద్ధుడు, గొప్ప ఆర్థికవేత్త, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నాయకులుగా దశాబ్దాల పాటు పనిచేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ పని చేస్తున్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రణబ్కు తెలంగాణ రాష్ట్రం రుణపడి ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో ఉత్తమ్ పేర్కొన్నారు. దేశంలో అనేక కీలక సమస్యలను పరిష్కరించడంలో ప్రణబ్ ముఖ్యపాత్ర పోషించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఉత్తమ్ తెలిపారు. ప్రణబ్ మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు కె. జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, మర్రి శశిధర్రెడ్డి, కోదండరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులున్నారు. తెలంగాణ ఏర్పాటులో ఆయనది కీలకపాత్ర: మంత్రులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణపై యూపీఏ ఏర్పాటు చేసిన కమిటికీ సారథ్యం వహించిన ప్రణబ్.. రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు. భారత రాజకీయాల్లో ప్రణబ్ భీష్మాచార్యులు లాంటి వారని కొనియాడారు. రాష్ట్రపతిగా తెలంగాణ బిల్లుపై సంతకం చేసి ప్రణబ్ కోట్లాది మంది తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరేలా చూశారని మంత్రులు నివాళి అర్పించారు. సంతాపం ప్రకటించిన వారిలో మంత్రులు కేటీ రామారావు, హరీశ్రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులున్నారు. సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు.. ‘భారతరత్న’ప్రణబ్ ముఖర్జీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగారు. భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఆయన ఒకరు. ప్రణబ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఆర్థిక సంస్కరణల అమలులో కీలకపాత్ర ప్రణబ్ ముఖర్జీ లేని లోటు తీరనిది. ఆయన మరణం చాలా బాధకు గురి చే సింది. లోతైన విషయం పరిజ్ఞానమున్న ప్రణబ్ రాష్ట్రపతిగా, ఆర్థిక మంత్రిగా దేశానికందించిన సేవలు మరువలేనివి. ఆర్థిక సంస్కరణల అమలులో ఆయనది కీలకపాత్ర. కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఆయన్ని కలసి అనేక విషయాలు చర్చించేవాడిని. – హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అజాత శత్రువు.. రాజకీయ దురంధరుడు ప్రణబ్ అజాత శత్రువు. గొప్ప రాజకీయ దురంధరుడు. నా గురు సమానులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ కృషి అభినందనీయం. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన సమయంలో ప్రణబ్తో ఏర్పడిన సాన్నిహిత్యం ఎంతో నేర్చుకునేందుకు ఉపయోగపడింది. ఉత్తమ పార్లమెంటేరియన్గా ప్రణబ్ ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారు. ఆయన మరణం దేశానికే కాకుండా నాకు తీరని లోటే. – కె.కేశవరావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత ప్రణబ్ మరణం తీరని లోటు ప్రణబ్ ముఖర్జీ మరణం దేశ ప్రజలకు తీరని లోటు. రాజనీతి శాస్త్రం చదువుకున్న ఆయన అందులోని అంశాలను అక్షరాలా అనుసరించారు. వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రణబ్ కృషి చేశారు. – కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు ప్రణబ్ మృతిపట్ల సీపీఐ నేతల సంతాపం సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సీపీఐ నాయకులు సురవరం సుధాకర్రెడ్డి, డా. కె.నారాయణ, అజీజ్పాషా, చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. సెక్యులర్ భావాల పట్ల నిబద్ధతతో పాటు చివరి వరకూ జాతి సమైక్యత కోసం ప్రణబ్ ముఖర్జీ గొప్ప కృషి చేశారని వారు నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత అస్తమించిన అజాతశత్రువు ప్రణబ్ -
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫోటోలు
-
రాష్ట్రపతి భవన్ను సామాన్యులకు చేరువ చేశారు : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ప్రణబ్ ముఖర్జీదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, మేథావిని దేశం కోల్పోయిందని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రణబ్ విశేషంగా కృషి చేశారని అన్నారు. రాజకీయాలు, వర్గాలకు అతీతంగా ప్రణబ్ ముఖర్జీ అందరికీ ఆరాధ్యులని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పలు పాలనా విధానాలపై ఆయన చేసిన సూచనలు సదా స్మరణీయమని చెప్పారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూతతో దేశం విషాదంలో కూరుకుపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రణబ్ భరతమాత ముద్దుబిడ్డ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఇక ప్రణబ్ ముఖర్జీ క్రమశిక్షణ, అంకిత భావంతో దేశానికి సమున్నత సేవలు అందించారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దివంగత నేతకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొప్ప నేతను కోల్పోయాం : అమిత్ షా దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని హోంమంత్రి అమిత్ షా ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని, ఆయన మాతృభూమికి ఎనలేని సేవ చేశారని ప్రస్తుతించారు. రాహుల్ సంతాపం మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రణబ్ మృతి పట్ల యావత్ జాతి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తోందని రాహుల్ అన్నారు -
కాంగ్రెస్ కుట్ర : ప్రణబ్ ప్రధాని అయ్యేవారు
సాక్షి, న్యూఢ్లిలీ : కాంగ్రెస్ పార్టీలో ఓ శకం ముగిసింది. ఆ పార్టీ సీనియర్ నేత, మూడు తరాల నాయకులకు నమ్మకమైన వ్యక్తిగా సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ మృతిచెందారు. నిజ జీవితంలో, రాజకీయాల్లోనూ అజాతశత్రుగా కీర్తిగఢించి ప్రణబ్ కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవచేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకే కాకుండా యావత్ దేశానికీ తీరనిలోటుగా పలువురు వర్ణిస్తున్నారు. ఇటీవల బ్రెయిన్ క్లాట్ కోసం సర్జరీ చేయించుకున్న ప్రణబ్ ముఖర్జీకు ఆపరేషన్ సమయంలో కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడంతో దాదాపు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచారు. నాలుగు తరాలను ముందుండి నడిపించారు.. 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్లో జన్మించిన ప్రణబ్ముఖర్జీ ఎమ్ఏ, న్యాయవాద విద్యలనూ పట్టా అందుకున్నారు. అనంతరం కొంతకాలంపాటు లెక్చరర్గా పనిచేశారు. తొలినుంచి సామాజిక దృక్పథం కలిగిన ప్రణబ్.. పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి1969 కోల్కత్తాలోని మిడ్నాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించించారు. వెంటనే ప్రణబ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తన అక్కున చేర్చుకుంది. అనంతరం 34 ఏళ్లకే కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1973లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఎంపికై నాటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మినబంటుగా పేరుబడ్డారు. ఈ క్రమంలోనే వరుసగా 1975, 1981, 1993, 1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఇందిరా గాంధీ మరణం అనంతరం రాజీవ్కు అండగా నిలబడి.. కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్నారు. పీవీ నరసింహారావు హాయంలో 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్గా నియమితులైయ్యారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఎన్నిక కావడంలో కీలకపాత్ర పోషించారు. ఇందిరా గాంధీ, రాజీవ్, సోనియా, రాహుల్ నాయకత్వంలోనూ కాంగ్రెస్కు అండగా నిలిచి.. నాలుగు తరాలను ముందుండి నడిపించారు. ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరు.. 2004లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. యూపీయే ప్రభుత్వంలో 2004 నుంచి 2012 వరకు కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు సమర్థవంతగా నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్ను గుర్తింపబడ్డారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. బీజేపీ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత అవార్డును ప్రకటించడం గమనార్హం. 2012 జూలై 25 నుంచి 2017 జూలై 25 వరకు భారత 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు. 2018లో ఆరెస్సెస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరైన తొలి మాజీ రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలో కొన్ని వర్గాల నుంచి విమర్శలతో పాటు.. అజాతశత్రుగా కూడా పేర్కొనబడ్డారు. కాంగ్రెస్ కుటిల రాజకీయం.. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా హత్య తర్వాత తానే నిజమైన వారసుడిగా భావించిన ప్రణబ్ డిమాండ్ను తోసిపుచ్చి రాజీవ్ను తెరపైకి తీసుకువచ్చారు. అనుకున్న పదవి దక్కకపోవడంతో 1984లో కాంగ్రెస్కు ప్రణబ్ గుడ్బై చెప్పారు. రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పేరుతో 1984లో ప్రణబ్ సొంత పార్టీ స్థాపించారు.1989లో రాజీవ్గాంధీ ఆయన్ని బుజ్జగించి తిరిగి కాంగ్రెస్లోకి తీసుకువచ్చారు.1991లో రాజీవ్ హత్య తర్వాత ప్రధాని అయ్యేందుకు ప్రణబ్ ప్రయత్నాలూ చేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీని కాదనుకుని పీవీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాల ఫలించకపోతే ప్రణబ్ ఎప్పుడో దేశ ప్రధాని అయ్యేవారిని ఆయన సహచరులు చెబుతుంటారు. ఆరు దశాబ్ధాల పాటు రాజకీయల్లో కొనసాగిన దాదా.. పార్లమెంటు వ్యవహారాల్లో ఆయన్ని మించిన వారు లేదనే విధంగా మెలిగారు. తెలంగాణ బిల్లుపై సంతకం.. ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణతో ప్రత్యేక అనుభందం ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ సంతకం పెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునః విభజన బిల్లుపై సంతకం చేశారు. ఆయన జారీచేసిన ప్రత్యేక గెజిట్ ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రణబ్ నాయకత్వం వహించారు. ఆసియా అత్యుత్తమ ఆర్థిక మంత్రి మరోవైపు రచయితగా కూడా ప్రణబ్ పలు పుస్తకాలను రచించారు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’ పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. -
ప్రణబ్ మృతి : సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయం అని కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్ దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. The unfortunate demise of Shri Pranab Mukherjee is a tragic loss to the nation. His invaluable contributions to the nation's progress in over 5 decades of exemplary service will always be remembered with great pride. My thoughts & prayers are with the grieving family. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 31, 2020 ముఖర్జీ సేవలు అజరామరం: గవర్నర్ బిశ్వ భూషణ్ ప్రణబ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ సేవలు అజరామరం అని కొనియాడారు. ఐదు దశాబ్ధాల పాటు దేశానికి ఎంతో సేవ అందినారని ప్రశంసించారు. బహుళపార్టీ వ్యవస్ధలో ఏకాభిప్రాయ సాధకునిగా ప్రశంశలు అందుకున్న వ్యక్తి ప్రణబ్ అని కొనియాడారు. ముఖ్యమైన చట్టాల రూపకల్పనలో ప్రణబ్ కీలక భూమికను పోషించారని గుర్తుచేశారు. ప్రొఫెసర్ గా, జర్నలిస్టు గా,రచయత గా,ఆర్థిక వేత్త గా పార్టీలకతీతంగా వారు దేశానికి చేసిన సేవ మహోన్నతం. ఆయన మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ దేశం పెద్ద రాజనీతిజ్ఞడ్ని కోల్పోయిందంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో మహోన్నత నేత అని, ఆయన భరత మాతకు ఓ రుషి మాదిరిగా సేవ చేశారని రాష్ట్రపతి కోవింద్ కొనియాడారు. అత్యంత విలువైన బిడ్డల్లో ఒకరిని కోల్పోయినందుకు దేశం శోకిస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రజలందరికీ సంతాపం తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రణబ్.. సోమవారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. India grieves the passing away of Bharat Ratna Shri Pranab Mukherjee. He has left an indelible mark on the development trajectory of our nation. A scholar par excellence, a towering statesman, he was admired across the political spectrum and by all sections of society. pic.twitter.com/gz6rwQbxi6 — Narendra Modi (@narendramodi) August 31, 2020 మాజీ రాష్ట్రపతి , భారతరత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. దేశం ఓ రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. క్రమశిక్షణ, కఠోరశ్రమ, అంకితభావంతో దేశరాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆదర్శనీయులు. pic.twitter.com/uFfS9rUQqv — Vice President of India (@VPSecretariat) August 31, 2020 -
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు. ప్రణబ్ జీవిత చరిత్ర ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్ఎల్బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా పనిచేశారు. రాజకీయ జీవితం 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక 1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక 1980-85 వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత 1973-74 కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా 1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా... 1974-75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా.. 1975-77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా.. 1980-82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా.. 1982-84లో ఆర్థికమంత్రిగా.. 1991-96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా.. 1993-95లో వాణిజ్యశాఖ మంత్రిగా.. 1995-96లో విదేశాంగమంత్రిగా.. విధులు నిర్వర్తించారు జంగీపూర్ నుంచి 2004లో లోక్సభకు ఎన్నిక 2004-06లో రక్షణశాఖ మంత్రిగా.. 2006-09లో విదేశాంగమంత్రిగా.. 2009-2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. -
‘సెప్టిక్ షాక్’లోకి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఆయన ఆరోగ్యాన్ని మరింత కుంగదీసిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నిన్నటి నుంచి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ‘సెప్టిక్ షాక్’లోకి వెళ్లారు. నిపుణులైన వైద్య బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం ప్రణబ్ డీప్ కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అంటూ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. (చదవండి: ఆస్పత్రి నుంచి అమిత్ షా డిశ్చార్జ్) సాధారణంగా ‘సెప్టిక్ షాక్’కి గురయ్యే వ్యక్తుల్లో గుండె, మెదడు, కిడ్నీలు వంటి కీలక అవయవాలు దెబ్బతినడం, బీపీ తీవ్రంగా పడిపోవడం జరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకరకంగా సెప్టిక్ షాక్లోకి వెళ్లడమంటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత శరీరంలో బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది. ఇక ప్రణబ్ ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా ట్వీట్ చేస్తున్న అతని కుమారుడు అభిజిత్ ముఖర్జీ ‘ప్రతి ఒక్కరూ తన తండ్రి కోసం ప్రార్థించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం క్లిష్టంగానే ఉందని.. కానీ అతని కీలకమైన పారామీటర్స్ అన్ని స్థిరంగా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు. I urge all my friends here to pray for the recovery of My father #PranabMukherjee . He is a fighter & with all your good wishes & prayers , He will surely recover ! At the moment he is critical but all his vital parameters are stable ! — Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 31, 2020 -
డీప్ కోమాలోకి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. డీప్ కోమాలోకి ప్రణబ్ వెళ్లారని ప్రకటించారు. ఇప్పటి వరకు అందించిన వైద్య చికిత్సతో ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులేదని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పైనే ప్రణబ్కు చికిత్స కొనసాగుతోందని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా బ్రెయిన్ సర్జరీ తర్వాత కరోనా బారినపడటంతో ప్రణబ్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. (క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) -
క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఇంకా తీవ్ర కోమాలోనే ఉన్నట్లు ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటెన్లో తెలిపింది. ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. (చదవండి: ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్కు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిన సంగతి తెలిసిందే. -
కోమాలోకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ (84) ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నామని ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఆయన కోమాలోనే ఉన్నారని ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కాగా, ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. (చదవండి: కాంగ్రెస్ నాయకత్వంపై సీనియర్లు లేఖ) -
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై తాజా అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఆయన శరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. (చదవండి : 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు) కాగా, ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందుతోంది. -
ప్రణబ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
-
మరింత విషమంగా ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని ఆయనకు వైద్యం చేస్తున్న ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్పైనే కొనసాగతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ప్రణబ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జి ట్వీట్ చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. (ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు) తండ్రిని గుర్తు చేసుకుంటూ శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా ప్రణబ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరం కాలేదన్నారు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం తనకుంది అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ ఫోటోలను ఆమె షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు’
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏ మాత్రం మార్పు లేదని ఆర్మీ హాస్పటల్ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ హాస్పటల్ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృందం ఎప్పటికపుడు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. (విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్కు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. . ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా ఉన్నారు. (కుదుటపడుతున్న ప్రణబ్ ఆరోగ్యం') -
విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రణబ్ శరీరం వైద్యం అందించడానికి సహకరిస్తూ స్థిరంగా ఉందని తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. -
'కుదుటపడుతున్న ప్రణబ్ ఆరోగ్యం'
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి ఆదివారం తెలిపింది. నేడు కూడా ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ మాత్రం ప్రణబ్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు పేర్కొన్నారు. "నిన్న ఆస్పత్రికి వెళ్లి నా తండ్రిని చూశాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదాల వల్ల ఆయన ఆరోగ్యం కుదుటపడుతోంది. ముందుకన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగవుతోంది. ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే స్పందిస్తున్నాయి. చికిత్సకు కూడా స్పందిస్తున్నారు. ఆయన త్వరలోనే మన మధ్యకు వస్తారని విశ్వసిస్తున్నా" అని తెలిపారు. (ఇంకా వెంటిలేటర్పైనే ప్రణబ్) కాగా మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆరోజు నుంచి ఆయన వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు మరోవైపు సోషల్ మీడియాలో ప్రణబ్ మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో ఆయన కుమారుడు వాటన్నింటినీ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. (కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ) -
ఇంకా వెంటిలేటర్పైనే ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి వైద్య బృందం శనివారం తెలిపింది. ఆయన పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, వెంటిలేటర్పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. ‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయనను ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణ కొనసాగుతోంది’ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (చదవండి : ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందుతోంది. -
‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించారు. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందుతోంది. ఈ కారణంగా ఆయన శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రణబ్ హాజరు కాకపోవడంతో.. ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ తన తండ్రి జ్ఞాపకాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. (చదవండి : వెంటిలేటర్పైనే ప్రణబ్) ‘చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా నాన్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మిస్ చేసుకోలేదు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం నాకుంది’అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ ఫోటోలను ఆమె షేర్ చేశారు. In his childhood, my dad & my uncle would hoist National Flag at our ancestral home in village. Since then, he never missed a year to hoist tri-colour on Independence Day. Sharing some memories from last years celebration at home. I’m sure he’ll do the same next year. Jai Hind 🇮🇳 pic.twitter.com/SX0CVO8lW6 — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 15, 2020 -
వెంటిలేటర్పైనే ప్రణబ్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందుతోంది. అయితే, పరిస్థితి దిగజారలేదనీ, ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే పనిచేస్తున్నాయని కుమార్తె శర్మిష్ఠ శుక్రవారం చెప్పారు. ‘వైద్యపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే, నిలకడగా మాత్రం ఉంది. ఆయన నేత్రాలు వెలుతురుకు కాస్తంత స్పందించడం కనిపిస్తోంది’అని ట్విట్టర్లో శర్మిష్ఠ ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రణబ్ ముఖర్జీ బాహ్య స్పర్శకు, చికిత్సకు స్పందిస్తున్నారు. 96 గంటల అబ్జర్వేషన్ సమయం నేటితో పూర్తవుతోంది’అని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో తెలిపారు. ‘దేశ ప్రజల నుంచి నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే పొందాను..అని మా నాన్న ప్రణబ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’అని అభిజిత్ కోరారు. -
కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రి గురువారం తెలిపింది. ప్రణబ్ చికిత్సకు మెల్లిగా స్పందిస్తున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ‘నా తండ్రి ఒక పోరాటయోధుడు. చికిత్సకు నెమ్మదిగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా శ్రేయోభిలాషులను కోరుతున్నాను’అని అభిజిత్ ట్వీట్ చేశారు. మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరగా ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స జరిగింది. మరోవైపు ప్రణబ్ మరణించారన్న వదంతులు ప్రబలడంతో ఆయన కుమారుడు అభిజిత్ వాటిని కొట్టిపారేశారు. ‘‘మా తండ్రి శ్రీ ప్రణబ్ బతికే ఉన్నారు. పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్టులే ఊహాగానాలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం భారత మీడియా రంగం నకిలీ వార్తల ఫ్యాక్టరీగా మారిందన్న ఆరోపణలకు అద్దం పట్టేదిలా ఉంది’’అని ట్వీట్ చేశారు. ‘‘మా తండ్రికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఆసుపత్రి నుంచి వచ్చే సమాచారం కోసం ఫోన్ అందుబాటులో ఉంచాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఎవరూ.. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు నన్ను సంప్రదించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా’’అని ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ట్వీట్ చేశారు. -
ఆ వార్తలను నమ్మొద్దు.. ప్రణబ్ కోలుకుంటున్నారు
-
ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. వాటిని ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని తెలిపారు. ఆ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, తమ తండ్రి కోలుకుంటున్నారని ట్విటర్లో వెల్లడించారు. సోషల్ మీడియాలో తమ తండ్రి అనారోగ్యంపై వచ్చే వార్తలు ఆసత్యమని, ముఖ్యంగా మీడియా గమనించాలని తెలిపారు. Rumours about my father is false. Request, esp’ly to media, NOT to call me as I need to keep my phone free for any updates from the hospital🙏 — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 13, 2020 ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable ! Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News . — Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020 -
ప్రణబ్ ముఖర్జీ : ఎంత నొప్పితో బాధపడుతున్నా..
కోల్కతా : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఎంతో నొప్పిని సైతం ఓర్చుకొని ప్రశాంతంగా ప్రణబ్ కనిపించేవారని 13 ఏళ్ల క్రితం ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ బసుదేవ్ మొండాల్ అన్నారు. '' 2007లో ముర్షిదాబాద్ నుంచి కోల్కతా వెళ్తుండగా నాడియా జిల్లాలో ప్రణబ్ ముఖర్జీ కారు ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో కారు ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో అప్పటి విదేశాంగ మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ సిటీ స్కాన్, ఎక్స్ రే వంటి సౌకర్యాలు లేనందున ఆయన్ని మా నర్సింగ్ హోంకు తీసుకువచ్చారు. (మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) అంతకుముందే నాకు పరిస్థితిని వివరించి అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాల్సిందిగా ఫోన్ రావడంతో చాలా అలర్ట్ అయ్యాను. అన్నీ సిద్ధం చేశాను. ఆ సమయంలో ముఖర్జీ తలకు బలమైన గాయం కావడంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా, వినయంగా కనిపించారు. ఇక పరీక్షలు అదృష్టవశాత్తూ ఆయనకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. ఆ తర్వాత అయన్ని అక్కడినుంచి కోల్కతా లోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత 2016లో ఓ కార్యక్రమం సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని ఆహ్వనించడానికి వెళ్లాను. అప్పటికీ ఆయన రాష్ర్టపతిగా ఉన్నారు. నన్ను చూడగానే గుర్తుపట్టి, చాలా ఆప్యాయంగా పలకరించారు. నా సేవలను గుర్తిచేస్తూ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమానికి హాజరవుతానన్న వాగ్ధానాన్ని కూడా నిలబెట్టుకున్నారు'' అంటూ డాక్టర్ మొండల్ ప్రణబ్ ముఖర్జీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రణబ్కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
ప్రణబ్ ఆరోగ్యం విషమమే
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతం లోని ఆసుపత్రిలో ప్రణబ్ 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మొదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవా లని ఆయన స్వగ్రామమైన బెంగాల్లోని మిరిటీలో మూడు రోజులుగా మృత్యుంజయ మంత్ర జపం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా..ప్రణబ్ ముఖర్జీకి ఏది మంచిదైతే భగవంతుడు తనకు అదే ఇవ్వాలని కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’అందుకున్న ఏడాదికే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం తనను బాధిస్తోందని కాంగ్రెస్ నేత కూడా అయిన షర్మిష్ట తెలిపారు. -
విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. 84 ఏళ్ల ప్రణబ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారని ఇక్కడి ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ కోసం సోమవారం ప్రణబ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ‘ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితి ఉండటంతో బ్రెయిన్ క్లాట్ను తొలగించడానికి సోమవారం అత్యవసరంగా శస్త్రచికిత్స చేశాం. ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోగా.. మరింత క్షీణించింది. వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్నారు’అని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్యం బాగాలేక ప్రణబ్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు చేసిన పరీక్షల్లో మెదడులో రక్తగడ్డకట్టినట్లు తేలింది. కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. కరోనా పాజిటివ్ ఉన్నా మెదడులో రక్తం గడ్డ పెద్దది కావడంతో వెంటనే వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం వివిధ విభాగాలకు చెందిన నిపుణులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. 2012–2017 మధ్యకాలంలో ప్రణబ్ భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు. -
మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ : బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రణబ్కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. కాగా మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. (ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం) అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ‘ప్రణబ్కు బ్రెయిన్ క్లాట్ను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్పై ఉన్నారు’అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి. దాదాకు కరోనా పాజిటివ్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కోవిడ్–19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత వారంలో తనను సంప్రదించిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం లేదా కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడమో చేయాలని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూడా అయిన ఆయన విజ్ఞప్తి చేశారు. 2012–17 మధ్యకాలంలో ప్రణబ్ రాష్ట్రపతిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్ఆర్ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్ చేసి ప్రణబ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్ గోయల్ తదితర నేతలు మాజీ రాష్ట్రపతికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు. -
మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్
-
మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వేరే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినపుడు తనకు కరోనా నిర్దారణ అయిందని ప్రణబ్ ట్వీట్ చేశారు. గతవారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అందించిన సమాచారం ప్రకారం వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్ కేసులతో 22 లక్షల కేసులను అధిగమించిందని, 44 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. అయితే రికవరీ రేటు 69.33 శాతంగా ఉందని, మరణాల రేటు కొత్త కనిష్టాన్ని (2 శాతం) చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today. I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee — Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020 -
పలువురు నేతలకు ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులతో ఫోన్లో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తిన పరిస్థితులపై వారితో చర్చించారు. ఆదివారం ప్రధాని మోదీ.. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడలతో కూడా ఫోన్లో సంభాషించారు. ఇంకా.. సమాజ్వాదీ పార్టీ అగ్ర నేతలు అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్తోనూ మాట్లాడారు. పార్లమెంట్లో వివిధ పక్షాల నేతలతో ప్రధాని మోదీ ఈనెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
జీడీపీ ఒక్కటే ముఖ్యం కాదు
-
భారత రత్న పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ దివంగత నేత నానాజీ దేశ్ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన భారత రత్న పురస్కారాలను గురువారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఈ అవార్డులను ముఖర్జీకి, హజారికా కొడుకు తేజ్కు, నానాజీ సన్నిహిత బంధువు విక్రమజీత్ సింగ్కు రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో అందజేశారు. నానాజీ, హజారికాలకు ఈ అవార్డును వారి మరణానంతరం ప్రకటించారు. ‘ప్రణబ్ దా’ అని సన్నిహితులు ప్రేమగా పిలుచుకునే ప్రణబ్ ముఖర్జీ.. భారత రత్న అందుకున్న ఐదో రాష్ట్రపతి. కాంగ్రెస్కు అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రణబ్ భారత్కు అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. నానాజీ దేశ్ముఖ్కు 1928 నుంచి ఆయన చనిపోయే వరకు ఆరెస్సెస్తో సంబంధాలు ఉన్నాయి. భారతీయ జన సంఘ్ స్థాపకుల్లో నానాజీ ఒకరు. కాగా, అస్సాంకు చెందిన హజారికా నేపథ్య గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, చిత్ర నిర్మాత కూడా. -
భారతరత్న అందుకున్న ప్రణబ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో గురువారం భారతరత్న పురస్కారాల ప్రదానోత్స కార్యక్రమం జరిగింది. 2019కి గాను దేశ అత్యున్నత పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్ముఖ్, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికాలకు ప్రకటించిన విషయం తెలిసిందే. నానాజీ, భూపేన్ హజారికాలకు కేంద్రం మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ రోజు జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భూపేన్ హజారికా తరఫున ఆయన కుమారుడు తేజ్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీలకు చెందిన నేతలు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. -
పీవీపై అనుచిత వ్యాఖ్యలు : చిన్నారెడ్డి వివరణ
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ లు అంటే తనకు అపారమైన గౌరవమని, వాళ్ళు గొప్ప మేధావులు కావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు గొప్ప అవకాశాలు ఇచ్చిందని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. పీవీ నర్సింహారావు, ప్రణబ్ ముఖర్జీ లపై బుధవారం తాను చేసిన ప్రకటనలపై వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పివి, ప్రణబ్ లను కాంగ్రెస్ అవమానించిందని అనడం రాజకీయమని, కాంగ్రెస్ పార్టీ వారికి గొప్ప గౌరవం ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకని తాను ప్రశ్నించానే తప్ప వాళ్ళను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. పీవీ, ప్రణబ్ అంటే ఎంతోఅభిమానం, గౌరవం ఉందని అన్నారు. తన వాఖ్యలపై కొంతకొంత అపార్థాలు చోటు చేసుకున్నాయని, ఎవరైనా బాధ పడితే చింతిస్తున్నానని అన్నారు. పివి, ప్రణబ్ లు ఎప్పటికైనా కాంగ్రెస్ గౌరవించే నేతలని ఆయన వివరణ ఇచ్చారు. (చదవండి : పీవీపై కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అనుచిత వాఖ్యలు) కాగా బుధవారం చిన్నారెడ్డి పీపీ, ప్రణబ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి చేసిన సోనియా గాంధీని, ఆమె అనుచరులను పీవీ అణగదొక్కారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి పీవీ అని విమర్శించారు. ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు. -
పీవీ, ప్రణబ్పై చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలపై ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ అని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలు మానుకొని హైదరాబాద్లో కూర్చున్న పీవీని సోనియాగాంధీ పిలిచి ప్రధానిని చేశారన్న చిన్నారెడ్డి.. ఇంత గౌరవం ఇచ్చినప్పటికీ పీవీ పార్టీని భ్రష్టు పట్టించారని దుయ్య బట్టారు. బుధవారం గాంధీభవన్లో మీడియా సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ పీవీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఆయన మాత్రం గద్దెనెక్కిన తర్వాత సోనియా సహా సీనియర్లను అణగదొక్కే ప్రయత్నం చేశారు. ప్రధాని పదవికి మరోనేత పోటీగా తయారవుతారనే ఆయన అలా వ్యవహరించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సహకరించి పీవీ మరో ఘోరతప్పిదం చేశారు. దీంతో అప్పటివరకు కాంగ్రెస్ను లౌకిక పార్టీగా విశ్వసించిన మైనారిటీలు పార్టీకి దూరమయ్యారు. దీంతో పార్టీకి ఇబ్బందులు తలెత్తడంతోనే గాంధీ కుటుంబం ఆయన్ను పక్కనబెట్టింది. కేవలం బాబ్రీని కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొడుగుతున్నారు’అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రణబ్ను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా కాంగ్రెస్దే అన్నారు. నాగ్పూర్లో ఆరెస్సెస్ సభకు వెళ్లి, సంఘ్ భావజాలాన్ని ప్రశంసించినందుకే ప్రణబ్కు బీజేపీ భారతరత్నతో సత్కరించిందన్నారు. అది కూడా ఆరెస్సెస్ నేత నానాజీ దేశ్ముఖ్తో కలిపి ఇచ్చారని చిన్నారెడ్డి గుర్తుచేశారు. ఆరెస్సెస్ భావజాలం ఉన్న వాళ్లనే బీజేపీ దగ్గరకి తీస్తోందని, దేశమంతా ఆ భావజాలాన్ని నింపాలనే లక్ష్యంతోనే ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరెస్సెస్కు అనుకూలంగా లేనందుకే బీజేపీ ఆయన్ను పొగడదని చిన్నారెడ్డి అన్నారు. మన్మోహన్సింగ్కు కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం ఇస్తోందని, పార్టీ ప్రధాన కార్యక్రమాలన్నింటిలో ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అప్పులకుప్ప మిగులు బడ్జెట్తో ఉన్నామని చెబుతున్నప్పటికీ.. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణకు 1.8లక్షల కోట్ల రూపాయల అప్పున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పిందన్నారు. ఈ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో కేసీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా నీరందించేందుకు ఎకరాకు రూ.75వేల ఖర్చు అవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం ఇప్పటికే రూ.50 వేల కోట్లు దాటిందని ఆయన తెలిపారు. వీటన్నింటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
పీవీపై కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అనుచిత వాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ అనుచరులను పీపీ అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి పీవీ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లను పీపీ తొక్కేశాడని ఆరోపించారు. బాబ్రీ మసీదును కూల్చి పీవీ పెద్ద తప్పు చేశాడని, దాని వల్ల కాంగ్రెస్కు ముస్లింలు దూరమయ్యారన్నారు. అందుకే పీవీని గాంధీ కుటుంబం పక్కన పెట్టిందని చెప్పుకొచ్చారు. ‘రాజకీయాలను మానుకొని హైదరాబాద్కు వచ్చిన పీవీని సోనియా గాంధీ పిలిచి ప్రధానిని చేశారు. కానీ పీవీ మాత్రం గాంధీ కుటుంబాన్నే అణగదొక్కే ప్రయత్నం చేశారు. గాంధీ కుటుంబం వాళ్లు వస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అందరిని తొక్కేశారు. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టింది. బాబ్రీ మసీదు కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొగుడుతున్నారు’ అని చిన్నారెడ్డి ఆరోపించారు. ప్రణబ్ కూడా పీవీలాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్పై కూడా చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ నాగపూర్లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు. ప్రణబ్ను కాంగ్రెస్ పార్టీయే దేశానికి రాష్ట్రపతి చేసిందన్నారు. బీజేపికి ప్రయోజనాలు చేకూర్చారు కాబట్టే ఆ పార్టీ నేతలు పీవీ, ప్రణబ్లను పొగుడుతున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు కాబట్టే బీజేపీ ఆయనను పొగడడం లేదని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, రాష్ట్రానికి లక్షా పదివేల కోట్ల అప్పు ఉందని పార్లమెంటులో ప్రకటించారన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం చెప్పిన లక్షా పదివేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. -
కేబినెట్ కూర్పుపై మోదీ, షా చర్చలు
న్యూఢిల్లీ: కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ కూర్పు, మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి తదితర అంశాలపై వారు కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. భేటీలో మోదీ, అమిత్ షా ఏం మాట్లాడుకున్నారనే దానిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఏ మంత్రిత్వ శాఖలను ఎవరికి కేటాయించాలనే దానిపైనే వీరు చర్చించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ కొత్తగా బలపడటం అనేది మంత్రివర్గంలో ప్రతిబింబిస్తుందని సమాచారం. అలాగే గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన మంత్రులందరికీ ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్, జవడేకర్, పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, నరేంద్ర తోమర్లకు కొత్త మంత్రివర్గంలోనూ చోటు ఖాయమైనట్లు కనిపిస్తోంది. అలాగే బీజేపీ మిత్రపక్షాల్లో శివసేన, జేడీయూలకు రెండు పదవులు (ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి), ఎల్జేపీ, శిరోమణి అకాలీదళ్కు ఒక పదవి దక్కే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే ఘోరంగా ఓడిపోయి ఒక్క సీటే గెలిచినప్పటికీ, తమిళనాడులో ఆ పార్టీ అధికారంలో ఉండటం, బీజేపీకి కీలక మిత్రపక్షం కావటంతో అన్నాడీఎంకేకు మంత్రిపదవి దక్కనున్నట్లు సమాచారం. ప్రణబ్ను కలిసిన మోదీ మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీని మోదీ మంగళవారం కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ రాజనీతిజ్ఞు డని మోదీ అభివర్ణించారు. ‘ప్రణబ్ దాను కలవడం ఎల్లప్పుడూ మంచి అనుభవం. ఆయనకున్న జ్ఞానం, దూరదృష్టి మరెవ్వరికీ ఉండవు. ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకునేలా దేశం కోసం ప్రణబ్ పనిచేశారు’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. గవర్నర్లు, సీఎంలు, ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం మోదీ ప్రమాణ స్వీకారానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రముఖ ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు ఆహ్వానాలను అందుకున్న వారిలో ప్రముఖులు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులకు కూడా ఆహ్వానాలు పంపనున్నారు. అన్ని ప్రముఖ ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఆహ్వానాలను పంపుతున్నారు. రాష్ట్రపతి భవన్లో గురువారం రాత్రి 7 గంటలకు మోదీ చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయిస్తారు. వేడుకకు విదేశీ నేతలు బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, కిర్గిజ్స్తాన్ దేశాల అధ్యక్షులు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. అలాగే నేపాల్, మారిషస్, భూటాన్ దేశాల ప్రధానులు వరుసగా కేపీ శర్మ ఓలీ, ప్రవీంద్ కుమార్ జగన్నాథ్, లొతయ్ షెరింగ్లు కూడా తాము వేడుకకు హాజరవుతున్నట్లు ధ్రువీకరించారు. అలాగే థాయ్లాండ్ ఓ ప్రత్యేక రాయబారిని పంపనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో బిమ్స్టెక్ దేశాల ప్రధానులు, అధ్యక్షులు లేదా రాయబారులు వేడుకకు వస్తున్నట్లైంది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్తున్నట్లు మమతా చెప్పారు. కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఢిల్లీ ప్రభుత్వాధికారి చెప్పారు. -
ప్రణబ్తో మోదీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ నినాదమైన సబ్కా సాథ్..సబ్ కా వికాస్..సబ్కా విశ్వాస్ సాకారం కావాలని ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. ప్రణబ్తో భేటీ సందర్భంగా మాజీ రాష్ట్రపతిని రాజనీతిజ్ఞడిగా మోదీ కొనియాడారు. ప్రణబ్ దాదాతో ఎప్పుడు కలిసినా అది అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని, అపార విజ్ఞానం సొంతమైన ఆయన అసలైన రాజనీతిజ్ఞుడని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు మోదీతో భేటీ ఆహ్లాదంగా సాగిందని, ఆయన రెండవ పర్యాయం ప్రధానిగా సేవలందించేందుకు సిద్ధమతున్న క్రమంలో శుభాకాంక్షలు అందిస్తున్నానంటూ ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. కాగా మాజీ రాష్ట్రపతిని కలుసుకునేందుకు ప్రణబ్ నివాసానికి వచ్చినందుకు ప్రధాని మోదీకి ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కూడా ధన్యవాదాలు తెలిపారు. -
వైఎస్ జగన్కు ప్రణబ్ ముఖర్జీ అభినందనలు
-
ఊహాగానాలకు ఈసీ తెరదించాలి
లక్నో, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపునకు మరో రెండురోజులు కూడా సమయంలేని నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు మంగళవారం రాజకీయంగా దుమారం సృష్టించాయి. దీనిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల తీర్పు తారుమారు వార్తలు తనను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు యంత్రాల (ఈవీఎంలు)ను చుట్టుముట్టిన ఊహాగానాలన్నిటికీ తెరదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పైనే ఉందని ఆయన చెప్పారు. తమ అధీనంలో ఉన్న ఈవీఎంలకు రక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ దిగ్గజ నేత కూడా అయిన ప్రణబ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజా తీర్పు చాలా పవిత్రమైనదని, అది ఏ అతి చిన్న సందేహానికీ తావివ్వనంత ఉన్నతంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు సమర్ధంగా నిర్వహించినందుకు ఈసీని ప్రణబ్ సోమవారం అభినందించిన సంగతి తెలిసిందే. విపక్షాల ఆందోళన ఈవీఎంల తరలింపు, ట్యాంపరింగ్ ఆరోపణల సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం నిరసన ప్రదర్శనలకు దారితీసింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంల తరలింపు ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈసీ తక్షణమే సరైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడాన్ని బీజేపీ ఖండించింది. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటర్లు తీర్పు ఇచ్చిన పక్షంలో, ఓటమిని హుందాగా అంగీకరించాలని కోరింది. ఘాటుగా స్పందించిన ఈసీ పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల స్థానంలో వేరే ఈవీఎంలను ఉంచుతున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది. అవన్నీ తప్పుడు, పనికిమాలిన, నిరాధార ఆరోపణలుగా పేర్కొంది. ఏడు విడతల్లో వినియోగించిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూముల్లో అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. టీవీలు, సోషల్ మీడియాల్లో చూపిస్తున్న దృశ్యాలకు, పోలింగ్ సందర్భంగా వినియోగించిన ఈవీఎంలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారం చేపట్టనుందని దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఈసీ పనితీరు భేష్: విపక్షాలకు ప్రణబ్ చురకలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల జల్లు కురిపంచారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని ఈసీని కొనియాడారు. విపక్షాలు ఎన్నికల సంఘాన్ని విమర్శించవద్దని ప్రణబ్ హితవుపలికారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి ప్రస్తుత కమిషనర్ల వరకు ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ఎన్నికల నిర్వహణ సంస్థలని, అవన్నీబాగా పనిచేస్తున్నాయని ప్రశంశించారు. కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్తో పలు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీపై విమర్శలు చేస్తున్న నాయకులకు ఆయన చురకలంటించారు. చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవ పడతాడని, మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగిస్తాడని చలోక్తులు విసిరారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ఆపార్టీలో చర్చనీయాంశంగా మారాయి. దిల్లీలో సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం పనితీరుతో పాటు పలు సంస్కరణలపై మాట్లాడారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి సమావేశంలో ప్రణబ్ మాట్లాడుతూ.. ‘‘ సుదీర్ఘ కాలంలో రాజ్యాంగ సంస్థలు నిర్మించబడ్డాయి. తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటి వరకు ఎన్నికల సంఘం అద్భుతంగా ఎన్నికలను నిర్వహిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 67% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలో 2/3 ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల కమిషనర్లు అందరిని ప్రభుత్వాలే నియమిస్తూ వచ్చాయి.’’అని ప్రణబ్ వ్యాఖ్యానించారు. -
ప్రజాస్వామం విజయవంతమైంది:ప్రణబ్
-
మన్మోహన్కు పీవీ పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా నెక్ట్స్ సంస్థ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని 2018 ఏడాదికిగానూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రదానం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్కు అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. ‘దేశంలోకి దిగుమతులను ప్రోత్సహించడంతోపాటు, అనుమతుల్లో తీవ్ర జాప్యం(లైసెన్స్ పర్మిట్ రాజ్)ను పీవీ రూపుమాపారు. స్వతంత్ర భారతావనిలో ఆర్థిక సంస్కరణల విషయంలో పీవీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సంక్లిష్ట సమయాల్లో కఠినమైన ఆర్థిక, విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో పీవీ నాకు ఎంతగానో సాయపడ్డారు’అని అవార్డును అందుకున్న సందర్భంగా మన్మోహన్ కొనియాడారు. -
3 లక్ష్యాలు.. 3 అవార్డులు!
‘వ్యక్తులకు బిరుదులు అలంకారం కాదు. వ్యక్తులే బిరుదులకు వన్నె తెస్తారు’ అనేది నానుడి. ఇటీవల ప్రకటించిన కొన్ని అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించడం, ప్రజాభిప్రాయ సేకరణ జరగకపోవడంతో విమర్శలు తలెత్తాయి. ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకోవడం కోసం వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ఇవ్వడం సహజమే. 2019 ఏడాదికి భారతరత్న పొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలు ఈ అవార్డుకు అర్హులే. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేయడం పట్ల బీజేపీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన సీపీఎం బలహీనపడటంతో అక్కడ ధీటైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య విద్వేషం పెరిగింది. అక్కడ మమత బెనర్జీకి పోటాపోటీగా నిలవాలని చాన్నాళ్లుగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ‘బెంగాలీ పుత్రుడు’ ప్రణబ్ పేరును చూపి సెంటిమెంట్తో ఆ రాష్ట్రంలో కేడర్ను బలోపేతం చేసుకోవాలని బీజేపీ ఆశిస్తూ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌరసత్వ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాం అట్టుడుకుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి అస్సాం గణపరిషత్ ఇప్పటికే తప్పుకుంది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలను బుజ్జగించడానికి ఆ ప్రాంత గాయకుడు అయిన హజారికాకు భారతరత్న ప్రకటించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక నానాజీ దేశ్ముఖ్కు భారతరత్నను ఇవ్వడం ద్వారా బీజేపీ ఆచితూచి అడుగులేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాయి. దీంతో బీజేపీ రెండు ఆశయాల్ని నెరవేర్చుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకటి ఆరెస్సెస్ను సంతృప్తిపరచడం, రెండోది మేధావుల వారసత్వాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే కాదు తాము కూడా గౌరవించగలమని చాటి చెప్పడం. ఎన్నికల ఎత్తుగడే కానీ.. ‘మమతా బెనర్జీకి చెక్ పెట్టి బెంగాల్లో పాగా వేయాలి. పౌరసత్వ బిల్లు వల్ల దూరమయ్యేలా కనిపిస్తున్న ఈశాన్య ప్రాంత ప్రజల్ని మళ్లీ తమ వైపు తిప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఒత్తిడి పెంచుతున్న ఆరెస్సెస్ను ఎలాగైనా శాంతపరచాలి’..ఈ లక్ష్యాలతోనే బీజేపీ అనూహ్యంగా భారతరత్నకు ముగ్గురు విశిష్ట వ్యక్తుల్ని ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నా విపక్షాలు తప్పు పట్టలేని పరిస్థితి. జీవిత కాలమంతా కాంగ్రెస్కే సేవచేసిన ప్రణబ్ 2సార్లు ప్రధాని పదవిని తృటిలో కోల్పోయారు. రాష్ట్రపతి అయ్యాక బీజేపీ ఆయనతో మంచి సంబంధాలే కొనసాగించింది. ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హజారికాతో బీజేపీకి రాజకీయ సంబంధాలున్నాయి. 2004 లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్పై పోటీచేసి ఓటమిపాలయ్యారు. పౌరసత్వ బిల్లుతో అస్సాం రాజకీయ పార్టీలతో పెరిగిన దూరాన్ని హజారికా రూపంలోనైనా తగ్గించుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నానాజీ దేశ్ముఖ్ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1977లో మొరార్జీ దేశాయ్ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తామన్నా వద్దనుకుని సామాజిక సేవకు అంకితమయ్యారు. ఓవైపు, ఆయన సేవల్ని గౌరవిస్తూనే, మరోవైపు ఆరెస్సెస్ వ్యక్తికి భారతరత్న ఇచ్చుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
భారతరత్న అర్హత ప్రణబ్ ముఖర్జీకి లేదు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గతంలో ప్రణబ్ ముఖర్జీపై తమ సంస్థ తరుపున అమెరికాలో క్రిమినల్ కేసు వేశామని చెప్పారు. అమెరికా నుండి వచ్చి ఆయనకు సమన్లు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. చాలా క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ ప్రణబ్ అని, ఆయన చెప్పింది ఎప్పుడూ చేయలేదని విమర్శించారు. ఇవాళ అత్యంత విచారకరమైన రోజు అని, బ్లాక్ డే అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రణబ్కి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకని భారతరత్న అవార్డు ఇచ్చారో చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ సానుభూతి పరుడని ప్రణబ్కు అవార్డు ఇచ్చారని ఆరోపించారు. లోక్ సభలో మెజారిటీ ఉంది కదా అని ఎవరికి పడితే వారికి అవార్డు ప్రధానం చేస్తారా అని మండిపడ్డారు. లోక్ సభ స్పీకర్గా సేవాలందించిన బాలయోగికి ఎందుకని అవార్డు ఇవ్వలేదన్నారు. బాలయోగి దళితుడిని అవార్డు ఇవ్వలేదా? టీడీపీ కనీసం ఆ దిశగా కృషి చేయలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. -
ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
భారత రత్నాలు
-
రాజనీతిజ్ఞుడికి అసలైన గౌరవం!
దేశ రాజకీయాల్లో ఓ అరుదైన వ్యక్తిత్వం. విదేశాంగ, రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి భిన్నమైన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన సామర్థ్యం. దశాబ్దాల రాజకీయ జీవితంలో స్ఫూర్తిదాయక వ్యవహారశైలితో ఆదర్శంగా నిలిచిన మహామనీషి. చిన్న వయసులోనే రాజనీతిజ్ఞుడిగా, దౌత్యవేత్తగా, రచయితగా, జర్నలిస్టుగా, అధ్యాపకుడిగా ఇలా అవకాశం దొరికిన ప్రతి రంగంలోనూ సత్తా చాటుకున్న సమర్థుడు. ఇవన్నీ భారతదేశానికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురించిన కొన్ని అంశాలు మాత్రమే. 2012 నుంచి 2017 భారత 13వ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ దా.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి.. మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాల్లో వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా.. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలికి 23 ఏళ్లపాటు సీడబ్ల్యూసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడినపుడల్లా ట్రబుల్ షూటర్గా వ్యవహరించి గట్టెక్కించారు. దేశ రాజకీయాల్లో ప్రణబ్ సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఈ మహనీయుడి గురించిన కొన్ని విశేషాలు. నరనరాన దేశభక్తి 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్లోని బిర్భుమ్ జిల్లా మిరాటీలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో ప్రణబ్ దా జన్మించారు. ఆయన తండ్రి కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మి. తండ్రి స్వాతంత్య్ర పోరాటాన్ని చూస్తూనే ఆయన పెరిగి పెద్దవాడయ్యారు. చరిత్ర, రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. టీచర్గా వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రణబ్ దా.. చాలా రోజుల పాటు ‘దేశేర్ దక్’(మాతృభూమి పిలుపు) అనే పత్రికకు జర్నలిస్టుగా పనిచేశారు. తండ్రి అప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కావడంతో.. ఆయన అడుగుజాడల్లోనే ప్రణబ్ కూడా కాంగ్రెస్ ద్వారానే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఇందిర ప్రియశిష్యుడిగా.. జాతీయ రాజకీయాల్లో ప్రణబ్ జోరుకు బీజం పడింది మాత్రం 1969లోనే. ప్రణబ్ చొరవను, నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఇందిరాగాంధీ.. ఆయన్ను ప్రియశిష్యుడిగా చేసుకున్నారు. 1969లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. 1979లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవగానే.. సభలో పార్టీ ఉపనేతగా, ఇందిర కేబినెట్లో మంత్రిగా స్థానం సంపాదించారు. 1980లో రాజ్యసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రణబ్ సామర్థ్యాన్ని గుర్తించిన ఇందిర.. 1982లో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో ఇందిర తర్వాతి స్థానం ప్రణబ్దే అనుకునేవారు. అయితే 1984లో ఇందిర హత్యతో పరిస్థితి తారుమారైంది. పార్టీలో ప్రణబ్ ఎదుగుదలను ఓర్వలేని నేతలంతా ఏకమై.. పార్టీలో ఆయన్ను పక్కనబెట్టేలా రాజీవ్పై ఒత్తిడి తీసుకొచ్చారంటారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య వరకు పార్టీలో ప్రణబ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పీవీ నరసింహారావు ప్రధాని కాగానే.. ప్రణబ్కు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇవ్వడంతోపాటు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా నియమించారు. 1995–96ల్లో భారత విదేశాంగ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2004లో మళ్లీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2012 వరకు పార్టీ లోక్సభాపక్ష నేతగా ఉన్నారు. ఈ సమయంలోనే రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. సొంత కూటమి పెట్టినా.. ఇందిర మరణం తర్వాత పార్టీలో ఎదురవతున్న అవమానాలతో.. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. 1987లో రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తదనంతర పరిణామాలతో 1989లో ఈ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రచయితగా జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో.. వీలున్నపుడల్లా తన భావాలకు అక్షరరూపం ఇవ్వడాన్ని మాత్రం ప్రణబ్ మరిచిపోలేదు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. ఇందిర పాలనను, అధికారాన్ని దగ్గరగా చూసిన అనుభవం.. దౌత్యవేత్తగా ప్రపంచంలో భారత్ స్థానాన్ని అవగతం చేసుకున్న సమర్థుడిగా.. కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా దేశంలోపల సమస్యలను చూసిన వ్యక్తిగా తన అనుభవాలను, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పుస్తకాల్లో పేర్కొన్నారు. భారత 13వ రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ప్రభావవంతంగా సాగింది. లైంగిక నేరాలను తీవ్రంగా పరిగణించేలా.. ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ల్లో సవరణలు చేసిన ‘క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్స్ – 2013’కు ఆమోదముద్ర పడింది ఈయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే. మంత్రిగా ప్రణబ్.. కేంద్ర మంత్రిగా ఉన్న భారత్– అమెరికా పౌర అణు ఒప్పందంపై ఇరుదేశాల సంతకాలు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంపై అమెరికాను ఒప్పించిందీ ప్రణబ్ హయాంలోనే. జేఎన్యూఆర్ఎమ్ సహా పలు సామాజిక సంక్షేమపథకాలకు రూపకల్పన చేశారు. 1980ల్లో తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన సమయంలో.. తీసుకొచ్చిన మార్పులతో భారత ఆర్థిక వ్యవస్థ సంస్కరణవాదిగా పేరుతెచ్చుకున్నారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. 1957లో సువ్ర ముఖర్జీతో ఆయన వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. 2015లో ప్రణబ్ దా భార్య కన్నుమూశారు. దౌత్యవేత్తగా విశేషానుభవం రాజకీయవేత్తగానే కాదు.. దౌత్యవేత్తగానూ దేశానికి ప్రణబ్ దా సేవలందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకులకు బోర్డ్ ఆఫ్ గవర్నర్గా వ్యవహరించారు. కామన్వెల్త్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశాలకు 1982, 83, 84ల్లో భారత బృందానికి నేతృత్వం వహించారు. 1995లో అక్లాండ్లో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ సదస్సులోనూ భారత బృందానికి నాయకత్వం వహించారు. -
ప్రణబ్ ‘భారతరత్న’ ఆనందదాయకం
సాక్షి, అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు లభించ డం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రణబ్ ఈ అవార్డుకు అన్నివిధాలా అర్హుడన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని ప్రశంసించారు. ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా, ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త నానాజీ దేశ్ముఖ్కు మరణానంతరం భారతరత్న గౌరవం దక్కడంపై జగన్ సంతోషం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలను పొందిన తెలుగువారికి జగన్ అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు వేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ శుక్రవారం అభినందనలు తెలిపారు. ప్రణబ్ముఖర్జీకి భారతరత్నపై కేసీఆర్ హర్షం సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ప్రణబ్ ముఖర్జీ పూర్తి అర్హుడని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి, రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న చొరవను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. రాజనీతిజ్ఞుడిగా.. రచయితగా, దౌత్యవేత్తగా, పాలనాదక్షుడిగా ప్రణబ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. -
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం
-
ప్రణబ్దా భారతరత్న
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికా కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సుమారు నాలుగేళ్ల తరువాత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటిదాకా భారతరత్న పొందిన ప్రముఖుల సంఖ్య 48కి చేరింది. ప్రణబ్ ముఖర్జీ 2012–17 మధ్య కాలంలో భారత 13వ రాష్ట్రపతిగా పనిచేయగా, దేశ్ముఖ్, హజారికాలు మరణానంతరం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది ఆరెస్సెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రణబ్ ముఖర్జీ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో దేశ్ముఖ్ ఒకరు కాగా, ఈశాన్య భారత్ నుంచి సినీరంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖుల్లో హజారికా ఒకరు. దేశ ప్రజలకు తాను చేసిన దానికన్నా ప్రజలే తనకు ఎక్కువిచ్చారని ప్రణబ్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ‘ నాకిచ్చిన ఈ గొప్ప గౌరవాన్ని దేశ ప్రజల పట్ల పూర్తి కృతజ్ఞతా భావం, విధేయతతో స్వీకరిస్తున్నా. నేను ఎప్పటికీ చెప్పేదాన్నే మళ్లీ చెబుతున్నా. ఈ గొప్ప దేశ ప్రజలకు నేను చేసిన దానికన్నా నాకే వారు ఎక్కువిచ్చారు’ అని ట్వీట్ చేశారు. చివరగా 2015లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయకు భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణబ్, దేశ్ముఖ్, హజారికాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి మార్గంపై చెరగని ముద్ర: మోదీ ప్రణబ్ ముఖర్జీ, దేశ్ముఖ్, హజారికాల సేవల్ని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్లు చేశారు. దశాబ్దాల పాటు నిస్వార్థంగా ప్రజాసేవచేసిన ప్రణబ్ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞుల్లో గొప్పవారని, దేశ అభివృద్ధి మార్గంపై ఆయన చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ‘ప్రణబ్దాకు భారతరత్న రావడం పట్ల సంతోషంగా ఉంది. ఆయన తెలివి, ప్రజ్ఞకు సాటిగా నిలిచేవారు కొందరే ఉన్నారు’ అని అన్నారు. గ్రామీణాభివృద్ధిలో విశేష కృషిచేసిన దేశ్ముఖ్..గ్రామీణుల సాధికారతా విషయంలో గొప్ప మార్పులకు నాందిపలికారని కొనియాడారు. ‘అణగారిన, వెనకబడిన వర్గాల పట్ల కరుణ, విధేయత కనబరచిన దేశ్ముఖ్ నిజమైన భారతరత్న’ అని పేర్కొన్నారు. ఇక హజారికా సేవల్ని ప్రశంసిస్తూ ఆయన గేయాలు తరాలకు అతీతంగా గౌరవం పొందాయని అన్నారు. ‘హజారికా పాటలు న్యాయం, సమైక్యత, సోదరభావం అనే సందేశాలిస్తాయి. భారత సంగీత సంప్రదాయాల్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారు. భూపేన్ హజారికాకు భారతరత్న దక్కడం ఆనందంగా ఉంది’ అని మోదీ అన్నారు. ప్రజాసేవ చేసిన తమలో ఒకరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రావడం పట్ల కాంగ్రెస్ గర్విస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. హజారికా, దేశ్ముఖ్లకు కూడా ఈ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి సరసన ప్రణబ్.. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు. 2010లో మరణించే వరకు దేశ్ముఖ్ ఆరెస్సెస్తో సంబంధాలు కొనసాగించారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకల్పనలో, 1977లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. రుద్రాలీ, దార్మియాన్, గాజాగామిని, డామన్ లాంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు పలు అస్సాం సినిమాలకు హజారికా సంగీతం సమకూర్చారు. బెంగాల్ నుంచి ప్రణబ్కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. భారతరత్న పొందిన ప్రణబ్ ముఖర్జీకి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచిన ప్రణబ్ భారతరత్నకు ఎంపికవడం బెంగాల్ ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి అన్నారు. అధికార తృణమూల్, ప్రతిపక్ష సీపీఎంలు కూడా ప్రణబ్కు శుభాకాంక్షలు తెలిపాయి. ఆయన ఈ దేశానికి గొప్ప పుత్రుడు మాత్రమే కాదని, గొప్ప మానవతావాది కూడా అని తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు. సమాజ సేవకుడిగా.. నానాజీ దేశ్ముఖ్.. సమాజ సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన, బలహీన వర్గాల ఉద్ధరణకు నడుంబిగించి.. ఆ దిశగా గణనీయమైన మార్పును తీసుకొచ్చారు. గ్రామీణ స్వరాజ్యంతోపాటు దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో మార్పులకోసం తీవ్రంగా శ్రమించారు. 1916లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో నానాజీ జన్మించారు. ఆయన అసలు పేరు చండికాదాస్ అమృత్రావ్ దేశ్ముఖ్. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్గా జీవితాన్ని ప్రారంభించారు. చదువుకోవాలనే తన ఆశకు ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకిగా మారడంతో కూరగాయలు విక్రయించి వచ్చే డబ్బులతో చదువుకున్నారు. బాలా గంగాధర్ తిలక్ స్ఫూర్తిగా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. బిర్లా కాలేజీ (నేటి బిట్స్)లో విద్యాభ్యాసం చేశారు. భారతీయ జన్సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. ఆ తర్వాత బీజేపీలోనూ కీలక నేతగా బాధ్యతలు నిర్వహించారు. తను ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో ఎవరికీ రావొద్దని భావించి.. పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషిచేశారు. దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ఆయన ప్రారంభించారు. మంథన్ అనే పత్రికను స్థాపించి.. చాలా ఏళ్లపాటు తనే సొంతగా నిర్వహించారు. పుట్టింది మహారాష్ట్రలోనైనా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలోనే నానాజీ విస్తారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. 1977లో లోక్సభ ఎంపీగా గెలిచారు. 1999లో ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్చేసింది. దేశంలోనే తొలి గ్రామీణ యూనివర్సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్లోని ‘చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయ’నానాజీ ఆలోచనల ఫలితమే. 1974నాటి జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకర్తల్లో నానాజీ కూడా ఒకరు. 94 ఏళ్ల వయసులో 2010 ఆయన కన్నుమూశారు. బ్రహ్మపుత్ర కవి.. సుధాకాంత భూపేన్ హజారికా నేపథ్యమిదీ.. ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్ హజారికా..బ్రహ్మపుత్ర కవి, సుధాకాంత పేరుతో సుప్రసిద్ధులు. మానవత్వం, సోదరభావం, సార్వత్రిక న్యాయం ఉట్టిపడేలా ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషలు ముఖ్యంగా బెంగాలీ, హిందీలోకి తర్జుమా అయ్యాయి. అసోం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో ఆయన పాటలకు విపరీత ఆదరణ లభించింది. తన గాత్రంతో కొన్ని తరాలను ఉర్రూతలూగించారు. నేపథ్య గాయకుడు, సంగీతకారుడు, రచయిత, సినీ దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్ర వేసిన హజారికాను జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి. 1926 సెప్టెంబర్ 8న అస్సాంలోని సాదియాలో హజారికా జన్మించారు. పది మంది సంతానంలో పెద్దవాడైన హజారికా బాల్యం నుంచే తల్లి నుంచి అస్సామీ సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. పదేళ్ల వయసులో ఓ కార్యక్రమంలో అస్సామీ భక్తి గీతాలు ఆలపిస్తుండగా ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్ అగర్వాలా, సినీ దర్శకుడు విష్ణుప్రసాద్ రాభా దృష్టిలో పడ్డారు. తరువాత 1939లో అగర్వాలా సినిమాలో రెండు పాటలు పాడారు. 13 ఏళ్ల వయసులో సొంతంగా పాట రాశారు. 1946లో బెనారస్ హిందూ వర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన హజారికా కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. ఆ తరువాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఉపకారవేతనం లభించడంతో 1949లో న్యూయార్క్ వెళ్లారు. అక్కడ ప్రముఖ హక్కుల కార్యకర్త పాల్ రాబ్సన్తో ఏర్పడిన పరిచయం ఆయన జీవితంపై చాలా ప్రభావం చూపింది. కొలంబియా యూనివర్సిటీలోనే తనకు పరిచయమైన ప్రియంవదా పటేల్ను 1950లో వివాహమాడారు. 1953లో స్వదేశం తిరిగొచ్చారు. 1967–72 మధ్యలో అసోం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో బీజేపీ తరఫున గువాహటి నుంచి లోక్సభకు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1998–2003 వరకు సంగీత నాటక అకాడమీకి చైర్మన్గా వ్యవహరించారు. 2011 నవంబర్ 5న ముంబైలో కన్నుమూశారు. బ్రహ్మపుత్ర తీరంలో జరిగిన ఆయన అంత్యక్రియలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు.