
రేపు వైఎస్ఆర్ సీపీ ఎల్పీ సమావేశం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశం కానున్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశం కానున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు లోటస్పాండ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభంకానుంది. గురువారం నుంచి ప్రారంభమైయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాల్ని ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 11:34 నిమిషాలకు ప్రారంభించాలని నిశ్చయించారు. ఆరోజు ఉదయాన్నే విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేస్తారు.