రాష్ట్ర ప్రజలకు అండగా వైస్ఆర్సిపి: జూపూడి | YSRCP support to people : Jupudi Prabhakara Rao | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు అండగా వైస్ఆర్సిపి: జూపూడి

Published Thu, Aug 8 2013 8:09 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

YSRCP support to people : Jupudi Prabhakara Rao

ఢిల్లీ: రాష్ట్ర ప్రజలందరికి వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మారెప్ప భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. వారు ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. విభజనపై కాంగ్రెస్‌లోనే స్పష్టత లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందరికి సమన్యాయం చేయాలని తమ పార్టీ నిర్ణయం అని చెప్పారు.

కాంగ్రెస్‌ను ఎదిరించినందుకే జగన్‌ను జైల్లో పెట్టారన్నారు. జగన్‌ను ఆదరించిన జనాన్ని విభజించి శిక్షించారని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement