
ప్రభుత్వ నిబంధనలకు అమెజాన్ గండి
చైనా తర్వాత అతిపెద్ద ఆన్ లైన్ షాపింగ్ మార్కెట్ గా భారత్ ఎదుగుతోంది. షాపింగ్ కోసం భారత వినియోగదారులు ఎక్కువగా ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే విదేశీ ఈ-కామర్స్ సంస్థలు భారత్ లో ఆన్ లైన్ వ్యాపారం నిర్వహించడానికి మన ప్రభుత్వం కొత్తగా మరికొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన అమెజాన్ సంస్థ అసలు పట్టించుకోవడం లేదు.
విదేశీ ఈ-కామర్స్ సంస్థలకు సరియైన ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే నిబంధనలను గాలికి వదిలేస్తున్నారని ఫార్రెస్టర్ రీసెర్చ్ సంస్థ విశ్లేషకుడు సతీష్ మీనా తెలిపారు. ఈ నిబంధనలపై సరియైన వివరాలు అందించాలని లేదా సెప్టెంబర్ వరకూ నిబంధనలు అమలుచేయకుండా ఉంటే బాగుంటుందని ఇంటర్నెట్ కంపెనీలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ట్రేడ్ అసోసియేషన్లు అభిప్రాయపడ్డాయి.
మరోవైపు ప్రభుత్వం విధించిన నిబంధనలను విదేశీ ఈ-కామర్స్ సంస్థలు తప్పుబడుతున్నాయి. 2020 నాటికి భారత్ లో ఆన్ లైన్ వ్యాపారంలో 75 బిలియన్ డాలర్లుకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఈ మార్కెట్ 12.1 బిలియన్ డాలర్లుగా ఉంది.