Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

55 thousand tons of Tobacco crop unsold at farmers1
రైతుపై సర్కారు పగాకు

నాలుగేళ్లుగా నల్లబర్లీ సాగు చేస్తున్నా. కిందటి సంవత్సరం వరకు మంచి ధర లభించింది. కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ వేశా. కౌలుకే ఎకరాకు రూ.30 వేల వరకు చెల్లించా. సాగుకు ఎకరాకు రూ.1.30 లక్షలైంది. బంగారం కుదవపెట్టి రూ.4 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 వడ్డీకి మిగిలిన మొత్తం తెచ్చా. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వాలిటీతో సంబంధం లేకుండా క్వింటా రూ.15వేలు–18 వేల మధ్య కొన్నారు. ఈ ఏడాది కంపెనీల చుట్టూ తిరిగినా కొనేవారు లేరు. కంపెనీల మాయమాటలు నమ్మి మోసపోయాం. పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొంటే కనీసం కొంత గట్టెక్కుతాం. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. – గెద్దల నాగబాబు, బాపట్ల జిల్లా వంకాయలపాడు (బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి) : నాలుగు జిల్లాలు.. దాదాపు లక్ష ఎకరాల్లో పంట.. వేలమంది రైతులు.. ఇప్పుడు లబోదిబోమంటు­న్నారు. పొగాకు కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగామని గుండెలు బాదుకుంటున్నారు. కూట­మి ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో ఏంచేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు..! బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా రైతుల్లో ఒకటే వ్యథ. ‘‘గతేడాది వరకు మంచి ధరలు లభించడంతో పాటు కంపెనీ­లు ఇచ్చిన భరోసాతో ఈసారి పెద్ద­ఎత్తున నల్లబర్లీ పొగాకు (హెచ్‌డీ బర్లీ) సాగు చేశాం. పంట పండాక ప్రభుత్వం, కంపె­నీలు మొహం చాటేస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవా­లి’’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. కౌలు, కూలీల ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఎకరా సాగుకు రూ.లక్షన్నర అయిందని.. నిరుడు ఎకరాకు 15–18 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి సగటున 10–12 క్వింటాళ్లకు పడిపోయిందని వారు వాపోతున్నారు. ఐడీ నంబర్లు ఇచ్చి మరీ సాగుచేయించిన పొగాకు కంపెనీలు.. డిమాండ్‌ లేదనే సాకుతో పంట కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కళ్లుమూసుకున్న కూటమి ప్రభుత్వంసీఎం యాప్‌ ద్వారా ప్రతి పంటకు కోతకొచ్చే సమయంలోనే మార్కెట్‌ ధరలను అంచనా వేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం నల్లబర్లీ రైతులను గాలికొదిలేసింది. మిర్చి రైతుల మాదిరిగానే పొగాకు రైతులను ఏమార్చేందుకు యత్నిస్తోంది. నల్లబర్లీకి సాధార­ణంగా డిసెంబరు నుంచి ఆకు కొట్టడం మొదలు­పెట్టి మార్చి ఆఖరుకు పూర్తిచేస్తారు. ఫిబ్రవరిలో కొనుగోళ్లు మొదలై ఏప్రిల్‌కు దాదాపు పూర్తవు­తాయి. అరకొరగా ఆఖరులో వచ్చే పొగాకును మాత్రమే మే నెలలో మార్కెట్‌కు తెస్తుంటారు. ఈసారి జూన్‌ తొలివారంలోనూ కనీసం మూడో వంతు పొగాకు కూడా కొనని పరిస్థితి నెలకొంది.పంట అమ్మితేనే కూలీ డబ్బులిచ్చే దుస్థితిపంట కొనేవారు లేకపోవడంతో రైతులు పొలాల్లో కట్టెలు పెట్టి వాటిపై బేళ్లు నిల్వ చేశారు. పైన పట్టా­లు కప్పి కాపలా కాస్తున్నారు. ఆకు కొట్టడం నుంచి తాళ్లకు గుచ్చడం వరకు కూలీలకు ఒప్పందాలు ఇచ్చి పనులు చేయించారు. పంట అమ్మితే కానీ వీరికి సొమ్ములివ్వలేని పరిస్థితి. ఇటుచూస్తే క్వింటా రూ.7 వేలకు కూడా కొనేవారు లేరు. దాదాపు ప్రతి రైతు ఎకరాకు రూ.­80 వేల నుంచి రూ.లక్ష నష్టపోతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్‌సీపీతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా, చివరి కేజీ వరకు పొగాకును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఖరీఫ్‌ సాగుకు దూరంగా ఉండాలని (క్రాప్‌ హాలిడే) భావిస్తున్నారు.కూటమి కార్యకర్తలకు మేలు చేసేందుకేకంపెనీల భరోసాతోనే రైతులు ఈసారి నల్లబర్లీ సాగు చేశారని, చాలా కంపెనీలు రైతులకు బాండ్‌లు ఇచ్చాయని ప్రభుత్వానికి తెలిసినా... వాటిపై ప్రభుత్వానికి కనీస నియంత్రణ కొరవడింది. పంట మార్కెట్‌కు వచ్చే సమయంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పొగాకు కోతలు పూర్తయి రెండు నెలలు గడుస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ కూడా మొదలైంది. అయినా సరే నల్లబర్లీ పంట చేలల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది లక్ష టన్నుల దిగుబడి అంచనా వే­యగా, గ్రేడ్‌లను బట్టి 85 వేల టన్నులు మార్కెట్‌కు వస్తుందని లెక్క. కానీ, ఇప్పటివరకు అదీ అతికష్టమ్మీద 24.58 వేల టన్నులు మాత్రమే కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేశారు. రైతు ఎవరైనా 10 చెక్కులు (క్వింటాళ్లు) తీసుకెళ్తే 3–4 చెక్కులు కొని మిగిలింది నాణ్యత లేదనే సాకుతో వెనక్కి పంపేస్తున్నారు. రైతుల వద్ద మరో 55 వేల టన్నుల పంట ఉంది. గత నెలలో వర్షాలకు పొగాకు దెబ్బతిన్నది. పంట నాణ్యతరోజురోజుకు తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం వ్యాపారులకు వత్తాసు పలికేలా వ్యవహరించింది. మిర్చి మాదిరిగానే కాలయాపన చేస్తూ పొగాకు రైతులను కంపెనీలకు వదిలేసింది. ఓవైపు ధర లేక రైతులు ఆత్మహత్య యత్నాలు చేస్తుండగా, మరోపక్క పొగాకు బేళ్లను తగలబెడుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. నెల రోజుల క్రితం కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించినా ఏ ఒక్కటీ కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కాగా, ఏ గ్రామంలో ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు..? ఎంత దిగుబడి వచ్చింది..? ఎంత అమ్ముకున్నారు..? రైతుల వద్ద ఇంకా ఎంత ఉంది? అని ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఇదంతా కూటమి పార్టీల కార్యకర్తలకు మేలు చేసేందుకే అన్న ఆరోపణలు వస్తున్నాయి.నాడు అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం» నేరుగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి చర్యలు» తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు» 30 వేల మంది నుంచి రూ.139 కోట్ల పంట కొనుగోలునల్లబర్లీ పంట విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20 సీజన్‌లో మార్కెట్‌లో ధర లేని సమయంలో ఏపీ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. తేమ శాతంతో సంబంధం లేకుండా 30 వేల మంది రైతుల నుంచి రూ.139.19 కోట్ల విలువైన 12,933 టన్నుల పొగాకు సేకరించింది. 2022–23లో 1.42 లక్షల టన్నుల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతివ్వగా, మాండూస్‌ తుపాన్‌తో సగానికి పైగా పొగాకుతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో పొగాకు రేటు బాగుండడంతో రైతులంతా ఇదే పంట వేశారు. ఫలితంగా 1.72 లక్షల టన్నుల పొగాకు ఉత్పత్తయింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. అలాంటిది నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చొరవ కారణంగా పైసా పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం ఒప్పుకొంది. నేడు ఈ చొరవ కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రైతులు కంపెనీల దయాదాక్షిణ్యా­లపై ఆధారపడాల్సి వస్తోంది.ధరల నేలచూపు.. రైతుల వద్ద పేరుకున్న నిల్వలునల్లబర్లీ లక్ష టన్నుల దిగుబడి వచ్చింది. పొగాకు బోర్డుతో సంబంధం లేకుండా ట్రేడర్స్, కంపెనీలు కొనుగోలు చేసే ఈ పొగాకును బాపట్ల, గుంటూ­రు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 20 వేల మంది సాగు చేశారు. నిరుడు హై గ్రేడ్‌కు కిలో రూ.155­–180 చొప్పున ధర లభించగా, ఈ ఏడాది రూ.­70­–80 మించడం లేదు. లో గ్రేడ్‌ గత ఏడాది కిలో రూ.80–100 ధర పలకగా, ఇప్పుడు రూ.30–45­కు మించి కొనేవారు లేరు. రాష్ట్రంలో 21 పొగాకు కంపెనీలు ఉన్నాయి. జీపీఐ, ఐటీసీతో సహా ఏడు కంపెనీలు రైతుల నుంచి నేరుగా, మరో 12 ట్రేడర్స్‌ ద్వారా పరోక్షంగా కొనుగోలు చేస్తాయి. కానీ, ఈ ఏడాది కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి రైతులను నిలువునా ముంచేశాయి.ఎకరాకు రూ.60 వేలు నష్టం తప్పేలా లేదుబాపట్ల జిల్లా ఇంకొల్లు మండలానికి చెందిన వంకాయలపాటి లోతుబాబు ఈ ఏడాది 3.5 ఎకరాల్లో నల్లబర్లీ వేశారు. గత ఏడాది ఎకరంలో పొగాకు పండించి రెండెకరాల్లో మిరప వేశారు. పంట దెబ్బ­తినడంతో తీసేసి మొక్కజొన్న పండించారు. ఈ ఏడాది నల్లబర్లీ ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టు­బడి కాగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పొగా­కు పండించమంటూ కంపెనీల వాళ్లు వచ్చి ప్రతి గ్రామంలో మీటింగ్‌ పెట్టారు. కానీ, ఒక్కరూ కొ­నడం లేదు. లోతుబాబు ఒక్క కేజీ కూడా అమ్మ­లేదు. ‘‘శనగ వేసుకున్నా మా డబ్బులు మాకు వచ్చేవి. ఎకరాకు రూ.60 వేలకు పైగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది’’ అని ఆయన ఇప్పుడు వాపోతున్నారు.నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కినేను 10 ఎకరాల్లో నల్లబర్లి పొగాకు సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టా.10 క్వింటాళ్లు వచ్చింది. కంపెనీ వాళ్లు కొంటామని చెప్పారు. నాలుగు చెక్కులు వేస్తే.. నాలుగూ వెనక్కి ఇచ్చేశారు. ఒక్క చెక్‌ కూడా ఇప్పటి వరకు కొనలేదు. నా దగ్గర దాదాపు 100 క్వింటాళ్ల పంట ఉంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – భవనం వెంకటరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లాగ్రేడింగ్‌ రావడం లేదని..3 ఎకరాల్లో కౌలుకు తీసుకొని నల్లబర్లీ పొగాకు సాగు చేశా. 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కౌ­లు­కే రూ.27 వేలు అప్పులు చేసి ఇచ్చాను. బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేశాను. 30 క్వింటాళ్ల పంట ఉంది. ఐదు చెక్‌లు తీసుకెళ్తే రెండు వెనక్కి ఇచ్చేశారు. చెక్‌కు చేరా రూ.1000 ఖర్చవుతోంది. క్వింటాకు గ్రేడ్‌ చేసి తొక్కాలంటే రూ.500. ఇక 10 క్వింటాళ్లు గ్రేడింగ్‌ చేస్తే 3 క్వింటాళ్లు బాగుంది. మిగిలింది గ్రేడింగ్‌ రావడం లేదు. కొనేవారు లేక ఇంటి వద్దే ఉంచా. – కాసు కోటిరెడ్డి, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లాపురుగుమందుల షాపులకే రూ.7లక్షలు కట్టాలి..11 ఎకరాల్లో నల్ల బర్లీ సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్ష­లు పెట్టుబడి పెట్టా. నిరుడు క్వింటా రూ.15,500కు కొన్నారు. ఈ సారి రూ.6–8 వేలకు కూడా తీసుకోవడం లేదు. పురుగుమందుల దుకాణం వాళ్లకే రూ.7 లక్షలు ఇవ్వాలి. బంగారం పూర్తిగా బ్యాంక్‌లోనే ఉంది. నిరుడు ఎకరాకు రూ.50వేలు మిగిలింది. ఈసారి ఎకరాకు రూ.50–70 వేలు నష్టపోతున్నాం. – ఎర్రం సుబ్బారెడ్డి, ఇంకొల్లు, బాపట్ల జిల్లాపొగాకు రైతు ఆత్మహత్య» ప్రకాశం జిల్లా కొండపిలో విషాదం» పంట సాగులో నష్టాలతో మనస్తాపంకొండపి: పొగాకు పంట సాగు చేసి నష్టాలు రావడంతో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా కొండపిలో శుక్రవారం జరిగింది. బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చల్లా మధుసూదన్‌రెడ్డి (43) పొగాకుతో పాటు కొన్ని వాణిజ్య పంటలు పండిస్తున్నాడు. గత సంవత్సరం లాభాలు వచ్చాయన్న ఆశతో ఈ ఏడాది 15 ఎకరాల్లో పొగాకు సాగు చేశాడు. అయితే వేలం ప్రారంభం నుంచి పొగాకుకు గిట్టుబాటు ధర లేదని కుటుంబ సభ్యులకు చెప్పుకుని ఆవేదన చెందాడు. ఇలాగైతే పంటసాగుకు చేసిన ఖర్చు కూడా తిరిగొచ్చే అవకాశం లేదని వాపోయాడు. ఈ క్రమంలో నాలుగో తేదీన కొండపికి వెళ్తున్నానని, సాయంత్రానికి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే మధుసూదన్‌రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం స్థానిక పొగాకు బోర్డు వెనుక గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అది మధుసూదన్‌రెడ్డిదిగా గుర్తించారు. మృతుడి కుమా­రుడు మాట్లాడుతూ పొగాకు సాగు కోసం తన తండ్రి భారీగా అప్పులు చేశారని, అయితే గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా కలత చెందారని కన్నీంటిపర్యంతమయ్యాడు.ఈ ఘటనపై చల్లా మధుసూదన్‌ రెడ్డి తండ్రి బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అయితే పోలీసులు మాత్రం రైతు ఆత్మ హత్యగా కాకుండా, రూ.200 కోసం తల్లిదండ్రులతో గొడవపడి నెన్నూరు పాడు నుంచి వచ్చి కొండపిలోని పొగాకు బోర్డు సమీపం ఒక పాకలో అనుమానాస్పదంగా మృతి చెందాడని కేసు నమోదు చేసినట్టు సమాచారం.పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనాలి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం డిమాండ్‌ సాక్షి, అమరావతి: రైతుల వద్ద పేరుకుపోయిన పొగాకు నిల్వలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మిర్చి రైతులకు ఇచి్చన హామీ లాగా బుట్టదాఖలు చేయకుండా రైతుల వద్ద ఉన్న చివరి కిలో పొగాకు వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. పొగాకుతో పాటు మామిడి, కోకో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీలు దగా చేస్తున్నాయని ఆరోపించారు.

YSRCP President YS Jagan Bakrid Wishes To Muslims2
ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

తాడేపల్లి : ముస్లిం సోదర, సోద­రీ­­మ­ణు­లకు వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభా­కాంక్షలు తెలిపారు. త్యాగాల పండగ బక్రిద్‌ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్‌ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్‌ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, త్యాగానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బ్రకీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#EidUlAdha— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025

Saugavasi Subramanayam Resign To TDP3
టీడీపీకి బిగ్‌ షాక్‌.. సీనియర్‌ నాయకుడు రాజీనామా

సాక్షి, అన్నమయ్య: ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అన్నమయ్య జిల్లాలో సీనియర్‌ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను అందజేశారు. దీంతో, పచ్చ పార్టీకి బిగ్‌ షాక్‌ తగలినట్టు అయ్యింది.అన్నమయ్య జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్ట ప్రకటించారు. ఈ మేరకు లేఖలో వెల్లడించారు. సుగవాసి సుబ్రహ్మణ్యం 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం.తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని అన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఇక, సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు.

Staring at Crisis Pakistan wrote 4 Letters to India4
కాళ్ల బేరానికి పాక్‌.. ‘సింధు ఒ‍ప్పందం’పై వేడుకోలు

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీని​కితోడు ఇటీవల భారత్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం ఆ దేశాన్ని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్‌ హస్తం ఉందంటూ, భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ)నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్తాన్‌ కాళ్లబేరానికి వచ్చి, భారత్‌కు ఈ విషయమై పునరాలోచించాలని కోరుతూ లేఖ రాసింది.ఇప్పటికే పాకిస్తాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో, భారత్‌ సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్‌ మరింత ఆందోళనకు లోనయ్యింది. వెంటనే తేరుకున్న ఆ దేశ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా తాజాగా ఐడబ్ల్యూటీని పునరుద్ధరించాలని కోరుతూ, భారత జల్ శక్తి మంత్రిత్వ శాఖకు నాలుగు లేఖలు రాశారు. వీటిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పరిశీలనకు పంపినట్లు జల్ శక్తి మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి ఉండలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్‌కు భారతదేశం ఇప్పటికే స్పష్టం చేసింది. ఐడబ్ల్యూటీని పరస్పర నమ్మకం, స్నేహబంధం మేరకు రూపొందించినప్పటికీ, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిందని భారత్‌ పేర్కొంది. భారత్‌ తన జాతీయ భద్రతా అధికారాన్ని ప్రయోగిస్తూ.. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ముగించే వరకు ఈ ఒప్పందం నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్‌) ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.పాక్‌లో నెలకొన్న నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించకపోతే దేశంలోని ప్రజలు చనిపోతారని, తమ దేశానికి వచ్చే నీటిలో మూడు వంతులు దేశం వెలుపల నుండి వస్తున్నందని పాక్‌ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్ ఇటీవల పేర్కొన్నారు. సింధూ బేసిన్‌ పాక్‌ జీవనాడి అని, ఈ దేశంలోని ప్రతీ 10 మందిలో తొమ్మిది మంది తమ జీవనోపాధి కోసం సింధు నీటిపై ఆధారపడతారని ఆయన అన్నారు. దేశంలో పండించే పంటలలో 90 శాతం సింధు జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, పలు విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ దానిపైనే నిర్మితమయ్యాయని సయ్యద్ అలీ జాఫర్ తెలిపారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన

Congress Leaders Over Action With Lady SI At Khammam5
మహిళా ఎస్‌ఐతో అనుచిత ప్రవర్తన.. అర్ధరాత్రి హోటల్‌ వద్ద ఉద్రిక్తత..

సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస​్‌ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐపై దాడి చేశారు. ఆమె బాడీపై చేయి వేసి పక్కకి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అనంతరం.. నిందితుడిని, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఖమ్మంలోని కల్లూరు ఎన్‌ఎస్‌పీలోని ఓ హోటల్‌ వద్ద తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్‌ నేతలకు, హోటల్‌ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్‌ఐ హరిత.. హోటల్‌ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు ఆమె.. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రెచ్చిపోయారు.కాంగ్రెస్‌ నాయకుడు రాము.. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. మహిళా అని కూడా చూడకుండా ఆమె భుజాన్ని బలంగా నెట్టివేశారు. దీంతో, అక్కడి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎస్‌ఐపై దాడి చేసిన రాముతో పాటుగా అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

Musk new US party X poll shows 80 percent support6
మస్క్‌.. ‘ది అమెరికా పార్టీ’కి 80 శాతం మద్దతు

వాషింగ్టన్‌ డీసీ: ప్రపంచ కుబేరుడు, టెక్‌ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇటీవల మస్క్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో యూఎస్‌లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్‌ ‘ఎక్స్‌’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.మస్క్‌ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్‌ తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్‌’లో వైరల్‌ అవుతున్న ఈ పోస్టులో మస్క్‌.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో మస్క్ పలు విమర్శలు చేశారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, అతనికి కృతజ్ఞత లేదని మస్క్‌ ఆరోపించారు. దీనికి స్పందనగా ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ట్రూత్‌లో మస్క్ కంపెనీలకు ఫెడరల్ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్- డోనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకూ ఎంతో సన్నిహితులుగా మెలిగారు. గత జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం నుండి ట్రంప్ తృటిలో బయటపడిన అనంతరం మస్క్ బహిరంగంగా ఆయనకు మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఇది కూడా చదవండి: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

youth finance Entering 30s can bring a mix of health challenges7
30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు

యువత చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలనే ధోరణి మంచిదే. అయితే కొలువు సంపాదించాకా కార్పొరేట్‌ వాతావరణానికి అలవాటుపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, మహిళల్లో పీరియడ్లకు సంబంధించిన పీసీఓఎస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇలా చెబుతున్నవారి సగటు వయసు 40 కంటే తక్కవే కావడం ఆందోళన కలిగిస్తుంది.సమస్యలు షురూ..దీర్ఘకాలిక వ్యాధుల ప్రారంభ వయసు బాగా తగ్గిపోతోంది. హృద్రోగ నిపుణులను సంప్రదించేవారి సగటు వయసు ఇప్పుడు కేవలం 35 మాత్రమేనని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఒక్క గుండె జబ్బులకే ఇది పరిమితం కాలేదు.. తీవ్రమైన ఇతర సమస్యలూ చిన్న వయసులోనే ఎదురవుతున్నాయి. తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యం, సమయపాలన లేని ఆహారపుటలవాట్లు, గంటల తరబడి సీట్లకే పరిమితం కావడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.వ్యయ భారం ఇలా..కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులో రావడం ఆయా కుటుంబ సభ్యులను ఆందోళకు గురిచేస్తోంది. ఇది దేశ ఉత్పాదకత, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కంపెనీలు ఏడాదికి ఒక ఉద్యోగి నుంచి 30 రోజుల వరకు ఉత్పాదకత, పని దినాలను కోల్పోతాయని అంచనా వేస్తున్నారు. 40 శాతం ఉద్యోగులు మానసిక అనారోగ్య సమస్యలతో నెలలో కనీసం ఒక రోజైనా సెలవు తీసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జస్ట్‌ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్‌ మాల్యాఏం చేయాలంటే..కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలను చేపడుతున్నాయి. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కొద్దిమంది ఉద్యోగులే పాల్గొంటున్నారు. చాలా కొద్ది కంపెనీలే ఉద్యోగుల ఆరోగ్యానికి అనుగుణంగా మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. కార్పొరేట్‌ వ్యవస్థ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రస్తుత పని ప్రణాళిల్లో మార్పులు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కూడా తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడంతోపాటు ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవాలని చెబుతున్నారు. ఉద్యోగం ఉన్నన్ని రోజులు కంపెనీ అందించే బీమా ఉపయోగపడొచ్చు. అనుకోని కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతే పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా ఉండడం ఉత్తమం. సంపాదన మొదలు పెట్టిన వెంటనే ఆర్థిక నిపుణులు సలహాతో మంచి ఆరోగ్య బీమాను ఎంచుకోవాలి.

 Russia Offers Elon Musk Political Asylum8
ట్రంప్‌తో ఫైటింగ్‌.. మస్క్‌కు రష్యా బంపరాఫర్‌

మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్‌ మస్క్‌ను రష్యా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. మస్క్‌ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్‌ చెప్పుకొచ్చారు.డొనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్‌ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్‌ డూమా ఫెడరేషన్‌ కమిటీ ఛైర్మన్‌ దిమిత్రి నోవికోవ్‌ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్‌ మస్క్‌​ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్‌ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ లాగానే మస్క్‌కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్‌ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.మరోవైపు.. ట్రంప్‌, మస్క్‌ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ నిరాకరించారు. ఇది యూఎస్‌ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.Breaking News 🔴Russian MP Dmitry Novikov states that Elon Musk may be offered political asylum in Russia. pic.twitter.com/rp2pwqomuD— Global Report (@Globalrepport) June 6, 2025ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్‌ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్‌ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్‌ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్‌ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్‌ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్‌ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్‌ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్‌ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్‌ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్‌ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.

Director Jyothi Krishna Speech Latest Hari Hara Veera Mallu Movie9
మూడు సార్లు సినిమా చూశారు.. మరో మూవీ చేస్తానని హామీ: డైరెక్టర్

పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా చేశారు. దాదాపు ఐదేళ్ల పాటు చాలా ఇబ్బందులు పడిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. సోషల్ మీడియాలో మాత్రం వేరే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాకు బయ్యర్లు దొరకట్లేదని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు పక్కనబెడితే మూవీని అధికారికంగా వాయిదా వేసినా సరే ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు. తాజాగా మచిలీపట్నంలో ఈవెంట్ నిర్వహించారు.మచిలీపట్నం బీచ్ ఒ‍డ్డున 'హరిహర..' ఈవెంట్ శుక్రవారం సాయంత్రం జరిగింది. దీనికి హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ హాజరయ్యారు. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతికృష్ణ ఏమన్నారంటే.. 'పవన్ కల్యాణ్.. ఒక్కసారి కాదు ఈ సినిమాని మూడు సార్లు చూశారు. గంటపాటు నన్ను మెచ్చుకున్నారు. మళ్లీ ఇంకో సినిమా చేస్తానని మాటిచ్చారు. అసురన్ అనే పాటని అయితే ఏకంగా 500 సార్లు విన్నారు' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు)సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మాట్లాడటం బాగానే ఉంది. కాకపోతే రియాలిటీలో చూసుకుంటే 'హరిహర వీరమల్లు' సినిమాకు మార్కెట్‌లో పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో రావాల్సిన ఈ మూవీ.. దాదాపు 11-12 సార్లు వాయిదా పడింది. దీంతో పవన్ అభిమానులే ఈ చిత్రం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదనిపిస్తుంది. అలాంటిది పవన్.. తన సినిమాని మూడుసార్లు చూడటం, మరో మూవీ చేస్తానని దర్శకుడికి మాటివ్వడం అంటే నెటిజన్లు సందేహపడుతున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి?డైరెక్టర్ జ్యోతికృష్ణ విషయానికొస్తే.. నిర్మాత ఏఎం రత్నం కొడుకు. చాన్నాళ్లుగా డైరెక్షన్ చేస్తున్నాడు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత కేడీ, ఊ ల లా లా అనే తమిళ చిత్రాలు చేశారు. తెలుగులో గోపీచంద్‌తో 'ఆక్సిజన్', కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ రంజన్' తీశారు. ఇవన్నీ థియేటర్ దగ్గర ఆడలేదు. ఇప్పుడు కూడా క్రిష్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. మరి 'హరిహర..'తోనైనా హిట్ కొడతారేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

Russia largest attack yet on Ukraine fires 400 drones 40 missiles10
400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి దిగింది. ఏకంగా 400 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించి, అతిపెద్ద దాడికి పాల్పడింది. ఈ దాడి దేశమంతటినీ ప్రభావితం చేసిందని, లెక్కలేనంత మంది గాయపడ్డారని, వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుని, ఉక్రెయిన్‌ ‘ఆపరేషన్ స్పైడర్‌వెబ్‌’ను నిర్వహించిన దరిమిలా, రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భీకరదాడి చేసింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ‘ఈరోజు, మన దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్‌తో పాటు అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగాయి. రష్యన్లు 400కు మించిన డ్రోన్లు, 40కిపైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మంది గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ శిథిలాల కింద విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని కొందరు ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్ ఈ కోవకు చెందిన వ్యక్తి. యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌లో ఈ దాడి కారణంగా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. లుట్స్క్‌లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్‌లో మరొక వ్యక్తి మృతిచెందారు. మొత్తం ఆరుగురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఉక్రేనియన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ (సీఎన్‌ఎన్‌) మీడియాకు తెలిపింది. రష్యా జరిపిన ఈ సైనిక దాడి ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న దాడులలో అతిపెద్ద దాడి. కైవ్ ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: కాళ్ల బేరానికి పాక్‌.. ‘సింధు ఒ‍ప్పందం’పై వేడుకోలు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement