Legislative Assembly
-
అప్పుల లెక్కలు.. అన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అప్పులు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిన అప్పులు.. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని వేడెక్కించాయి. ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సవాళ్లు.. ప్రతి సవాళ్లతో స భ అట్టుడికింది. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్రావుల మధ్య వాడివేడి వాదనలు కొనసాగాయి. అసత్యాలతో ప్రజలను త ప్పుదోవ పట్టిస్తున్నారని పరస్పరం విమర్శించుకుంటూ వారివారి లెక్కలను సభ ముందుంచారు. ప్రివిలేజ్ మోషన్పై మాట మార్చారు: భట్టి ‘రాజకీయాలు చేయటమే లక్ష్యంగా వ్యవహరించే హరీశ్రావు సభలో అన్నీ అబద్ధాలే చెబుతారు. ఏడాదిలో మేం చేసిన అప్పులపై ఆయన చెప్పే లెక్కలు సరికాదు. పదేళ్ల వారి పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దేందుకు కొంత అప్పు చేయక తప్పలేదు. ఇక పదేళ్ల వారి హయాంలో చేసిన అప్పుల లెక్కల్లోనూ ఆయనది ప్రజలను తప్పుదారి పట్టించే పద్ధతే. అందుకే మేం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం రూపంలో వాస్తవాలను ప్రజల ముందుంచాం. మళ్లీ చర్చ పెడితే నిరూపించేందుకు సిద్ధం. బీఆర్ఎస్ నేతలు 10 సంవత్సరాల పాలనలో తప్పులు చేసినందుకు గత డిసెంబర్లో జనం శిక్షించారు.ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలప్పుడు డిపాజిట్ దక్కకుండా వారికి మతిపోయేలా చేశారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఆ పార్టీది భూస్వామ్య మనస్తత్వం. భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సాయం చేయరా? అని ఖమ్మంలో ఓ విలేకరి అడిగినప్పుడు, వారికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పా. దాని ఆధారంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి, ఇప్పుడు అప్పుల మీద అవాస్తవాలు మాట్లాడితే ఇచ్చామంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారికి అనుకూలంగా సభ నియమాలు రూపొందించుకున్నారు.వారి నిబంధనల్లోనే సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని ఉంది..కానీ నిన్న తీసుకొచ్చారు. వీరా నామీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది? వారి హయాంలో స్పీకర్ శ్రీనివాస్రెడ్డి ఉన్నప్పుడు బీఏసీలో పాటించిన పద్ధతినే మేం ఇప్పుడు అనుసరిస్తున్నాం. ఇప్పుడు ప్రసాద్కుమార్ స్పీకర్గా ఉన్నారు. వ్యక్తి మారారు తప్ప స్పీకర్ స్థానం అదే. ఆ స్థానాన్ని గౌరవించాలి కదా.. నిన్న బీఏసీలో కాగితాలు విసిరి బయటకొచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. ఎఫ్ఆర్బీఎం కింద మేము రూ.51,277 కోట్లు మాత్రమే అప్పు చేశాం. గ్యారంటీల కింద రూ.61,991 కోట్లు, గ్యారంటీ లేని రుణా లు రూ.10,999 కోట్లు సమీకరించాం. మీ హయాంలో చేసిన అప్పుపై వడ్డీ రూపేణ రూ.66 వేల కోట్లు చెల్లించాం. మీరు పెట్టిపోయిన పెండింగు బిల్లులు రూ.40 వేల కోట్లలో ఇప్పటికి రూ.14 వేల కోట్లు చెల్లించాం.ప్రజల ఆస్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ఔటర్ రింగురోడ్డును ఆ ప్రభుత్వం 30 ఏళ్ల లీజు పేరుతో అమ్ముకుంది. అదే పద్ధతిలో మేం వచ్చే 30 ఏళ్ల కాలానికి జీఎస్టీ లాంటి ఆదాయ వ్యవహారాలను ఏ అదానికో, అంబానికో లీజుకిస్తే రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి?..’అని భట్టి నిలదీశారు. పరిమితంగానే మా అప్పులు: హరీశ్రావు ‘మా ప్రభుత్వం పరిమితంగా చేసిన అప్పును తప్పుడు లెక్కలతో పెంచి భూతద్దంలో చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధపు అప్పుల బూచి చూపి ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆటలు సాగనివ్వం. మేం చెప్పే లెక్కలే సరైనవని నిరూపించేందుకు సిద్ధం. సభలో ప్రత్యేక చర్చ పెట్టండి, ఆడిటర్లను, ఆర్థిక నిపుణులను పిలిపించుకోండి.. నేను చెప్పేవే సరైన లెక్కలని నిరూపిస్తాను.ఇది నా ఛాలెంజ్. ఆర్బీఐ నేటి లెక్కల ప్రకారం గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ.1,27,208 కోట్లు. ఐదేళ్లలో చేయబోయే అప్పు దాదాపు రూ.6,36,400 కోట్లు. కానీ మా ప్రభుత్వం పదేళ్ల కాలంలో తెచి్చన అప్పులు కేవలం రూ.4,17,496 కోట్లు మాత్రమే. ‘ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలను ఆయన ఉటంకించారు) కరోనా కారణంగా కేంద్రం అదనంగా 1.75 శాతం అప్పు తీసుకోవాలని సూచించడంతో తీసుకున్నాం. లేకపోతే అంతకూడా అప్పు అయ్యేది కాదు.దీనిపై నేను సవాల్ విసురుతున్నా.. చర్చకు సిద్ధం. మేం రూ.6,71,757 కోట్లు అప్పు తీసుకున్నామని ఒకసారి, రూ.7 లక్షల కోట్లు అని మరోసారి, సభలో రూ.7,11,911 కోట్ల అప్పులంటూ నోటికొచి్చనట్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తా. ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఏసీతో సంబంధం లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడం వింతగా ఉంది. గత సభలో అప్పుల గురించి తప్పుడు లెక్కలు చూపినందుకే భట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ మరో అంశంపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తాం..’అని హరీశ్రావు సవాల్ చేశారు. -
ఇక నిలదీయడమే!
సాక్షి, హైదరాబాద్: పాలకుల అసమర్ధతపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ ఎస్.. ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమ యం ఇచ్చామని, సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత విధానాలను ఎండగట్టాలని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లి నివాసంలో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. నమ్మి ఓట్లేసిన వాళ్లను వేధిస్తున్నారు.. ‘త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. నమ్మి ఓట్లు వేసిన రైతులు, గిరిజనులు, దళితులను వేధిస్తోంది. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చింది. ఉద్యోగులకు మొండి చేయి చూపుతూ కేవలం ఒకేఒక్క డీఏను విడుదల చేసి అది కూడా 17 వాయిదాల్లో చెల్లిస్తోంది.దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గురుకుల విద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. విషాహారంతో పిల్లలు చనిపోవడాన్ని చూసి సభ్య సమాజం సిగ్గు పడుతోంది. గురుకుల బాట పేరిట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీని ప్రభుత్వం అడ్డుకుంది. గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పార్టీ కమిటీ నివేదిక ఇచ్చింది. గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలపై బీఆర్ఎస్ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తుంది. గురుకుల విద్యా సంస్థల్లో వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలి..’ అని కేసీఆర్ సూచించారు. తెలంగాణ అస్తిత్వం మీద సోయి లేదు ‘తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల మీద సోయి లేని సీఎం కేవలం రాజకీయ స్వార్ధంతో పాటు నాపై ఉన్న కక్షతో తెలంగాణ విగ్రహం రూపురేఖలు మార్చే పిచ్చి పనులకు పూనుకుంటున్నాడు. తెలంగాణ తల్లి భావన కేవలం నాది మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ సమాజానిది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే మూర్ఖత్వంతో సీఎం వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రామాత అనే భావన ముందుకు తెచ్చిన అక్కడి నాయకత్వం తర్వాత తెలుగు తల్లిని తెరమీదకు తెచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని మరిపించింది.తెలుగు తల్లి విగ్రహం ఒక రకంగా తెలంగాణ ప్రజల్లో అస్తిత్వ భావనకు ఊపిరిపోసింది. ఇక్కడి ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా తెలంగాణ తల్లిని భగవత్ స్వరూపంలో చేతులెత్తి మొక్కేలా రూపొందించాం. అనేకమంది మేధావులు, కవులు, కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి, శ్రమించి తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సామాజిక నేపథ్యంలో నుంచి ప్రస్తుత తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దారు. సమైక్య పాలనలో మరిచిపోయిన తెలంగాణ ప్రతీకలను ఉద్యమ సమయంలో పునరుజ్జీవింప చేసుకోవడానికే తెలంగాణ తల్లిని నిలుపుకున్నాం.కానీ తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై అవగాహన లేని సీఎం తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెస్తున్నారు. కొత్త రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ విగ్రహం ఆవిష్కరణకు నన్ను ఆహా్వనించడం వెనుక ఉన్న కోణం, ఉద్దేశం ఏదైనా ఇంటికి వచ్చిన మంత్రికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారం భోజనం పెట్టి సాదరంగా గౌరవించాం..’ అని మాజీ సీఎం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి నేను చేపట్టిన అనేక పనులు, పథకాలను ప్రారంభిస్తున్నాడు. యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ ఆనవాలు అనే విషయం తెలియదా. వ్యవసాయ రంగాన్ని నిరీ్వర్యం చేయడంపై అసెంబ్లీలో నిలదీయాలి, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరీకరిచేందుకు దార్శనికతతో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఎలాంటి పరిమితులు విధించకుండా రైతుబంధును అందజేశాం. కానీ ఎన్నికల సమయంలో రైతులకు ఆశపెట్టి ఎగవేస్తున్న ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో ఎండగట్టాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హామీల అమలుపై నిలదీయాలి. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికే పరిమితం కాకుండా గతంలో బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను వివరించాలి..’ అని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఏడాదంతా సంస్థాగత నిర్మాణం ‘ప్రజలు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ను మాత్రమే చూస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో వరంగల్, హైదరాబాద్ కాకుండా అందరికీ అందుబాటులో ఉండే చోటును చాటుకుని భారీ జనసమీకరణతో సభ నిర్వహిద్దాం. వచ్చే ఏడాదంతా పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపైనే దృష్టి పెడదాం. జమిలి ఎన్నికలు జరిగే పక్షంలో పెద్దగా సమయం ఉండదు. మళ్లీ అధికారంలోకి వంద శాతం మనమే వస్తాం..’ అని బీఆర్ఎస్ అధినేత భరోసా ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని పార్టీ కమిటీ కేసీఆర్కు ‘గురుకుల బాట’ నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా కమిటీని కేసీఆర్ అభినందించారు. ఇలావుండగా హైదరాబాద్లో ఈ నెల 11న జరిగే తన పెద్ద కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి.. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ను, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించారు. -
నిరుద్యోగ భృతి ప్రతిపాదనే లేదు
సాక్షి, అమరావతి: జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువతకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలన్నింటినీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత భవిష్యత్తో చెలగాటం ఆడుతున్న బాబు ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచి్చన నిరుద్యోగ భృతి హామీ అమలును సైతం గాలికి వదిలేసింది. నిరుద్యోగులకు భృతి అందించే ప్రతిపాదనే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని శుక్రవారం శాసన సభ సాక్షిగా ప్రభుత్వం రాతపూర్వకంగా తేల్చి చెప్పింది. పైగా రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు కాకి లెక్కలు చూపించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై నిరుద్యోగ యువత భగ్గుమంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకూ నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తీరా గద్దెనెక్కి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఆ హామీ అమలుపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం నిరుద్యోగ భృతికి ఎటువంటి కేటాయింపులు చేయలేదు. కొత్త ఉద్యోగాల భర్తీపై స్పష్టతా ఇవ్వలేదు. వాస్తవానికి రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికొక్కరు చొప్పున వేసుకున్నా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతికి రూ.4,800 కోట్లు ఖర్చు చేయాలి. అంటే ఏడాదికి సుమారు రూ.57,600 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి ఖర్చవుతుంది. అయితే రాష్ట్రంలో 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు బాబు ప్రభుత్వం వెల్లడించడం యువతను మోసగించడమేనని పలువురు చెబుతున్నారు.ఉచిత బస్సు మరింత దూరం..!మరోవైపు రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను కూడా బాబు ప్రభుత్వం దగా చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారు. అధికారం చేపట్టి ఐదు నెలలు దాటినా ఈ హామీ అమలుపై కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఇంకా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని శాసన సభలో రాతపూర్వకంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, మార్గదర్శకాలు, విధివిధానాలు అంటూ హామీ అమలును దాటవేస్తున్నారు. ఇప్పుడూ ఇదే చెప్పడంపై మహిళాలోకం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. మహిళలకు బస్ ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రత్యేక వ్యవస్థ అవసరం లేదని, ఉన్న బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడానికి మార్గదర్శకాల రూపకల్పన అంటూ ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారని నిలదీస్తున్నారు. -
పోలీసులు వచ్చే లోపే తిరగబడి కొట్టండి
సాక్షి, అమరావతి: ‘మృగాల కంటే హీనంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఏం చేయాలన్నా చట్టం కట్టేస్తోంది. పోలీసులు వచ్చే లోపే ప్రజలు తిరుగుబాటు చేసి వారిని కొట్టాలి’ అంటూ సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో చెప్పారు. సభలో ప్రవేశ పెట్టిన వివిధ బిల్లులు, తీర్మానాలపై ఆయన మాట్లాడారు. గతంలో ఇంతకంటే కష్టమైన పరిస్థితులు చూశానని, హైదరాబాద్లో ఉగ్రవాదం, విద్వేషాలు, మత కలహాలు, సీమలో ఫ్యాక్షన్ , విజయవాడలో రౌడీయిజం ఉండేదన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ను అణచివేశామన్నారు. ముంద్రా పోర్టుకు ఏపీ అడ్రస్తో డ్రగ్స్ వచ్చాయని, దానిపై నిరసన తెలిపితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో నేరాలన్నీ గంజాయి మత్తులోనే చేస్తున్నారని, కాలేజీ పరిసరాల్లోకి కూడా గంజాయి వెళ్లిందని చెప్పారు. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడిన వారిని మార్చడం కష్టమని అన్నారు. తల్లి, చెల్లిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిని జగన్ ప్రోత్సహించారని ఆరోపించారు. డిజిటల్ కార్పొరేషన్లో సొంత మనుషులను పెట్టి సోషల్ మీడియాలో పని చేయించుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా లాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. సివిల్ జడ్జి అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారన్నారు. ఎవరినైనా లాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారిగా పెట్టుకునేలా చట్టంలో పేర్కొన్నారని, అంటే ‘సాక్షి’లో పని చేసే గుమస్తాలను అధికారులుగా పెట్టాలని చూశారని అన్నారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్చాలంటే ఆ యజమానికి నోటీసు కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా నేరుగా హైకోర్టులో తేల్చుకునేలా చేశారన్నారు. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామన్నారు. తాము తెచ్చిన యాంటీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఎక్కడ భూమి కబ్జా చేసినా, ప్రయత్నించినా, బెదిరించినా శిక్షిస్తామని, భూమి కబ్జా చేయలేదని కూడా వారే నిరూపించుకోవాలని అన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డవారిని 6 నెలల్లోనే శిక్షిస్తామని, ఇసుక అక్రమాలకు, బియ్యం స్మగ్లింగ్కు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేయాలని హోం మంత్రి అనితకు సూచించారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి రాజధానిలో 5 ఎకరాలు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే 6,100 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 2,812 పోలీస్ వాహనాల కొనుగోలుకు రూ.281 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రూ.859 కోట్ల బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం, తిరుపతి, రాజమండ్రిలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లు, రాజధానిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు.వివేకా హత్యపై అధికారులూ అదే చెప్పారువివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఉదయం సాక్షిలో గుండెపోటుతో చనిపోయారని కథనం నడిపారని, తానూ దానిని నమ్మానని, అధికారులు, విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పారని చంద్రబాబు అన్నారు. అక్కడి సీఐని మేనేజ్ చేశారని, రక్తం మరకలు కనబడకుండా బాత్రూమ్ క్లీన్ చేసి మృతదేహాన్ని వెంటనే ఫ్రీజర్లో పెట్టారన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి పోస్టుమార్టం చేయాలని అడగ్గా, అప్పుడు నెత్తిపైన గొడ్డలి వేట్లు ఉన్నాయని తేలిందన్నారు. గిరిజన మ్యూజియంకు అల్లూరి పేరుభోగాపురం విమానాశ్రయానికి, అక్కడి గిరిజన మ్యూజియంకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేంత వరకూ కేంద్రంపై పోరాడతామని తెలిపారు. దేవాలయాల కమిటీల్లో విశ్వ బ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కోరారు. శాసనసభలో బుధవారం ఆమోదించి మండలికి పంపిన నాలుగు బిల్లులు యధాతథంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు గురువారం శాసన సభలో చెప్పారు. ఇప్పటికే ఈ అంశాన్ని కేబినెట్ ఆమోదించిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ గురువారం సభలో ప్రవేశపెట్టారు. మంత్రి సవిత, పలువురు రాయలసీమ ఎమ్మెల్యేలు తీర్మానంపై మాట్లాడారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కర్నూలును బెస్ట్ టౌన్గా మార్చడంలో భాగంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యాలయాలు కూడా అక్కడే ఉంటాయన్నారు. వికేంద్రీకరణ తమ విధానమని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో కర్నూలు, తిరుపతి, ఇక్కడ అమరావతి అభివృద్ధి చేస్తామన్నారు.హార్టికల్చర్ అభివృద్ధి చేస్తే రాయలసీమకు మహర్దశ వస్తుందని చెప్పారు. అనంతపురానికి బెంగళూరు ఎయిర్పోర్టు, కర్నూలుకు హైదరాబాద్ ఎయిర్పోర్టు, చిత్తూరుకు చెన్నై ఎయిర్పోర్టు దగ్గరగా ఉన్నాయని, ఈ అవకాశాన్ని అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చన్నారు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదన్నారు.చెత్త యూజర్ చార్జీలు, కాంట్రాక్టర్ల లబ్ధిపై విచారణ: మంత్రి నారాయణ గత ప్రభుత్వంలో చెత్తపై యూజర్ చార్జీల వసూలు, కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు.5 లక్షల ఉద్యోగాలు: మంత్రి లోకేశ్వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ఏ ప్రభుత్వం హామీ ఇవ్వలేదని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అండ్ డేటా సెంటర్ పాలïÜలపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో 53 కంపెనీలు, రూ.17 వేల కోట్ల పెట్టుబడి, 96,220 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. -
సంప్రదాయానికి తూట్లు
సాక్షి, అమరావతి: పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి రాకుండా చేసి శాసనసభ వ్యవహారాల్లో అనాదిగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారు. పారదర్శకత ఉండాలంటే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు ఉండటం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఇవ్వాల్సిన పదవిని కూడా తమ కూటమికే దక్కేలా అన్ని స్థానాలకు తమ సభ్యులతో నామినేషన్లు వేయించి ఎన్నిక జరిగేలా చేశారు. దీంతో శాసనసభ చరిత్రలో తొలిసారి పీఏసీ కమిటీకి ఎన్నిక అనివార్యమైంది. ఈ కమిటీలో 12 మంది సభ్యులకు అవకాశం ఉండగా.. 9 ఎమ్మెల్యేల తరఫున, మూడు ఎమ్మెల్సీల తరఫున ఎన్నికవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీల తరఫున ఉన్న మూడు స్థానాలకు కేవలం మూడు నామినేషన్లు రావడంతో అవి ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 స్థానాలకు 10 నామినేషన్లు దాఖలవడంతో ఎన్నిక తప్పనిసరైంది. 9 స్థానాలకు కూటమి తరఫున 9 నామినేషన్లు, వైఎస్సార్సీపీ తరఫున ఒక నామినేషన్ (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి) దాఖలవడంతో శుక్రవారం ఎన్నిక నిర్వహించనున్నారు.ఆనవాయితీకి చెల్లుచీటీపీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పదవిని ప్రతిపక్ష పార్టీకి వదిలిపెట్టాలనే సంప్రదాయం పార్లమెంటు నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభల్లోనూ కొనసాగుతోంది. అప్పుడే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షానికి వస్తుందని ఈ సంప్రదాయాన్ని తెచ్చారు. ప్రతిపక్షానికి పీఏసీ కేటాయించాలనేది ప్రజాస్వామిక స్ఫూర్తి. కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం అనే దాన్నే గుర్తించకుండా, పీఏసీ కూడా వారికి ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రజల గొంతు ఏమాత్రం వినపడకూడదనే ఉద్దేశంతో దాన్ని కూడా తామే చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లే పీఏసీ తీసుకుంటే ఇక ప్రజల తరఫున మాట్లాడేవాళ్లే ఉండరనే దుర్బుద్ధితోనే దాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది. పీఏసీ అనే దానిలోనే పబ్లిక్ అనే పదం ఉంది. అంటే ప్రజలకు సంబంధించిన పదవి అని అర్థం. ప్రతి అంశం పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరిగింది. నామినేషన్ దాఖలులో హైడ్రామా మరోవైపు పీఏసీ సభ్యత్వాలకు వైఎస్సార్సీపీ సభ్యులు నామినేషన్లు వేసే సమయంలోనూ హైడ్రామా నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సివుండగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆ సమయంలో అందుబాటులో లేకుండాపోయారు. పీఏసీ సహా ఇతర రెండు కమిటీల సభ్యత్వాలకు నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు సెక్రటరీ జనరల్ చాంబర్కి వెళ్లారు. కానీ.. ఆ సమయంలో ఆయన కావాలని అసెంబ్లీలోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికల అధికారి (సెక్రటరీ జనరల్) తన చాంబర్లో అందుబాటులో ఉండాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరొకరిని నియమించాలి. కానీ.. సమయం దాటిపోయే వరకూ నామినేషన్లు తీసుకోకుండా ఉండేందుకే ఆయన దురుద్దేశంతో అసెంబ్లీలో ఉండిపోయినట్టు సమాచారం. గంటన్నరపాటు ఎదురుచూసినా ఆయన రాకపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. సెక్రటరీ జనరల్ దురుద్దేశపూర్వకంగా చాంబర్లోకి రావడంలేదనే విషయం తెలుసుకుని ఆయన కూడా చాంబర్ వద్దకెళ్లారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు తీసుకోకుండా ఉండటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న మరో చాంబర్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉండటంతో ఆయన్ను కూడా ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. దీంతో అచ్చెన్నాయుడు వెంటనే అసెంబ్లీలోకి వెళ్లి సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ను బయటకు పంపారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కొద్ది నిమిషాలు ఉందనగా.. సెక్రటరీ జనరల్ హడావుడిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నుంచి నామినేషన్లు స్వీకరించారు. బొత్స సత్యనారాయణ సభలోనే ఉంటే నామినేషను దాఖలుకు అవకాశం ఇవ్వకుండా చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా చేసి ఉంటే.. 2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి అప్పట్లో ఈ పదవి ఇచ్చారు. అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించారు. సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సంప్రదాయాలకు గండిపడింది. -
శాసనమండలి నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
-
ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు
సాక్షి, అమరావతి: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు రాష్ట్ర శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు మరో నాలుగు బిల్లులను కూడా ఆమోదించింది. ఒక బిల్లు వాయిదా పడింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లు 2024 బిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. గతంలో జరిగిన చట్ట సవరణల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చెప్పారు. అయితే, గత మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ చర్యలతో సంతానోత్పత్తి సామర్ధ్యం రేటు బాగా తగ్గిపోయిందన్నారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేసినట్లు వివరించారు. గతంలో ఆ చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్లను తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.జనాభా పెరగదుఈ బిల్లుపై అధికార కూటమి శాసన సభ్యులే పలువురు పెదవి విరిచారు. చట్ట సవరణ చేసినప్పటికీ, ప్రస్తుత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సంతానోత్పత్తి పెరగకపోవచ్చునని, పైగా సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా ఆలోచిస్తే ఈ సవరణ సంతానోత్పత్తి రేటు వృద్ధికి దోహద పడదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. జననీ సురక్ష పథకం ఒక్కరికే వర్తిస్తుందని, ఇద్దరు పుడితే ఆ పథకం వర్తించదని చెప్పారు. ఇటువంటి నిబంధనలు ఉన్నన్ని రోజులూ సంతానోత్పత్తి రేటు పెరగదని స్పష్టం చేశారు. కుటుంబాలను ఆదుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలైన రోజే సంతానోత్పత్తి రేటు పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో యువత పెరగడానికి ఈ సవరణ తోడ్పడుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి అన్నారు.మరి కొన్ని బిల్లులకూ ఆమోదంవైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన మూడు బిల్లులను శాసన సభ ఆమోదించింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఫార్సు మేరకు మూగ, చెవిటి, కుష్టు పదాలను తొలగిస్తూ ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2024ను సభ ఆమోదించింది. ఆయా సమస్యలున్న వారికి విశ్వవిద్యాలయం ఈసీ సభ్యులుగా అవకాశం కల్పించేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి చెప్పారు. అదే విధంగా ఈ మూడు పదాలను తొలగిస్తూ ఏపీ ఆయుష్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లులనూ సభ ఆమోదించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు –2024కు కూడా సభ ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖ మంత్రి అభ్యర్థన మేరకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్–2024ను మరో రోజుకు వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. -
'నిజమే'.. నిత్యావసరాల ధరలు పెరిగాయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినట్టు ప్రభుత్వం శాసన సభలో అంగీకరించింది. కీలకమైన నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయా అంటూ వైఎస్సార్సీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, దాసరి సుధ అడిగిన ప్రశ్నను ప్రశ్నోత్తరాల సమయం షెడ్యూల్లో ఉంచినప్పటికీ సంబంధిత మంత్రి సమాధానం చెప్పకుండా దాటవేశారు. సంబంధిత విభాగం ద్వారా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. జూన్తో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగినట్లు ప్రభుత్వం ఆ సమాధానంలో తెలిపింది. శనగపప్పు 17 శాతం, సన్ఫ్లవర్ నూనె 21 శాతం, పామాయిల్ 33 శాతం, ఉల్లిపాయలు 87 శాతం ధరలు పెరిగినట్టు ప్రకటించింది. రైతుబజార్లలో సబ్సిడీపై సరుకులను అందిస్తున్నామంది.అతిసార మృతుల కుటుంబాలకు పరిహారం లేదుసోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. విజయనగరం జిల్లాలో ఇటీవల అతిసారతో మరణించిన వ్యక్తుల వివరాలు చెప్పాలని, వారికి ఎలాంటి పరిహారం ఇస్తారో చెప్పాలని అడిగిన ప్రశ్నకు సమధానం చెప్పినట్టే భావించాలని స్పీకర్ ప్రకటించారు. అయితే, నలుగురు మాత్రమే అతిసారతో చనిపోయారని, వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.రీసర్వేలో తప్పుచేసిన అధికారులను శిక్షిస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్ గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని 22ఏ నుంచి తొలగించారని, ఇందులో అక్రమాలు జరిగాయని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 25 వేల రిజిస్ట్రేషన్లలో 8 వేల వరకు తప్పు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామన్నారు. గత ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు అసైనీలను బెదిరించి లాక్కోవడమే కాకుండా రిజిస్ట్రేషన్లు త్వరగా చేసుకునేందుకు జీవోలు కూడా ఇచ్చారన్నారు. నంద్యాల, పుట్టపర్తి, రాయచోటి, విశాఖలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, అందుకే ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తెస్తున్నట్టు చెప్పారు. 70 వేలకుపై అర్జీలు రీ సర్వేపైనే వచ్చాయన్నారు. రీ సర్వే పూర్తయిన 6,700 గ్రామాల్లో సభలు పెట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు. వాటిన్నింటినీ పాత పద్ధతిలో వెబ్ల్యాండ్లో పెట్టి రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. తప్పు చేసిన అధికారులను కూడా శిక్షిస్తామని చెప్పారు. ఇనాం భూములపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టి న్యాయం చేస్తామన్నారు.సర్వే చేసి హౌసింగ్ బిల్లులు చెల్లిస్తాం: గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిగత ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు హౌసింగ్ ప్రోగ్రామ్ మచ్చుతునక అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులను నిలిపివేసిందని, గ్రామాల్లో ఇళ్ల పరిస్థితిపై సర్వే చేసిన అనంతరం పాత బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. విశాఖలో గృహాల నిర్మాణం 2026 మార్చికి పూర్తి చేస్తామన్నారు.జగనన్న కాలనీల్లో లోన్లు ఎక్కడా బలవంతంగా తీసుకోలేదని, 52 వేల మంది బ్యాంకు రుణాలు తీసుకున్నారని, ఈ మొత్తం కలెక్టర్ వద్దే ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో యూఎల్బీలో యూనిట్ ధర తగ్గించడంతో రుణాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వీటిలో ఎక్కడా తప్పులు జరగలేదని మంత్రి వివరించారు. వైఎస్ జగన్ని దూషించిన బుచ్చయ్య చౌదరిజగనన్న కాలనీ ఇళ్లను ప్రస్తావిస్తూ రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ సీఎం వైఎస్ జగన్ను తీవ్ర పదజాలంతో దూషించారు. జగనన్న కాలనీల పేరుతో వేల ఎకరాలు కొని, అన్యాక్రాంతం చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని అన్నారు. ఆ భూములు నిర్మాణాలకు ఉపయోగపడవన్నారు. ప్రతిచోటా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పట్టాపై వైఎస్ జగన్ బొమ్మ వేసుకుని పనికిరాని పట్టాలు ఇచ్చారని, ఇవేమన్నా ఆయన సొంత ఆస్తులు ఇస్తున్నారా అంటూ విమర్శించారు.మల్లవల్లి పారిశ్రామికవాడలో సమస్యలు లేవు: మంత్రి టీజీ భరత్మల్లవల్లి పార్కులో సదుపాయాల కొరతతో యాజమాన్యాలు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్న విషయంలో వాస్తవం లేదని, అక్కడ ఎలాంటి సమస్యలు లేవని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.మత్స్యకార భరోసా ఇవ్వలేంవ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుమత్స్యకారులకు 2014–19 మధ్య మేలు జరిగితే, గత ఐదేళ్లలో ప్రభుత్వం వారిని నాశనం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈనెల 21న మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేమని, అసలైన అర్హులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నామని చెప్పారు. వేట విరామ సమయంలో గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.5 వేలు ఇచ్చేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానిని రూ.10 వేలకు పెంచిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఒక్కటీ తప్ప గత ఐదేళ్లలో మత్స్యకారులకు ఏదీ అందలేదన్నారు. గత ఐదేళ్లల్లో 63 మంది వేటకెళ్లి చనిపోతే పరిహారం ఇవ్వలేదన్నారు. కాగా, మత్స్యకారుల అంశంపై ప్రత్యేక చర్చ పెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.ఆర్టీసీలో సిబ్బంది క్రమబద్ధీకరణ లేదు: మంత్రి రాంప్రసాద్రెడ్డిఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్లు పోస్టుల కొరత ఉందన్నారు. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించే ప్రతిపాదన లేదన్నారు. ఆన్ కాల్ డ్యూటీ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఆర్టీసీ విలీనం అశాస్త్రీయంగా జరిగిందని అన్నారు. ఆర్టీసీలో 18 విభాగాల్లో 7,545 పోస్టులు పెండింగ్ ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు తెలిపారు. గత ప్రభుత్వం ఆన్ కాల్ డ్యూటీ ప్రవేశపెట్టి, అనుభవం లేని డ్రైవర్లను విధుల్లోకి తెస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సిబ్బందిని చిన్న విషయానికి కూడా శిక్షిస్తున్నారని తెలిపారు. ఈహెచ్ఎస్ను పాత విధానంలో అమలు చేయాలని కోరారు. -
వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 13,497 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకం 16,347 టీచర్ పోస్టుల భర్తీపై చేసినట్టు వివరించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వచ్చే ఆరు నెలల్లో నోటిఫికేషన్ జారీచేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. అభ్యర్థుల వయోపరిమితి పెంచే ఆలోచన చేస్తున్నామన్నారు. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ఆలోచనచేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఉపాధ్యాయులు ధర్నా చేసినప్పుడు అనేక కేసులు పెట్టారని, త్వరలో వాటిని తొలగిస్తామని చెప్పారు. ఉన్నత విద్యపై అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సంస్కరణలు తెస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక ఇంటర్లో 15 వేల అడ్మిషన్స్ పెరిగాయని చెప్పారు. తాము నారాయణ విద్యాసంస్థలతో పోటీపడేలా పనిచేస్తున్నామని, 9వ తరగతి నుంచే క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి స్కూల్స్కు ర్యాంకింగ్స్ ఇస్తామన్నారు. నాడు–నేడుతో ప్రయోజనం లేదు గత ప్రభుత్వం టీచర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఘనంగా మోసం చేసిందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా చాకరీ చేయించిందని విమర్శించారు. ఉపాధ్యాయులకు అదనపు పనులు చెప్పడంతో వారు పాఠాలు చెప్పలేకపోతున్నారని, దీంతో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రావాలన్నారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంతో ఎలాంటి ప్రమోజనం లేదని, దీనివల్ల చాలా నష్టం జరిగిందన్నారు.. పాఠశాలలు శిథిలమైపోయాయన్నారు. విద్యారంగానికిరూ.29 వేల కోట్లు కేటాయించడం హర్షించతగ్గ విషయమన్నారు. -
3లక్షల పింఛన్లు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. అనర్హత పేరుతో మూడు లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు గురువారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు. 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, 2.5 లక్షలు కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి బదులిచ్చారు. దివ్యాంగులు కానివారు కొంతమంది డాక్టర్ల ద్వారా నకిలీ సరి్టఫికేట్ పొంది పింఛన్లు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయని, వాటన్నింటినీ తనిఖీ చేసి అనర్హులను తొలగిస్తామని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మంత్రి చెప్పాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రశ్నించారు. కానీ ఈ ప్రశ్నకు మంత్రి కొండపల్లి స్పందించలేదు. విశాఖలో భూ కుంభకోణాలపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ లేదా హౌస్ కమిటీ వేయాలని సంబంధిత మంత్రికి స్పీకర్ సూచించారు.విశాఖలోని రుషికొండలో నిరి్మంచిన భవనాల నిర్మాణ ఖర్చులు రూ.409.39 కోట్ల వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో వివరించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ రుషికొండలో భవనాలు కూల్చేయాలన్న పిటిషన్ను వెనక్కితీసుకుంటామని చెప్పారు. సీట్లు కేటాయించండి అధ్యక్షా! పారీ్టలు మారినట్లు అసెంబ్లీలో సీట్లు మారుతుంటే కష్టంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సభలో ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యులకు ఎవరి సీట్లు వారికి కేటాయిస్తే బాగుంటుందని ఆయన స్పీకర్ను కోరారు. అంతా మన హౌసే కదా... అని స్పీకర్ చెప్పగా... అయినా కూడా ఎవరి సీట్లు వాళ్లకు ఇవ్వాలని బుచ్చయ్య స్పష్టంచేశారు. డిసెంబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఆయన సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో సమీక్ష జరిపారు. -
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ
అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా. -
Sikkim: ఎస్కేఎం శాసనసభాపక్ష నేతగా తమాంగ్
గ్యాంగ్టక్: సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్కేఎం) శాసనసభా పక్ష నేతగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ అసెంబ్లీలోని 32 సీట్లకు గాను 31 సీట్లను కైవసం చేసుకోవడం తెల్సిందే. ఆదివారం రాత్రి సీఎం తమాంగ్ అధికార నివాసంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎస్కేఎం సెక్రటరీ జనరల్ అరుణ్ ఉప్రెటి శాసనసభా పక్ష నేతగా తమాంగ్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే సోనమ్ లామా బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి తమాంగ్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. -
టార్గెట్ హిమాచల్ప్రదేశ్?
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్ప్రదేశ్కు పంపించారు. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్ప్రదేశ్లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిõÙక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు బీజేపీ అభ్యరి్థకి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ‘జైశ్రీరామ్, బన్ గయా కామ్’ అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్కు సమరి్పంచానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు హిమాచల్ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్దన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారీ్టలో పడిందని, ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది. ప్రజా తీర్పును కాపాడుకుంటాం హిమాచల్ప్రదేశ్లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమరి్పంచాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచి్చన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేలి్చచెప్పారు. హిమాచల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు. -
కేజ్రీవాల్ సర్కారు విశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా గైర్హాజరవడంతో శనివారం తమ ముందు హాజరుకావాలని సిటీ కోర్టు కేజ్రీవాల్ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగడం గమనార్హం. విశ్వాస తీర్మానంపై శనివారం సభలో చర్చించనున్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్షకు సిద్ధపడటం ఇది రెండోసారి. ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయడమే ఇందుకు కారణం. శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన బలపరీక్షకు దిగారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
శాసనసభలో సెల్ఫోన్లు వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: శాసనస సభ స్పీకర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి సభలో సభ్యులెవరూ సెల్ఫోన్లు, ట్యాబ్లు, ఇతర ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్ను వినియోగించకూడదని రూలింగ్ ఇచ్చారు. వాటిని ఉపయోగించి వీడియోలు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ‘కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే అంశం’మీద సభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా అధికార–ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సమయంలో, ఆ నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించిన అప్పటి నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ప్రస్తుతం మాజీ) మురళీధర్రావు పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించారు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇ రుకున పెట్టింది. ఈ నేపథ్యంలో సభలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగంపై గురువారం స్పీకర్ నిర్ణ యం వెల్లడించటం విశేషం. స్పీక ర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలో వాటిని వినియోగించవద్దని స్పష్టం చేశారు. మీడియా పాయింట్ వద్ద కూడా ఇక సీఎం రేవంత్రెడ్డి బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీదట బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడేందుకు సభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు వస్తుండగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సభ జరుగుతున్న తరుణంలో మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ వారు పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నేలమీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే స్పీకర్ ప్రసాద్కుమార్ కీలక ప్రకటన చేశారు. సభ జరుగుతున్న తరుణంలో సభా ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశానికి అనుమతి లేదని, టీ, లంచ్ విరామ సమయాల్లో, సభ వాయిదా పడ్డ తర్వాత యధావిధిగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. -
నేడు అసెంబ్లీకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. శనివారం రాష్ట్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు. బడ్జెట్ను శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెడతారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో కేసీఆర్ డిసెంబర్ 8న జారిపడి గాయపడ్డారు. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్.. ఈనెల 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే కేసీఆర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈమేరకు బులెటిన్ కూడా విడుదలైంది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది. -
కేసీఆర్కు ఈ చాంబర్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఇన్నర్ లాబీలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏళ్ల తరబడి కేటాయిస్తూ వస్తున్న చాంబర్ను తొలగించి తాజాగా కె.చంద్రశేఖరరావుకు ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాల తొలిరోజున గురువారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ చాంబర్కు వెళ్లి తమ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్రావు, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ చాంబర్ను మార్చడాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ఇన్నర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక చాంబర్ను కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్ను ఔటర్ లాబీకి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన పలు సంఘటలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి భార్య వచ్చేంత వరకు సుమారు రెండు గంటల పాటు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారన్నారు. నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్ తదితర నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులను పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో అనుసరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అధికారులను ఆదేశించాలని స్పీకర్ను కోరారు. పని చేయని టీవీ.. డోర్ హ్యాండిల్ లేని బాత్ రూం గతంలో ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్కు కూడా చాంబర్ను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్నర్ చాంబర్లోని ప్రతిపక్ష నేత చాంబర్ను తాను వాడుకుంటానని స్పీకర్ కోరడంతో ఔటర్ లాబీకి తన కార్యాలయాన్ని తరలించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గది కేటాయించారని, అందులోని మూత్రశాలకు కనీసం డోర్ హ్యాండిల్ లేదనీ, టీవీ పనిచేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు తెలిపారు. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడం లాంటిదేనని, విశాలమైన చాంబర్ను కేటాయించాలని కోరారు. వచ్చే సెషన్లోగా ప్రతిపక్ష నేత చాంబర్ను విశాలంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. -
అసెంబ్లీలో టీడీపీ రగడ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను అడ్డుకుని రాద్ధాంతం చేశారు. ఇతర సభ్యులు ఎవరూ ప్రసంగించకుండా స్పీకర్ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎంతకీ వారి తీరులో మార్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి రామకృష్ణ చౌదరి (అనపర్తి), అలికిరి జగదీష్ (గుత్తి), పరకాల కాళికాంబ (నరసాపురం) అకాల మృతికి శాసన సభ సంతాపం ప్రకటించింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఇంతలో టీడీపీ సభ్యులు నిత్యావసర ధరలపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చ పూర్తయ్యాక మాట్లాడదామని స్పీకర్ చెప్పారు. ఇందుకు టీడీపీ సభ్యులు అంగీకరించలేదు. ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని సహా 15 మంది స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అచ్చెన్న వెల్లో ఉండగా, మిగతా సభ్యులు పోడియం పైకి ఎక్కి స్పీకర్ కురీ్చని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, సీఎం జగన్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా బిల్లు పత్రాలను చింపి స్పీకర్పై చల్లి రగడ సృష్టించారు. స్పీకర్ వారిని ఎంతగా వారించినా పద్ధతి మార్చుకోకపోవడంతో 48 నిమిషాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి ఉదయం 10.34 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఈసారి విజిల్స్ తీసుకొచ్చి స్పీకర్ చెవుల్లో ఊదడం ప్రారంభించారు. ఇది సరికాదని, స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు సుధాకర్బాబు, అబ్బయ్య చౌదరి, బియ్యపు మధుసూదన్రెడ్డి వారించినా పట్టించుకోలేదు. వెలగపూడి రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించి స్పీకర్ వద్దనున్న బెల్ను అదే పనిగా మోగించడం ప్రారంభించారు. సభలో ఇతర సభ్యులు మాట్లాడేది ఏదీ వినబడకుండా, స్పీకర్ చెప్పేది సభ్యులకు వినిపించకుండా టీడీపీ సభ్యులు నానా రగడా సృష్టించారు. దీంతో మార్షల్స్ స్పీకర్ తమ్మినేనికి రక్షణగా నిలబడ్డారు. ఎంత వారించినా వినకపోవడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బ్రేక్ తర్వాత టీడీపీ సభ్యలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. -
ఆరు రోజులు.. రెండు స్వల్పకాలిక చర్చలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ తొలి విడత సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఇంధన రంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం ప్రకటించారు. డిసెంబర్ ఏడో తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో తొలిరోజు కొత్తగా ఎన్నికైనవారు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. 11న స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్, 13న నామినేషన్ల స్వీకరణ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 14న నూతన స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 15న శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించేందుకు 16న శాసనసభ, మండలి వేర్వేరుగా సమావేశమై చర్చ అనంతరం ఆమోదం తెలిపాయి. ధన్యవాద తీర్మాన ఆమోదం అనంతరం శాసనమండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శాస నసభను మాత్రం 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 20న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, 21న ఇంధన రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ తీవ్ర వాగ్వాదం నడుమ సాగింది. 26 గంటల 33 నిమిషాలు ఆరురోజుల్లో శాసనసభ మొత్తంగా 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశమైంది. 19 మంది సభ్యు లు చర్చలో పాల్గొనగా, రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మినహా మిగతా 118 మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
అప్పుల రాష్ట్రంగా మార్చారు!
సాక్షి, హైదరాబాద్: ‘సంపదతో కూడిన మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల రాష్టంగా మార్చారు. కృష్ణా, గోదావరి నుంచి ఓ చుక్క నీటినైనా తెచ్చారా? ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లు ఇచ్చారా? రూ.లక్షల కోట్లు వృథా చేశారు. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఒక్క ఇందిరమ్మ ఇళ్లయినా ఇచ్చారా? రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం చేశారు. స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రజలు స్వేచ్ఛ ఇచ్చేటువంటి తీర్పునిచ్చారు అని గవర్నర్ ప్రసంగంలో చెప్పాం’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు చేస్తుండగా భట్టి విక్రమార్క పలుమార్లు అడ్డుపడి మాట్లాడారు. ‘మనం తెలంగాణ శాసనసభలో చర్చిస్తున్నాం. 2014 జూన్ 2 నుంచి జరిగిన పనుల గురించే మాట్లాడుకోవాలి’అని చెప్పారు. 55 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలన వద్దనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. నాడు కాంగ్రెస్ మంత్రులందరూ రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానం చేశారని, కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించారని చెప్పారు. పార్లమెంట్లో సరైన బలం లేకపోయినా కాంగ్రెస్ మిగిలిన పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. చర్చ తొలిరోజే దాడితో ప్రసంగాన్ని మొదలుపెడితే ప్రభుత్వం తగిన రీతిలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద 70–80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లు ఇచ్చామని భట్టి గుర్తు చేశారు. మిషన్ భగీరథ కోసం రూ.43 వేల కోట్లు్ల ఖర్చు పెట్టి నీళ్లు ఎక్కడ ఇచ్చారని కేటీఆర్ను ప్రశ్నించారు. నల్లగొండకు 2014కు ముందు నీళ్లు రాలేదా? అని పేర్కొన్నారు. సీఎం ఎంపిక హైకమాండ్దే: మంత్రి దామోదర కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించినప్పుడు సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్కు అప్పగించే సంప్రదాయం ఉందని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని తామంతా శిరసావహిస్తామని ప్రజలకు కూడా తెలుసన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాదని రేవంత్రెడ్డిని సీఎం చేయడంపై కేటీఆర్ చేసిన విమర్శకు దామోదర ఈ మేరకు స్పందించారు. పైన పటారం.. లోన లొటారం: మంత్రి పొన్నం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా సాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందనే తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుందామని కేటీఆర్కు సూచించారు. మా తాత మీసాల మీద నిమ్మకాయ పెట్టాడంటే నడవదని పొన్నం చెప్పగా.. దీనికి కేటీఆర్ గట్టిగా స్పందించారు. ‘మా తాతలు నెయ్యి తాగిన్రు.. మా మూతులు వాసన చూడండి’అంటే కుదరదని కౌంటర్ ఇచ్చారు. నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టామని క్రెడిట్ మాత్రమే తీసుకుంటామంటే నడవదని, కాంగ్రెస్ దురాగతాలను బరాబర్ చెప్తామని పేర్కొన్నారు. మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది: మంత్రి శ్రీధర్ బాబు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో సైతం 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించే చెప్పారని మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం, పేదలకు న్యాయం జరిగాయని, ఇళ్లు, భూములు, పోడు భూములొచ్చాయని చెప్పారు. అలాంటి ప్రభుత్వం కోసమే మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఉమ్మడి ఏపీలో 1999లో 91 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారంటూ.. కాంగ్రెస్ను తామే గెలిపించామన్న హరీశ్రావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘నాడు మీరెంత మంది ఉన్నారు? ఎన్ని సీట్లలో పోటీ చేసి ఎంత మంది గెలిచారు? మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది’అని నిలదీశారు. -
రేవంత్ ప్రసంగానికి అడ్డు తగిలిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. రేవంత్రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తుండటంతో రెండుసార్లు మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశిస్తూ ‘సిగ్గుతో తలదించుకోవలసిందే’నని రేవంత్ వ్యాఖ్యానించగా హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాగంటి గోపీనాథ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. మీకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ప్రసాద్కుమార్ తెలపడంతో సీట్లలో కూర్చున్నారు. ► రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ను, కేసీఆర్ను విమర్శిస్తున్నప్పుడు సభ్యులు పాడి కౌశిక్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అరుస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ► రేవంత్ మాటలకు కౌశిక్రెడ్డి అడ్డు తగులుతుంటే స్పీకర్ ప్రసాద్కుమార్ జోక్యం చేసుకుంటూ ‘కౌశిక్రెడ్డి.. కొత్త సభ్యుడివి. సభ నాయకుడు మాట్లాడుతుంటే వినాల్సిందే’అని స్పష్టం చేశారు. ► డ్రగ్స్ మాఫియా గురించి రేవంత్ మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేసేందుకు మనసు రాలేదా అని ప్రశ్నించగా, ‘వుయ్ సపోర్ట్ యూ’అని పాడి కౌశిక్రెడ్డి అరిచారు. దానికి రేవంత్ స్పందిస్తూ ‘ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన కష్టాలు ఆయనకుంటాయి’అని వ్యాఖ్యానించారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్ కట్టడికి సీవీ ఆనంద్ నేతృత్వంలో చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ► రేవంత్ మాటలకు కౌశిక్రెడ్డి అడ్డు తగిలిన సమయంలో ‘గట్టిగా అరుస్తున్న ఆయన కూడా మేనేజ్మెంట్ కోటానే’అని వ్యాఖ్యానించారు. -
గూండాలు, సైకోల్లా టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: శాసన సభలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు గూండాలు, సైకోల్లా వ్యవహరించారని వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారు. వారు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు సభ ప్రారంభంలోనే చేసిన రచ్చను తీవ్రంగా తప్పుబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తగిన ఫార్మాట్లో వస్తే ఎంతసేపైనా చర్చిద్దామని చెబుతున్నా వినిపించుకోకుండా పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ను చుట్టుముట్టి, ఆయనపై కాగితాలు విసిరి, మానిటర్ను, గ్లాసును పగులగొట్టి టీడీపీ సృష్టించిన గందరగోళం సభా కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించిందని తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో మీసం మెలేసి, తొడగొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సభ్యుల వ్యాఖ్యలు వారి మాటల్లోనే.. రచ్చకోసమే అసెంబ్లీకి.. టీడీపీ నేతలు రచ్చకోసమే అసెంబ్లీకి వస్తున్నారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి పారిపోతున్నారు. సభలో రేపు స్కిల్ డెవలప్మెంట్ పైన చర్చిస్తున్నాం. 26న ఫైబర్ నెట్, 27న ఇన్నర్ రింగ్ రోడ్డుపై చర్చ ఉంది. ధైర్యం ఉంటే టీడీపీ చర్చకు రావాలి. సభలో బాలకృష్ణ నిజమైన సైకోలా కనిపించాడు. – ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం లాంటి జగన్ ముందు కాదు టీడీపీ సభ్యులు సభలో గూండాలు, సైకోల్లా ప్రవర్తించారు. స్పీకర్ చైర్ మీద గౌరవం లేకుండా స్పీకర్ చుట్టూ చేరి అరుస్తూ పేపర్లు చింపేసి మొహం మీద విసిరేశారు. మానిటర్, మంచి నీటి గ్లాస్ పగులగొట్టారు. శాసన సభ సమావేశాలను బాలకృష్ణ షూటింగ్ అనుకుంటున్నాడేమో. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతున్నాడు. ఏ రోజూ ప్రజా సమస్యలను ప్రస్తావించని బాలకృష్ణ.. బావ కళ్లల్లో ఆనందం చూడటానికి అసెంబ్లీకి వచ్చినట్టున్నాడు. తండ్రి ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినప్పుడు చంద్రబాబుపై బాలకృష్ణ మీసాలు తిప్పి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవారు. చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ. బాలకృష్ణా.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం వంటి జగన్ ముందు కాదు. బాలకృష్ణకు తెలిసిందల్లా షూటింగ్లకు వెళ్లడం... ఈవెంట్లలో ఆడవాళ్లను గౌరవం లేకుండా మాట్లాడటం. సభలో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి ఆధారాలను పెద్ద స్క్రీన్లపై చూపిస్తామనే భయంతోనే టీడీపీ రివర్స్ డ్రామా ఆడింది. దమ్ము, ధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలి. ఎంత సేపైనా చర్చించేందుకు మేం సిద్ధం. సెంట్రల్ జైలు చంద్రబాబు కట్టిందేనని వాళ్లే చెబుతున్నారు. అంటే ఇన్నాళ్లూ అక్కడ ఖైదీలకు ఏ సదుపాయాలూ లేకపోయినా పర్లేదు కానీ చంద్రబాబుకు ఉండాలా?. – మంత్రి ఆర్కే రోజా బాబుకు తప్పించుకునే అవకాశం లేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సాక్ష్యాధారాలతో దొరికిన చంద్రబాబుకు తప్పించుకొనే అవకాశం లేదు. చంద్రబాబు అనేక పాపాలు, నేరాలు, ఘోరాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ని, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు. ఒక ఎమ్మెల్సీని కొంటూ దొరికారు. మీడియా బలంతో బయట పడ్డారు. చివరికి చట్టానికి దొరికారు. కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను తెచ్చారు. వారు కూడా నేరం జరగలేదని అనటంలేదు. టెక్నికల్ అంశాలనే ప్రస్తావిస్తున్నారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పాపాలను ఒప్పుకోవాలి. దొంగను పట్టుకుంటే సానుభూతి రాదు. నకిలీ సర్వేలతో సానుభూతి పొందాలని చూస్తే ఉపయోగం లేదు. – మంత్రి అంబటి రాంబాబు స్కామ్ జరగలేదని చెప్పరేం? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరగలేదని టీడీపీ చెప్పడంలేదు. స్పీకర్ చర్చిద్దామని చెబుతున్నా టీడీపీ ముందుకు రావడంలేదు. చంద్రబాబును అరెస్టు చేయకూడదని అంటున్నారే తప్ప స్కిల్ స్కామ్ గురించి మాట్లాడటంలేదు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫైబర్ నెట్ కేసులో కూడా అవినీతి జరిగింది. ఈ ఐదు రోజుల్లో చంద్రబాబు అవినీతిపై చర్చించి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు రాజమండ్రి జైల్లో కూర్చుని సత్య హరిశ్చంద్రుడిని అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతను దోచుకున్నాడు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యలపై చర్చించాడా? తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు, ఆయనపై చెప్పులు వేయించినప్పుడు బాలకృష్ణ పౌరుషం ఏమైంది? కక్ష సాధించాలంటే చంద్రబాబును ఎప్పుడో అరెస్టు చేసే వాళ్లం. – ఎమ్మెల్సీ పోతుల సునీత సభాపతి పట్ల అమర్యాదగా ప్రవర్తించారు సభలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారు. బాలకృష్ణ సినిమాల్లో మాదిరిగా తొడలు కొడుతూ, మీసాలు తిప్పడం దురదృష్టకరం. సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ సభ్యులు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవ్ సెల్ ఫోన్తో చిత్రీకరించాలని చూశారు. సభ నుంచి బయటకు వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ వారు మీసాలు తిప్పినా, తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ టీడీపీ సభ్యులకు భయం చంద్రబాబు అవినీతిపై చర్చ అంటే టీడీపీ సభ్యులకు భయం. వారు చంద్రబాబు అరెస్టు పైనే మాట్లాడు తున్నారు. స్కిల్ స్కామ్పై చర్చిద్దామంటే పారిపోతున్నారు. స్కామ్పై చర్చిస్తే దొరికిపోతామన్నది వారి ఆందోళన. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సమావేశాల్లోనే కచ్చితంగా చంద్రబాబు అవినీతిపై చర్చించి నిజనిజాలను ప్రజల ముందుంచుతాం. – ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు -
Telangana: అక్టోబర్ 5 తర్వాత నగారా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల తరుణం ముంచుకొస్తోంది. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం శాసనసభల ఎలక్షన్లకు అక్టోబర్ తొలి వారం తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల 3న రాష్ట్ర పర్యటనకు రానుంది. 5 వరకు అంటే మూడురోజులపాటు విస్తృత సమీక్షలు, వరుస సమావేశాలు నిర్వహించనుంది. మిగతా చోట్ల ఇప్పటికే ముగియడంతో.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు సంసిద్ధతను స్వయంగా పరిశీలించడానికి సీఈసీ బృందం రాష్ట్రాల్లో పర్యటనలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత షెడ్యూల్ను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకుగాను.. తెలంగాణ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ఇప్పటికే సీఈసీ బృందం పర్యటనలు ముగిశాయి. అక్టోబర్ 5వ తేదీ నాటికి తెలంగాణలోనూ పర్యటన ముగుస్తుంది. అంటే ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం గత శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను 2018 అక్టోబర్ 6న ప్రకటించగా.. అదే ఏడాది డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాలను ప్రకటించారు. ఈసారి కొన్ని రోజులు అటూఇటూగా షెడ్యూల్ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒక్కో దఫాలోనే పూర్తి చేశారు. అలాగే ఈసారి కూడా ఒకే దఫాలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 16వ తేదీతో ముగుస్తుంది. ఆలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా.. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. దానితో ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సీఈసీ బృందం షెడ్యూల్ ఇదీ.. ► కేంద్ర ఎన్నికల కమిషనర్ల బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా.. అక్టోబర్ 3న జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై, అభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం వివిధ కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై.. ఎన్నికల్లో ధనం, మద్యం, ఇతర ప్రలోభాలు, అక్రమాల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తుంది. తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి (ఎస్ఎన్పీఓ), కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారి తమ సన్నద్ధతను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ► అక్టోబర్ 4న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు/పీసీలు ప్రజెంటేషన్ ఇస్తారు. ► అక్టోబర్ 5న ఓటర్లలో చైతన్యం కల్పించడానికి అమలు చేస్తున్న ‘స్వీప్’ కార్యక్రమం తీరు తెన్నులను సీఈసీ బృందం పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రచారకర్తలుగా ఉన్న క్రీడా, సినీ రంగ సెలబ్రిటీలతో సమావేశం అవుతుంది. దివ్యాంగ, యువ ఓటర్లతో ముఖాముఖీగా మాట్లాడుతుంది. చివరిగా ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్లతో సమావేశమై రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం, భద్రత సంస్థలను సమన్వయం పర్చే అంశంపై సమీక్షిస్తుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తమ పర్యటన విశేషాలను వెల్లడిస్తుంది. -
విద్యారంగంపై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి దారుణంగా ఉందని, క్రమంగా అది తీసికట్టుగా మారుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. విద్య–వైద్యంపై శుక్రవారం శాసనసభ లో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. వాస్తవంగా పరిస్థితులు బాగా లేవని, తెలంగాణ వచ్చాక విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయని అంకెలతో సహా వివరించారు. అయితే, భట్టి విక్రమార్క సభను, తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అంకెలు చెబుతున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కేవలం విద్యాశాఖ బడ్జెట్ను మాత్రమే భట్టి పేర్కొంటున్నారని, ఇతర శాఖల ద్వారా కూడా విద్యారంగానికి జరుగుతున్న కేటాయింపులను ఆయన ప్రస్తావించలేదని అన్నారు. దీనికి భట్టి జవాబు ఇస్తూ, ప్రతి సంవత్సరం బడ్జెట్ పద్దు పెరుగుతున్నప్పుడు, ఆ దామాషా ప్రకారం విద్యా రంగానికి కేటాయింపులు లేక పోవటం అంటే బడ్జెట్ తక్కువ ఇచ్చినట్టేనంటూ మళ్లీ సభ ముందు లెక్కలు ఉంచారు. ఇదేనా మీ స్ఫూర్తి: స్పీకర్పై భట్టి అసహనం.. తాను మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డు తగులుతుండటం, ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్ బెల్ కొడుతుండటంతో ఓ దశలో భట్టి అసహనం వ్యక్తం చేశారు. ‘నేను ఐదు నిమిషాలు మాట్లాడితే, మంత్రులు పది నిమిషాలు అడ్డుతగులుతున్నారు. వారు లేచినప్పుడల్లా మీరు వారికి మైక్ ఇస్తున్నారు. ఇదేనా మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి?’ అని ప్రశ్నించారు. కాగా, వచ్చే అసెంబ్లీకి బీఆర్ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారో రారో తెలియదని, అంతకు మించి అయితే రారని భట్టి వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. -
గవర్నర్ తిరస్కరించిన బిల్లులు మళ్లీ పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో రోజు సమావేశాల్లో కీలకమైన 4 బిల్లులకు తిరిగి ఆమోదం లభించింది. అసెంబ్లీ గతంలోనే పురపాలక శాసనాల చట్టం (సవరణ) బిల్లు, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ)బిల్లు, రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన, క్రమబద్దీకరణ) సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట (సవరణ) బిల్లులను పాస్ చేసింది. ప్రభుత్వం వాటిని గవర్నర్ తమిళిసైకి పంపించినా ఆమోదముద్ర వేయలేదు. ఆయా బిల్లుల్లోని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పిపంపేశారు. ఈ క్రమంలో ఆ నాలుగు బిల్లులను పునః పరిశీలించాలంటూ సంబంధిత మంత్రులు శుక్రవారం రాత్రి శాసనసభలో ప్రతిపాదించగా ఆమోదం లభించింది. శాసనసభ రెండోసారి పాస్ చేసి పంపుతున్న నేపథ్యంలో ఈ బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం నుంచి ప్రశ్నోత్తరాలు, లఘు చర్చలతో శుక్రవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ, ఉద్యాన అభివృద్ధి సంస్థ, విద్యుత్ సరఫరా సంస్థ, ఉపాధ్యాయుల బదిలీ ల నియమావళి, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ, అటవీ అభివృద్ధి సంస్థల నివేదికలను సంబంధిత మంత్రులు సభకు సమర్పించారు. తర్వాత ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఎజెండాలో పది ప్రశ్నలు ఉన్నప్పటికీ సమయాభావం కారణంగా.. ఐటీ ఎగుమతులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, ఆరోగ్య లక్ష్మి పథకం తదితర అంశాలపైనే మంత్రులు సమాధానాలిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కె.విజయరామారావు (ఖైరతాబాద్), కొమిరెడ్డి రాములు (మెట్పల్లి), కొత్తకోట దయాకర్రెడ్డి (మక్తల్), సోలిపేట రామచంద్రారెడ్డి, (దొమ్మాట), చిల్కూరి రామచంద్రారెడ్డి (ఆదిలాబాద్) మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఇటీవల సంభవించిన వరదలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ సభ్యుడు రఘునందన్రావు ఇచ్చిన వాయిదా తీ ర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. జీరో అవర్ తర్వాత మధ్యాహ్నం 12.05కి స్పీకర్ టీబ్రేక్ విరా మం ఇవ్వగా.. సభ తిరిగి 12.50కి సమావేశమైంది. వరదలు, విద్య, వైద్యారోగ్యంపై లఘు చర్చ రెండో రోజు సమావేశం ఎజెండాలో భాగంగా రెండు అంశాలపై లఘు చర్చ జరిగింది. భారీ వర్షాలు, వరదల నష్టం, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జరిగిన చర్చకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం స్పందించలేదంటూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్యారోగ్య రంగాలపై చర్చను ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రా రంభించారు. దీనిపై రాత్రి 8 వరకు సభ్యుల ప్రసంగాలు కొనసాగాయి. తర్వాత మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు ఆయా అంశాలపై సమాధానాలిచ్చారు. రాత్రి 10.20 వరకు సమావేశం కొనసాగగా.. కీలక బిల్లులను ఆమోదించాక శనివారం ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. గవర్నర్ తిరస్కరించడంతో.. అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడతామని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తెలిపింది. అందులో గవర్నర్ తిప్పిపంపిన నాలుగు బిల్లులను శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) బిల్లును మంత్రి హరీశ్రావు, ప్రైవేటు వర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును ఎర్రబెల్లి దయాకర్రావు సభకు సమర్పించారు. వాటిని పునః పరిశీలించి ఆమోదించాలని కోరారు. ఈ బిల్లులను తిరస్కరిస్తూ గతంలో గవర్నర్ కార్యాలయం నుంచి మూడు సందేశాలు అందాయని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. వీటిపై సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక.. బిల్లులను సభ ఆమోదించినట్టు ప్రకటించారు. ఇక శనివారం సభలో ‘తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు సభలో ఉండాలి: కేటీఆర్ శాసనసభ సమావేశాలను 30 రోజులు జరపాలని బీజేపీ, 20 రోజులు జరపాలని కాంగ్రెస్ కోరాయని.. కానీ చర్చల సమయంలో ఆ పారీ్టల సభ్యులు సభలో ఉండటం లేదని మంత్రి కేటీఆర్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు సభలోకి రాగా.. ‘‘శ్రీధర్ బాబుగారికి వెల్కమ్. శాసన సభ్యులు కచ్చితంగా సభలో ఉండేలా చూడాలి. సభలో ఉండి సమాధానాలు వినాలి. బయటికి వెళ్లి అటూ ఇటూ తిరగడం, మీడియాతో మాట్లాడడం సరికాదు’’అని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. తనతోపాటు రఘునందన్రావు బీజేపీ తరఫున ఉన్నారని పేర్కొన్నారు. దీంతో బీజేపీ నుంచి సస్పెండైన మీరు ఆ పార్టీ ఎమ్మెల్యే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక జీరో అవర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీరు సంగారెడ్డి వరకు మెట్రో కోరితే.. మేం ఇస్నాపూర్ వరకు మంజూరు చేసినా అభినందించడం లేదు. సంగారెడ్డి, ములుగు, పెద్దపల్లిలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. ప్రభుత్వాన్ని అభినందించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్బాబులకు మనసు రావడం లేదు..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
మాది మానవీయ బడ్జెట్
సాక్షి, అమరావతి :తమ ప్రభుత్వానిది సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధిని అందించే మానవీయ బడ్జెట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘ఇది అక్క చెల్లెమ్మలు, రైతన్నల పక్షపాత బడ్జెట్.. గ్రామ స్వరాజ్య బడ్జెట్.. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సామాజిక న్యాయ బడ్జెట్’ అని చెప్పారు. శుక్రవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా రూపొందించి అమలు చేస్తున్నట్టుగానే 2023–24లోనూ మానవీయ బడ్జెట్ను అందించామన్నారు. కచ్చితంగా సంక్షేమ కేలండర్ను ప్రకటించి ఆ మేరకు అన్ని వర్గాల లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నామని చెప్పారు. తాము ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి గత నాలుగేళ్లుగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ, ఆ పనులు పూర్తి చేస్తూ వచ్చామని తెలిపారు. గత నాలుగు బడ్జెట్లలోనూ ఇదే మానవత్వం కనిపించిందన్నారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై... శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
పూణే: లోక్సభ, శాసన సభల్లో మహిళల రిజర్వేషన్ విషయమై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ఉత్తర భారతదేశం సానుకూలంగా లేదని, వాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం పూణే డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన కుమార్తె లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలేతో పాల్గొని ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభలోనూ అన్ని రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయలో దేశం ఇంకా మానసికంగా సిద్ధంగా లేనట్టుంది అని శరద్ పవర్ని మీడియా ప్రశ్నించగా...దీనికి ఆయన సమాధామిస్తూ...తాను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్ అన్నారు. ముఖ్యంగా అందుకు ఉత్తర భారతదేశం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. తాను ఒకసారి ఈ అంశంపై ప్రసంగిస్తుంటే తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు లేచి వెళ్లిపోయారని చెప్పారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన వారే దీన్ని జీర్ణించుకోలేకపోత్నురని తనకు అప్పుడే స్పష్టమైందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని శరద్పవార్ అన్నారు. అంతేగాదు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ..జిల్లా పరిషిత్, పంచాయితీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టానని, మొదట్లో వ్యతిరేకించిన తర్వాత ప్రజలే దానిని ఆమోదించారని చెప్పుకొచ్చారు. (చదవండి: యడ్డి తనయుడిపై లోకాయుక్తాలో కేసు) -
గోవా పీఠంపై మళ్లీ బీజేపీ!
చిన్న రాష్ట్రం గోవాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మరీ అధికార బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 40 సీట్లకు గాను 20 సీట్లు గెలుచుకుంది. శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంలో ఆగిపోయింది. జీఎఫ్పీతో కూడిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి 12 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 2, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూటమికి 3 సీట్లు వచ్చాయి. తృణమూల్ కూటమిలో ఉన్న ఎంజీపీ రెండు సీట్లు సాధించింది. ముగ్గురు స్వతంత్రులు నెగ్గారు. ఎంజీపీకి చెందిన ఇద్దరు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో బీజేపీ బలం 25కు చేరింది. గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం ఇక లాంఛనమే. ఎంజీపీ తమకు బేషరతుగా మద్దతునిచ్చేందుకు అంగీకరించిందని ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు బీజేపీ గోవా ఎన్నికల ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రభుత్వ నూతన సారథి ఎవరన్నది పార్టీ నాయకత్వమే నిర్ధారిస్తుందని ప్రమోద్ సావంత్ అన్నారు. కొత్త ప్రభుత్వంపై మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి ప్రాతినిధ్యం కల్పించాలా, లేదా ఇంకా నిర్ణయించలేదని వెల్లడించారు. శుక్రవారం జరగబోయే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో దానిపై స్పష్టత వస్తుందన్నారు. గోవా ఎన్నికల్లో ఓటమిపై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడాంకర్ స్పందించారు. నాన్–బీజేపీ ఓట్లు చీలిపోవడం వల్లే కమలం పార్టీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 33.31 శాతం, కాంగ్రెస్ 23.46 శాతం ఓట్లు సాధించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ ఓటమి చెందడం గమనార్హం. -
అసెంబ్లీలో గాంధీ వర్ధంతి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. -
నిర్ణీత రేట్లకే టికెట్ల విక్రయం.. రోజూ 4ఆటలు మాత్రమే: మంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఈ విధానం లక్ష్యమన్నారు. ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ– సవరణ) బిల్లు’ను అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకు ముందు చర్చ సందర్భంగా బిల్లు ఉద్దేశాలను మంత్రి పేర్ని నాని వివరించారు. ప్రేక్షకుల ఆదరణ ను కొందరు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావించారు. ఒక్కో టిక్కెట్పై ఇష్టారాజ్యంగా రూ.300 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. రోజుకు 4 ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సినా చట్ట విరుద్ధంగా 6 – 8 షోలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక ఆటలు సాగవు.. చిత్ర పరిశ్రమలో కొందరు మాకు ఎదురు ఉండకూడదు.. ఏచట్టాలూ మమ్మల్ని ఆపలేవు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మంత్రి నాని పేర్కొన్నారు. ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా టిక్కెట్లు విక్రయించే వ్యవస్థ తేవాలని నిర్ణయిం చిందన్నారు. బస్సులు, రైలు టికెట్ల మాదిరిగా సినిమా టిక్కెట్లను కూడా మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని వివరించారు. గంట ముందు థియేటర్లో కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే అక్కడ కూడా ఆన్లైన్ విధానంలోనే థియేటర్ల యజమానులు టిక్కెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నారని మంత్రి తెలిపారు. కాగా, సమాజ హితం కోసం స్వచ్ఛంద సంస్థలు థియేటర్ యాజమాన్యాలతో కలసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే బెనిఫిట్ షోలకు అవకాశం ఉంటుందని తెలిపారు. -
14 సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ మంగళవారం 14 సవరణ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించింది. వీటిలో ఉద్యాన మొక్కల పెంపకం నియంత్రణ బిల్లు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల సవరణ బిల్లు వరకు ఉన్నాయి. మరో రెండు బిల్లులు.. ఏపీ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ (సవరణ) బిల్లును, సీఎం వైఎస్ జగన్ తరఫున ఏపీ సినిమా (నియంత్రణ), సవరణ బిల్లు–2021ను మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు. శాసనసభ ఆమోదించిన బిల్లులు.. మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టిన ఏపీ హార్టికల్చర్ నర్సరీల నియంత్రణ సవరణ బిల్లు–2021 మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన ఏపీ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు–2021, ఏపీ సెల్ఫ్హెల్ప్ గ్రూప్ (ఎస్హెచ్జీ) ఉమెన్ కో– కంట్రిబ్యూటరీ పెన్షన్ (సవరణ) బిల్లు–2021; మున్సిపల్ కార్పొరేషన్స్ (సవరణ) బిల్లు–2021. పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టిన ఏపీ బొవైన్ బ్రీడింగ్ (పశు సంతతి) (ఉత్పత్తి నియంత్రణ, పశు వీర్య అమ్మకం, కృత్రిమ గర్భోత్పత్తి సేవలు) బిల్లు–2021 ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టిన ఏపీ భూహక్కుల, పట్టాదార్ పాస్ పుస్తకాల (సవరణ) బిల్లు–2021, ఏపీ అసైన్డ్ భూముల (బదిలీల నిషేధం) సవరణ బిల్లు–2021, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి తరఫున ప్రవేశపెట్టిన ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, విదేశీ మద్యం (సవరణ) బిల్లు–2021 ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రవేశపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైద్య శాస్త్రాల సంస్థ (సవరణ) బిల్లు–2021.మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన ఏపీ ధర్మాదాయ, హిందూ మత సంస్థల, దేవదాయ (సవరణ) బిల్లు–2021, ఏపీ ధర్మాదాయ, హిందూ మతసంస్థల, ధర్మాదాయ (రెండో సవరణ) బిల్లు–2021 మంత్రి సురేష్ తరఫున మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టిన ఏపీ విద్యా (సవరణ) బిల్లు–2021, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (సవరణ) బిల్లు–2021, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రవేశపెట్టిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నియంత్రణ (సవరణ) బిల్లు. -
కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
-
చర్చలు కోసమే చట్ట సభలు: వెంకయ్య
బెంగళూరు: పార్లమెంట్, శాసన సభలు ఉన్నది చర్చలు, నిర్ణయాల కోసమే తప్ప గొడవలు, అంతరాయాల కోసం కాదని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆయన బుధవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడారు.ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో చోటుచేసుకున్న అనుచిత పరిణామాలను వెంకయ్య ప్రస్తావించారు. ప్రజల చేత ఎన్నికైన నేతలు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. ‘‘పార్లమెంట్లో ఇటీవల ఏం జరిగిందో మీరు చూశారు. సార్.. మీరు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి. రాజ్యసభలో మీరెందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు అని కొందరు యువతీ యువకులు అడిగారు. సభలో కొందరు ఎంపీల ప్రవర్తన వల్లే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని సమాధానమిచ్చినట్లు చెప్పారు. -
AIADMK: ఉపనేత ఎంపికపై ఉడుంపట్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై : శాసనసభాపక్ష ఉప నేత ఎన్నికపై తలెత్తిన భిన్నాభిప్రాయాలతో అన్నాడీఎంకేలో మరోసారి రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. ఎప్పటిలాగే పార్టీ కో–ఆర్డినేటర్ పన్నీర్సెల్వం, డిప్యూటీ కో–ఆర్డినేటర్ ఎడపాడి పళనిస్వామి పరస్పరం ఢీకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఏర్పాటైన సమావేశంలో ఎడపాడి, పన్నీర్ పోటీపడ్డారు. నాలుగేళ్లు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపించిన ఎడపాడినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన మద్దతుదారులు బహిరంగంగా గళం విప్పారు. పార్టీ అధినేతను కాబట్టి తానే సీఎం అభ్యర్థినని పన్నీర్సెల్వం పట్టుబట్టారు. పార్టీ ద్వితీయశ్రేణి నేతలు పన్నీర్సెల్వంను కలిసి పదిరోజులపాటు బుజ్జగించడంతో పట్టువీడారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడపాడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో పన్నీర్సెల్వం తీవ్ర మనస్థాపం చెంది ఎడపాడిని అభినందించకుండానే సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు. ఎన్నికల్లో 65 సీట్లకే పరిమితం కావడంతో అన్నాడీఎంకేలో స్తబ్దత నెలకొంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తుండడంతో అన్నాడీఎంకేలో కదలిక వచ్చింది. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు అగ్రనేతలు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమయంలో మళ్లీ ఎడపాడి, పన్నీర్ మళ్లీ పోటీపడ్డారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిపోయింది. కొన్నిరోజుల తర్వాత నిర్వహించిన సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎడపాడి వైపే నిలవడంతో ఆయన పేరునే ఖరారు చేశారు. ‘టూ’ ఎంపికలో వన్ అండ్ టూ మళ్లీ ఢీ ఎన్నికలకు ముందు ఒకసారి, ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి విభేదాలతో రచ్చకెక్కిన ఎడపాడి, పన్నీర్సెల్వం శాసనసభాపక్ష ఉప నేత ఎంపిక విషయంలో మూడోసారి పరోక్షంగా ముష్టియుద్దం సాగిస్తున్నారు. ఉప సభాపక్ష నేతగా పన్నీర్సెల్వంను ఎంపిక చేసుకోవాలని ఎడపాడి ఆశించారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, నేడు ప్రతిపక్షంలో ఉపనేత, తర్వాత పార్టీలో సైతం తనను ద్వితీయ స్థానానికి నెట్టే ప్రమాదం ఉందని అనుమానించిన పన్నీర్ సెల్వం అందుకు అయిష్టతను వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష ఉప నేత పదవికి ద్వితీయశ్రేణి నేతల్లో పోటీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే వైద్యలింగం పట్ల పన్నీర్సెల్వం సుముఖుత వ్యక్తం చేస్తుండగా, దీన్ని ఎడపాడి వర్గీయులు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, నత్తం శ్రీనివాసన్ పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరూ ఎడపాడికి రబ్బర్స్టాంప్లా మారుతారనే విమర్శ రావడంతో మాజీ మంత్రి విజయభాస్కర్ పేరును సూచించారు. వైద్యలింగం మినహా మరెవరినీ అంగీకరించేది లేదని పన్నీర్సెల్వం భీష్మించుకుని కూర్చున్నారు. సీనియార్టీతోపాటు సామాజిక సమతుల్యం కూడా పాటించాలని కొందరు పేర్కొనడంతో కేపీ మునుస్వామి తదితరుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఎడపాడి, పన్నీర్సెల్వం ఏకాభిప్రాయానికి వస్తేగానీ ఉప నేత ఎంపిక వ్యవహారం కొలిక్కివచ్చే పరిస్థితి లేదు. చదవండి: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ -
రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు?
సాక్షి, అమరావతి: శాసనసభ తీర్మానం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు... అదే శాసనసభకు రాజధానిని మార్చే అధికారం ఎందుకు ఉండదని హైకోర్టు ప్రశ్నించింది. రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉన్నట్లు పునర్విభజన చట్టం, సీఆర్డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల బిల్లులు ఆమోదం పొందే సమయంలో శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన రికార్డులు, వీడియో ఫుటేజీని వెంటనే కోర్టుకు సమర్పించాలని శాసనసభ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. వెంటనే ఆ రికార్డులు ఇస్తామని శానససభ న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు హైకోర్టుకు నివేదించారు. అయితే బ్లూ కాపీ (అసెంబ్లీ రికార్డులు నిర్వహించే బుక్)ని మాత్రం స్పీకర్ అనుమతి తీసుకున్న తరువాతే ఇవ్వగలమని నివేదించారు. ప్రస్తుతం స్పీకర్ రాష్ట్రంలో లేరని, ఆయన వచ్చిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇందుకు హైకోర్టు అంగీకరించింది. (అమరావతిలో అణగారిన వర్గాలకు చోటులేదా?) ఆ చట్టాల్లో అలా ఎక్కడుంది? పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన అంబటి సుధాకర్రావు వాదనలు వినిపిస్తూ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, ఇప్పుడు రాజధానిని మార్చాలంటే పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సిందేనన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల రైతులకిచ్చిన హామీలను ఉల్లంఘించినట్లవుతుందన్నారు. మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్బాబు వాదనలు వినిపిస్తూ పునర్విభజన చట్టం అమల్లో ఉన్నంత కాలం హైకోర్టును మార్చడానికి వీల్లేదన్నారు. హైకోర్టును మార్చేందుకు చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి అధికారం ఉందని పునర్విభజన చట్టం, సీఆర్డీఏ చట్టాల్లో ఎక్కడా చెప్పలేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు అమరావతిని రాజధానిగా ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. శానససభలో తీర్మానం చేయడం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని ఇంద్రనీల్ పేర్కొనగా.. మరి రాజధానిని నిర్ణయించడానికి శాసనసభకు అధికారం ఉన్నప్పుడు, దానిని మార్చే అధికారం కూడా శాసనసభకు ఉంటుంది కదా? అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ‘ధర్మ’సందేహం! 1. రాజధానిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నప్పుడు మార్చే అధికారం కూడా అసెంబ్లీకి ఉంటుంది కదా..? 2. అమరావతిని రాజధానిగా చేయాలని ఏపీ పునర్విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు ఎలా నిర్ణయించారు? 3. పిటిషన్లు దాఖలు చేసి విచారణకు హాజరు కాకపోవడం ఏమిటి? వాదనలు వినిపించని కేసులను విచారణ జాబితా నుంచి తొలగిస్తున్నాం. – హైకోర్టు ధర్మాసనం విచారణ జాబితా నుంచి ఆ కేసుల తొలగింపు.. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరి వాదనలు ముగిసిన తరువాత, మిగతావారు వాదనలు వినిపించేందుకు ప్రత్యక్షంగా తమ ముందు హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసులను వరుసగా పిలిచి, ఏ కేసులో సంబంధిత న్యాయవాది వాదనలు వినిపించేందుకు రాలేదో వాటిని విచారణ జాబితా నుంచి తొలగించింది. కొందరి తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
అసెంబ్లీ ఆవరణలో నాగుపాములు
భువనేశ్వర్ : రాష్ట్ర శాసన సభ ఆవరణలో నాగు పాములు తిరుగాడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ వ్యవధిలో వరుసగా రెండు సార్లు నాగు పాముల్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సోమవారం అసెంబ్లీ కార్యాలయంలోని స్విమ్మింగ్ పూల్ పరిసరాల్లో పాము తిరుగాడుతున్నట్లు భద్రతా సిబ్బంది దృష్టిలో పడడంతో స్నేక్ హెల్ప్ లైన్కు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న సంస్థ ప్రతినిధి సువేందు మల్లిక్ ఆ ప్రాంతానికి చేరి స్విమ్మింగ్ పూల్లో మెట్ల మధ్య నక్కిన పామును మెలకువగా అదుపులోకి తీసుకున్నారు. అది 6 అడుగుల నాగుపాము అని నగర శివారులోని అటవీ ప్రాంతంలో దానిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. -
ఆ అధికారం కోర్టుకు లేదు
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకుని, దానిని గవర్నర్ ఆమోదించిన తరువాత న్యాయస్థానానికి జోక్యం చేసుకునే అధికారం లేదని శ్రీకాకుళానికి చెందిన ఉరిటి లక్ష్మీ శైలజ.. హైకోర్టులో అధికార వికేంద్రీకరణపై రైతులు దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి మంగళవారం ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. గతంలో హైకోర్టే అనేక కేసుల్లో ప్రభుత్వం, గవర్నర్ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 12, 13 ఆర్టికల్స్ ప్రకారం ప్రభుత్వం చేసిన చట్టాల్లో కోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని, ఆర్టికల్ 14 ప్రకారం ప్రజా హక్కులకు భంగం కలిగితే జోక్యం చేసుకునే అవకాశముందని పిటిషనర్ తరఫు న్యాయవాది చీమకుర్తి చంద్రశేఖర్ తెలిపారు. 3 రాజధానుల ఏర్పాటు వలన ఎ క్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని, అమరావతిలో మాత్రమే రాజధానిని ఉంచడం వలన ఒక్క ప్రాంతం వారికే ప్రయోజనం ఉంటుందన్నారు. -
బలపరీక్ష నెగ్గిన చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు హాజరుకాలేదు. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సభా విశ్వాసం కోరుతూ ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. ప్యానెల్ స్పీకర్గా ఉన్న బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే జగ్దీశ్ దేవ్డా స్పీకర్గా వ్యవహరించారు. శివరాజ్సింగ్ చౌహాన్ సారథ్యంలోని ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు దేవ్డా ప్రకటించారు. బహుజన్ సమాజ్పార్టీకి చెందిన ఇద్దరు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యేలు సురేంద్ర సింగ్, విక్రమ్సింగ్ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఈ బలపరీక్షలో మద్దతు తెలిపారు. స్వతంత్ర ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు గైర్హాజరయ్యారు. విశ్వాస పరీక్ష అనంతరం సభను ఈ నెల 27వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు దేవ్డా ప్రకటించారు. సభకు ముందు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. -
బలపరీక్షపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ శాసనసభలో రేపే(శుక్రవారం) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని సుప్రీంకోర్టులో బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సింగిల్ పాయింట్ ఎజెండాతో బలపరీక్ష జరపాలని స్పీకర్ను ఆదేశించింది. అదేవిధంగా బలపరీక్ష నిర్వహణను వీడియో తీయాలని పేర్కొంది. బలపరీక్ష సమయంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, నిబంధనలు ఉల్లంఘించకుండా అసెంబ్లీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచనలు ఇచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేతులు పైకి ఎత్తడం ద్వారా బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష పక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఇటీవల 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో బీజేపీ గూటికి చేరడంతో కమల్నాథ్ సర్కార్ సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ స్పందించారు. ‘బలపరీక్షపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. శుక్రవారం జరపబోయే బలపరీక్షలో కమల్నాథ్ ప్రభుత్వం కూలిపోతుంది. ఎందుకంటే కమల్నాథ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు’ అని శివరాజ్సింగ్ అన్నారు. -
మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
-
మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ 15వ సమావేశాలు ఈనెల ఆరో తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తరపున శాసనసభ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 6న శాసన మండలి, శాసనసభను ఉద్దేశించి గవర్నర్ హోదాలో తమిళిసై తొలిసారిగా ప్రసంగిస్తారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020ను ఈ నెల 8 లేదా 10న అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎనిమిదో తేదీ ఆదివారం, మరుసటి రోజు సోమవారం హోలీ రావడంతో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో బడ్జె ట్ ప్రవేశపెట్టే తేదీతో పాటు, సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపైనా చర్చిస్తారు. ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి హరీశ్రావు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశ పెట్టనుండగా, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తారు. 2019–20కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు 2019 సెప్టెంబర్ 9 నుంచి 22 వరకు జరగ్గా, శాసనసభ 11 రోజులు, శాసన మండలి కేవలం నాలుగు రోజులు మాత్రమే సమావేశమైంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు కూడా పన్నెండు పని దినాల్లో ముగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మార్చి 22వ తేదీ వరకు శాసనసభను నిర్వహించి, మండలి సమావేశాలను మాత్రం నాలుగైదు రోజులకు పరిమితం చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లోనే రాజ్యసభ ఎన్నిక రాష్ట్ర కోటాలో రాజ్యసభ నుంచి ఏప్రిల్ 9న ఇద్దరు సభ్యులు రిటైర్ అవుతుండటంతో, ఖాళీ అవుతున్న స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే ద్వై వార్షిక ఎన్నిక షెడ్యూలును విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై, 18న ముగియనుంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 26న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితం ప్రకటిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రక్రియ జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
మండలికి మంగళం..?
-
ఇద్దరికి మించి సంతానమున్నా..
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరికి మించి సంతానమున్న వారు వార్డులు/డివిజన్లలో పోటీచేసేందుకు అర్హులే. ఈ మేరకు కొత్త పురచట్టంలోనూ అవసరమైన మేర మార్పులు చేశారు. ఈ చట్టాన్ని ఇదివరకే శాసనసభ/ శాసనమండలి ఆమోదించింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కూడా స్పష్టతనిచ్చింది. ఇద్దరికి మించి పిల్లలుంటే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తేయడంతో అభ్యర్థుల పోటీ విషయంలో ఈసారి కొత్త చట్టానికి అనుగుణంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. చెవిటి, మూగవారికి పోటీకి అవకాశం.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించి కొత్త మున్సిపల్ చట్టంలోని వివిధ సెక్షన్లు, కాలమ్ల వారీగా సరిచూసుకోవాలని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఎస్ఈసీ సూచించింది. మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, జీహెచ్ఎంసీ చట్టంలోని వివిధ అంశాలకు సంబంధించి పోటీచేసే అ«భ్యర్థులు, రిటరి్నంగ్ అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్లకు చట్టబద్ధమైన అంశాలపై స్పష్టతనిస్తూ మెటీరియల్ను రూపొందించింది. చెవిటి, మూగ లేదా కుషు్టవ్యాధితో బాధపడుతుంటే అటువంటి వారు గతంలో పోటీకి అనర్హులుగా ఉండగా కొత్తచట్టంలో ఆ నిబంధనను తొలగించారు. అదేవిధంగా అవినీతి పద్ధతులు లేదా ఎన్నికల అక్రమాల కారణంగా (9ఏ చాప్టర్ ప్రకారం) శిక్షపడిన వారికి గతంలో పోటీకి అర్హత లేకపోగా, కొత్తచట్టంలో దానిని తొలగించారు. ఈ విషయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (జీహెచ్ఎంసీ మినహా), అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, కార్పొరేషన్ల ఆర్వోలు, పీవోలకు ఇదివరకే ఒక నోటిఫికేషన్ ద్వారా ఎస్ఈసీ తెలియజేసింది. ఆ స్థలాలు పాడు చేస్తే జైలు శిక్ష, జరిమానా మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం, ర్యాలీల నిర్వహణకు ఇకపై విద్యాసంస్థలు (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఏవైనా), వాటి మైదానాలు ఉపయోగించే వీలు లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ప్రచార సమయంలో ప్రభుత్వ,ప్రైవేట్ స్థలాల గోడలపై పోస్టర్లు అంటించడం, ప్రకటనలు రాయడం, ఇతర చర్యలతో వికారంగా మారుస్తున్న నేపథ్యంలో ఈ ఆస్తుల యజమానులకు కలుగుతున్న నష్టం, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎస్ఈసీ కొన్ని అంశాల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ‘ప్రివెన్షన్ ఆఫ్ డిస్ ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ప్లేసెస్, ప్రొహిబిషన్ ఆఫ్ అబ్సీన్, అబ్జెక్షనబుల్ పోస్టర్స్, అడ్వర్టయిజ్మెంట్ యాక్ట్, 1997 (యాక్ట్ 28 ఆఫ్ 1997)ను గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని శాసనసభ ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాన్ని పాడుచేస్తే దానిని నేరంగా పరిగణించడంతో పాటు మూడునెలల కారాగార శిక్ష లేదా రూ. వెయ్యికి తగ్గకుండా జరిమానా విధించవచ్చు. లేదా ఈ జరిమానాను రూ.2 వేలకు పెంచడంతో పాటు రెండుశిక్షలు విధించవచ్చు. ఈచట్టంలోని సెక్షన్ల ప్రకారం అభ్యంతరకరమైన ప్రచార ప్రకటనలను తొలగించే, చెరిపేసే అధికారం పోలీసులకు కల్పించారు. ఇవి కూడా.. ►గోడలమీద పోస్టర్లు, కాగితాలు అంటించడంలేదా మరోరూపంలోనైనా పాడుచేయడం, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండా లు, మొదలైనవాటిని ప్రభుత్వ స్థలాల్లో (ప్రజల ఆస్తులతోసహా) అనుమతించరు. ప్రభుత్వ కార్యాలయం లేదా ప్రాంగణం ప్రభుత్వ స్థలం పరిధిలోకి వస్తాయి. ►ఒకవేళ ఏ బహిరంగస్థలంలో (ప్రభుత్వ స్థలం కానిది) నిర్దేశిత రుసుముల చెల్లింపు ద్వారా లేదా మరో విధంగా నినాదాలు రాసుకోడానికి, పోస్టర్లు మొదలైన వాటి ప్రదర్శనకు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు రాజకీయ ప్రకటనలు మొదలైన వాటికి అనుమతి లేదా అవకాశం కలి్పంచిన చోట అన్ని పార్టీలకు, అభ్యర్థులకు సమాన అవకాశం కలి్పంచాల్సి ఉంటుంది. ►గోడలపై రాసే నినాదాలు, రాతలు, ప్రదర్శనలు వివిధ వర్గాల్లో అసహనాన్ని, అసంతృప్తిని కలిగించేలా ఉండకూడదు ►వాణిజ్య వాహనాలను సంబంధిత మున్సిపల్ కమిషనర్ల అనుమతి పొందాకే ప్రచారానికి ఉపయోగించాలి. ఈ ఆమోదం పొందాకే ఆయా వాహనాలపై జెండాలు, స్టిక్కర్లు, మొదలైన వాటి ప్రదర్శనకు అనుమతి ఉంటుంది. ►మార్పులు చేసిన ప్రచార, వీడియో రథం వంటి ప్రత్యేక ప్రచార వాహనాలకు ఎంవీ చట్టం కింద అధికార పరిధి ఉన్న వారి నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాకే ఉపయోగించాలి. -
ప్రతి అడుగు విప్లవాత్మకమే..
-
సువర్ణ చరిత్రకు మరో అడుగు
ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కీలక బిల్లులను ఆమోదించి రాష్ట్ర శాసనసభ సువర్ణాక్షరాలతో కొత్త చరిత్రను లిఖించింది.. ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ బడుగు, బలహీన వర్గాలు, ఇతరత్రా పేద పిల్లల బంగారు భవిష్యత్కు శ్రీకారం చుట్టింది.. మద్యం మహమ్మారిపై ఉక్కుపాదం మోపింది.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు.. తదితర కీలక నిర్ణయాలకు నాంది పలికింది.. ఐదున్నర కోట్ల రాష్ట్ర ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా గత శాసనసభ సమావేశాల్లో 19 బిల్లుల ఆమోదంతో తొలి అడుగు వేసిన వైఎస్ జగన్ సర్కారు.. తాజాగా యావత్ ప్రపంచంలోని తెలుగు వారు ప్రశంసించేలా సోమవారం 16 బిల్లులకు ‘ఎస్’ అంటూ మలి అడుగు వేసింది. ప్రతి అడుగు విప్లవాత్మకమే.. ►ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఇవాళ మేము మరో విప్లవాత్మక బిల్లును తెస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా రెండు కమిషన్లు తీసుకొస్తున్నాం. వారి అభివృద్ధి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని, వారి సమస్యల మీద లోతుగా అధ్యయనం చేయాలని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం కనుగొనాలనే తపన, తాపత్రయంతో ఈ పని చేస్తున్నాం. ►ఇక ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రతి ఉద్యోగీ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ చరిత్రాత్మక నిర్ణయం వల్ల, ఎప్పటి నుంచో ఉద్యోగులు కోరుకుంటున్న, ఏ ప్రభుత్వం కూడా చేయడానికి ముందుకు రాని ఈ పని.. మా హయాంలో, మా ప్రభుత్వంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ►వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం కాబోతున్నాయి. ఆ తర్వాత వరుస సంవత్సరాలలో 7, 8, 9, 10 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నాం. నాలుగేళ్లలో మన పిల్లలందరూ 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్లో రాసేలా ఈ బిల్లు మార్చబోతున్నది. ఇది ఒక చరిత్రాత్మక బిల్లు. ఆమోదం పొందిన ముఖ్యమైన బిల్లుల్లో కొన్ని ►పిల్లలందరికీ ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన.. ధనిక, పేద అనే తేడా లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి. ►ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఆర్టీసీకి చెందిన దాదాపు 52 వేల మంది దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. వారిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం. ►ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ల ఏర్పాటు ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించేందుకు రెండు కమిషన్ల ఏర్పాటు. ►మద్యపాన నిషేధం దిశగా వేగంగా అడుగులు అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.2 లక్షల జరిమానా.. రెండోసారి అయితే రూ.5 లక్షల జరిమానా. మద్యం ముట్టుకోవాలంటే షాక్ కొట్టాల్సిందే మేము అధికారంలోకి రాక ముందు 43 వేల బెల్టు షాపులుండేవి. వాటిలో ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేశాం. పర్మిట్ రూమ్లను ఎత్తివేశాం. మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చాం. అమ్మకాల సమయాన్ని కూడా కుదించాం. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ధరలు సైతం పెంచాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాల బోధన, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడం,మద్యం అక్రమ విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టడం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు వంటి 16 చరిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ సమావేశాల్లోనే 19 విప్లవాత్మక బిల్లులను శాసనసభ ఆమోదించడం ద్వారా రికార్డు సృష్టించింది. సోమవారం శాసనసభ ఆమోదించిన ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్–1982 సవరణ బిల్లు ద్వారా వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు లక్షలాది మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలను బోధించడానికి బాటలు వేసింది. ఆ తర్వాత వరుస సంవత్సరాల్లో పదో తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలను బోధించడం ద్వారా మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు ఈ బిల్లు చుక్కానిలా నిలుస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునే బిల్లును ఆమోదించడం ద్వారా 51,488 మంది కార్మికుల స్వప్నం సాకారం చేసింది. ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం కోసం ఎస్సీ కమిషన్, ఎస్టీ వర్గాల ప్రజల హక్కులను పరిరక్షించడంతోపాటు ఆ వర్గాల ప్రజలకు మరింతగా ప్రయోజనం చేకూర్చడం కోసం ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు వీలుగా శాసనసభ బిల్లులను ఆమోదించింది. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగకుండా నియంత్రించడం.. ప్రజలందరికీ వాటిని అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం కోసం చిరుధాన్యాలు, పప్పుధాన్యాల బోర్డుల ఏర్పాటుకు వీలుగా వేర్వేరు బిల్లులను ఆమోదించింది. రాష్ట్ర శాసనసభలో ఒక్క రోజే 16 కీలక బిల్లులు.. మరో చారిత్రక ఘట్టానికి వేదికైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదం పొందిన బిల్లులు.. వాటి ఉద్దేశాలు ►బిల్లు : ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్–1982 సవరణ ఉద్దేశం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు భోదన.. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదం చేయడం.. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం. ►బిల్లు: ప్రభుత్వ సర్వీసుల్లోకి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఉద్దేశం: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం. ►బిల్లు : ఎస్సీ కమిషన్ ఉద్దేశం: ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం. ►బిల్లు : ఎస్టీ కమిషన్ ఉద్దేశం: ఎస్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం. ►బిల్లు : చిరుధాన్యాల(మిల్లెట్స్) బోర్డు ఏర్పాటు ఉద్దేశం: చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం. ►బిల్లు: పప్పుధాన్యాల(పల్సస్) బోర్డు ఏర్పాటు ఉద్దేశం: పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగడకుండా నియంత్రించడం.. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం. ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ మద్యనిషేధ చట్టం–1995కు సవరణ ఉద్దేశం: అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.రెండు లక్షల జరిమానా.. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా. ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ చట్టం–1968కు సవరణ ఉద్దేశం: బార్లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం.. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా.. ఇలాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లైసెన్స్ ఫీజుకు రెండు రెట్లు జరిమానా.. రెండోసారి పాల్పడితే బార్ లైసెన్స్ రద్దు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు. ►బిల్లు: కర్నూలులో క్లస్టర్ యునివర్సిటీ ఏర్పాటు ఉద్దేశం: కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీ, కేవీఆర్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.. విద్యార్థులకు ఉపాధి కల్పన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచేలా నాణ్యమైన విద్యను అందించడం. ►బిల్లు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం చట్టం సవరణ ఉద్దేశం: వైఎస్సార్ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడం. ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు ఉద్దేశం: విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్/ప్రతినిధి ఎక్స్–అఫీషియో సభ్యునిగా నియామకం. ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల రెండో సవరణ బిల్లు ఉద్దేశం: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ (ఉప కులపతులు)ల నియామక నిబంధనల్లో మార్పులు ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల రెండో సవరణ బిల్లు ఉద్దేశం: సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం. ఇతర బిల్లులు ►ఏపీ వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగుల వృత్తిపన్ను చట్టం సవరణ బిల్లు–2019 ►ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు–2019 ►ఏపీ మున్సిపల్ చట్టం సవరణ బిల్లు–2019 చదవండి: మరో అల్లూరి.. సీఎం జగన్ చదవండి: ఎస్సీ, ఎస్టీలకుద్రోహం చేయలేదా? -
ప్రైవేట్ విద్యా సంస్థలకు ముకుతాడు
తల్లిదండ్రులు గానీ, ప్రభుత్వాలు గానీ పిల్లలకు, భావితరాలకు ఇవ్వగలిగే మంచి ఆస్తి ఒక్క చదువు మాత్రమే. మన పిల్లలను మనం బాగా చదివించుకోగలిగితేనే వాళ్లు రేపు పేదరికం నుంచి బయట పడతారు. చదువు అనేది పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం. అందుకే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చదువు అన్నది ఒక హక్కుగా మేం చర్యలు ప్రారంభించాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యకు సంబంధించి దేశంలో ఒక చట్టం ఉంది. స్కూళ్లు కానీ, కాలేజీలు కానీ.. ఏవీ కూడా లాభాపేక్షతో, వ్యాపార దృక్పథంతో నడపాల్సినవి కావు. ప్రజా సేవలో భాగంగానే నడపాలి. అయితే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఫీజులు కూడా ఏకంగా రూ.63 వేలు, లక్ష రూపాయలు అని చెబుతుంటే మన పిల్లలను ఎలా చదివించగలం? సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో సమూల మార్పుల కోసం ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టిన పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల బిల్లులు చరిత్రాత్మకమైనవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని ప్రోత్సహిస్తూ గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నీరుగార్చిందని విమర్శించారు. విద్యను వ్యాపారమయంగా మార్చేసిన ఆయా సంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పిల్లలు చదువుకునే పరిస్థితులు లేకుండా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతులే గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉండడంతో ఫీజులు నియంత్రించలేని పరిస్థితి ఉండేదన్నారు. ఈ తరుణంలో విద్యా రంగం సమూల ప్రక్షాళన, ఫీజుల నియంత్రణతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను పిల్లలకు అందించడానికి వీలుగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ బిల్లులు ఎంతగానో దోహదం చేస్తాయని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విద్యా సంస్థల పెద్దలే మంత్రులైతే నియంత్రణ సాధ్యమా? ‘ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ బిల్లు ఒక చరిత్రాత్మక బిల్లు. మన కళ్లెదుటే ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఎడాపెడా బాదుతున్నా ఎవరూ అడగలేని పరిస్థితి. పట్టించుకోని దుస్థితి. సాక్షాత్తు ఆ పెద్ద పెద్ద స్కూళ్లు, కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలకు చెందిన వారే గత ప్రభుత్వంలో ఇక్కడ మంత్రులుగా ఉండటం మనం కళ్లారా చూశాం. ఆ పెద్ద పెద్ద వాళ్లే మంత్రులుగా ఉన్న పరిస్థితుల్లో స్కూళ్లను, ఫీజులను నియంత్రించలేని పరిస్థితి. ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలి. లేదా తక్కువ ఫీజులు వసూలు చేయాలి, ఆ ఫీజులు కూడా ప్రభుత్వం కట్టాలి. గడిచిన ఐదేళ్లలో ఒక్క స్కూల్లో కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేదు. దాంతో ఇష్టానుసారం ఆ స్కూళ్లలో ఫీజులు పెంచుకునే పరిస్థితులు నెలకొని, వ్యవస్థ అంతా నాశనమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పథకం ప్రకారం ప్రభుత్వ స్కూళ్ల నిర్వీర్యం రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారు. అప్రజాస్వామిక విధానాలతో గత ఐదేళ్లూ ప్రభుత్వ స్కూళ్లను క్రమంగా నిర్వీర్యం చేశారు. చివరకు ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన బకాయిలు కూడా కనీసం 6 నుంచి 8 నెలలపాటు చెల్లించని పరిస్థితి. మధ్యాహ్న భోజన పథకం సరుకుల బిల్లులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్య పుస్తకాలను కూడా సమయానికి ఇవ్వలేదు. జూన్లో ఇవ్వాల్సిన పుస్తకాలు సెప్టెంబర్, అక్టోబరులో కూడా ఇవ్వని పరిస్థితులను నా పాదయాత్ర సమయంలో చూశాను. హేతుబద్ధీకరణ పేరుతో స్కూళ్లను మూసేయడంతో పాటు ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే అవకాశం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు విద్య పేరుతో దోచేస్తున్న పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తున్నాం. సమూల మార్పుల దిశగా ముందడుగు రాష్ట్రంలో చదువులు అతి దారుణంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థను మేలుకొలపడానికే ఈ బిల్లును తీసుకొచ్చాం. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారు 33 శాతం మంది ఉన్నారు. అంటే నిరక్షరాస్యత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. తల్లిదండ్రులకు పిల్లలను చదివించాలన్న కోరిక, తపన లేక కాదు.. వారికి ఆర్థిక స్థోమత లేని కారణంగా.. రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతంగా ఉంది. దేశం మొత్తం మీద నిరక్షరాస్యత 26 శాతమే. ఇలాంటి పరిస్థితిలో ఈ బిల్లును తీసుకొస్తున్నాం. చదువు అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచించే హైకోర్టు రిటైర్డ్ జడ్జిని ఈ కమిషన్కు చైర్మన్గా నియమిస్తున్నాం. జాతీయ స్థాయిలో విద్యా రంగానికి సంబంధించిన ప్రముఖులతో కలుపుకుని మరో 11 మందిని సభ్యులుగా నియమిస్తున్నాం. నిబంధనలు పాటించకపోతే స్కూళ్లను మూయించే అధికారం ఈ కమిషన్లు ఏదైనా స్కూలు, కాలేజీకి వెళ్లి అక్కడ అడ్మిషన్, టీచింగ్ ప్రక్రియలను పర్యవేక్షించగలుగుతుంది. స్కూళ్ల గ్రేడింగ్ను, విద్యా హక్కు చట్టం అమలును, అక్రిడిటేషన్ను వీళ్ల పరిధిలోకి తీసుకు వస్తున్నాం. యాజమాన్యాలను హెచ్చరించడమే కాదు.. జరిమానాలు విధించడం, చివరకు స్కూళ్లను కూడా మూసి వేయించే అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. స్కూళ్లలో ఫీజులు రియాల్టీలోకి రావాలి. ఏ మాత్రం ఫీజులు ఉంటే పిల్లలు చదువుకోగలుగుతారన్నది, మౌలిక సదుపాయాలను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. మొత్తంగా పేదలు, మధ్యతరగతి వారికి అందుబాటులోకి చదువులను తీసుకెళ్తున్నాం. అందుకే ఈ చట్టం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. -
ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి
సాక్షి, అమరావతి : టీడీపీ నాయకులు ప్రజావేదిక గురించి మరిచిపోవడమే మంచిదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రజా వేదిక గురించి మాట్లాడటం వల్ల టీడీపీకి ఏమైనా మేలు జరుగుతుందని అనుకుంటే అది పొరపాటే అవుతుందని పేర్కొన్నారు. శాననమండలి ప్రశ్నోత్తరాల సమయంలో భవానీ ద్వీపం అభివృద్ధిపై ఆయన మాట్లాడుతూ.. భవానీ ఐలాండ్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చే ప్రతి భక్తుడు భవానీ ద్వీపాన్ని సందర్శించుకునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే విమానం నిలిపివేశామని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారు. కానీ బాబు ప్రభుత్వం ఆ విమాన సంస్థకు 2 కోట్ల బకాయి పడి.. దానిని చెల్లించలేకపోవడం వల్లే రద్దు చేశాం’ అని తెలిపారు. -
తొలిసారి శాసనమండలిలో అడుగు పెట్టిన వైఎస్ జగన్
-
కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలు
సాక్షి, అమరావతి : నవ్యాంధ్రలో నూతన శకానికి తెరతీసిన 15వ శాసనసభ తొలిసారిగా నేడు కొలువుదీరనుంది. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆశలను మోసుకుంటూ భవితకు భరోసానిస్తూ తొలిసారిగా బుధవారం సమావేశం కానుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అఖండ మెజార్టీతో ప్రజలు ఓ పార్టీకి అధికారం అప్పగించిన శాసనసభ. చరిత్ర సృష్టిస్తూ సుదీర్ఘ పాదయాత్ర చేసిన జననేత ముఖ్యమంత్రిగా సభా నాయకుడి హోదాను అలంకరించబోతున్న సభ కూడా ఇదే. 25 మంది మంత్రుల్లో ఏకంగా 19 మంది కొత్త మంత్రులుగా అధికార స్థానాల్లో కూర్చొనబోతున్న సభ. గత 30 ఏళ్లలో అత్యధిక శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు చట్టసభలో అడుగుపెట్టబోతున్న సభ కూడా ఇదే.. అందుకే బుధవారం తొలిసారిగా కొలువుదీరనున్న 15వ శాసనసభపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత శాసనసభ ప్రజాస్వామ్యానికి మిగిల్చిన మరకలను చెరిపేస్తూ.. గత ఐదేళ్ల కష్టాల నుంచి సాంత్వన కోరుతూ కొత్త శాసనసభ వైపు ఆశగా చూస్తున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యోన్ముఖులయ్యారు. ప్రజాస్వామ్య విలువలకు పట్టం కడుతూ సుపరిపాలనకు మార్గం సుగమం చేసేలా శాసనసభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. గత శాసనసభ చరిత్రలో మిగిల్చిన మరకలను పారదోలేలా చట్టసభలపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా శాసనసభ ఉండాలని కృతనిశ్చయంతో ఉన్నారు. 15వ శాసనసభ తొలి సమావేశాలు బుధవారం నుంచి ఐదురోజుల పాటు జరగనున్నాయి. బుధ, గురువారాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. శాసనసభ స్పీకర్ ఎన్నికను గురువారం నిర్వహిస్తారు. అఖండ విజయంతో వైఎస్సార్సీపీకి అధికార స్థానం రాష్ట్రం యావత్తూ కొత్త శాసనసభ వైపు చూస్తోంది. 15వ శాసనసభ తొలిసారి బుధవారం కొలువుదీరనుండటమే దీనికి కారణం. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నో విశిష్టతలు సంతరించుకున్న ఈ కొత్త శాసనసభ పట్ల ప్రజల్లో అంతటి ఆసక్తి వ్యక్తమవుతోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ రెండో శాసనసభ ఇది. నవ్యాంధ్ర ప్రదేశ్లోనే కాదు గతంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత భారీ మెజార్టీతో ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. శాసన సభలోని 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకుని వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు దక్కించుకుని ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. గత ఐదేళ్లు పరిపాలించిన టీడీపీ ఘోర పరాజయం పాలై కేవలం 23 సీట్లకు పరిమితం కావడం గమనార్హం. 14వ శాసనసభలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల స్థానాలు అటు ఇటూ మారాయి. గత శాసనసభలో సమర్థ ప్రతపక్షంగా వ్యవహరించిన వైఎస్సార్సీపీ ప్రజల మనసు గెలుచుకుని 15వ శాసనసభలో అధికార పక్షంగా అడుగు పెట్టనుంది. గత శాసనసభలో కేవలం 1.50 శాతం అధిక ఓట్లతో అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ ఐదేళ్ల పాలనలో ఘోర వైఫల్యం చెంది ప్రజల తిరస్కారానికి గురై ప్రస్తుత శాసనసభలో ప్రతిపక్ష స్థానానికి చేరింది. తిరుగులేని ప్రజా మద్దతుతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అశేష ప్రజాభిమానంతో తిరుగులేని జననేతగా గుర్తింపు పొందిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో బుధవారం అడుగుపెట్టనున్నారు. అద్వితీయమైన ప్రజాదరణ ఉన్న నేత సభా నాయకుడి స్థానాన్ని అధిష్టించడం రాష్ట్ర చరిత్రలో ఇది మూడోసారి. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి సభా నాయకులుగా రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్త చరిత్రను లిఖిస్తూ వైఎస్ జగన్ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించి ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో సభానాయకుడి స్థానాన్ని అలంకరించనున్నారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత శాసనసభలో ప్రధాన ప్రతిపక్షనేతగా సమర్థవంతంగా పనిచేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన అసెంబ్లీ వేదికగా పోరాడారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. శాసనసభ విలువలు, రాజ్యాంగ నిబంధనలు, ప్రజాస్వామ్య ప్రమాణాల కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. అయినప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఆ శాసనసభ సమావేశాలను పూర్తిగా బహిష్కరించి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ఏకంగా 14 నెలల పాటు 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం రగిలించారు. నవరత్నాల పథకాలతో రాజన్న రాజ్యం తీసుకు వస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆయన చిత్తశుద్ధి, నాయకత్వ పటిమను గుర్తించిన ప్రజలు వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఘోర పరాజయంతో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గత శాసనసభలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఈసారి ప్రధాన ప్రతిపక్ష నేత స్థానంలోకి మారనున్నారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్షం అత్యంత బలహీనంగా ఉండటం గమనార్హం. గత శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రతిపక్షంగా మిగిలిన టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. గత శాసనసభలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన వారిలో 23 మంది ఎమ్మెల్యేలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ప్రలోభాలకు గురిచేసి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నారు. కాగా 15వ శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల కాగా... టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యే స్థానాలే దక్కడం దేవుడు రాసిన స్క్రిప్టు అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత శాసనసభలో రాజ్యంగ విలువలను కాలరాస్తూ ప్రతిపక్ష ఎమ్మల్యేల కొనుగోలుకు కొమ్ము కాసిన స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఇటీవల ఎన్నికల్లో పరాజయం పాలై శాసనసభలో అడుగుపెట్టలేకపోవడం విశేషం. ఉనికి కోల్పోయిన జాతీయ పార్టీలు జాతీయ పార్టీలకు రాష్ట్ర 15వ శాసనసభలో స్థానం లేకుండా పోయింది. జాతీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం లేకుండా రాష్ట్ర శాసనసభ కొలువు దీరడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల నుంచి 15వ శాసనసభకు ఎవరూ ఎన్నిక కాలేదు. కాగా, కొత్తగా ఆవిర్భవించిన ప్రాంతీయ పార్టీ జనసేన 15వ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఆ పార్టీ తరఫున తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అత్యధికులు కొత్త మంత్రులు, కొత్త ఎమ్మెల్యేలే రెండు దశాబ్దాలకు ఓసారి రాష్ట్ర శాసనసభలోకి అత్యధికంగా కొత్త తరం నేతలు రావడం సహజ పరిణామం. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ 15వ శాసనసభలోకి రికార్డు స్థాయిలో కొత్త ఎమ్మెల్యేలు అడుగు పెట్టనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఎన్టీ రామారావు రాజకీయ ప్రవేశం సమయం 1983లో, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో 2004లో రాష్ట్ర శాసనసభకు అత్యధికంగా కొత్త ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ గత రికార్డులు తిరగరాసింది. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అత్యధిక శాతం మంది మంత్రుల హోదాలో తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గంలోని 25 మందిలో 19 మంది తొలిసారి అమాత్యులు అయినవారే కావడం విశేషం. సామాజిక న్యాయానికి ప్రతీక సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన కొత్త శకానికి 15వ శాసనసభ ప్రాతినిధ్యం వహించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతం మంత్రి పదవులు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తొలిసారి ఐదు మంది ఉప ముఖ్యమంత్రి హోదాలో శాసనభలో ఆసీనులయ్యే మహోన్నత అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పించారు. అందులోనూ ఆ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నాలుగు కేటాయించడం సామాజిక న్యాయం పట్ల ఆయన చిత్తశుద్ధికి తార్కాణంగా నిలుస్తోంది. వారిలో ఒకరు గిరిజన మహిళ కూడా ఉండటం ముదావహం. రాష్ట్రంలో తొలిసారి ఓ ఎస్సీ మహిళ హోం మంత్రి హోదాలో శాసనభలో ప్రవేశించనున్నారు. శాసనసభ స్పీకర్ పదవిని కూడా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యేగా ఎన్నికైన బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే నిర్ణయించడం పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రజల ఆకాంక్షలకు దీపిక ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. అందుకు శాసనభను ఆలయంగా భావించి ప్రజలకు త్రికరణశుద్ధిగా పనిచేస్తానని మాటిచ్చారు. అందుకు తగ్గట్లుగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మేనిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టారు. పింఛన్ల పెంపుదలపై తొలి సంతకం చేశారు. తాను పాదయాత్రలో గుర్తించిన ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యుక్తులయ్యారు. సోమవారం నిర్వహించిన తన మంత్రివర్గ తొలి సమావేశంలోనే దాదాపు 50 కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా రానున్న ఐదేళ్లలో మేనిఫెస్టో అమలు.. ప్రజా సంక్షేమం.. రాష్ట్ర ప్రగతికి శాసనభను వేదికగా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. సుపరిపాలనకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్రంలో రాజన్న పాలనకు 15వ శాసనసభ వేదికగా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులతోపాటు ప్రజలూ విశ్వసిస్తున్నారు. నేటి ఉదయం 11.05 గంటలకు సభ ప్రారంభం రాష్ట్ర 15వ శాసనసభ తొలి సమావేశం బుధవారం ఉదయం 11.05 గంటలకు ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. ప్రొటెం స్పీకర్గా నియమితులైన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి, సభానాయకుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 175 మంది సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ముగియని పక్షంలో గురువారం ఉదయం కొనసాగిస్తారు. 13వ తేదీన స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు ఆయన్ను ఆధ్యక్ష స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేయనున్నారు. స్పీకర్గా ఎన్నికైన సీతారాంకు సభ అభినందనలు తెలియజేస్తుంది. మరుసటి రోజు అంటే 14వ తేదీ ఉదయం 9 గంటలకు ఉభయసభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. కొత్త ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగం ద్వారా స్పష్టం చేయనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక సభ వాయిదా పడుతుంది. 15, 16వ తేదీలు సెలవు రోజులు కావడంతో సభ తిరిగి 17వ తేదీన ప్రారంభం అవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగుతుంది. సభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సమాధానం చెబుతారు. దీంతో ఈ సమావేశాలు ముగుస్తాయి. -
చట్టసభలకూ కొత్త భవనాలు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తెలంగాణలో ఆ ఖ్యాతికి తగ్గట్టుగా ప్రధాన పరిపాలన భవనాలు ఉండాలన్న దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా హుస్సేన్సాగర్ తీరంలో సచివాలయం కోసం భారీ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సచివాలయం ఉన్న 24 ఎకరాల స్థలంలోనే తెలంగాణ సంస్కృతికి దర్పణం పడుతూ ఆధునిక హంగులతో కొత్త సెక్రటేరియట్ నిర్మించబోతోంది. అలాగే రాష్ట్రానికి కీలకమైన శాసనసభ, శాసన మండలిలకు కూడా అదే స్థాయిలో సమీకృత భవన సముదాయాన్ని నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ను ఆనుకుని శాసనసభ, శాసన మండలి భవనాలున్నాయి. నిజాం కాలంలో నిర్మితమైన అసెంబ్లీ భవన సముదాయం చూడటానికి ఘనంగా కనిపించినా, అవి పురాతనమైపోవటంతో అంత వసతిగా లేవని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు భావిస్తున్నారు. ఇందులో పాత అసెంబ్లీ భవనం సరిగా లేకపోవటంతో దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు హయాంలో ఓ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇందులోనే తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతోంది. శాసన మండలికి ప్రత్యేక భవనం లేకపోవటంతో జూబ్లీహాల్ను మండలి భవనంగా మార్చారు. ఈ నేపథ్యంలో సరైన వసతులు లేని భవనాల్లో చట్టసభలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సచివాలయానికి ఘనంగా భవనాన్ని నిర్మించబోతున్నందున, చట్టసభలకు కూడా అదే స్థాయిలో భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు అనువైన స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతానికి మూడు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వీటిలో ఓ స్థలాన్ని చట్టసభల భవనాల కోసం ఖరారు చేయనున్నట్టు సమాచారం. పబ్లిక్ గార్డెన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించిన పబ్లిక్ గార్డెన్ను ఓ స్థలంగా గుర్తించారు. దాదాపు 35 ఎకరాల్లో విస్తరించిన పబ్లిక్ గార్డెన్ నిజాం కాలంలో హైదరాబాద్ కీ షాన్గా రూపుదిద్దుకున్న ఉద్యానవనం. ఇందులో జూబ్లీహాల్తోపాటు డాక్టర్ వైఎస్రాజశేఖరరెడ్డి తెలంగాణ స్టేట్ మ్యూజియం, జవహర్ బాలభవన్, హెల్త్ మ్యూజియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు లలిత కళాతోరణం, ఉద్యానవన విభాగ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. గతంలో అద్భుతంగా ఉండి నగరవాసులకు ప్రధాన విహార విడిదిగా ఉన్న ఉద్యానవనాలు ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక మురికికూపాలుగా మారాయి. దీంతో జనం కూడా పెద్దగా రావడంలేదు. దీంతో పోకిరీలు, ఆకతాయిలకు ఇది అడ్డాగా మారిపోయింది. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించి నగరవాసులను ఆకట్టుకున్న లలిత కళాతోరణం కూడా కళ తప్పింది. ఇందులోని ఓపెన్ థియేటర్ ఎంతో అలరించేది. ఇప్పుడు అందులో సినిమా ప్రదర్శనలు లేక వెలవెలబోతోంది. ఈ మొత్తం గార్డెన్ను పునరుద్ధరించి మెరుగుపరచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీనిని ఆనుకునే ప్రస్తుత అసెంబ్లీ భవన సముదాయం ఉంది. ఈ ఉద్యానవనంలో కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఇందులో ఉన్న ఖాళీ స్థలం ఎంత, భవనాల విస్తీర్ణం ఎంత అనే వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణం ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణాన్ని కూడా పరిశీలనలో ఉంది. దాదాపు 60 ఎకరాల్లో విస్తరించిన ఆ స్థలంలో కొంత భాగాన్ని చట్టసభల భవనాల కోసం వినియోగించుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ఇక్కడే సచివాలయాన్ని నిర్మించాలని భావించింది. కానీ వాస్తు ప్రకారం అది సరిగా ఉండదన్న అభిప్రాయంతోపాటు తీవ్ర ట్రాఫిక్ చిక్కులుండే ఏరియా కావటంతో ఆ ఆలోచనను విరమించుకుంది. ఇక్కడి ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించి అక్కడ అసెంబ్లీ భవన సముదాయం నిర్మిస్తే బాగుంటుందా అన్న కోణంలో ప్రస్తుతం ఆలోచిస్తోంది. దీంతో ఇక్కడి ఆసుపత్రి తరలింపు, అందులో ఉన్న స్థలం తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇర్రమ్ మంజిల్ ప్రస్తుతం నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ ప్రధాన భవనాలున్న ఇర్రమ్ మంజిల్ (ఎర్రమంజిల్) ప్రాంగణాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో నిజాంకాలం నాటి పురాతన ఇర్రమ్ మంజిల్ ప్యాలెస్ ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ప్రధాన భవనంగా ఇది కొనసాగింది. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం దీని వెనక కొత్త భవనాన్ని నిర్మించటంతో ఆ శాఖ కార్యాలయాన్ని అందులోకి తరలించారు. అప్పటి నుంచి ఈ పురాతన ప్యాలెస్ ఖాళీగా ఉంది. దాన్ని కూల్చి ఆ స్థలంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందో అని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే అది హెరిటేజ్ భవనం కావటంతో దాన్ని కూల్చాలంటే ముందుగా హెరిటేజ్ జాబితాలోంచి ఆ పేరును చట్టబద్ధ ప్రక్రియ ద్వారా తొలగించాల్సి ఉంది. దీనికి తోడు ఆ ప్రాంతం గుట్ట భాగం కావటంతో కొంత ఎత్తుగా, కొంత పల్లంగా ఉంటుంది. ఇది కూడా అంత యోగ్యం కాదన్న అభిప్రాయం ఉంది. అయినా అధికారులు దాని వివరాలు సేకరించి ముఖ్యమంత్రికి అందించనున్నారు. ఈ మూడు స్థలాలతోపాటు నగరం వెలుపల అసెంబ్లీ నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. చట్ట సభలు నిరంతరం కొనసాగవు. సంవత్సరం మొత్తంలో 50 రోజులకు మించి కార్యకలాపాలు ఉండవు. మిగతా సమయం ఖాళీగానే ఉంటుంది. అందువల్ల నగర శివారులో నిర్మించినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. దీనికి వీలుగా కూడా కొన్ని ప్రాంతాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం అలాగే... ప్రస్తుతం చట్టసభలు కొనసాగుతున్న అసెంబ్లీ భవనం హెరిటేజ్ జాబితాలో ఉంది. నిజాం హయాంలో నిర్మితమైనవాటిలో ఇదీ ప్రధానమైందే. ఈ నేపథ్యంలో దాన్ని తొలగించటం సాధ్యం కాదు. అందుకు జనం కూడా ఆమోదించే అవకాశం లేదు. దీంతో ఆ భవనాన్ని అలాగే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ భవనాలను హైదరాబాద్ మ్యూజియంగా మార్చాలన్న ప్రతిపాదన కూడా ఉంది. స్టేట్ మ్యూజియం భవనం ఇరుకుగా ఉంది. దీంతో చాలా పురాతన వస్తువులను గదుల్లో పెట్టి తాళం వేశారు. అసెంబ్లీ భవనాన్ని మ్యూజియంకు అప్పగిస్తే వాటన్నింటిని ప్రదర్శనలో ఉంచే వీలుంటుంది. అందుకే దీన్ని మ్యూజియంగా మార్చాలన్న ప్రతిపాదన ఉంది. అసెంబ్లీకి కొత్త భవనం నిర్మిస్తే ప్రస్తుత భవనం మ్యూజియంగా మారే అవకాశం ఉంది. -
రేపు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం
-
సంప్రదాయానికి భిన్నంగా నేడూ సభ..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి. శాసనసభ, శానసమండలిలో శనివారం బడ్జెట్పై చర్చ జరగనుంది. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తారు. ఆదివారం సెలవుగా ఖరారు చేశారు. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అధ్యయనం కోసం అసెంబ్లీకి సెలవు ఉంటుంది. అయితే ఉభయసభలను శనివారం సైతం నిర్వహించాలని శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)లు నిర్ణయించాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన శాసనసభ బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ అధ్యక్షతన శాసనమండలి బీఏసీ సమావేశం జరిగింది. శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బోడికుంటి వెంకటేశ్వర్లు, రాజేశ్వర్రావు ఇందులో పాల్గొన్నారు. ఈ రెండు సభల బీఏసీలోనూ సోమవారంతో సభను ముగించాలని నిర్ణయించారు. సంతాపం అనంతరం చర్చలు శనివారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. దివంగత మాజీ గవర్నర్ నారాయణ్దత్ తివారీతోపాటు 15 మంది మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభలో సంతాపం తెలుపుతారు. జీఎస్టీ, పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెడుతుంది. అనంతరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ మొదలవుతుంది. ఇటు శాసన మండలిలో నారాయణ్దత్ తివారీకి సంతాపం ప్రకటించిన అనంతరం బడ్జెట్పై చర్చ మొదలవుతుంది. ఆరోగ్యకరమైన చర్చ జరగాలి: ప్రశాంత్రెడ్డి ప్రతిపక్షాలు ప్రస్తావించే అన్ని అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. బడ్జెట్పై కాంగ్రెస్ తరపున ఇద్దరు సభ్యులు చర్చను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. అదేరోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తవుతుందని వెల్లడించారు. -
నేనో ఆర్థికవేత్తను
సాక్షి, అమరావతి: ‘నేనో ఆర్థిక శాస్త్రవేత్తను.. ఆర్థిక శాస్త్ర విద్యార్థిని.. పేదరికం లేకుండా సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం శాసనసభలో ‘సామాజిక సాధికారత, సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి’పై నిర్వహించిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. సమాజానికి పేదరికం శాపం వంటిదని అన్నారు. దేశంలో 19 91లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక.. ప్రపంచీకరణతో కులవృత్తులు, చేతివృత్తులు దెబ్బతిన్నాయన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల్లో పేదలు ఉన్నట్లు అగ్రవర్ణాల్లోనూ ఉన్నారన్నారు. లీడర్ను కాబట్టే.. జనాభా పెంచాలని కోరుతున్నా.. 2014 ఎన్నికలకు ముందు తాను చేసిన పాదయాత్రలో ఎక్కువమంది పిల్లలకు జన్మనివ్వాలని.. జనాభాను పెంచాలని పిలుపునిస్తే అందరూ అవహేళన చేశారని సీఎం అన్నారు. చైనా, జపాన్లో జనాభా తగ్గడం వల్ల వృద్ధులు అధికమైపోయార న్నారు. 1995 నుంచి 2004 వరకు తాను చేపట్టిన చర్యలతో జనాభా గణనీయంగా తగ్గిందన్నారు. కానీ ఇది సమాజానికి మంచిది కాదని, జనాభా పెరగాల్సి ఉందని, భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని తానీ పిలుపునిస్తున్నానని చెప్పారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది.. ఆహార భద్రత చేకూర్చడంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందని సీఎం చెప్పారు. విద్యా భద్రత చేకూర్చడం వల్ల పేదరికం తగ్గుతుందన్నారు. నిరుద్యోగులకు మార్చి నుంచి దీన్ని రెండువేలకు పెంచుతున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలకిచ్చే చెక్కులకు బ్యాంకర్లు డబ్బులివ్వకపోతే.. తిరుగుబాటు చేసైనా డబ్బులు తీసుకోవాలన్నారు.వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యిందని చెప్పారు. 23 ప్రాజె క్టులు పూర్తి చేశామన్నారు. జూన్నాటికి గ్రావిటీద్వారా పోలవరం నుంచి నీటినందిస్తామన్నారు. -
ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ, మండలిలో పార్టీ ఫిరాయింపుల చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతుందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేసిన నెల రోజులకే వేటు వేశారు. అదే టీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీల నేతలపై ఫిర్యాదు చేస్తే మాత్రం ఇప్పటి వరకు విచారణ చేయలేదన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇష్టానుసారం అన్వయించుకుంటూ స్పీకర్, మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని, ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. -
తెలంగాణ మండలిలో అనూహ్య పరిణామాలు
-
సభకు చెప్పకుండా అసెంబ్లీ రద్దు చేయొచ్చా?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ అభిప్రాయం, ఆమోదం తీసుకోకుండానే అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చో లేదో చెప్పాలని హైకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావుకు సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు ఎన్నికల కోసం 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాకు చెందిన పోతుగంటి శశాంక్రెడ్డి, ఆర్.అభిలాష్రెడ్డిలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది పి.నిరూప్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడం వల్ల ఓటుహక్కు నమోదు గడువును ఎన్నికల సంఘం కుదించిందని, ఫలితంగా రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం పోయిందని, తద్వారా వారు ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారని వివరించారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ షెడ్యూల్ను విడుదల చేసిందని, దీని ప్రకారం ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. అనంతరం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2019 జనవరి 1 గడువును 2018 జనవరి 1గా కుదిస్తూ గత నెల 8న తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి మెమో జారీ చేశారని, దీనిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇలా ఓటు హక్కును హరించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. ఏ యువత వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైందో, ఇప్పుడు ఆ యువతకే ఓటుహక్కు లేకుండా పోయిందని చెప్పారు. రద్దుపై సభ అభిప్రాయం తెలుసుకోవాలి... అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రిమండలి సిఫారసు చేసిందని, దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారని నిరూప్రెడ్డి వివరించారు. వాస్తవానికి అసెంబ్లీని రద్దు చేయాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని సభకు తెలియజేసి, ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ముఖ్యమంత్రి ఆ పని చేయకుండా తన ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజాభీష్టం మేరకే ఎన్నికయ్యారని, అసెంబ్లీ రద్దు విషయం వారికి పత్రికల్లో చూస్తే గాని తెలియలేదని వివరించారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో సభకు కారణాలు తెలియచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని స్పష్టంచేశారు. సాధారణ ఎన్నికలప్పుడు రెండు అసెంబ్లీలకు మధ్య ఆరు నెలల వ్యవధి ఉండాలని, కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఆరు నెలల వ్యవధి అవసరం లేదని, కాబట్టి ఇంత హడావుడిగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం లేదని నివేదించారు. 2014 ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 63 మంది గెలిచారని, ఆ తరువాత ఇది 90కి చేరిందని, ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్లే అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఈ పాయింట్ను ఇప్పటి వరకు ఎవ్వరూ లేవనెత్తలేదు. ఇది ఓ విస్తృత అంశం. దీనిని భిన్న కోణంలో చూడాలి. కాబట్టి ఈ అంశంపై మేం పూర్తిస్థాయిలో వాదనలు వింటాం’ అని స్పష్టం చేసింది. జాతకాలను తేల్చేది ఆ 10 శాతం మందే నిరూప్రెడ్డి తన వాదనలను కొనసాగిస్తూ.. తెలంగాణలో మొత్తం 2.81 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల దాదాపు 10 శాతం మంది ఓటుహక్కు కోల్పోయారని, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల జాతకాలను ఈ 10 శాతం మంది ఓటర్లే తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తప్పులన్నీ సవరించి ఓటర్ల జాబితాను తయారుచేసి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం వల్ల వచ్చిన నష్టం ఏమీలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. శాసనసభ అభిప్రాయం, ఆమోదం తీసుకోకుండానే అసెంబ్లీ రద్దుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చో లేదో చెప్పాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు ఏజీ రామచంద్రరావును ఆదేశించింది. ఇది ప్రధాన అంశమని, దీనిని తేల్చిన తర్వాతే ఓటర్ల చేర్పులు, తీసివేతలు, జాబితాల తయారీ విషయానికొస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. -
శాసన విధుల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ: శాసన సంబంధ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం పెంపునకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కోయంబత్తూర్కు చెందిన డాక్టర్ ఎస్.రాజశేఖరన్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2017 బిల్లును ఇప్పటికే లోక్సభ ఆమోదించగా రాజ్యసభలో పెండింగ్లో ఉంది. దీనిని వచ్చే శీతాకాల సమావేశాల్లో సభ ఆమోదించే అవకాశం ఉంది. ‘చట్టసభల విధుల్లో మేం జోక్యం చేసుకోలేము. రాజ్యసభలో ఆ బిల్లు పెండింగ్లో ఉందంటే దానర్థం మేం జోక్యం చేసుకోవాలని కాదు. ఆ పని మేం చేయలేం’ అని స్పష్టం చేసింది. ‘పరిహారం చెల్లింపులో ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా రూ.2 లక్షల పరిహారం ఇస్తామంటే మేమేందుకు వద్దంటాం? అని ప్రశ్నించింది. -
శాసనసభకు తెలుగింటి కోడలు
గౌరిబిదనూరు : ఈ నియోజక వర్గంలో 14 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. అందులో ఒక్కసారి మాత్రం మహిళా అభ్యర్థిని ఎన్నిక చేసి కర్ణాటక శాసనసభకు పంపారు. ఆమె జ్యోతిరెడ్డి. ఆంధ్రప్రదేశ్కు చెందిన జడ్జి వరదారెడ్డి కుమార్తె జ్యోతిరెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా పుంగనూరు. అయితే ఈమె హిందూపురంలో కళాశాల విద్యనభ్యసించింది. ఈమె అమ్మమ్మ ఇల్లు ఇదే తాలూకా నాగసంద్రం. ఈమె తాత ఎన్సీ నాగయ్యరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి మొదటి ఎమ్మెల్యేగా 1952లో కాంగ్రెస్ టికెట్పై విజయం సాధించారు. ఇదిలా ఉంటే జ్యోతిరెడ్డి భర్త రాజగోపాలరెడ్డి స్వగ్రామం కూడా నాగసంద్ర కావడంతో ఇక్కడే వచ్చి స్థిరపడ్డారు. అప్పటి నుంచి రాజకీయలపై దృష్టి సారించారు. 1989లో జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి ఓటమి పాలయ్యారు. తిరిగి 1994లో జేడీఎస్ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు. ఈమె ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జ్యోతిరెడ్డి బీజేపీలో కొనసాగుతున్నార -
శాసన సభ నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ నిరవధిక వాయిదా పడింది. మార్చి 5న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. మొత్తం 19 రోజుల్లో 133.58 గంటల పాటు శాసన సభ జరిగిందని వివరించారు. మొత్తం 166 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగా, తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సభలో ప్రభుత్వం 5 తీర్మానాలు చేసింది. మొత్తం 103 మంది సభ్యులు మాట్లాడారు. -
మిగులు కాదు.. లోటురాష్ట్రమే
సాక్షి, హైదరాబాద్:‘తెలంగాణ మిగులు రాష్ట్రం కాదు.. లోటు రాష్ట్రం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,386 కోట్ల రెవెన్యూ మిగులు నమోదు చేసింది. రెవెన్యూ మిగులును రూ.6,778 కోట్లు ఎక్కువ చేసి చూపించింది. అంటే రాష్ట్రం రూ.5,392 కోట్ల రెవెన్యూ లోటులో ఉంది’భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పద్దులు నమోదు చేయటంలోనే ఈ తప్పులు చేసిందని అంశాల వారీగా కాగ్ వేలెత్తి చూపింది. ‘ఉదయ్ పద్దులో రూ.3,750 కోట్లను గ్రాంటుకు బదులు ఈక్విటీగా చూపించింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు అప్పుగా తెచ్చుకున్న రూ.1,500 కోట్లు రాబడిలో జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, హడ్కో నుంచి అప్పుగా తెచ్చుకున్న రూ.1,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలో రెవెన్యూ రాబడిగా రాసుకుంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.528 కోట్ల రెవెన్యూ వ్యయం రుణంగా చూపించి ఖర్చు తక్కువ కనబడేలా చేసింది’అని జమా ఖర్చుల పద్దులో ప్రభుత్వం చేసిన గిమ్మిక్కులను కాగ్ బయటపెట్టింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అజాయబ్సింగ్ ఈ నివేదికలను మీడియాకు విడుదల చేశారు. ఆదాయ వ్యయాల పరిశీలనతో పాటు వివిధ రంగాల వారీగా తమ ఆడిట్లో వెల్లడైన అంశాలను పొందుపరిచినట్లు విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు స్థానిక సంస్థలు, ఆర్థిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, సామాన్య, సామాజిక రంగాలపై విడుదల చేసిన నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల నిర్వహణను కాగ్ తూర్పారబట్టింది. రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని వేలెత్తి చూపింది. హద్దు మీరిన ద్రవ్యలోటు.. ద్రవ్యలోటు ఆందోళనకరంగా పెరిగిపోయిందని కాగ్ స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం నిర్దేశించిన 3.5 శాతం దాటిపోయిందని గుర్తించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో ద్రవ్యలోటు 5.46 శాతంగా ఉందని, ఉదయ్ పథకం కింద విద్యుత్తు సంస్థలకు బదిలీ చేసిన డబ్బును మినహాయిస్తే 4.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. అప్పుగా తెచ్చిన నిధులను రెవెన్యూ రాబడుల్లో జమ చేసి, ద్రవ్య లోటును రూ.2,500 కోట్ల మేరకు తక్కువ చేసి చూపించిందని రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. ఉదయ్ బాండ్ల ద్వారా రూ.8,931 కోట్లు అప్పు తెచ్చుకుంటే, కేవలం రూ.7,500 కోట్లు డిస్కంలకు విడుదల చేసిందని పేర్కొంది. డిస్కంల మిగతా రుణాలకు కొత్త బాండ్లు జారీ చేయాలని ఉదయ్ పథకం నిర్దేశించినప్పటికీ.. వాటిని జారీ చేయలేదని తప్పుబట్టింది. ఖర్చెక్కువ.. అభివృద్ధి తక్కువ.. రెవెన్యూ రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని కాగ్ వేలెత్తి చూపింది. ‘రాష్ట్రం మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం 69 శాతంగా నమోదైంది. దీంతో మౌలిక వసతులు, ఆస్తుల కల్పనలో పెట్టుబడికి 31 శాతమే మిగిలి ఉంది’అని కాగ్ ప్రస్తావించింది. 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే రూ.6,184 కోట్లు అధికంగా ఖర్చయితే క్రమబద్ధీకరించలేదని తప్పుబట్టింది. బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ ఖర్చులకు పొంతన లేకపోవటంతో కొన్ని శాఖల్లో భారీగా మిగులు, కొన్నింటిలో కేటాయింపులకు మించి ఖర్చులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. గ్రాంట్లకు మించి ఖర్చు చేసిన కేసులు తీవ్ర ఉల్లంఘనలేనని, ఇవి శాసనసభ అభీష్టానికి విఘాతం కలిగిస్తాయని, వెంటనే బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. 2016–17లో బడ్జెట్ కేటాయింపులను మించి చేసిన అధిక ఖర్చు రూ.21,161 కోట్లుగా గుర్తించింది. 16 గ్రాంట్లు, మూడు అప్రాప్రియేషన్లలో చేసిన అధిక వ్యయం రాజ్యాంగం ప్రకారం క్రమబద్ధీకరించాలని సూచించింది. కేటాయింపులే.. ఖర్చుల్లేవు.. ఎస్సీ సబ్ ప్లాన్కు కేటాయించిన నిధుల్లో 60 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 58 శాతం వినియోగించకుండా చట్టాన్ని నిర్లక్ష్యం చేసిందని కాగ్ వెల్లడించింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఐటీడీఏ జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు, రాష్ట్రంలో ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చు కాలేదని గుర్తించింది. రైతులకు వడ్డీ లేని పంట రుణాలకు నిర్దేశించిన రూ.265 కోట్లు ఖర్చు చేయలేదని వెల్లడించింది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులు పాటించకపోవటం, ఆర్థిక నియంత్రణ లోపించిందని పలు ఉదాహరణలను కాగ్ ప్రస్తావించింది. వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు సంబంధించిన వెబ్సైట్లో ఉన్న నిల్వలకు, లెడ్జర్లో ఉన్న నిల్వలకు వ్యత్యాసముంది. 28,087 వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల్లో రూ.19,873 కోట్ల మొత్తం నిల్వ ఉంది. పీడీ ఖాతాల్లో భారీ మొత్తాలు ఉంచి రుణాలపై 7.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న తీరు ప్రభుత్వ నగదు నిర్వహణ, ఆర్థిక నిర్వహణలు సరిగా లేవని స్పష్టంచేస్తోందని కాగ్ అభిప్రాయపడింది. పథకాల అమలుకు డ్రా చేసిన నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలు(యూసీలు) సమర్పించలేదని, కొన్ని శాఖలు నిధులు వినియోగించకుండానే యూసీలు సమర్పించాయని గుర్తించింది. అప్పుల కుప్పలపై ఆందోళన ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో 34.74 శాతం పాత అప్పులను తీర్చేందుకే వినియోగిస్తోందని కాగ్ వెల్లడించింది. 2020–22 సంవత్సరాల మధ్య రూ.14,896 కోట్లు, 2022–24 మధ్య రూ.22,280 కోట్ల అప్పును ప్రభుత్వం తీర్చాల్సి ఉందని, ఈ అప్పును తీర్చేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. మరిన్ని అప్పులు చేయకుండా ఉండేందుకు సముచితమైన చెల్లింపుల వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించుకోవాలని సూచించింది. 2017 మార్చి 31 నాటికి ఉన్న రాష్ట్ర అప్పులు పరిశీలిస్తే.. వచ్చే ఏడేళ్లలో 49 శాతం రుణాలు.. అంటే రూ.56,388 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. 2015–16లో పన్నుల రాబడిలో 7.12 శాతం రుణాలు తిరిగి చెల్లించగా, 2016–17లో ఇది 32.16 శాతానికి పెరిగింది. 14వ ఆర్థిక సంఘం ప్రామాణిక రేటు ప్రకారం రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు 8.22 శాతంగా ఉండాలి. కానీ ఇవి 10.40 శాతానికి పెరిగాయని కాగ్ గుర్తించింది. -
గ్రామ స్వరాజ్యం
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లయినా గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏమాత్రం మారలేదని.. సర్కారు తుమ్మలు, మురికి కాలువలతో గ్రామాలు అధ్వానస్థితిలో ఉండటానికి సరైన చట్టాల్లేకపోవడమే కారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం శాసనసభలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.36 లక్షల మంది ప్రజాప్రతినిధులున్నా.. గ్రామాలు మాత్రం జవసత్వాలు లేకుండా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పంచాయతీ వ్యవస్థలో పూర్తిస్థాయిలో మార్పులు చేసి సుపరిపాలన, గ్రామ స్వరాజ్యం దిశగా కొత్త చట్టాన్ని రూపొందించినట్టు స్పష్టం చేశారు. శాసనసభ ఆమోదంతోనే గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేలా సవరణలు చేస్తున్నట్టు తెలిపారు. అప్పట్లో ఎస్కే డే తోడ్పాటుతో.. దేశంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు ఒక ఉద్యమమని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ‘‘స్వాతంత్య్రం అనంతరం ప్రధాని నెహ్రూ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అప్పటి అధ్యక్షుడు ఐసెన్ హోవర్ అక్కడ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న భారతీయుడు ఎస్కే డేను నెహ్రూకు పరిచయం చేశారు. ఎస్కేడే వల్ల అమెరికా గ్రామీణాభివృద్ధి చెందుతోందని ఐసెన్ హోవర్ ప్రశంసించారు. దాంతో నెహ్రూ ఎస్కే డేను భారత్కు రావాలని కోరినా.. ఆయన నిరాకరించారు. మూర్ఖుల చేతుల్లో ఉన్న భారతదేశానికి తాను రాలేనన్నారు. కానీ నెహ్రూకు కొన్ని సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా నీళ్లు, గ్రామాల్లోని భూములు, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు దేశం బాగుపడుతుందని ఎస్కే డే స్పష్టం చేశారు. నెహ్రూ భారత్కు తిరిగొచ్చాక రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాజెక్టులపై దృష్టి సారించి.. భాక్రానంగల్, నాగార్జునసాగర్లను నిర్మించారు. ఇది గమనించిన ఎస్కే డే అమెరికా నుంచి రావడంతో.. నెహ్రూ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కమ్యూనిటీ డెవలప్మెంట్ బా«ధ్యతలు అప్పగించారు. ఎస్కే డే హైదరాబాద్ను ఎంచుకుని ఎన్ఐఆర్డీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్)ని స్థాపించారు. దేశంలోనే మొట్టమొదటి బ్లాక్ పంచాయతీగా పటాన్చెరువును ఏర్పాటు చేశారు..’’అని కేసీఆర్ తెలిపారు. ఆ పంచాయతీకి మాజీ స్పీకర్ జి.రామచంద్రారెడ్డి సమితి ప్రెసిడెంట్గా వ్యవహరించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలే భయపడేవారు.. గతంలో పంచాయతీ సమితి ప్రెసిడెంట్లు అంటే ఎమ్మెల్యేలు సైతం వణికిపోయేవారని.. అన్ని విశేష అధికారాలు కలిగి ఉండేవారని కేసీఆర్ చెప్పారు. టీచర్ల నియామకం, సిబ్బందికి జీతాల చెల్లింపు, పెంపు వంటి అన్ని అధికారాలు ఉండేవన్నారు. ‘‘నేను దుబ్బాక పాఠశాలలో చదువుకున్నప్పుడు సోలిపేట రామచంద్రారెడ్డి సమితి అధికారిగా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామాల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేశాం. అలా ఉన్న గ్రామాలు ఇప్పుడు ఎన్నికలు వస్తే రాజకీయాలు చేయడం, ఏకంగా హత్యలకు పాల్పడడం, ముఠాలు, వర్గాలుగా కేసులు పెట్టుకోవడానికి కేంద్రంగా మారిపోయాయి. దీనికి దేశంలోని అన్ని రాజకీయ పక్షాలే కారణం..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మొక్కలు ఎండిపోతే.. సర్పంచ్ను తొలగింపు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్లను తొలగిస్తూ కలెక్టర్ ఉదయం 11 గంటలకు ఆదేశాలు ఇస్తే.. రెండు గంటలలోపే కోర్టుల స్టే ఆదేశాలు వస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీలు అంటే సర్పంచులు మాత్రమే కాదని, గ్రామం మొత్తమని తెలియాలని పేర్కొన్నారు. సర్పంచులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం లేదనే తాము దగ్గరుండి మొక్కలు నాటుతున్నామన్నారు. కొత్త చట్టం ప్రకారం గ్రామంలో మొక్కలు చచ్చిపోతే సర్పంచును తొలగించడంతోపాటు ఆ గ్రామ కార్యదర్శిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తప్పించేలా చట్టంలో నిబంధనలు పెట్టామని కేసీఆర్ చెప్పారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో నర్సరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్కడ గిరిజనులే ఉంటరు. ఇప్పటివరకు గిరిజన తండాలు, గూడాలు కలిపి 631 ఎస్టీ గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయని.. కొత్త చట్టం ప్రకారం 2,637 నూతన ఎస్టీ రిజర్వు పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయని కేసీఆర్ తెలిపారు. అవి శాశ్వతంగా ఇదే రిజర్వేషన్తో కొనసాగుతాయని.. కేవలం పురుష, మహిళా విభాగం మారుతుందని చెప్పారు. సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికి కలిపి జాయింట్ చెక్పవర్ ఇస్తున్నామని.. దానివల్ల ఇద్దరికీ సమాన గౌరవంతో పాటు బాధ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చే నిధులే తప్ప పంచాయతీలకు పెద్దగా నిధులు లేవని.. కానీ తాము దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పంచాయతీల కోసం రూ.1,500 కోట్లు, మున్సిపాలిటీల కోసం రూ.1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించామని వెల్లడించారు. చిన్న గ్రామానికి కూడా రూ.3 లక్షల వరకు నిధులు కేటాయించనున్నట్టు ప్రకటించారు. ఇవేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపీ ల్యాడ్స్ తదితర మార్గాల ద్వారా గ్రామాలకు నిధులు అందుతాయన్నారు. నగర పంచాయతీల్లేవు.. మున్సిపాలిటీలే.. పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా ఉన్న వ్యవస్థలో.. ఇక నుంచి నగర పంచాయతీలు ఉండవని కేసీఆర్ తెలిపారు. నగర పంచాయతీగా ఉండటం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని.. అందుకే వాటిని మున్సిపాలిటీలుగా మార్చుతున్నామని చెప్పారు. ప్రస్తుతం పురపాలక చట్టానికి సవరణలు మాత్రమే జరుగుతున్నాయని, త్వరలో కొత్త పురపాలక చట్టం తెస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం కలిపి 147 అవుతున్నాయన్నారు. గడువులోగా ఎన్నికలు జరుపుతాం తాము తొలుత భావించినట్టుగా ప్రత్యేక సెషన్స్లోనే పంచాయతీ చట్టం తెచ్చి ఉంటే.. ఈ పాటికి ఎన్నికలు ముగిసి కొత్త సర్పంచులు వచ్చేవారని కేసీఆర్ చెప్పారు. ఈ నెల 24న ఓటర్ల జాబితా ప్రకటించారని, దీనివల్ల పంచాయతీ చట్టాన్ని బడ్జెట్ సెషన్లో పెట్టామని తెలిపారు. అయితే ప్రస్తుతమున్న పాలకవర్గాలను రద్దు చేసే ఆలోచన లేదని.. గడువు ప్రకారమే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. పార్టీలకు సంబంధం లేకుండా ఈ ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఇన్ని గ్రామాలు, ఈ పార్టీకి అన్ని గ్రామాలు అని అంకెలు ప్రకటించుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. కో–ఆప్షన్ వ్యవస్థపై సైతం సీఎం వివరణ ఇచ్చారు. ప్రతి గ్రామంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నారైలు, ఆర్థికంగా గ్రామాలను ఆదుకున్నవారు ఉంటారని.. వారి సూచనలు, సలహాలు, సేవలు తీసుకొనేందుకు గ్రామ పంచాయతీయే వారిని గుర్తించి కో–ఆప్షన్ మెంబర్లుగా నియమించుకుంటుందని తెలిపారు. వారికి ఎలాంటి ఓటింగ్ హక్కులు ఉండవని చెప్పారు. కేంద్ర ఎరువుల విధానం దుర్మార్గం రైతులు ఎరువులు తీసుకోవడానికి బయోమెట్రిక్, ఆధార్, పీఓఎస్ విధానం తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని కేసీఆర్ పేర్కొన్నారు. తాను దీనిపై పదే పదే కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో మొత్తుకున్నా వినలేదని, దీనివల్ల రైతులు రోడ్లపై ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని.. గతంలో చెప్పులు లైన్లో పెట్టి, ఠాణాల్లో ఎరువులు కొనుగోలు చేసిన పరిస్థితి గుర్తుకువస్తోందని చెప్పారు. కేవలం రూ.3 వేల కోట్ల ఆదా కోసం కోట్లాది మంది రైతులను రోడ్ల మీదికి తీసుకొస్తారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాలు.. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా కొత్త పంచాయతీల చట్టాన్ని ప్రవేశపెడుతోందని.. అర్ధరాత్రి బిల్లు కాపీలిచ్చి తెల్లారే చర్చ జరిపి ఆమోదింపజేసుకోవడం సరికాదని బీజేపీ శానససభాపక్షనేత కిషన్రెడ్డి పేర్కొన్నారు. కనీసం సభ్యులు పార్టీపరంగా చర్చించుకుని, మరింత సమగ్రంగా బిల్లు ఉండేలా కృషిచేసే అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పారు. పంచాయతీల బిల్లుపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి, మరింత చర్చ జరిగాకే సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా ఇదే డిమాండ్ చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానమిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం రెండేళ్ల నుంచి తల పగిలిపోయేలా కృషి చేస్తున్నామని, అనేక మంది మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు, నిపుణులతో చర్చించాకే బిల్లును రూపొందించామని చెప్పారు. రైతు సమన్వయ సమితులకు సర్పంచులకు సంబంధం లేదని... ‘శంకరాచార్యులకు–పీరీల పండుగకు ముడిపెట్టినట్టు’గా కిషన్రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు బిల్లులకు సభ ఆమోదం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ చట్టం, మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన పురపాలక చట్ట సవరణ బిల్లులను గురువారం శాసనసభ ఆమోదించింది. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. -
రాష్ట్రంలో 71 కొత్త పురపాలికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 71 పురపాలిక సంస్థలు ఏర్పాటు కానున్నాయి. 173 గ్రామ పంచాయతీలు/ఆవాస ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా ఈ 71 చిన్న పట్టణ ప్రాంతాలు ఏర్పాటవుతున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామాలు/గ్రామాల్లోని భాగాలను విలీనం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, జీహెచ్ఎంసీ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. గత సాంప్రదాయానికి భిన్నంగా స్థానిక ప్రజల అభిప్రాయంతో, గ్రామ పంచాయతీల తీర్మానంతో పనిలేకుండా.. నేరుగా కొత్త పురపాలికల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో గ్రామాలు/ఆవాసాలను విలీనం చేసేందుకు వీలుగా సవరణలు చేపడుతున్నారు. 144కు పెరగనున్న పురపాలికలు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగియనుండడంతో ఆలోపే పురపాలక చట్టాల సవరణలు పూర్తిచేసి.. కొత్త పురపాలికల ఏర్పాటుకు రంగం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఆగమేఘాల మీద కసరత్తు పూర్తి చేసి.. తాజాగా శాసనసభలో సవరణ బిల్లులు ప్రవేశపెట్టింది. కొత్తగా ఏర్పాటుచేసే 71 మున్సిపాలిటీలు, న్యాయ వివాదాల్లో ఉన్న మరో ఏడు మున్సిపాలిటీలు, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసే 136 గ్రామ పంచాయతీల పేర్లను ఆయా చట్టాల్లో చేర్చనుంది. ఈ బిల్లులకు గురువారం రాష్ట్ర శాసనసభ ఆమోదం లభించే అవకాశముంది. కొత్త పురపాలికలుగా ఏర్పాటవుతున్న, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో విలీనమవుతున్న గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే... వాటికి మున్సిపాలిటీ హోదా అమల్లోకి రానుంది. ఇక జీహెచ్ఎంసీలో కొత్తగా బండ్లగూడ గ్రామ పంచాయతీ విలీనం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీతో సహా 73 పురపాలికలు ఉండగా... కొత్త పురపాలికల ఏర్పాటుతో వాటి సంఖ్య 144కి పెరగనుంది. న్యాయ సమస్యలు లేకుండా.. ఇప్పటికే ఏర్పాటును ప్రకటించిన ఏడు పురపాలికలకు సంబంధించి స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్లుగా అది అమల్లోకి రాలేదు. ఈ న్యాయ వివాదాన్ని అధిగమించేందుకు ఆ ఏడు మున్సిపాలిటీలైన నకిరేకల్, జిల్లెలగూడ, మీర్పేట్, బొడుప్పల్, పీర్జాదిగూడ, దుబ్బాక, మేడ్చల్లను.. తాజాగా సవరణ బిల్లులలో చేర్చినట్టు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు బిల్లులో రాతపూర్వకంగా తెలిపారు. పట్టణ లక్షణాలు, పట్టణ పరిసరా ల్లో ఉన్న గ్రామాలను జిల్లా కలెక్టర్ల ద్వారా గుర్తించి.. పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు ప్రస్తుత చట్టాల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించడానికిగాని, ప్రస్తుతమున్న మున్సిపాలిటీలో విలీనం చేయడానికిగానీ పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం బహిరంగ ప్రకటన జారీచేసి.. నిర్ణీత గడువులోగా స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి రాత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. చివరిగా గ్రామసభ నిర్వహించి మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇకపై పంచాయతీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ వంటి ప్రక్రియేదీ అవసరం లేకుండానే.. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు మున్సిపల్ హోదా/మున్సిపాలిటీలో విలీనం వంటివి చేపట్టేలా చట్టాలకు సవరణలు చేస్తున్నారు. -
రూ.3 వేలు వసూలు చేశారు!
‘రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మా బంధువుకు పోస్టుమార్టం చేయమంటే డాక్టర్ రూ.3 వేలు లంచం అడిగాడు. ఎమ్మెల్సీ అయి న నేను, ఓ ఎమ్మెల్సీ పీఏ అక్కడే ఉన్నామన్న భయం కూడా ఆ డాక్టర్లో లేదు. ఇదేం పద్ధతి’ – శాసన మండలిలో ఓ ఎమ్మెల్సీ ఫిర్యాదు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఇలా డబ్బులు అడిగే పద్ధతి అన్ని ఆసుపత్రుల్లో ఉండేది. ఇప్పుడు అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ – వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం. సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యంపై బుధవారం శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో వైద్యారోగ్య శాఖ పనితీరు చర్చకు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల కీళ్ల మార్పిడి అంశంపై టీఆర్ఎస్ సభ్యులు గంగాధర్గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ, భూపతిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటనను సభ ముందుంచారు. గత ఆదివారం తన బంధువు రోడ్డు ప్రమాదంలో చనిపోతే చూడ్డానికి వెళ్లానని, పోస్ట్మా ర్టం కోసం సిబ్బంది మధ్యాహ్నం వరకు ఎదురు చూసేలా చేసి చివరకు రూ.3 వేలు వసూలు చేసి ఆ తంతు పూర్తి చేశారని ఫిర్యాదు చేశారు. తాను, మరో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పీఏ అక్కడే ఉండగానే వసూళ్లు సాగాయని, మరి పేదల విషయంలో వేధింపులు ఇంకెలా ఉంటాయని సభ దృష్టికి తెచ్చారు. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, ‘ఉమ్మడి రాష్ట్రంలో ఈ అవినీతి ఇంకా ఎక్కువగా ఉండేది. అన్ని ఆసుపత్రుల్లో వసూలు చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ తెలిపారు. ఈ సమాధానంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ విరామ సమయంలో మంత్రిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు చనిపోయి దుఃఖంలో ఉంటే, వైద్యులు పోస్టుమార్టం కోసం వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. -
శ్రీమంతుల కొమ్ము కాస్తున్న కేంద్రం..
సాక్షి, గౌరిబిదనూరు(కర్ణాటక): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించి శ్రీమంతుల కొమ్ము కాస్తోందని శాసనసభ ఉపాధ్యక్షుడు శివశంకరరెడ్డి విమర్శించారు. గుడిబండ తాలూకా ఆదినారాయణ స్వామి సన్నిధిలో శనివారం ఏర్పాటు చేసిన విజయ వాహిని ప్రచార రథ యాత్రను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మోదీ అసత్యాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుతో ధనవంతులే బాగుపడ్డారన్నారు. ఇంధన ధరలు పెరిగి సామాన్యుల నడ్డి విరుగుతోందన్నారు. తాలూకాలో 20ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. 1500 మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు గీతా జయందర్, నగరసభ అధ్యక్షుడు కలీంవుల్లా, తదితరులు పాల్గొన్నారు. -
‘చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, పెద్దపల్లి : చట్టసభల్లో బీసీలకు తగిన స్థానాలు లేవని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ సంఘాల ఫెడరేషన్లకు బడ్జెట్లో రూ.500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కేటాయించాలని కోరారు. బీసీ కార్పొరేషన్కు రూ. 2 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు రూ. 2 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకం కింద బీసీలకు రూ. 2 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మరో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు మరో మూడు రోజుల పాటు నిర్వహించ నున్నట్లు మంత్రి కాల్వ∙శ్రీనివాసులు వెల్లడించారు. శాసనసభాపతి కోడెల శివ ప్రసాదరావు అధ్యక్షతన శాసనసభలోను, మండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ అధ్యక్ష తన శాసన మండలిలోను మంగళవారం జరిగిన బీఏసీ సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నెల 29, 30 తేదీల్లోను, వచ్చే నెల 2న సభలో చర్చించాల్సిన అంశాలను నిర్ణయించినట్టు వివరించారు. -
నిరుద్యోగ పర్వం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అంశంపై మంగళవారం శాసనసభ అట్టుడికింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి ఈటల పేర్కొనగా.. ఆ లెక్కలన్నీ అవాస్తవమంటూ విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతోనే తెలంగాణ పోరాటం జరిగిందని.. కానీ తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఒక్క నోటిఫికేషన్ను అయినా సరిగా పూర్తి చేయలేదని.. తప్పులు చేయడం, కప్పిపుచ్చుకోవడంతోనే సరిపోతోందని విమర్శించారు. ఈ విమర్శలపై ఈటల ఘాటుగా స్పందించారు. కోర్టుల్లో కేసులు వేస్తూ ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నది విపక్ష నేతలేనని వ్యాఖ్యానించారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎంల సభ్యులు వాకౌట్ చేశారు. మంగళవారం శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ భర్తీ లెక్కలతో వచ్చిన విపక్ష సభ్యులు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అడ్డుకుని.. ఆరోపణలు చేస్తున్నారు..: ఈటల ఉద్యోగాల అంశంపై మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఏ వ్యక్తులైతే కోర్టుల్లో కేసులు వేసి నీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారో.. అదే తరహాలోనే ఉద్యోగ నియామకాలను అడ్డుకోవటం కోసం కేసులు వేస్తున్నారని ఆరోపించారు. నియామక ప్రక్రియలను ఆపటం కోసం టీఎస్పీఎస్సీ మీద 272 కేసులు వేశారని, అయినా తాము 73 నోటిఫికేషన్లు విడుదల చేశామని వివరించారు. రాష్ట్రంలో మొత్తంగా 4,41,995 ఉద్యోగాలు ఉంటే.. 1,08,132 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు. 63,152 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని, మిగతా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అన్ని సమస్యలను రాజకీయ కోణంలో చూడవద్దని, ఏ రాష్ట్రంలోనైనా ఒకటిన్నర రెండు శాతం కంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలుండవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 27,744 ఉద్యోగాలను భర్తీ చేశామని.. టీఎస్పీఎస్సీ ద్వారా 5,932 ఉద్యోగాలు, సింగరేణిలో 7,266, విద్యుత్ శాఖలో 1,427, పోలీసు శాఖలో 12,157 పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. కమల్నాథన్ కమిటీ 31 సార్లు సమావేశమైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య పూర్తి స్థాయిలో ఉద్యోగుల విభజన జరగలేదని.. ఇంకా 1,400 మంది ఉద్యోగుల విభజన జరగాల్సి ఉందని ఈటల తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రమే నంబర్ వన్ దేశంలోనే ఐటీ రంగంలో తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉందని.. 2014–17 మధ్య ఐటీ ఎగుమతులు రూ.30 వేల కోట్ల మేర పెరిగాయని ఈటల చెప్పారు. ఆపిల్ కంపెనీ బెంగళూరుకు తరలిపోయిందనడంలో వాస్తవం లేదని, ఇక్కడే ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనేక సంస్థలు మూతపడి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని.. అదే తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పెట్టుబడుల ద్వారా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు వెన్నుపోటు: కె.లక్ష్మణ్ నియామకాల కోసం జరిగిన పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. కానీ ఇప్పుడు యువకులకు అదే దక్కడం లేదని బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను వెన్నుపోటు పొడుస్తోందన్నారు. భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ యువత, విద్యార్థులు ఆశించారని.. కానీ నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీని చూస్తే ‘ఓ స్త్రీ రేపురా’అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 5,23,675 ప్రభుత్వోద్యోగాలు ఉన్నాయని.. అందులో సీమాంధ్ర ప్రాంతం వారు 83 వేల మంది ఉన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. యువత, విద్యార్థులు అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం.. ఇప్పుడు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేపట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.17 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని.. కానీ మూడేళ్లలో 17 వేల పోస్టులే భర్తీ చేశారని, ఇందులోనూ 11 వేల పోస్టులు పోలీసు శాఖలోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఒక్క నోటిఫికేషన్ అయినా సరిగా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ప్రశ్నపత్రం, మూల్యాంకనం, వైట్నర్ సమస్యలు, చివరికి ఫలితాల్లో తప్పులు... ఇలా ఏదో ఒక తప్పిదంతో అభాసుపాలవుతోందని విమర్శించారు. ఐటీకి హైదరాబాద్ చిరునామా అంటారని.. మరి టీఎస్పీఎస్సీకి సాంకేతిక వ్యవస్థ ఉండదా? అని నిలదీశారు. విశ్వవిద్యాలయాలు కేంద్రంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని.. ఇప్పుడా విశ్వవిద్యాలయాల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తున్నారన్నారు. పోస్టులు ఎందుకు తగ్గాయి?: టి.రామ్మోహన్రెడ్డి నీళ్లు, నిధులు, నియామకాల నినాదంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఉద్యోగ నియామకాల విషయాన్నే మర్చిపోయిందని కాంగ్రెస్ సభ్యుడు టి.రామ్మోహన్రెడ్డి విమర్శించారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో 27 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం... తీరా నోటిఫికేషన్కు వచ్చే సరికి 8,792 పోస్టులు భర్తీ చేయడమేమిటని నిలదీశారు. నియామకాలు త్వరగా చేపట్టాలని కోరారు ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలం: అక్బరుద్దీన్ తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని యువత ఆశగా ఎదురు చూసిందని.. ఆ ఆశలు అడియాసలు అయ్యాయని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలు, మండలాలు, సర్కిళ్లు ఎన్ని ఏర్పడినా కొత్త పోస్టులు మాత్రం రావడం లేదన్నారు. గ్రూప్–1, 3, 4 నోటిఫికేషన్లేవీ..?: ఆర్.కృష్ణయ్య రాష్ట్రంలో గ్రూప్–1, 3, 4 నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటానికి ఒక ప్రత్యేక చట్టం తేవాలన్నారు. ప్రభుత్వంలోకి యువరక్తం రావాలని.. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో 50 శాతం డైరెక్టు నియామకాల ద్వారా, 50 శాతం పదోన్నతుల ద్వారా నింపాలని సూచించారు. 1998 డీఎస్సీ బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయరా: సున్నం రాజయ్య రాష్ట్రంలో 23 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. బేస్ క్యాంపుల్లో పనిచేస్తున్న 2,500 మంది గిరిజన యువకుల జీతభత్యాలు పెంచలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఒక్క పాఠశాలనూ మూసివేయలేదు: కడియం రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలను మూసివేయలేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వాస్తవాలు ఒకలా ఉంటే బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ మరోలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలను ఎక్కడైనా మూసివేసినట్లు తెలిస్తే వివరాలు చెప్పాలని... అంతేతప్ప తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించవద్దని వ్యాఖ్యానించారు. ‘నెహ్రూ జయంతి’పై వాగ్వాదం ఉద్యోగాల కల్పనపై స్వల్పకాలిక చర్చ చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించిన సమయంలో.. కాంగ్రెస్ సభ్యులు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి అంశాన్ని లేవనెత్తారు. దేశ తొలి ప్రధాని జయంతి సందర్భంగా ప్రభుత్వపరంగా కనీసం ఒక్క ప్రకటన అయినా ఇవ్వలేదని, ఆయన సేవలపై చర్చించాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి కోరారు. అయితే నెహ్రూ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ప్రభుత్వ కార్యక్రమం జరుగుతోందని, మంత్రి తుమ్మల ఆ కార్యక్రమంలోనే ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. ఇక సంప్రదాయం లేని, ముందుగా నిర్ణయించని అంశాలపై చర్చించాలని కోరడం సరికాదని సభా వ్యవహారాల మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ముఖ్యమైన ఉద్యోగాల కల్పన అంశంపై మాట్లాడుతుంటే చర్చ జరగకుండా వ్యవహరించడం కాంగ్రెస్కు తగదని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ తప్పుబట్టారు. -
చీఫ్ విప్లుగా పయ్యావుల, పల్లె
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శాసనసభ చీఫ్ విప్గా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి, శాసనమండలి చీఫ్విప్గా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఎంపిక దాదాపుగా ఖరారయింది. వీరిద్దరికీ పదవులు కట్టబెడుతున్నట్లు సీఎంఓ నుంచి ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే నియామకానికి సంబంధించిన జీఓ వెలువడాల్సి ఉంది. శాసనమండలి ఎన్నిక రోజు, లేదంటే అంతకు ముందుగానే జీఓ వెలువడనున్నట్లు తెలిసింది. పయ్యావుల కేశవ్ తొలిసారి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో ఓటమిపాలయ్యారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో ఓటమి చవిచూశారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. దీంతో కేశవ్ తీవ్ర నిరాశ చెందినా.. చివరకు మండలి చీఫ్విప్ పదవిని కట్టబెట్టారు. = పల్లె రఘునాథరెడ్డి తొలిసారి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీ, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. ఇప్పుడు తిరిగి చీఫ్ విప్గా ఎంపికయ్యారు. అనంతపురం చరిత్రలో చీఫ్ విప్గా తొలిసారి నల్లమాడ ఎమ్మెల్యే వీరప్ప ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.. అనంతరం చీఫ్విప్లుగా పల్లె, పయ్యావుల నియమితులయ్యారు. -
మండలిలోనూ రచ్చ
శాసనమండలి సమావేశం శుక్రవారం ప్రారంభమైన వెంటనే గందరగోళం నెలకొంది. రైతుల సమస్యలపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టి నిరసనకు దిగారు. మండలి చైర్మన్ టి.స్వామి గౌడ్ చర్చకు అనుమతించకపోవడంతో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు.. పోడియం వద్దకు చేరి నిరసనకు దిగారు. చర్చకు అంగీకరించకపోవడంతో నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించిన చైర్మన్ అనంతరం సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు. గ్రూప్–2 పరీక్షలో అక్రమాలు జరగలేదు: తుమ్మల సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణను రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తోసిపుచ్చారు. కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్ అలీ, టి.సతీశ్ కుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. నియామక ప్రక్రియలో సమయాన్ని తగ్గించేందుకు కొత్త తరహాలో ఓఎంఆర్ షీట్లను ప్రవేశపెట్టామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మూడేళ్ల లోపు బాలలకు పాలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ఏడు ప్రాంతీయ రింగ్ రోడ్డులను నిర్మిస్తున్నామని ఇంకో ప్రశ్నకు బదులిచ్చారు. నాలాలపై ఆక్రమణలు తొలగిస్తాం: కేటీఆర్ హైదరాబాద్లో నాలాల కబ్జాలను తొలగించి వర్షాలతో నగర ప్రజలు ఎదుర్కొంటున్న చిక్కులను తొలగిస్తామని పురపాలక మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కిర్లోస్కర్ కమిటీ సిఫారసుల ప్రకారం నాలాలపై నుంచి 28 వేల అక్రమ కట్టడాలను తొలగించడం ఆచరణలో సాధ్యం కాదని తెలిపారు. అయితే నాలాలపై నుంచి తొలగించిన పేదల ఇళ్లకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. వర్షాలతో నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత విమానాశ్రయం ఏర్పాటు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని టీఆర్ఎస్ సభ్యుడు ఆర్.భూపతిరెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. త్వరలో మరో ఆయిల్పామ్ క్రషింగ్ యూనిట్: పోచారం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు 60 టన్నుల సామర్థ్యంతో త్వర లో ఓ ఆయిల్పామ్ క్రషింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే అశ్వారావుపేటలో 17 టన్నుల సామర్థ్యం గల కర్మాగారం సామ ర్థ్యాన్ని 30 టన్నులకు పెంచామని తెలిపారు. ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహంపై టీఆర్ఎస్ సభ్యులు బి.లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు పోచారం బదులిచ్చారు. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న హైబ్రీడ్ సజ్జలు, హైబ్రీడ్ జొన్నలు, హైబ్రీడ్ మొక్కజొన్న, పశుగ్రాసం, వరి విత్తనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నా మని టీఆర్ఎస్ సభ్యుడు కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు పోచారం సమాధానమిచ్చారు. -
ఏపీలో కట్ కట్.. ఇక్కడ రికార్డు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత మైక్ను పదేపదే కట్ చేస్తున్నారని.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో శాసన సభ జరుగుతున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటు తోందని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలు సజా వుగా సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. రికార్డు స్థాయిలో గురువారం పన్నెండున్నర గంటలకుపైగా చర్చ జరిగిందని, పద్దులపై మునుపెన్నడూ లేని విధంగా చర్చలు సాగుతున్నాయని చెప్పారు. ‘గత ప్రభుత్వాలు అనుసరించిన గిలిటిన్ విధానానికి స్వస్తి చెప్పాం. పద్దులపై సభ్యులం దరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరిచే వాతావరణముంది. అందరూ సందర్భో చితంగా వ్యవహరిస్తున్నారు.. పరస్పరం క్షమాపణలు సైతం చెప్పుకుంటూ హుం దాగా వ్యవహరిస్తున్నారు’ అన్నారు. సభలో జరిగిన కీలకమైన చర్చల కంటే లాబీల్లో జరిగే చిట్చాట్ ముచ్చట్లకే మీడియా ప్రాధాన్యమిస్తోందని మంత్రి అన్నారు. -
విపక్షాలవి పనికిరాని విమర్శలు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ, మండలి జరిగిన తీరు చారిత్రాత్మకమని, అన్ని వర్గాలకు ఊరటనిచ్చేలా సభలు జరి గాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అభి ప్రాయపడ్డారు. ఒంటరి మహిళల జీవన భృతికి పథకం ప్రకటించడం అభినంద నీయమని, బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉభయ సభల వేదికగా ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాల యంలో గురువారం ఎమ్మెల్సీలు గంగా ధర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, సలీం విలేకరు లతో మాట్లాడారు. కుల వృత్తుల్ని కాపా డేందుకు సీఎం ఉభయ సభల్లో చేసిన ప్రకటనలు వెనుకబడిన వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయన్నారు. ఆలస్య మైనా సీఎం కేసీఆర్ ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తారని అన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో అసెంబ్లీ నడిచిందన్న రేవంత్ ఆరోపణలు అర్థరహితమన్నారు. -
అధికారులకు సెలవులు బంద్
అసెంబ్లీ సమావేశాలపై సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే శాసన సభ, శాసనమండలి ఆరో విడత సమావేశాల సందర్భంగా సభ్యులడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్ర అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల సందర్భంగా అధికారులు పర్యటనలు, సెలవుల్లో వెళ్లవద్దని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ప్రశ్నలపై గురువారం సచివాలయంలో సీఎస్ సమీక్ష జరిపారు.ఆ ప్రశ్నలపై ఆయా శాఖల కార్యదర్శులు హెచ్వోడీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకొని వెంటనే సమాధానాలు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 21న మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఈ ప్రశ్న లకు రూపొందించిన వెబ్సైట్ను ప్రదర్శించారు. జీరో అవర్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు వెంటనే పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం సమావేశాలకు అన్ని శాఖలు ముఖ్యమైన అంశాలతో ప్రత్యేక నోట్ను క్లుప్తంగా సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖల తరఫున సభలకు హాజరయ్యే అధికారులు తమకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు వెంటనే నోట్ చేసుకోవాలని, ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. వేరే శాఖలకు చెందిన ప్రశ్నలు వస్తే వాటిని సంబంధిత శాఖ అధికారులకు బదిలీ చేయాలని కోరారు. కార్యదర్శులు జిల్లాల పర్యటనకు వెళ్లి అభివద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని, కలెక్టర్లకు మార్గదర్శనం చేయాలని సీఎస్ సూచించారు. తమ శాఖ కార్యకలాపాలు జరిగే జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు -
జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటి?
అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కాకాణి నెల్లూరు(స్టోన్హౌస్పేట): జన్మభూమి కమిటీలు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి గురువారం ఆరోపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పింఛన్ల వివరాలు, కేంద్ర ప్రభుత్వ పింఛన్ల సాయంపై ఆయన మాట్లాడారు. జన్మభూమి కమిటీల జోక్యంతో అర్హులకు పింఛన్లు అందడంలేదని, జరుగుతున్న అన్యాయంపై ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ పార్టీలకతీతంగా పింఛన్లను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా జన్మభూమి కమిటీలకు ప్రమేయం కల్పించి రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు వెంటనే పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అందజేసిన పింఛన్లు, ప్రస్తుత ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను గణాంకాలతో సహా వివరించారు. ఆధార్కార్డుల్లో చేతివేళ్లు నమోదు కాలేదని, భూమి కలిగి ఉన్నారని, వయస్సు తక్కువ, తదితర కారణాలతో తమ పార్టీ మద్దతుదారుల పింఛన్లను తొలగించారని ఆరోపించారు. -
హామీలను అమలు చేయండి
♦ 27 హామీలకు మూడే అమలు ♦ 19 కోర్టు పెండింగ్లో ఉన్నాయి ♦ చిత్తశుద్ధితో కృషి చేయండి ♦ శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్ చిత్తూరు (సెంట్రల్) : ప్రజావసరాల నిమిత్తం శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్ పి.వెంకటేష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాకు సంబంధించి శాసనసభలో ఇచ్చిన హామీల అమలుపై వివిధ శాఖల అధికారులతో కమిటీ సమీక్షించింది. ఈ సమీక్షలో చైర్మన్తో పాటు సభ్యులు పి.రమేష్బాబు, జోగేశ్వరరావు, పి.గోవిందసత్యనారాయణ, చింతలరామచంద్రారెడ్డి పాల్గొనగా, కమిటీ సహాయక కార్యదర్శి రాజ్కుమార్, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్, తుడా వీసీ వినయ్చంద్, డీఆర్వో విజయచందర్ హాజరయ్యారు. సమావేశనంతరం చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి 26 హామీల అంశాలు రాగా, మూడు మాత్రమే పూర్తి చేశారన్నారు. మరో నాలుగు అంశాలను టీటీడీలో సమీక్షించనున్నామని, మిగిలిన 19 అంశాలు ఎక్కువగా భాగం కోర్టులో పెండింగ్లో ఉన్నాయన్నారు. సమీక్షలో వచ్చిన వాటిలో ప్రధానంగా సాగు, తాగునీరు, రోడ్ల నిర్మాణాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సదుపాయాల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సౌకర్యాలు, వాగులు, వంకల మరమ్మతులు వంటి వాటిని సమగ్రంగా సమీక్షించినట్లు చెప్పారు. ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రతివారం ముఖ్య కార్యదర్శులతో చర్చించి, అవసరమైన వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ సిద్ధార్థ్జైన్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న హామీలను అవసరం మేరకు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని, ఇప్పటికే కార్యచరణను అధికారులు రూపొందించారని కమిటీకి వివరించారు. కోర్టుకు సంబంధంలేని అంశాలు సంబంధిత శాఖల కార్యదర్శులు తీసుకెళ్ళి పరిష్కరిస్తామని కమిటీకి తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మీడియాపై ఆంక్షల పట్ల జగన్ ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మీడియాపై ఆంక్షలు విధించడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులు ఆయన వద్ద ఆంక్షల విషయం ప్రస్తావించారు. దీనికి జగన్ స్పందిస్తూ.. ఆంక్షలు విధించడం సరైన పద్థతి కాదని అన్నారు. ప్రజా సమస్యలపై అభిప్రాయాలు వెల్లడించే హక్కు సభ్యులకు ఉంటుందని చెప్పారు. సభలో సభ్యుల గొంతు నొక్కినప్పుడు ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించడం వంటివి చేస్తారని, వాటిని ప్రసారం చేయకూడదని నియంత్రించడం సరికాదని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
మాటల బడ్జెట్
ఆశాజనకం బందరులో మెరైన్ అకాడమీ ఏర్పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పోర్టు అభివృద్ధి గన్నవరం విమానాశ్రయ విస్తరణ కూచిపూడిలో నాట్యారామం ఏర్పాటు పర్యాటక కేంద్రంగా భవానీ ద్వీపం స్మార్ట్ సిటీగా విజయవాడ అభివృద్ధి ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులే.. ఎప్పటికి పూర్తయ్యేదీ ప్రశ్నార్థకమే.. నిరాశాజనకం బందరు పోర్టుకు కేవలం రూ.30 లక్షల కేటాయింపు రైతు రుణమాఫీ దశలవారీగానే.. డ్వాక్రా రుణమాఫీ ఊసే లేదు విజయవాడ : ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాటల గారడీ చేశారు. శాసనసభలో గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో జిల్లాకు రాజధాని స్థాయిలో నిధులు కేటాయించలేదు. ప్రతి పాదిత అంశాలు 20కి పైగా ఉండగా కొన్నింటిని మాత్రమే మంజూరు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. బందరు పోర్టుకు కేవలం రూ. 30 లక్షలు కేటాయించి జిల్లావాసుల ఆశలపై నీళ్లు చల్లారు. రుణమాఫీ దశలవారీగా జరుగుతుందని చెప్పి రైతుల ఆశలను ఆవిరి చేశారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ ఊసే బడ్జెట్లో ప్రస్తావించకపోవడం శోచనీయం. బడ్జెట్పై వివిధ పార్టీల నేతలు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి రూ.3,168 కోట్లు నూతన రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో రూ.3,168 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. మచిలీపట్నం పోర్టును ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని, గన్నవరం విమానాశ్రయం విస్తరణ చేపడతామని ప్రకటించారు. కూచిపూడిలో నాట్యారామం ఏర్పాటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. హస్తకళల అభివృద్ధి కోసం జిల్లాలో శిల్పారామం ఏర్పాటుచేస్తామని తెలిపారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వ బీసీ బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. జిల్లాలో మరో బీసీ స్టడీ సర్కిల్ ఏరా్పాటు చేస్తామన్నారు. మైలవరంలో నీటిపారుదల కోసం రూ.5.90 కోట్ల నిధులు ఈ బడ్జెట్లో కేటాయించారు. అయితే ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులు కావటంతో వేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంది. నూతన రాజధాని విజయవాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. బడ్జెట్లో డ్వాక్రా రుణమాఫీ ప్రస్తావనే లేకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో మాఫీ కావాల్సిన డ్వాక్రా రుణాలు రూ.300 కోట్లు ఉండగా, జిల్లాలో రూ.918 కోట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి ప్రకటనా లేకపోవటంపై రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.111.08 కోట్లు కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులకు రాష్ట్ర బడ్జెట్లో రూ.111.08 కోట్లను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.120.14 కోట్లు కేటాయించగా, రాష్ట్ర విభజన తరువాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కృష్ణాడెల్టా పనులకు కోత పెట్టారు. పులిచింతల ప్రాజెక్టు (కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టు)కు బడ్జెట్లో రూ.20.11 కోట్లు, ప్రకాశం బ్యారేజీ అభివృద్ధి పనులకు రూ.55 లక్షలు, జిల్లాలో ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5.80 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి నిర్ణయం తీసుకున్నారు. -
‘నాటుకోడి’ కూరతో సెట్ దోసె!
విధాన పరిషత్లో ఆసక్తికర చర్చ బెంగళూరు : ‘నాటుకోడి కూర, గింజల కూర, బోటి, సెట్దోసె....వహ్వా ఏమా రుచులు’ ఈ తరహా ఆసక్తికర చర్చ విధానపరిషత్లో గురువారం చోటుచేసుకుంది. విధానపరిషత్ కార్యకలాపాల్లో భాగంగా పరిషత్ సభ్యుడు రామచంద్రగౌడ ప్రస్తావించిన అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం ఇచ్చే సందర్భంలో ఈ చర్చ చోటుచేసుకుంది. సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘మైసూరులో 12 పైసలకు రెండు సెట్ దోసెలు ఇచ్చేవారు. నాటుకోడి కూర, గింజల కూర, బోటిలతో ఈ సెట్దోసెలు అందించేవారు. మైసూరులోని చడ్డి హోటల్, మైలారి హోటల్, రాజుహోటల్ల దగ్గర పొద్దుపొద్దున్నే క్యూలో జనాలు కనిపించేవాళ్లు. అప్పటి రుచులే వేరు. ఇప్పుడు ఆ రుచి కనిపించడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో విధానపరిషత్లో ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప కలగజేసుకుంటూ....‘ఇలా నాటుకోడి కూర, బోటి అంటూ మీరు చెబుతుంటే మాకు నోరూరుతోంది. ఇలాంటి ఆహారపదార్థాలన్నీ మేం కూడా రుచి చూసేందుకు ఏదైనా ఏర్పాటు చేయకూడదా?’ అంటూ చమత్కరించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మైసూరుకు రండి, నాటుకోడి కూరతో పాటు బోటి, తలమాంసం ఇలా అన్ని రకాల పదార్థాలు వండి, వడ్డిస్తాం’ అంటూ ఆహ్వానించారు. ఇక ఈ సంభాషణల మధ్య జేడీఎస్ సభ్యుడు ముజీర్ ఆగా కలగజేసుకుంటూ...‘కేవలం ఈశ్వరప్పనేనా మమ్మల్ని కూడా ఆహ్వానించేదేమైనా ఉందా’? అంటూ సిద్ధరామయ్యను ప్రశ్నించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మిమ్మల్ని వదిలి పెట్టి వేరే ఎవరినైనా ఆహ్వానించడం అసలు సాధ్యమేనా’ అనడంతో సభలో నవ్వులు విరబూశాయి. -
బీబీఎంపీ విభజనకు సై
సీఎం ప్రకటనతో విపక్షాల మండిపాటు బెంగళూరు : బీబీఎంపీ విభజనకు సంబంధించి నివేదిక అందగానే ఆ దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానపరిషత్కు తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రగౌడ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానమిస్తూ....‘మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎస్.పాటిల్ నేతృత్వంతో బీబీఎంపీ విభజనకు సంబంధించి ఓ కమిటీని వేశాం. ఈ కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను సైతం అందజేసింది. ఇందుకు సంబంధించిన తుది నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కష్టనష్టాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు. ఈ సమయంలో బీజేపీ సభ్యుడు వి.సోమణ్ణ కలగజేసుకుంటూ ‘కెంపేగౌడ నిర్మించిన బెంగళూరు నగరాన్ని విభజించడం సరికాదు. బీబీఎంపీ పాలనా సౌలభ్యం కోసం మేయర్ ఇన్ కౌన్సిల్ విధానాన్ని రూపొందించండి. అంతేకాని బీబీఎంపీని విభజించకండి’ అని సలహా ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘గతంలో 200 చదరపు కిలోమీటర్లు ఉన్న బెంగళూరు ప్రస్తుతం 800 చదరపు కిలోమీటర్ల పరిధికి చేరుకుంది. 110 గ్రామాలు, ఏడు నగరసభలు, ఒక పట్టణ పంచాయితీ బెంగళూరులో కలిశాయి. అదే విధంగా బీబీఎంపీ పరిధిలో సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అందువల్ల బీబీఎంపీ పాలనా సౌలభ్యం కోసం బీబీఎంపీని విభజించే దిశగా ఆలోచనలు సాగించాల్సి వచ్చిందని’ తెలిపారు. దీంతో సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. బీబీఎంపీని విభజించేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పాయి. -
వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’
అధికార పక్ష సభ్యులపై ఈశ్వరప్ప గరం బెంగళూరు : ‘వీళ్లేమైనా తాగి వచ్చారా’ అధ్యక్షా అంటూ అధికార పక్ష సభ్యులపై విధాన పరిషత్లో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప మండిపడ్డారు. గురువారం ఉదయం పరిషత్ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ప్రవీణ్ తొగాడియా నగర ప్రవేశ నిషేధం అంశంపై చర్చ కొనసాగింది. ఈ చర్చకు అడ్డుతగులుతున్న అధికార పక్ష సభ్యులపై ఈశ్వరప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ప్రవీణ్ తొగాడియా ఓ దేశభక్తుడు, ఆయన మాట్లాడేందుకు ఈ రాష్ట్రంలో అవకాశం లభించలేదంటే ఈ రాష్ట్రం భారత్లో ఉన్నట్లా? లేక పాకిస్తాన్లోనా?’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఈశ్వరప్ప ప్రసంగానికి అధికాపక్ష సభ్యులు అడ్డుతగిలారు. ఈ పరిణామంతో మరింత ఆగ్రహానికి లోనైన ఈశ్వరప్ప ‘వీళ్లేమైనా తాగి వచ్చారా? అధికార పక్ష సభ్యులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?’ అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చట్టసభల్లో ప్రతిపక్ష నేతలు ఈ విధంగా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం కాదని, ఈశ్వరప్ప వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. -
‘లాటరీ’ లేదు
విధాన పరిషత్కు వెల్లడించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : రాష్ట్రంలో లాటరీ అమ్మకాలను పునఃప్రారంభించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తేల్చిచెప్పారు. విధానపరిషత్ కార్యకలాపాల్లో భాగంగా గురువారం జీరో అవర్లో జేడీఎస్ సభ్యుడు బసవరాజ్ హొరట్టి అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానమిస్తూ... ప్రజలకు అందించే ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాల అమలుకు లాటరీలను అమ్మి నిధులను సేకరించాల్సిన దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి పట్టలేదని కాస్తంత ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సదుపాయాలను చేరువ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి లాటరీ అమ్మకాలను ప్రారంభించనుందని, రాష్ట్ర ప్రణాళికా సంఘం సైతం ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించిందని కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇక బుధవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సైతం లాటరీ అమ్మకాల నిర్ణయంపై నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ వార్తలన్నింటికి తెరదించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉందని, ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఇక లాటరీల అమ్మకం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం సూచించిందనడంలో కూడా ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.