వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’ | Eshwarappa fire on members of the ruling party | Sakshi
Sakshi News home page

వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’

Published Fri, Feb 6 2015 8:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’

వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’

‘వీళ్లేమైనా తాగి వచ్చారా’ అధ్యక్షా అంటూ అధికార పక్ష సభ్యులపై విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప మండిపడ్డారు.

అధికార పక్ష సభ్యులపై ఈశ్వరప్ప గరం
 
బెంగళూరు :  ‘వీళ్లేమైనా తాగి వచ్చారా’ అధ్యక్షా అంటూ  అధికార పక్ష సభ్యులపై విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప మండిపడ్డారు. గురువారం ఉదయం పరిషత్ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ప్రవీణ్ తొగాడియా నగర ప్రవేశ నిషేధం అంశంపై చర్చ కొనసాగింది. ఈ చర్చకు అడ్డుతగులుతున్న అధికార పక్ష సభ్యులపై ఈశ్వరప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ప్రవీణ్ తొగాడియా ఓ దేశభక్తుడు, ఆయన మాట్లాడేందుకు ఈ రాష్ట్రంలో అవకాశం లభించలేదంటే ఈ రాష్ట్రం భారత్‌లో ఉన్నట్లా? లేక పాకిస్తాన్‌లోనా?’ అంటూ ప్రశ్నించారు.

 

దీంతో ఈశ్వరప్ప ప్రసంగానికి అధికాపక్ష సభ్యులు అడ్డుతగిలారు. ఈ పరిణామంతో మరింత ఆగ్రహానికి లోనైన ఈశ్వరప్ప ‘వీళ్లేమైనా తాగి వచ్చారా? అధికార పక్ష సభ్యులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?’ అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చట్టసభల్లో ప్రతిపక్ష నేతలు ఈ విధంగా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం కాదని, ఈశ్వరప్ప వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement