టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ, మండలి జరిగిన తీరు చారిత్రాత్మకమని, అన్ని వర్గాలకు ఊరటనిచ్చేలా సభలు జరి గాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అభి ప్రాయపడ్డారు. ఒంటరి మహిళల జీవన భృతికి పథకం ప్రకటించడం అభినంద నీయమని, బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉభయ సభల వేదికగా ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఎల్పీ కార్యాల యంలో గురువారం ఎమ్మెల్సీలు గంగా ధర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, సలీం విలేకరు లతో మాట్లాడారు. కుల వృత్తుల్ని కాపా డేందుకు సీఎం ఉభయ సభల్లో చేసిన ప్రకటనలు వెనుకబడిన వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయన్నారు. ఆలస్య మైనా సీఎం కేసీఆర్ ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తారని అన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో అసెంబ్లీ నడిచిందన్న రేవంత్ ఆరోపణలు అర్థరహితమన్నారు.
విపక్షాలవి పనికిరాని విమర్శలు
Published Fri, Jan 20 2017 2:31 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
Advertisement
Advertisement