Foreign Services
-
అమెరికాలో అన్నింటా తెలుగువారే!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. 2010 నుంచి 2017 సంవత్సరం వరకు వీరి సంఖ్య ఊహించనంతగా భారీగా పెరిగి నేడు నాలుగు లక్షలను దాటిందని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. దేశంలో ఉంటూ విదేశీ భాష మాట్లాడే వారిలో 86 శాతం మంది తెలుగువారేనని ఆ సర్వే పేర్కొంది. తెలుగు తర్వాత అరబిక్ మాట్లాడే వారి శాతం 42, హిందీ మాట్లాడే వారి శాతం 42, ఉర్దూ మాట్లాడే వారి శాతం 30, చైనీస్ 23 శాతం, గుజరాతీ 22 శాతం, హైతీ మాట్లాడే వారి శాతం 19 అని అధ్యయనంలో తేలింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మాతృ భాషయిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో 2000 సంవత్సరం నాటికి 87,543 మంది మాత్రమే ఉండగా, వారి సంఖ్య 2010 సంవత్సరం నాటికి 2,22,977కి చేరుకుంది. వీరి సంఖ్య 2017, జూలై నాటికి 4,15,414కు చేరుకుంది. తెలుగు రాష్ట్రా నుంచి టెక్, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్లనే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 2008 నుంచి 2012 మధ్య 26 వేల మంది విద్యార్థులు వచ్చారని, వారిలో ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ చదవేవారు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్లు కూడా హైదరాబాదీలవడం విశేషమని అధ్యయనం పేర్కొంది. ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే కాకుండా ఇతర తొమ్మిది ఉద్యోగాల్లో ఐదుగురు ఉద్యోగులు తెలుగువారే ఉంటున్నారు. రెండో తెలుగుతరం కుటుంబానికి చెందిన నైనా దవులూరి 2013లో మిస్ ఇండో–అమెరికన్గా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి 1980లో అమెరికా డాక్టర్ దంపతుల కూతురు నైనా. స్పెల్లింగ్ బీ పోటీల్లో కూడా ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. ప్రతిష్టాకరమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’లో కూడా తెలుగు విద్యార్థులు టాప్లో నిలవడం విశేషం. తెలుగు సంస్కృతిని నిలబెట్టడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలోను తెలుగువారు ముందుంటున్నారు. కొందరు తమ పిల్లలకు సంప్రదాయ సంగీతం, నృత్యంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి విషయంలో చీకటి కోణం కూడా ఉంది. జాతి విద్వేషాలకు, దోపిడీలకు తెలుగువారే ఎక్కువగా బలవుతున్నారు. బెంగాలీ, తమిళయన్లు తక్కువే! అమెరికాలో బెంగాలీ మాట్లాడేవారు మూడున్నర లక్షల మంది ఉండగా, తమిళం మాట్లాడే వారి సంఖ్య 2,80,000 మాత్రమే. అయితే ఇటీవలి కాలంలో వారు బాగా పెరుగుతున్నారు. బెంగాలీల్లో పెరుగుదల 57 శాతం కాగా, తమిళయన్లలో 55 శాతం ఉంది. తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే అయినప్పటికీ వివిధ భాషల వారు విస్తృతంగా హిందీ మాట్లాడతారు. దాదాపు 8,63.000 మంది అమెరికాలో హిందీ మాట్లాడతారు. మొత్తంలో అమెరికా జనాభాలో ఇళ్ల వద్ద విదేశీ భాష మాట్లాడే వారి సంఖ్య 21.8 శాతం మందని అధ్యయనంలో తేలింది. -
కలగా అంతర్జాతీయ విమానయానం
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం... పేరుకే అంతర్జాతీయం... కనీసం దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు కూడా విమానాలు తిరగని పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన టెర్మినల్ ఏర్పాటు చేసి మూడేళ్లు దాటుతున్నా విమానాలు భాగ్యనగరాన్ని దాటి బయటకు వెళ్లడంలేదు. ఫలితంగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన వారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రేణిగుంట: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి సమీపంలోని రేణిగుంటను అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపకల్పన జరిగింది. 2015లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గరుడ పక్షి ఆకారంలో రూ.175 కోట్లతో నూతన టెర్మినల్ను ప్రారంభించారు. టెర్మినల్ ప్రాంగణంలో రూ.5కోట్లకు పైగా వెచ్చించి తుడా అధికారులతో సుందరీకరణ పనులు కూడా చేయించారు. 2017 జూన్లో అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ఇక్కడ నుంచి కువైట్, దుబాయ్, శ్రీలంక వంటి దేశాలకు కనెక్టింగ్ ఫ్లెట్లను నడుపుతామని మూడు నెలల కిందట సాక్షాత్తూ అప్పటి కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్గజపతిరాజు ప్రకటించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గణనీయంగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య.. గతంలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన విమాన సేవలు ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలకు విస్తరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్జెట్, ట్రూజెట్, ఇండిగో, ఎయిర్ కోస్తా తమ సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 15 వరకు విమాన సర్వీసులు రాకపోకలను సాగిస్తున్నాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు 5,48,732మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి విమాన ప్రయాణం చేసినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2015–16 ఏడాదికిగాను రేణిగుంట విమానాశ్రయం ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎయిర్పోర్టు’ అవార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయానికి రాని అనుమతులు ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇక్కడి నుంచి ప్రారంభిస్తే 200మంది అంతర్జాతీయ, 55మంది డొమెస్టిక్ ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే సామర్థ్యం నూతన టెర్మినల్కు ఉంది. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అనుమతులివ్వకపోవడంతో ప్రస్తుతం దేశీయ సర్వీసులే నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులను నడపాలి.. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు అనేక మంది వెళుతున్నారు. వీరికి అనువుగా రేణిగుంట నుంచి కనీసం వారానికి ఒక్క కనెక్టింగ్ ఫ్లైట్ను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుం ది. తిరుపతి పుణ్యక్షేత్రానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతర్జాతీయ విమానం ఇక్కడి నుంచి ఎగిరితే పేరుకు సార్థకత ఉంటుంది. – శ్రీనివాసులు రెడ్డి, ప్రయాణికుడు సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం.. రెండేళ్లలో నూతన టెర్మినల్లో ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం. రూ.కోట్లు వెచ్చించి ఎయిర్పోర్టు ప్రాంగణమంతా సుందరీకరణ పనులు చేపట్టాం. విమాన సర్వీసులను విస్తరించాం. 2015–16 ఏడాదికి గాను ‘బెస్ట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ ఎయిర్పోర్టు’గా అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఉన్నతాధికారుల అనుమతులతో అంతర్జాతీయ విమానయాన సేవలను త్వరితగతిన ప్రారంభిస్తాం. – హెచ్.పుల్లా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్, తిరుపతి -
మరో 9 విదేశీ బ్రాంచ్లను మూసివేయనున్న ఎస్బీఐ
న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో తొమ్మిది విదేశీ బ్రాంచ్లను మూసివేయనుంది. ఇప్పటికే బ్యాంక్ గత రెండేళ్ల కాలంలో విదేశాల్లోని ఆరు బ్రాంచ్లలో కార్యకలాపాలకు స్వస్తి పలికింది. విదేశీ కార్యకలాపాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) ప్రవీణ్ కుమార్ గుప్తా తెలిపారు. కాగా ఎస్బీఐ 36 దేశాల్లో 190 బ్రాంచ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘విదేశీ భూభాగాల్లోని అన్ని బ్రాంచ్లు పూర్తిస్థాయి కార్యాలయాలు కాదు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో చిన్న బ్రాంచ్లతోపాటు రిటైల్ బ్రాంచ్లు కూడా ఉన్నాయి. వీటిని హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది’ అని గుప్తా వివరించారు. ‘బ్రాంచ్ల హేతుబద్ధీకరణ కొనసాగుతున్న ప్రక్రియ. వాణిజ్యపరంగా అనవసరం అయితే ఆ బ్రాంచ్లలో సేవలు కొనసాగించడం అవివేకం అవుతుంది’ అన్నారు. బ్రాంచ్లను మూసివేయడమంటే కార్యకలాపాల నుంచి పూర్తిగా వైదొలగినట్లేనా? అనే ప్రశ్నకు.. తాము ఆ దేశాల నుంచి తప్పకున్నట్లు కాదని, అయితే చిన్న బ్రాంచ్లను మూసివేస్తామని, లేకపోతే రెండు లేదా మూడు బ్రాంచ్లను కలిపి ఒకటిగా చేస్తామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం దేశీయంగా దాదాపు 300–350 బ్రాంచ్లను ఏర్పాటు చేస్తామని, వీటిల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తామని గుప్తా తెలిపారు. కాగా, ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ బ్యాంకులు 35 విదేశీ బ్రాంచ్లను మూసివేశాయి. -
ఐపీఎల్-12వ సీజన్ మార్చిలోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 (ఐపీఎల్ ) సంబరం అయిపోయింది. కానీ, ప్రేక్షకులు మాత్రం అప్పుడే వచ్చే ఐపీఎల్ గురించి చర్చలు మొదలుపెట్టారు. ఈసారి ఐపీఎల్-12వ సీజన్ ముందుగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వరల్డ్ కప్ కూడా 2019లోనే జరగనుంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్తో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ మే 30 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా ప్లేయర్స్ నిబంధనల ప్రకారం ఒక టోర్ని అయిపోయినత తర్వాత మరో టోర్నీలో మ్యాచ్ ఆడటానికి కనీసం 15 రోజుల విరామం ఉండాలి. దీనిలో భాగంగానే ఐపీఎల్-12వ సీజన్ త్వరగానే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్లోని వేల్స్ వేదికగా 2019 మే 30 నుంచి జూలై 14 వరకు వరల్డ్ కప్ జరగనుంది. అయితే ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభమై మే నెల చివరి వారంలో ముగుస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్ మే మూడో వారంలోనే ముగించాలి. అలా అయితేనే ఇండియన్ ప్లేయర్స్కు వరల్డ్ కప్లో ఆడేందుకు 15 రోజుల గ్యాప్ లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 2019లో మార్చి 29న ఐపీఎల్ -12వ సీజన్ ప్రారంభమతుందని సమాచారం. అంతేకాక ఐపీఎల్-12ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్ సమయంలో మ్యాచ్లు నిర్వహిస్తే భద్రత కష్టమవతుంది. గతంలో కూడా 2009లో ఎన్నికల సమయంలో ఐపీఎల్ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కప్ కైవసం చేసుకున్న విషయం విదితమే. -
విదేశీ జంట ప్రైవేట్ వీడియో కలకలం!
సాక్షి, ఉదయ్పూర్: విదేశీ జంట ఏకాంత వీడియోపై దుమారం రేగుతోంది. పోలీస్ స్టేషన్పై వీరు ఏకాంతంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ఈ ఘటన రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఒక్క వీడియోతో స్థానిక పోలీసులు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అయి ఉండి ఇలాంటి పనులకు చోటు ఇస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ కథనం ప్రకారం.. ఉదయ్పూర్ పరిధిలోని ఘంటానగర్ పోలీస్ స్టేషన్ మీద కొన్ని రోజుల కిందట విదేశానికి చెందిన ఓ జంట శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట నిజమేనని, అయితే ఇది ఎక్కడ జరిగింది? ఎవరైనా మార్ఫింగ్ చేసి లీక్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. పీఎస్ మీద ఇలాంటి పనులు జరిగినట్లు తాను నమ్మడం లేదన్నారు. పోలీస్ స్టేషన్పైనే ఈ అసాంఘీక కార్యకలాపాలు జరిగాయని, స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ లోపలి నుంచే టెర్రస్ మీదకు ఎక్కేందుకు వీలుండటం గమనార్హం. అంటే.. పోలీసుల సహకారంతోనే విదేశీ జంట పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద ఏకాంతంగా గడిపారని, వీడియో ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఘంటానగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
గ్రేటర్కు ‘విదేశీ’ కిక్కు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నెలకు సుమారు రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుండగా.. ఇందులో ఏకంగా రూ.75 కోట్లు విదేశీ మద్య మేనని ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తు తం నగరంలో ఉన్న 500 బార్లు, 400 మద్యం దుకాణాల్లో విదేశీ మద్యం లభించేవి దాదాపు 100 వరకు ఉన్నాయి. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఉన్న బార్లలో వినియోగదారుల అభిరుచి మేరకు విదేశీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఫారిన్ సరుకుకు విని యోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో పలు బార్ల యజమానులు ఆబ్కారీ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుంటున్నట్లు నగర ఆబ్కారీ శాఖ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. నగరం లో రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల బీరు.. 5 లక్షల లీటర్ల దేశ, విదేశీ రకాల మద్యాన్ని కుమ్మేస్తున్నట్లు ఆబ్కారీశాఖ లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే వీకెండ్లలో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. రూ.లక్షల విలువ చేసే బ్రాండ్లు... జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని ‘టానిక్’ బడా లిక్కర్ మాల్ మందుబాబులను, గ్రేటర్ సిటిజన్లు విశేషంగా ఆకర్షిస్తోంది. సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ లిక్కర్ మాల్ ఆసియాలోనే అత్యంత పెద్దది కావడం గమనార్హం. ఇక్కడ నెలకు రూ.5 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయని, ఇందులో సింహభాగం విదేశీ మద్యానిదేనని నిర్వాహకులు తెలిపారు. ఇక బంజారాహిల్స్లోని లిక్కర్ బ్యాంక్లోనూ విదేశీ మద్యం విరివిగా అమ్ముడవుతోంది. నెలకు సుమారు రూ.3 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక్కడ కూడా దేశ, విదేశాలకు చెందిన పలు లిక్కర్ బ్రాండ్లు గ్రేటర్ సిటిజన్లను ఆకర్షిస్తున్నాయి. జానీవాకర్, చివాస్రీగల్ వంటి బ్రాండ్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అభాగ్య మహిళలపై గురి..దుబాయ్లో అమ్మకం
సాక్షి, బెంగళూరు: అభాగ్య వనితలను మభ్యపెట్టి దుబాయ్లో ఉద్యోగాల పేరిట అమ్మేస్తున్న ముఠా బాగోతం బెళగావిలో వెలుగులోకి వచ్చింది. ఒక బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. వివరాలు... బెళగావిలోని నిరుపేద మహిళలు, వితంతువులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బెళగావికి చెందిన వహీదా మకందార్, షంషుద్దీన్ మకందార్లు మభ్యపెట్టేవారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న షానవాజ్ను ,ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి ఆమెను దుబాయ్కు పంపించారు. అక్కడైతే జీతం దండిగా వస్తుందని, సమస్యలన్నీ తీరిపోతాయని ఆమెకు ఆశలు చూపించారు. అయితే అక్కడ ఆమెను ఉద్యోగానికి కాకుండా, దుబాయ్ సేఠ్లకు అమ్మేశారని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దుబాయ్లో చిత్రహింసలు దుబాయ్కు వెళ్లిన షానవాజ్ అక్కడ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తిరిగి దేశానికి వెళ్తానంటే తనను తీవ్రంగా కొట్టి చెయ్యి విరగ్గొట్టారని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపింది. తనను అక్కడి వారికి రూ.10 లక్షలకు అమ్మేశారని, ఎలాగైనా తనను ఈ నరకం నుండి తప్పించాలని మొరపెట్టుకుంది. దీంతో షానవాజ్ కుటుంబ సభ్యులు బెళగావి పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లిని దుబాయ్కి తీసుకెళ్లి అమ్మేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆమెను తిరిగి భారత్కు రప్పించాలని ఫిర్యాదులో షానవాజ్ కూతురు కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నాం: పోలీస్ కమిషనర్ ఈ విషయంపై బెళగావి కమిషనర్ కె.రామచంద్రరావు మాట్లాడుతూ.... డబ్బు ఆశ చూపి మహిళలను విదేశాలకు అమ్ముతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ముంబైలో ఉన్న ముఠాతో కలిసి కొంతమంది స్థానికులు ఇలా మహిళలను విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పారు. షానవాజ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
ఎంత తాగినా.. వాసన రాదట!
సాక్షి, హైదరాబాద్: బీరు, విస్కీ, బ్రాందీ.. ఇలా మద్యం ఏదైనా ఓ రకమైన వాసన వస్తుంది.. అదోరకమైన చేదు రుచితో ఉంటుంది. కాస్త మందెక్కువైతే... తలపోటు, వికారం దగ్గరి నుంచి ఒళ్లు నొప్పులు, మగతగా ఉండటం దాకా ఎన్నో సైడ్ ఎఫెక్టులు. అయితే త్వరలో రాష్ట్ర మార్కెట్లోకి రానున్న విదేశీ ‘బయో మద్యం’ఇలాంటి సైడ్ ఎఫెక్టులన్నింటికీ అతీతమట. వాసన కూడా రాకపోవడం దాని ప్రత్యేకత అని, పలు రకాల ఔషధ ఉత్పత్తులను కలిపి దీనిని తయారు చేస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు. తెలంగాణలో ఈ మద్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. అయితే ఈ బయో మద్యంలోనూ సాధారణ మద్యంలో ఉండే స్థాయిలోనే ఆల్కాహాల్ ఉంటుంది. వాసన రాకపోవడం, సైడ్ ఎఫెక్టులు లేకపోవడం తప్ప మిగతా అంతా సాధారణ మద్యం లాగానే ఉంటుంది. తాగేసి వాహనం నడిపితే ‘డ్రంకెన్ డ్రైవ్’లో దొరికిపోవడం ఖాయమే. తెలుగువారి కంపెనీయే వాస్తవానికి గుంటూరుకు చెందిన సింధూరా హెర్బల్స్ సంస్థ వ్యవస్థాపకుడు అమర్నాథ్ బయో మద్యాన్ని తయారు చేశారు. దీనిని ఇక్కడి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని శాస్త్రీయపరమైన సందేహాలను నివృత్తి చేయలేకవటంతో... బయో మద్యం ఇక్కడి మార్కెట్లోకి రాలేదు. తరువాత ఈ బయో మద్యానికి విదేశీ హంగులు జోడించి అమెరికా, నేపాల్ మార్కెట్లలో ప్రవేశపెట్టారు. తాజాగా రాష్ట్రంలో విదేశీ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడి మార్కెట్పై దృష్టి పెట్టారు. ఇక్కడ మద్యం మార్కెట్ తీరు, వినియోగంపై ఒక సర్వే చేయించినట్లు తెలిసింది. వాసన లేని, తలపట్టేయడం, వికారం వంటి సైడ్ ఎఫెక్టులు లేని మద్యానికి మంచి మార్కెట్ ఉన్నట్లు గుర్తించి.. తెలంగాణలో విక్రయాల కోసం కేఎస్ బయో నాచురల్స్ మార్కెటింగ్ సంస్థ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మద్యం తాగితే నిషా వస్తుందిగానీ.. తలపట్టడం వంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని, వాసన రాదని ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదించి అనుమతి పొందింది. ప్రస్తుతం బయో బీరు, బయో విస్కీలకు అనుమతి వచ్చింది. త్వరలోనే బయో ఓడ్కా, బ్రాందీ, రమ్లను కూడా తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఏం కలుపుతారు? విదేశాల్లో మొక్కజొన్నలు, బార్లీ, జొన్నలు వంటి ధాన్యం ఆధారంగా తయారు చేసిన ఆల్కాహాల్ ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)కు చక్కెరను మండించి తయారు చేసిన ‘బరంట్ షుగర్’ను, ప్రత్యేక కృత్రిమ (సింథటిక్) ఫ్లేవర్లను కలిపి మద్యాన్ని తయారు చేస్తారు. మన దేశంలో మొలాసిస్ ఆధారిత ఈఎన్ఏను వాడుతారు. అదే బయో మద్యంలో బరంట్ షుగర్ స్థానంలో తేనె ఆధారిత చక్కెరను, అశ్వగంధ లాంటి 16 రకాల మూలికలను కలిపి సహజ ఫ్లేవర్లతో మద్యాన్ని ఉత్పత్తి చేస్తామని కంపెనీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్కు సమర్పించిన బ్రాండ్ లేబుల్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో పేర్కొంది. విదేశీ మద్యం అమ్మకాలు పెరిగే అవకాశం ప్రస్తుతం రాష్ట్రంలో 500 రకాల విదేశీ మద్యం బ్రాండ్లు ఉన్నాయి. ఏటా 280 లక్షల కేసుల దేశీ మద్యం అమ్ముడుపోతుండగా.. లక్ష కేసుల మేర విదేశీ మద్యం విక్రయిస్తున్నారు. విదేశీ మద్యం నుంచి సుమారు రూ.2,890 కోట్ల మేర రాబడి వస్తోంది. తాజాగా బయో మద్యంతో విదేశీ మద్యం అమ్మకాలు పెరుగుతాయని.. రాబడి మరో వెయ్యి కోట్ల వరకు పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకత ఏమీ లేదు హైదరాబాద్లో తరచుగా అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరుగుతున్నందున విదేశీ మద్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఆ క్రమంలోనే ఇటీవల 58 విదేశీ మద్యం బ్రాండ్లకు అనుమతించాం. అందులో బయో మద్యం ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అంతేగానీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ మద్యాన్ని ప్రోత్సహించడం లేదు.. – టీఎస్బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్ -
మద్యంతో భాషా ప్రావీణ్యం
వాషింగ్టన్ : మద్యం వల్ల ఆరోగ్యం పాడవుతుందని మన అందరికీ తెలుసు. మద్యాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మనసు, శరీరం, మొదడు మొద్దువారిపోతాయని పెద్దలు చెబుతారు. అయితే తాజాగా వెలువడిన ఒక రీసెర్చ్ మద్యపానం గురించిన ఆసక్తిక విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా రెండుమూడు భాషలు మాట్లాడేవారికి మద్యం తీసుకోవడం చాలా మేలు చేస్తుందని రీసెర్చ్చెబుతోంది. తగితన మోతాదులో తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు, చేసే పనులలో శ్రద్ద, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని రీసెర్చ్ స్పష్టం చేస్తోంది. చాలామందిలో కనిపించే యాంగ్జయిటీ (ఆత్రుత సమస్య) మద్యం వల్ల తగ్గుతుందని రీసెర్చ్ ప్రకటించింది. మద్యం తాగే అలవాటున్న 50 మందిపై డచ్ యూనివర్సిటీ ర్యాండమ్గా ఒక పరిశోధన చేసింది. అందరికీ వారివారి బరువులో 5 శాతం బీరు తాగించి.. ఇతర భాషా ప్రావీణ్యతపై పరిశోధకులు పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో మద్యం తాగిన వారు ఇతర భాషలపై తమకున్న పట్టును నిరూపించుకున్నారు. వారు మాట్లాడే మాటలను ఆడియో రికార్డ్ కూడా చేసినట్లు పరిశోధకులు ప్రకటించారు. -
బ్రాండ్ విదేశీ.. మందు దేశీ..!
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన విదేశీ మద్యం బ్రాండ్ల ఖాళీ సీసాలను సేకరించడం.. దానిలో లోకల్ విస్కీ, వోడ్కా నింపేసి విదేశీ మద్యం పేరిట అమ్మేయడం.. అంతర్జాతీయ మార్కెట్లో రూ.42 వేల ధర పలికే బ్రాండ్ సీసాలో రూ.వెయ్యి విలువైన లోకల్ మద్యం.. రూ.3,600 విలువైన బ్రాండ్ ఖాళీ సీసాల్లో రూ.300కు దొరికే వోడ్కా నింపడం.. వాటిని విలాసవంతమైన ప్రాంతాల్లో అమ్మేయడం.. హైదరాబాద్లో ముంబై నకిలీ మద్యం ముఠా సాగిస్తున్న అక్రమ వ్యాపారమిదీ. గత రెండేళ్లుగా ఈ గ్యాంగ్ దందా కొనసాగిస్తున్నా ఎౖMð్సజ్ పోలీసులు పసిగట్టలేక పోయారు. ముంబై ఎక్సైజ్ పోలీసులు అందిం చిన సమాచారంతో చివరికి నిందితుల్ని పట్టుకు న్నారు. వారి నుంచి విదేశీ బ్రాండ్లకు చెందిన 142 నకిలీ మద్యం సీసాలను, మరో 183 ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దందా సాగుతోందిలా.. ముంబై నగరానికి చెందిన అంతర్జాతీయ మద్యం స్మగ్లర్లు ఘాంజీభాయి, ముఖేశ్ కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. వీరికి చెందిన ఓ ముఠా 10 రోజుల క్రితం ముంబైలో అక్కడి ఎక్సైజ్ టాస్క్ఫోర్స్కు పట్టుబ డింది. వారిని విచారించగా.. హైదరాబాద్లోనూ ఒక ముఠా నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. స్టేషనరీ వ్యాపారం ముసుగులో ముంబై నుంచి వివిధ రకాల విదేశీ బ్రాండ్లకు చెందిన లేబుల్స్, మూతలు, సీల్స్, కార్టర్లు తెప్పించే వారు. స్టార్ హోటళ్లలో తాగి పడేసిన విదేశీ మద్యం ఖాళీ సీసాలను సేకరించి, స్థానిక మద్యం దుకాణాల్లో చౌక ధరకు దొరికే బ్రాండ్ల మద్యాన్ని ఆ బాటిల్స్లో పోసి మూతపెట్టి, లేబుల్ అతి కించి విక్రయించేస్తున్నారు. లేబుల్ చెదరకుం డా.. సులభంగా మద్యం సీసాల మీద మూతలు ఊడ దీయటం, తిరిగి పెట్టడంలో తర్ఫీదు ఉన్న వ్యక్తులే ఈ వ్యాపారానికి కీలకం. ఇందుకోసం స్మగ్లింగ్ గ్యాంగ్ గుజరాత్కు చెందిన మహేశ్ అంబావి అనే నిçపుణుడిని పంపింది. అతన్ని కూడా టాస్క్ఫోర్స్ అరెస్టు చేసింది. నిఘా లోపంతోనే వ్యాపారం.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్ పర్మిట్ ఫంక్షన్లలోనే ఈ నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ప్రాథమిక విచారణలో తేలింది. ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ తీసుకుని ఎమ్మార్పీ ధర మీద 20 నుంచి 30 శాతం తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫంక్షన్ హాళ్లలో మద్యం పార్టీ కోసం ఈవెంటు పర్మిట్ ఇస్తున్న అధికా రులు.. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మద్యం డిపోల నుంచే కచ్చితంగా మద్యం తెచ్చుకునేలా కట్టుదిట్టం చేయాలి. కానీ మద్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారనే అంశాన్ని అధికారులు విస్మరిస్తు న్నారు. దీంతో ఇలాంటి నకిలీ మద్యానికి అవకాశం చిక్కుతోంది. టోల్ఫ్రీకి కాల్ చేయండి తక్కువ ధరకే విదేశీ మద్యం విక్రయిస్తున్నారని తెలిసినా.. ఫోన్ కాల్ ద్వారా ఎవరైనా ఆర్డర్ అడిగినా 18004252523 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ కోరారు. టీఎస్బీసీఎల్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 4,500 రకాల బ్రాండ్ల విదేశీ మద్యం అమ్ముతున్నామని, ప్రజలు కార్పొరేషన్ మద్యాన్నే తాగాలని ఆయన సూచించారు. మద్యం సీసాలపై త్రీడీ హోలోగ్రామ్ సీల్ ఉంటుందని, దీనికి నకిలీ తయారు చేయడం సాధ్యం కాదని, అందువల్ల హోలోగ్రామ్ సీల్ ఉన్న మద్యంనే కొనుగోలు చేయాలని చెప్పారు. -
దొంగ చిరునామాలతో ఎంత పని చేశారు !
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దొడ్డిదారిన దేశంలోకి తరలిస్తున్న బంగారం భారీగా పట్టబడింది. ఇందుకు దేశ రాజధానిలోని ఫారిన్ పోస్టాఫీసు, ప్రధాన పోస్టాఫీసులు వేదిక కావటం గమనార్హం. థాయ్లాండ్, టర్కీ, దుబాయి, హాంగ్కాంగ్, ఇండోనేసియా, వంటి దేశాల నుంచి నిషేధిత వస్తువలను పోస్టు ద్వారా కొందరు తీసుకువస్తున్నారు. ఇలా వచ్చే పార్సిళ్లపై దొంగ చిరునామాలుంటాయి. అయితే ఇది ముందే పోస్టాఫీసు సిబ్బందికి తెలిసి ఉంటుంది. ఆ ప్రకారమే సంబంధిత వ్యక్తికి ఆ పార్శిల్ అందుతుంది. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు గురువారం ఢిల్లీలోని ఫారిన్ పోస్టాఫీసుపై దాడి చేసి రూ.15 కోట్ల విలువైన బంగారం సహా నిషేధిత వస్తువులను పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక అధికారితో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. వారు చెప్పిన సమాచారం మేరకు రెండు ముఠాలకు చెందిన వ్యక్తులను పట్టుకుని రూ.8.5 కోట్ల విలువైన 28 కిలోల బంగారంతోపాటు రూ. 5 కోట్ల విలువైన డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేశారు. ఈ సిండికేట్ గుట్టురట్టు చేయటానికి తమకు నాలుగు రోజులు పట్టిందని అధికారులు తెలిపారు. అంతేకాక వారి నుంచి లెక్క చూపని రూ. 24 లక్షల నగదు కూడా దొరికిందని వివరించారు. -
విదేశీ జోక్యంతో కశ్మీర్లో కల్లోలమే: ముఫ్తీ
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారానికి విదేశీ మధ్యవర్తిత్వం అవసరమంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. చైనా, అమెరికా లాంటి విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటే కశ్మీర్ మరో సిరియా, అఫ్గానిస్తాన్, ఇరాక్లా మారుతుందని హెచ్చరించారు. విదేశీ జోక్యం కోరుతున్న ఫరూక్కు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? అని ముఫ్తీ ప్రశ్నించారు. సిరియా, ఇరాక్లోని పరిస్థితులను కశ్మీర్లో ఫరూక్ కోరుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. అమెరికా, చైనాలు తమ అంతర్గత విషయాలపై దృష్టి సారిస్తే మంచిదని ముఫ్తీ అన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్.. ఓ స్కామ్
విదేశీ పుస్తకాల స్కానింగ్ పేరుతో బెంగళూరులో రూ.150 కోట్ల వంచన సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. లక్షల్లో వసూలు వలలో చిక్కిన బాధితులు వందల్లోనే పలు రాష్ట్రాల్లో ఇదే తరహాలో చీటింగ్ సాక్షి, బెంగళూరు: కాసేపు స్కానింగ్.. ఆనక ఇంటర్నెట్లో పీడీఎఫ్ కాపీలు పంపితే లక్షల్లోనే ఆదామయంటూ మోసగాళ్లు పన్నిన వలలో చిక్కుకున్న బాధితులు మోసపోయి విలవిల్లాడుతున్నారు. బెంగళూరులో రూ. వందల కోట్లలో సాగిన ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచే పనిచేయండి.. కాలు కాదల్చకుండా ప్రతి నెలా వేలు, లక్షలు సంపాదించండి! ఇటీవల ఎక్కడ చూసినా ఊరించే ఇలాంటి ప్రకటనలే. బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాలు, సోషల్ మీడియాలో ఊదరగొడుతుంటాయి. ‘ఈ–బుక్’ ప్రాజెక్ట్ పేరుతో విదేశాలకు చెందిన పుస్తకాలను స్కానింగ్ చేసి పీడీఎఫ్లోకి మార్చి పంపిస్తే ప్రతి నెలా లక్షల్లో సంపాదించవచ్చంటూ గుజరాత్కు చెందిన ఓ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. దీన్ని చూసిన బెంగళూరు విజయనగర్కు చెందిన వినోద్కుమార్ ఈ–బుక్ ప్రాజెక్ట్ తీసుకున్న తన స్నేహితుడి ద్వారా కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. అయితే రూ.1.50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని వారు చెప్పటంతో ఇంట్లో నగలు అమ్మి కట్టేశాడు. అనంతరం రూ.45,000 వెచ్చించి స్కానింగ్ యంత్రం కొనుగోలు చేశాడు. పుస్తకాలను స్కానింగ్ చేసి పీడీఎఫ్లోకి మార్చి పంపించి నెలలు గడుస్తున్నా కంపెనీ పైసా కూడా ఇవ్వకపోవటంతో అనుమానంతో ఫోన్ చేయగా పనిచేయలేదు. దీంతో మోసపోయి నట్లు గ్రహించిన వినోద్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ చేతిలో ఇలా మోసపోయిన బెంగళూరుకు చెందిన 40 మంది బాధితులు కూడా విజయనగర్, విల్సన్గార్డెన్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఒక్క కర్ణాటకలోనే ఆ కంపెనీకి వెయ్యి మందికిపైగా సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. వారి దగ్గర రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారని, ఇలా రాష్ట్రంలో రూ.150 కోట్లు గుంజినట్లు సమాచారం. గుజరాత్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో రూ.300 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. స్టార్హోటళ్లలో మీటింగ్లు, ఒప్పందాల రిజిస్ట్రేషన్లు ఈ ముఠా మోసం చేసే తీరు పక్కాగా ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని కాలేజీలు వారి గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఈ–బుక్స్గా మార్చడానికి నిర్ణయించుకున్నాయని, ఆ పని తమకు అప్పగించినట్లు ప్రచారం చేస్తారు. పీడీఎఫ్లు కంపెనీ మెయిల్కు పంపితే చాలంటూ అమాయకులకు వల వేస్తారు. ప్రతి పేజీకి రూ.6 వరకు చెల్లిస్తామని, ఒక్కో ప్రాజెక్ట్లో కనీసం 15 వేల పేజీలు ఉంటాయని, లక్షల్లో ఆదాయం వచ్చి వాలుతుందని నమ్మిస్తారు. రకరకాల నిబంధనలు చూపి రూ.1.50 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ రాబడతారు. కంపెనీ ప్రతినిధులంటూ హర్యానా నుంచి సూటుబూటు వేసుకుని ఖరీదైన కార్లలో వచ్చినవారితో స్టార్ హోటళ్లలో సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. కొందరిని హర్యానాకు తీసుకెళ్లి అక్కడి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాజెక్ట్ ఒప్పందాలను తయారు చేసి ఇస్తారు. ఇలా వందల కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టారు. కాగా, కంపెనీ ప్రతినిధులు రాఘవేంద్రసింగ్, నిఖిల్ ప్రకాశ్, జై మన్వాని, అనికేత్, శ్రీవాస్తవ్, దివ్యాసింగ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పట్టుకోగానే ‘గంట’ కొట్టాడు!
-
పట్టుకోగానే ‘గంట’ కొట్టాడు!
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఏపీ మంత్రి ఫోన్ సాక్షి, హైదరాబాద్: విదేశీ మద్యం బాటిళ్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పట్టుబడ్డ అధికారులను వదలిపెట్టా లంటూ ఏపీకి చెందిన మంత్రి ఒకరు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. ఈ అడ్డగోలు దందాలో పోలీసులకు చిక్కిన శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ సూపరింటెండెంట్ను వదలిపెట్టాలని, అతడు తనకు మంచి మిత్రుడని చెబుతూ సదరు మంత్రి.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు ఫోన్లో ‘గంట’కొట్టాడు. అయితే సబర్వాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సూపరింటెండెంట్ను వదిలిపెట్టేది లేదని, అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని ఆ అమాత్యుడికి స్పష్టంచేశారు. దీంతో చేసేదేమి లేక ఆ మంత్రి తెలంగాణలోని పలువురు ప్రముఖులతో అకున్ సబర్వాల్కు ఫోన్ల మీద ఫోన్లు చేయించినట్టు తెలుస్తోంది. అరెస్టయిన కస్టమ్స్ అధికారులు అమాత్యుడికి సైతం ప్రతీనెల విదేశీ మద్యం బాటిళ్లను సరఫరా చేస్తారని ఎక్సైజ్ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. అందుకే పదే పదే ఫోన్లు చేసి వారిని వదిలి వేయాలని ఒత్తిడి తెచ్చాడని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పాస్పోర్టులను కొందరు కస్టమ్స్ అధికారులు స్కాన్ చేసి.. కస్టమ్స్ ఔట్లెట్ లిక్కర్ను పక్క దారిపట్టిస్తున్నారు. వారు బ్రోకర్లతో కలసి నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్లో బడాబాబులకు విదేశీ లిక్కర్ బాటిళ్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్టు అకున్ సబర్వాల్ తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఎక్సైజ్కు భారీగా నష్టం వస్తోందని, ప్రతీ ఏటా రూ.45 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు ఆయన చెప్పారు. -
విదేశీ చెల్లింపుల్లో రూ.2200 కోట్ల అక్రమాలు
న్యూఢిల్లీ: విదేశీ చెల్లింపుల్లో రూ.2200 కోట్ల అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుని రూ.24.34 కోట్ల విలువ జేసే బిల్లులకు గాను రూ.2200 కోట్లు చెల్లింపులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు స్టెల్కోన్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్(ఎస్ఐపీఎల్)తో పాటు మరో 12 కంపెనీలపై కేసు నమోదు చేశారు. 2015–16 సంవత్సరంలో మోసపూరితంగా వస్తువులను దిగుమతి చేసుకోవడమే కాక.. పెద్దమొత్తంలో అక్రమ చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కంపెనీల బ్యాంకు ఖాతాలన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంకులోనే ఉన్నాయని.. వాటి నుంచే లావాదేవీలు జరిగినట్లు ఆరోపించింది. 25 బిల్లులకుగాను రూ.3.14 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కేవలం ఆరు బిల్లులకే రూ.680.12 కోట్లు చెల్లించారని వివరించింది. ఎస్ఐపీఎల్ చట్టవిరుద్ధంగా ఈ లావాదేవీలు జరిపినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అదేవిధంగా మిగతా కంపెనీలు కూడా రూ.1572.7 కోట్ల మేర అక్రమాలకు పాల్పడడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
అథ్లెటిక్స్లో విదేశీ కోచ్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సత్తా చాటేందుకు అథ్లెటిక్స్ విభాగంలో విదేశీ కోచ్ల నియామకానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రేస్వాకింగ్, 400మీ. పరుగు, 400మీ.రిలే విభాగాలకు విదేశీ కోచ్లతో పాటు సహాయక సిబ్బందిని నియమించారు. ఆస్ట్రేలియాకు చెందిన డేవ్ స్మిత్ రేస్ వాకింగ్ ఈవెంట్కు, గలీనా పి బుఖరీనా (అమెరికా) 400మీ. పరుగు విభాగాలకు కోచ్లుగా వ్యవహరిస్తారు. -
గత 12 ఏళ్లలో తొలిసారిగా...
కాలిఫోర్నియా వర్సిటికీ తగ్గిన విదేశీ దరఖాస్తులు శాన్ఫ్రాన్సిస్కో: గత 12 ఏళ్లలో తొలిసారిగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అంతకుముందు దాదాపు దశాబ్దకాలం పాటు ఈ యూనివర్సిటీకి వచ్చే విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్యలో ప్రతి ఏడాది సగటున 21 శాతం వృద్ధి నమోదయ్యేది. ఈ విశ్వవిద్యాలయంలో 2017లో కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబరుతో ముగిసింది. ఆ నెలలోనే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తెలిసిందే. అత్యధికంగా మెక్సికో నుంచి వచ్చే దరఖాస్తుల్లో 30 శాతం తగ్గిపోగా, ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండే దేశాల నుంచి ఈసారి 10 శాతం తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. -
విదేశీ మద్యంపై భారీగా పన్నుల బాదుడు
-
మద్యంతో ముంచేద్దాం..!
⇒ ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం పెంపుపై సర్కారు దృష్టి ⇒ మద్యం ధరలు, దుకాణాల సంఖ్య పెంచే యోచన ⇒ విదేశీ మద్యంపై భారీగా పన్నుల బాదుడు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది మద్యం పొంగి పొర్లనుంది. మద్యం ద్వారా ఏకంగా రూ.20 వేల కోట్లు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడున్న మద్యం దుకాణాల సంఖ్యను పెంచటంతో పాటు మద్యం రేట్లు, లైసెన్సు ఫీజులు, మద్యం అమ్మకాలపై పన్నుల మోత మోగించేందుకు నడుం బిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలతో రాష్ట్ర ఖజానాకు రూ.13 వేల కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త బడ్జెట్లో ఈ అంచనాలను అమాంతం 50 శాతానికి పైగా పెం చింది. అదనంగా రూ.7 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని నిర్ణయించడం గమనార్హం. భారీగా పెరగనున్న దుకాణాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం 2,144 మద్యం దుకాణాలు న్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో వీటి లైసెన్స్ గడువు ముగియనుంది. ఆశించిన ఆదాయం రాబట్టా లంటే లైసెన్సు ఫీజులను పెంచడంతోపాటు ఇప్పు డున్న దుకాణాల సంఖ్యనూ పెంచాలని సర్కారు యోచిస్తోంది. విదేశీ మద్యం ద్వారా వీలైనంత ఎక్కు వ ఆదాయం సంపాదించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ మద్యం ద్వారా రూ.4,447 కోట్ల ఆదాయం సమకూరనుంది. విదేశీ మద్యం విక్రయాలను విస్తరించటంతో పాటు అదనపు ఫీజుల ను పెంచాలని సర్కారు నిర్ణయించింది. అందుకే విదేశీ మద్యం ద్వారా రూ.8,201 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంది. ఎక్సైజ్ ఆదాయమే పెద్ద దిక్కు అమ్మకపు పన్ను తర్వాత ఖజానాకు ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయమే పెద్ద దిక్కు. ఎక్సైజ్ డ్యూటీ, లీజు, లైసెన్సు ఫీజు, ఎక్సైజ్ వ్యాట్, ప్రివిలేజ్ ఫీజు ఇవన్నీ ఈ పద్దులో ఉంటాయి. మద్యం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్ డ్యూటీని ఈసారి గణనీయంగా పెంచే అవ కాశం ఉంది. తద్వారా మద్యం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై 70 నుంచి 180 శాతం వరకు వ్యాట్ విధిస్తుండగా, ప్రీమియం, ఫారిన్ లిక్కర్పై వ్యాట్ను మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీటితో పాటు లైసెన్సు ఫీజులు ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన సంవత్సరానికి రూ.40 లక్షల నుంచి రూ.1.08 లక్షల వరకు వివిధ స్లాబుల్లో ఉన్నాయి. వీటిని సవరించాలని నిర్ణయిం చింది. ప్రస్తుతం 13 వేల జనాభాకి ఓ మద్యం దుకా ణం ఉండగా, వీటిని విస్తరించే అవకాశాలున్నాయి. బార్ల లైసెన్సులను నగర పంచాయతీల నుంచి మం డల స్థాయి వరకు విస్తరించాలని యోచిస్తోంది. సుప్రీం ఆదేశాలతో వ్యాపారుల బెంబేలు.. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 తర్వాత రహదారులకు ఆనుకుని మద్యం అమ్మకాలు ఉండరాదని స్పష్టం చేసింది. దీంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రహదారులకు దూరంగా వెళితే వ్యాపారాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం సైతం తగ్గిపోతుంది. -
తొలి భారత క్రికెటర్గా యూసఫ్ !
వడోదరా:ఒక విదేశీ లీగ్ లో ట్వంటీ 20 లీగ్ లో ఆడేందుకు భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఒప్పందం చేసుకున్నాడు. తద్వారా ఒక విదేశీ లీగ్ లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసఫ్..తన ఫామ్ ను మరింత మెరుగుపరుచునే క్రమంలో విదేశీ లీగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వచ్చే నెల 8 వ తేదీన ఆరంభమయ్యే ఈ లీగ్ లో తాను పాల్గొనబోతున్న విషయాన్ని యూసఫ్ స్వయంగా వెల్లడించాడు. 'హాంకాంగ్ ట్వంటీ 20 లో పాల్గొనేందుకు సంతకం చేశా. ఆ లీగ్ లో చాలా మంది ప్రముఖ క్రీడాకారులు ఆడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నా. దాంతో ఆ లీగ్ తో ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వెళ్లా. ఇలా ఒక విదేశీ లీగ్ తో ఒప్పందం చేసుకోవడానికి ఐపీఎల్లే ప్రధాన కారణం. ఐపీఎల్ కు మంచి ప్రాక్టీస్ లభిస్తుందనే ఉద్దేశంతోనే విదేశీ లీగ్ తో ఒప్పందం చేసుకున్నా' అని యూసఫ్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఈ లీగ్ లో పాల్గొనడం తన దేశవాళీ కెరీర్ పై ఎటువంటి ప్రభావం చూపదని యూసఫ్ పేర్కొన్నాడు. దాదాపు ఐదేళ్ల క్రితం భారత తరపున యూసఫ్ ఆడాడు. 2012లో చివరిసారి భారత్ కు యూసఫ్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయిన యూసఫ్..కేవలం దేశవాళీ టోర్నీలకు మాత్రమే పరిమితమయ్యాడు. -
హైదరాబాద్లో విదేశీ భవన్
• కేంద్రానికి సీఎం కేసీఆర్ ప్రతిపాదన • సానుకూలంగా స్పందించిన విదేశాంగ శాఖ కార్యదర్శి మూలే • విదేశాలకు వెళ్లేవారి సంక్షేమానికి ఉమ్మడి విధానం ఉండాలి: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలకు సేవలందించేందుకోసం హైద రాబాద్లో విదేశీ భవన్ నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు విదేశాంగ శాఖ కార్యదర్శి దానేశ్వర్ మూలే సానుకూలంగా స్పందించారు. హైదరా బాద్లో విదేశీ భవన్ను నిర్మిస్తామని ప్రకటిం చారు. శనివారం ప్రగతి భవన్లో కేసీఆర్తో దానేశ్వర్ మూలే సమావేశమయ్యారు. విదేశా లకు వెళ్లి మోసపోయేవారి విషయంలో, ఆపదల్లో చిక్కుకున్న వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి సాయం అందించేలా తీసుకోవాల్సిన చర్యలపై వారు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. విద్య, ఉద్యో గ, ఉపాధి అవకాశాల కోసం అన్ని రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణ రూపొం దించి, అమలు చేయాల్సిన అవసరముం దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విదేశీ భవన్ ఎందుకంటే... ‘‘తెలంగాణ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు విదేశాలకు వెళ్తున్నారు. వారికి అనేక విష యాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సార్లు మోసాలు, ప్రమాదాలు, కిడ్నాప్లకు గురవుతున్నారు. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వారందరికీ తగిన సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. విదేశీ పెట్టుబడులు, సెజ్లకు అనుమతులు ఇస్తు న్నందున పెద్ద ఎత్తున విదేశీ పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు దేశానికి వస్తున్నారు. వారికి కూడా తగిన విధంగా ప్రభుత్వం సహకరించాలి. అందుకోసం విదేశీ రాయ బార కార్యాలయాలను బలోపేతం చేయాలి. రాష్ట్రాల రాజధానుల్లో కూడా విదేశీ భవన్లు నిర్మించాలి. తెలంగాణలో విదేశీ భవన్కు స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో విదేశీ వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ అధికారులకు తగిన సహకారం అందిస్తామ న్నారు. మంత్రి కేటీఆర్, ఇతర అధికారులతో తదుపరి కార్యాచరణపై చర్చలు జరపాలని కేంద్ర అధికారులకు సూచించారు. విస్తృతం కావాలి... ‘‘భారతదేశం గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగు తోంది. ఆరో∙అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ విదేశాలతో మంచి సంబంధాలు నెరుపుతోంది. ఎగుమతులు, దిగుమతులూ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రాధాన్యం కూడా బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాఖ కార్యకలాపాలు కూడా పెరగాలి. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారికి, విద్య కోసం వివిధ దేశాలకు వెళ్లే వారికి తగిన అవగాహన కల్పిం చాలి. ప్రభుత్వమే మార్గదర్శకం చేసే విధంగా ఉంటే, మోసాలు తగ్గుతాయి’’అని సిఎం చెప్పారు. పదిహేనేళ్లుగా భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాలతో సంబంధాలను మెరుగు పర్చుకుంటు న్నాయని మూలే అన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖను బలోపేతం చేస్తోందని వివరించారు. వరంగల్లో పాస్పోర్టు కార్యాలయం: మూలే వరంగల్ నగరంలో పాస్పోర్టు సేవా కేంద్రం నెలకొల్పుతామని దానేశ్వర్ మూలే ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మూలే, ఈ మేరకు హామీ ఇచ్చారు. పాస్ పోర్టు కేంద్రం ఏర్పాటుకు వరంగల్లో అవసరమైన స్థలం కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పాస్పోర్టుల జారీలో జాప్యాన్ని నివారిస్తామని మూలే వెల్లడించారు. అత్యంత వేగంగా పాస్పోర్టులను జారీ చేసే రాష్ట్రంగా రికార్డు సృష్టించిన తెలంగాణ దేశానికే ఆదర్శమని మూలే ప్రశంసించారు. ఈ సమావేశంలో రీజనల్ పాస్పోర్టు అధికారి అశ్వని, తెలంగాణలో విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి విష్ణు, సీఎంఓ అధికారులు నర్సింగ రావు, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెన్నై కేంద్రంగా విదేశీమద్యం రవాణా
జిల్లాలో జోరుగా విక్రయాలు నెల్లూరు (క్రైమ్) : చెన్నై కేంద్రంగా విదేశీ మద్యం జిల్లాకు గుట్టు చప్పుడు కాకుండా రవాణా జరుగుతుంది. రైళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా లక్షలాది రూపాయల విదేశీ మద్యం జిల్లాకు చేరుతుంది. జిల్లాకు చెందిన కొందరు ఈ వ్యాపారాన్ని చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. చెన్నైలోని బర్మాబజార్లో కొన్ని కస్టమ్స్ షాపుల్లో అనధికారికంగా విదేశీ మద్యంను విక్రయిస్తున్నారు. నెల్లూరు నుంచి చెన్నైకు వెళ్లే సీజన్బాయిస్ కస్టమ్స్ షాపుల్లో విదేశీ మద్యం(జానీవాకర్, గ్లాండ్ఫిచ్, హెన్నీస్సీ రెడ్వైన్, కూట్టిసార్ప్ బ్లెండెండ్ స్కాట్చ్ తదితరాల)ను కొనుగోలు చేసి అధిక ధరలకు జిల్లాలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ బేవరేజస్లో జానీవాకర్ రెడ్లేబుల్ (750 ఎంఎల్) ఫుల్బాటిల్ రూ 2,145 ఉండగా అదే కంపెనీకి చెందిన లీటర్ బాటిల్ (12 ఏళ్ల పురాతనం) బర్మాబజార్లో రూ.1520లకే, జానీవాకర్ డబుల్బ్లాక్ రూ.4, 225 ఉండగా రూ.3,500కు, జానీవాకర్ బ్లాక్లేబుల్ రూ.4,290 ఉండగా రూ.3,525కు లభ్యమవుతున్నాయి. వాటిని తీసుకువచ్చి జిల్లాలో ఒక్కో బాటిల్పై రూ.500 నుంచి రూ.700 వరకు లాభంతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అతి తక్కువ ధరకే విదేశీ మద్యం అందుబాటులోకి వస్తుండటంతో మందుబాబులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. జానీవాకర్ బ్రాండ్ 12 ఏళ్ల పురాతనమైనది కావడంతో కొనుగోళ్లు మరింతగా పెరుగుతున్నాయి. నెల్లూరుకు చెందిన కొందరు సీజనల్ బాయిస్ ప్రతి రోజు రైళ్లు, ప్రైవేటు ట్రావెల్స్ల్లో విదేశీ మద్యం బాటిళ్లను నెల్లూరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. నెల్లూరులోని పలు కస్టమ్స్ షాపుల్లో సైతం విదేశీ మద్యం అందుబాటులో ఉంచి గోప్యంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. మరికొందరు గోవా, పాండిచ్చేరి నుంచి పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు డిఫెన్స్కు సంబంధించిన మద్యం బాటిళ్లను సైతం విక్రయిస్తున్నారు. డిఫెన్స్లో 50 శాతం తక్కువకే మద్యం దొరుకుతుంది. దీంతో వాటిని తమకు తెలిసిన వారి ద్వారా కొనుగోలు చేయించి బయట అధిక శాతం ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోది. పెద్ద మొత్తంలో విదేశీ మద్యం సరిహద్దు దాటి జిల్లాకు వస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అధికారుల తనిఖీల ఊసే లేకపోవడంతో జిల్లాలో విచ్చలవిడిగా విదేశీ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇతర జిల్లాలకు సైతం జిల్లా మీదుగానే విదేశీ మద్యం తరలుతుందని రెండురోజుల కిందట తడ చెక్పోస్టు వద్ద వాణిజ్య పన్నులశాఖ దాడుల్లో బహిర్గతమైంది. ఇప్పటికైనా ఎక్సైజ్శాఖ అధికారులు కళ్తు తెరిచి దాడులు నిర్వహిస్తే పెద్ద ఎత్తున్న విదేశీమద్యం దొరికే అవకాశం ఉంది. -
17,500కోట్ల విదేశీ అప్పునకు చాన్సివ్వండి
కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాయం కింద ఏడాదికి రూ.3,500 కోట్ల చొప్పున వచ్చే ఐదేళ్లలో రూ.17,500 కోట్ల మేర విదేశీ అప్పునకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అంతేగాక కేంద్ర సాయంతో నిమిత్తం లేకుండా నూటికి నూరు శాతం రాష్ట్రప్రభుత్వమే తీర్చుకునేలా మరో రూ.21,034 కోట్ల విలువగల ప్రాజెక్టులకోసం విదేశీ అప్పునకు అనుమతించాలని విన్నవించింది. మొత్తం రూ.32,573 కోట్ల మేర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పు పొందేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు అనుమతించాలని కోరింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు రెండు రోజులక్రితం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలోనే సీఎం ఈ లేఖ రాశారు. -
వాతావరణ కేంద్ర కంప్యూటర్లు హ్యాక్
కాన్ బెర్రా: ఆస్ట్రేలియా జాతీయ వాతావరణ బ్యూరో కంప్యూటర్లను అంతర్జాతీయ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్(ఏసీఎస్సీ) అధికారికంగా బుధవారం ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్య సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు. గత ఏడాది కూడా వాతావరణ కేంద్ర కంప్యూటర్లు హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే. అయితే, హ్యాకింగ్ కు గల కారణాలు తెలియరాలేదు. కేవలం నష్టం కలిగించడానికి మాత్రమే హ్యాకర్లు ఈ పని చేసుంటారని నిపుణులు అంటున్నారు. ఏసీఎస్సీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వాతావరణ కేంద్రంలో గల రెండు కంప్యూటర్లలోకి వైరస్ చొరబడినట్లు గుర్తించామని చెప్పారు. పరిశీలించి చూడగా అంతర్జాతీయ హ్యాకర్లు ఉపయోగించే రిమోట్ యాక్సెస్ టూల్(ఆర్ఏటీ)గా తేలిందని వెల్లడించారు. ఈ టూల్ ను ఉపయోగించే గతంలో కొన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వ కంపూటర్లను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు యత్నించారని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో 1,095సార్లు ప్రభుత్వ కంప్యూటర్లపై హ్యాకర్లు దాడులు చేశారని పేర్కొన్నారు. కాగా, గతంలో ఆస్ట్రేలియా అధికారులు హ్యాకింగ్ పై చైనాను దూషించిన విషయం తెలిసిందే. -
మయన్మార్లోకి ఎస్బీఐ ఎంట్రీ
యంగూన్: భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మయన్మార్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. రాజధాని యంగూన్లో తన మొట్టమొదటి బ్రాంచీని ప్రారంభించింది. దీనితో మయన్మార్లో శాఖను ప్రారంభించిన మొట్టమొదటి దేశీయ బ్యాంక్గా ఎస్బీఐ నిలిచింది. ఎస్బీఐకి ఇది 54వ విదేశీ బ్రాంచ్. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య బ్రాంచీని ప్రారంభించినట్లు సోమవారం ఇక్కడ విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. 198 కార్యాలయాల ద్వారా 37 దేశాల్లో ఎస్బీఐ ప్రస్తుతం సేవలు నిర్వహిస్తోంది. -
కదిరిలో గల్ఫ్ ఏజెంట్ల ఘరానా మోసం
కదిరి : అనంతపురం జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట ప్రజలను గల్ఫ్కు తరలించి అక్కడ ఏజెంట్లకు అమ్మేసిన ఘటన చోటుచేసుకుంది. కదిరికి చెందిన గల్ఫ్ ఏజెంట్లు నలుగురు మహిళలు సహా ఐదుగురిని సౌదీఅరేబియాలోని ఏజెంట్లకు విక్రయించారు. మోసపోయామని గుర్తించిన బాధితులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు కదిరి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్కార్ ఎంట్రీకి తమిళ సినిమా
జాతీయ అవార్డును గెలుచుకున్న తమిళ చిత్రం ’విరసణై’ ఆస్కార్ ఎంట్రీకి అవకాశం దక్కించుకుంది. భారతదేశం నుంచి 'ఉత్తమ విదేశీ భాషా చిత్రం' కేటగిరీలో ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 29 చిత్రాలు పోటీ పడగా, చివరకు విసరణై బరిలో నిలిచింది. ఈ మేరకు ఎఫ్ఎఫ్ఐ చైర్మన్ కేతన్ మెహతా ధ్రువీకరించారు. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలను భావోద్వేగాలతో తెరకెక్కిస్తాడనే పేరున్న తమిళ దర్శకుడు వెట్రిమాన్ రూపొందించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు జాతీయ అవార్డులను అందుకుంది. ఖాకీల కర్కశత్వాన్ని ప్రధానంగా చూపించిన 'విసరణై'.. ఎం.చంద్రకుమార్ నవల 'లాకప్' ఆధారంగా తెరకెక్కింది. థియేటర్లలో విడుదల కాకాముందే 72వ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. కాగా 89 వ ఆస్కార్ అవార్డు వేడుకలు 2017 ఫిబ్రవరిలో లాస్ ఏంజెలెస్లో జరుగనున్నాయి. -
తెలివితేటలు పెరగాలంటే మాత్రం..!
మాతృభాషపై ఎంత ప్రేమ ఉన్నా సరేగానీ, విదేశీ భాషలను నేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. విదేశీ భాషలు నేర్చుకున్న వారిలో తెలివి తేటలు మెరుగవుతాయని, నేర్చుకునే భాషల సంఖ్య పెరిగేకొద్దీ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ప్రాక్టికల్ గా తేలింది. యూరీ స్టైరోవ్ నేతృత్వంలోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీకి చెందిన రీసెర్చర్స్ బృందం విదేశీ భాషలపై బాగా అవగాహన ఉన్న 22 మంది(10 మంది బాలురు, 12 మంది బాలికలు) విద్యార్థులను ప్రశ్నించి, పరిశీలించి కొన్ని విషయాలను గుర్తించారు. వారి మాతృభాష పదాలు, విదేశీ భాషల పదాలను ప్లే చేసి ఎక్కువ భాషలు తెలిసిన విద్యార్థుల మెదడు పనితీరు చాలా వేగంగా ఉందని వెల్లడించారు. అధిక భాషలపై అవగాహన ఉన్న విద్యార్థులలో చురుకుదనం ఎక్కువగా ఉండి ఎక్కువ విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం ఉంటుందని ఎలక్ట్రాన్ సెఫలోగ్రఫీ(ఈఈజీ) ద్వారా హెల్సింకీ వర్సిటీ బృందం ప్రాక్టియల్ గా వివరించింది. -
భారీగా తగ్గిన భారత్ కంపెనీల విదేశీ రుణ సమీకరణ
ముంబై: భారత్ కంపెనీల విదేశీ రుణ సేకరణ ఈ ఏడాది జూలైలో గణనీయంగా 44 శాతం తగ్గింది. 2015 జూలైలో ఈ రుణ సమీకరణ పరిమాణం 2.14 బిలియన్ డాలర్లుకాగా, 2016 జూలైలో ఈ మొత్తం 1.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇందులో 183.7 మిలియన్లు అప్రూవల్ రూట్లో వచ్చాయి. 1.02 బిలియన్ డాలర్లు ఆటోమేటిక్ చానెల్లో వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అప్రూవల్ రూట్లో టికోనా డిజిటల్ నెట్స్వర్క్స్ 171 మిలియన్ డాలర్లు సమీకరించింది. విజయవాడ టోల్వే విషయంలో ఈ మొత్తం 11.07 మిలియన్ డాలర్లుగా ఉంది. ఆటోమేటిక్ రూట్లో రుణాలు తెచ్చుకున్న సంస్థల్లో హెచ్డీఎఫ్సీ (446 మిలియన్ డాలర్లు), గ్లెన్మార్క్ ఫార్మా (200 మిలియన్ డాలర్లు), అదానీ ట్రాన్స్మిషన్ (74 మిలియన్ డాలర్లు), బిర్లా కార్పొరేషన్ (40 మిలియన్ డాలర్లు), సీమన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (37 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. -
విదేశీ కొంగ
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారు నీటి కుంటలో విదేశీ కొంగ ప్రత్యక్షమైంది. స్థానిక వేటగాళ్లు ఈ కొంగను పట్టుకుని గురువారం గ్రామానికి తీసుకొచ్చారు. సర్పంచ్ జైడి రాజవ్వ రాజేశ్వర్ పోలీసులకు సమాచారం అందించగా స్వాధీనం చేసుకున్నారు. -
'బాహుబలి'ని మించిన పెళ్లి!!
• కోట్లకు కోట్ల బడ్జెట్తో వివాహాలు... • విదేశీ బీచ్లకు జెట్లలో అతిథులు • కార్డులతో పాటు ఖరీదైన బహుమతులు • 10 నిమిషాల మూడీకి రూ.12 లక్షలు • ఏటా రూ.2.4 లక్షల కోట్లకు వెడ్డింగ్ మార్కెట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పెళ్లంటే ...!! పెళ్లికార్డులు, షాపింగ్, బాజా భజంత్రీలు, మండపం, బంధుమిత్రుల హడావుడి... ఇవన్నీ కలుస్తాయి. ఇంకో రకంగా చెప్పాలంటే..!! పెళ్లంటే దాదాపు 2.4 లక్షల కోట్ల మార్కెట్. ‘బాహుబలి’ బడ్జెట్నూ మించిపోతున్న ఈ పెళ్లి వేడుకలకిపుడు కార్పొరేట్ లుక్ వచ్చేసింది. కార్యక్రమ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకునే వెడ్డింగ్ ప్లానర్లు మొదలు కెమెరాలను చేతపట్టుకుని వేడుకను క్లిక్మనిపించే ఫోటోగ్రాఫర్ల వరకు అంతా కార్పొరేట్ మయమైంది. ఫలితం... స్టార్ హోటళ్లే కాక విదేశాల్లోనూ బాజాభజంత్రీలు మోగుతున్నాయి. విలువైన బహుమతులతో కూడిన ఖరీదైన వెడ్డింగ్ కార్డ్స్, ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులు, వేడుకకు హాజరయ్యేందుకు ప్రత్యేక జెట్ విమానాలు, సెలబ్రిటీల ఆటా పాటా, విదేశీ వంటకాలు, వెడ్డింగ్ మూవీస్.. ఇలా బడ్జెట్ను బట్టి సౌకర్యాలందించడానికి వేల కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటి విశేషాలే ఈ కథనం.. రూ.2,40,000 కోట్ల వెడ్డింగ్ మార్కెట్ దేశంలో ఏటా దాదాపు కోటి పెళ్లిళ్లు జరుగుతున్నాయని అంచనా. ఈ వివాహాలకు అవుతున్న ఖర్చు ఎంతకాదన్నా రూ.2.4 లక్షల కోట్ల పైమాటేనట. అందుకే ఇపుడు లక్షల మంది ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ వేడుకలు అతిథులకు మర్చిపోలేని అనుభవాన్ని కలిగిస్తున్నట్లు ‘వెడ్డింగ్ వోస్’ మ్యాగజైన్ ఎండీ దక్షిణామూర్తి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. వెడ్డింగ్ ఇండస్ట్రీ భారత్లో ఏటా 25-30 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నారు. అలల సాక్షిగా బీచ్లూ వేదికలే.. రిచ్ లుక్ కోరుకునే యువ జంటల తొలి ప్రాధాన్యం స్టార్ హోటళ్లే. బంధువులకు, స్నేహితులకు మర్చిపోలేని జ్ఞాపకాలను ఇవ్వాలనుకునే వారికి బీచ్లు కొత్త వేదికలవుతున్నాయి. గోవా వంటి నగరాలే కాక బాలి, థాయ్లాండ్, సింగపూర్, మెక్సికో, హవాయ్, కోస్టారికా, కరీబియన్ దీవులు సైతం పాపులర్ డెస్టినేషన్స్ జాబితాలో చేరిపోయాయి. ప్రత్యేక విమానాల్లో అతిథులను తీసుకెళ్లి అలల సాక్షిగా ఒక్కటవ్వాలని యువ జంటలు కలలుగంటున్నాయి. క్యాబ్ల మాదిరిగా విమాన సర్వీసుల అగ్రిగేటర్ అయిన ‘జెట్సెట్గో’ దీనికోసం ప్రత్యేక ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఇక సెలబ్రిటీలతో ఆటాపాటా కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నాయి. ఇలాంటి పార్టీలకు సెలబ్రిటీలను అందించడానికి టాలీవుడ్ వేదికగా ‘జిల్మోర్.కామ్’ వంటి అగ్రిగేటర్లూ మొదలయ్యాయి. కళ్లారా చూసే అవకాశం.. భారతీయ పెళ్లి వేడుకల్ని చూడాలని తహతహలాడే విదేశీయుల కోసం ‘జాయిన్మైవెడ్డింగ్.కామ్’ పుట్టుకొచ్చింది. నిర్దేశిత చార్జీ చెల్లించి పేరు నమోదు చేసుకుంటే... మర్చిపోలేని పెళ్లి చూసేయొచ్చు. వచ్చిన మొత్తంలో కొంత వధూవరులకు చెల్లిస్తోంది ఈ కంపెనీ. ఇక జోటికస్ ప్రొడక్షన్స్ అయితే పెళ్లి తంతును ఏకంగా ఓ సినిమాగా తీసి పెడుతోంది. 10 నిమిషాల లోపు నిడివితో ఒక్కో థీమ్తో సినిమాలు చిత్రీకరిస్తోంది. దీనికి థీమ్నుబట్టి రూ.3.5 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా చార్జీ చేస్తోంది. ఇప్పటి వరకు 100 దాకా సినిమాలు చేసినట్టు జోటికస్ ఎండీ శ్రీ కౌండిన్య చెప్పారు. పెళ్లి సంబంధాలను కుదిర్చేందుకు షగున్ టీవీ హిందీలో 24 గంటల పాటూ కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. భాగ్యనగరిదీ ప్రత్యేక స్థానం.. ⇔ పెళ్లికి భారీగా ఖర్చు చేసే నగరాల్లో ఢిల్లీ, చండీగఢ్, ముంబై తర్వాతి స్థానం హైదరాబాద్ది. ⇔ ఆడంబరం విషయంలో పంజాబీ కుటుంబాలు ముందుంటున్నాయి. ⇔ హైదరాబాద్లో రూ.5 కోట్లు ఆపైన వెచ్చించే పెళ్లిళ్లు ఏటా 2,500 దాకా జరుగుతున్నాయి. ⇔ సల్మాన్ తన సోదరి పెళ్లిని హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో వైభవంగా జరిపించారు. ⇔ భాగ్యనగరిలో 200 మంది వెడ్డింగ్ డెకార్స్, 30 మంది ప్లానర్లు ఉన్నట్లు సమాచారం. ఆభరణాలకే అధికం.. వివాహ సమయంలో బంగారం, వజ్రాలతో చేసిన నగల అమ్మకాలు రూ.70,000 కోట్లు జరుగుతున్నాయట. దుస్తులు రూ.12,000 కోట్లు, మండపాల అలంకరణ రూ.50,000 కోట్లు, పెళ్లి పత్రికలు రూ.12,000 కోట్లు, మెహందీకి రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తున్నారట. బాజా భజంత్రీలకు రూ.5,000 కోట్లు, పూలకు రూ.10,000 కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఖరీదైన వెడ్డింగ్ కార్డుల తో పాటు విలువైన బహుమతినీ ముఖ్యులకిచ్చే ధోరణి పెరి గిందని ఫ్రెండ్స్ ఇన్విటేషన్స్ దక్షిణాది సేల్స్ హెడ్ నవీన్ రెడ్డి చెప్పారు. వ్యాపార బంధాల బలోపేతానికి ఈ వేడుక ఒక వేదికగా నిలుస్తోందన్నారు. గతేడాది కేరళకు చెందిన ఆర్పీ గ్రూప్ అధినేత రవి పిళ్లై తన కుమార్తె వివాహానికి రూ.50 కోట్లు ఖర్చు చేసి వార్తల్లోకెక్కారు. ఫిల్మ్ ఆర్ట్ డెరైక్టర్ సాబు సిరిల్ 75 రోజులు శ్రమించి 40,000 చదరపు అడుగుల్లో పెళ్లి వేదిక రూపొందించారు. 42 దేశాలకు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు అతిథులుగా విచ్చేశారు. -
తల్పగిరి రంగనాథుడిని దర్శించుకున్న విదేశీ భక్తులు
నెల్లూరు(బందావనం): నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీదేవి,భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామిని శనివారం విదేశీభక్తులు దర్శించుకున్నారు. ఇస్కాన్ దుబాయ్(దామోదర్ దేశ్) వర్కర్ క్యాంప్ కో–ఆర్డినేటర్ జగన్నాథదాస్ పర్యవేక్షణలో లండన్, కెనడా, బంగ్లాదేశ్, దుబాయ్కు చెందిన 96మంది, దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన మరో 50మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శించేందుకు విచ్చేశారు. ఇందులో భాగంగా నెల్లూరులో రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఫొటో -
16 సెన్సెక్స్ కంపెనీల్లో పెరిగిన విదేశీ వాటా
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఏప్రిల్-జూన్ కాలానికి 16 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాలను పెంచుకున్నారు. ప్రస్తుత విలువల ప్రకారం రూ.17,465 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే 13 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాను తగ్గించుకున్నారు. ఈ 13 కంపెనీల్లో రూ.14,389 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో సెన్సెక్స్ కంపెనీల్లో వీరి నికర పెట్టుబడులు రూ.3,076 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీలో అధికంగా (6.58 శాతం) వాటా కొనుగోలు చేశారు. ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్లో యాక్సిస్ బ్యాంక్లో 42.27 శాతంగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్ల వాటా ఈ ఏడాది జూన్ క్వార్టర్కు 45.81 శాతానికి పెరిగింది. -
విదేశీ జైల్లలో 6,567 మంది భారతీయులు
న్యూఢిల్లీ: వివిధ దేశాల్లో ఖైదీలుగా మగ్గుతున్న భారతీయుల వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పార్లమెంటులో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 75 దేశాల్లోని జైల్లలో 6,567 మంది భారతీయులు ఉన్నారు. అత్యధికంగా సౌదీ అరేబియా లో 1,896 మంది శిక్షను అనుభవిస్తున్నారు. అరబ్ దేశాల్లో 764 , నేపాల్లో 614, అమెరికాలో 595 , పాకిస్థాన్ లో 518, కువైట్ లో 325 , మలేషియా లో 293 , బహరేన్ లో 235, సింగపూర్ లో 147, చైనాలో 105, బంగ్లాదేశ్ లో 130 మంది మంది ఉన్నారు. 354 మంది శిక్ష పూర్తై స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని వీకే సింగ్ తెలిపారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరోప్రశ్నకు సమాధానంగా 261 మంది భారతీయ మత్సకారులు పాకిస్థాన్ జైల్లలో శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. భారతదేశం 42 దేశాలతో ఖైదీల సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఒప్పందం చేసుకుంది. -
విదేశీ పోస్టాఫీసుల ద్వారా స్మగ్లింగ్!
న్యూఢిల్లీ: ఇటీవల క్రమంగా విదేశీ పోస్టాఫీసుల ద్వారా తుపాకులు, పిస్టల్స్, సిగరెట్లు, మెమరీ కార్డులు అక్రమ రవాణా జరుగుతుండడంతో కస్టమ్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని నెలలుగా 50 తుపాకులు, పిస్టల్స్, కాట్రిడ్జ్లను ఢిల్లీ విదేశీ పోస్టాఫీసు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ కస్టమ్ అధికారి చెప్పారు. నిబంధనల ప్రకారం జాతీయ, రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్ నుంచి లెసైన్స్ కలిగిన వారు మాత్రమే తుపాకులు దిగుమతి చేసుకోవాలన్నారు. ఈ పార్సిళ్లు హాంకాంగ్ నుంచి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
విదేశీ ఉద్యోగం పేరుతో మోసం
మిర్యాలగూడ: మలేసియాలో హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగిని ఓ వ్యక్తి నిండా ముంచాడు. దీనిపై బాధిత నిరుద్యోగి మిర్యాలగూడ డీఎస్పీ సందీప్గోనెకు శనివారం ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన సీహెచ్ పృథ్వీ (20) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. కృష్ణా జిల్లాకు చెందిన గంప గణేష్ అనే వ్యక్తి మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పృథ్వీ నుంచి రూ.1.60 లక్షలు తీసుకున్నాడు. విజిటింగ్ వీసాపై అక్కడికి పంపించాడు. మూడు నెలల పాటు నానా కష్టాలు పడి, రూ.లక్ష వరకు ఖర్చు పెట్టుకుని తాను తిరిగి వచ్చానని బాధితుడు పృథ్వీ పేర్కొన్నాడు. నిందితుడు గంప గణేష్ కృష్ణా జిల్లాకు చెందిన మరో ఐదుగురిని కూడా ఇలానే మోసగించాడని తెలిపాడు. -
రెహమాన్కి గ్రాండ్ ప్రైజ్
‘రోజా’ నుంచి ప్రస్తుతం చేస్తున్న ‘2.0’ వరకూ ఎ.ఆర్. రెహమాన్ తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్... ఇలా అన్ని భాషలవారికీ వీనుల విందైన పాటలిచ్చారు. ఈ సంగీత సంచలనం పలు దేశీ అవార్డులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్పుకునే ఆస్కార్, గ్రామీ వంటి ప్రతిష్ఠాత్మక విదేశీ అవార్డులు కూడా అందుకున్నారు. తాజాగా, మరో అరుదైన అవార్డుని సొంతం చేసుకున్నారు. జపాన్ ప్రభుత్వం అందించే గ్రాండ్ ఫ్యూకూవోకా అవార్డు రెహమాన్ని వరించింది. తన సంగీతం ద్వారా ఆసియా దేశాల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినందుకు రెహమాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఈ అవార్డును అందుకున్న భారతీయుల్లో సితార్ విద్వాంసులు పండిట్ రవిశంకర్, నర్తకి పద్మా సుబ్రహ్మణ్యం, సరోద్ విద్వాంసులు అంజాద్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. మామూలుగా ఫ్యుకూవోకా అవార్డుకి మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి గ్రాండ్ ప్రైజ్, రెండోది అకాడమిక్ ప్రైజ్, మూడోది కల్చర్ ప్రైజ్. మన రెహమాన్కి వచ్చింది గ్రాండ్ ప్రైజ్. -
నేరాలకు కేరాఫ్ తాడేపల్లి.
► వరుస కిడ్నాప్లతో కలకలం ► శ్రీమంతులే టార్గెట్ ► చేసేది..చేయించేది.. సెటిల్ చేసేది.. ► అంతా వారే! తాడేపల్లి రూరల్ : శ్రీమంతులు... విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లల తల్లిదండ్రులే టార్గెట్గా తాడేపల్లి ప్రాంతంలో కిడ్నాప్లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నేరస్తులు రూటు మార్చి సినీ ఫక్కీలో పక్కాగా ప్లాన్ చేసి, గుట్టు చప్పుడు కాకుండా ‘టార్గెట్’లను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి వారి నుంచి లక్షలాది రూపాయలు గుంజుకుంటున్నారు. గత వారంలో వరుసగా తాడేపల్లిలో రెండు కిడ్నాప్లు, ఒక దోపిడీ జరిగాయి. ఇందులో దోపిడీ ఘటన మాత్రమే వెలుగు చూసింది. కిడ్నాప్ విషయాలు మాత్రం బయటకు రాలేదు. కిడ్నాప్ విషయాలు ఆ నోటా ఈ నోటా పోలీసుల చెవినబడ్డాయి. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు ఆదివారం సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాడేపల్లి మునిసిపల్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ బిల్డర్ ఇంటికి వెళుతుండగా అతడిని కారులో ఎక్కించుకుని, కిడ్నాప్ చేసి ఏటీఎం కార్డు, కొంత నగదు దోచుకెళ్లారు. మరుసటి రోజు కుంచనపల్లికి చెందిన ఓ శ్రీమంతుడిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలలో కారులో తిప్పుతూ చిత్రహింసకు గురి చేశారు. అదే సమయంలో కిడ్నాప్ అయిన వ్యక్తికి కిడ్నాప్ చేయించిన వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని సమాచారం అడుగుతాడు. కిడ్నాప్ అయిన వ్యక్తి నుంచి విషయాలు తెలుసుకున్నట్టు నటించి, కిడ్నాపర్స్తో ఫోన్లో మాట్లాడి, వారు అడిగిన డబ్బులు ఇస్తానంటూ అతనే ఆ డబ్బు తెస్తాడు. ఆ డబ్బును కిడ్నాపర్లకు అందజేసి, అనంతరం కిడ్నాప్ అయిన వ్యక్తి నుంచి వసూలు చేసుకుంటాడు. నగదు వసూలు ఇలా.. ఇలా జరిగిన కిడ్నాప్లో కుంచనపల్లికి చెందిన ఓ శ్రీమంతుడి వద్ద ఎనిమిది లక్షలు వసూలు చేశారు. సదరు కిడ్నాప్ అయిన వ్యక్తి దగ్గర ఈ నెల 21న రూ. లక్ష, 23న రూ. 3 లక్షలు, 25న రూ. 4.5 లక్షలు వసూలు చేశారు. దీనిలో కూడా కిడ్నాపర్స్తో మాట్లాడినందుకు రూ. 50 వేలు అంటూ అదనంగా నగదు వసూలు చేశాడు. ఈ కిడ్నాప్లు చేస్తున్నది తాడేపల్లికి చెందిన మాజీ నేరస్తుడిగా పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆ పాత నేరస్తుడు తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేకాట, కోడిపందేలు నిర్వహించడంతో ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటనేది తెలిసిన వ్యక్తి. వారిని కిడ్నాప్ చేస్తే ఎంత డబ్బు వసూలు చేయవచ్చు, ప్రాణభయం ఉన్నవారిని మాత్రమే ఎంచుకుని ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో మహానాడు ప్రాంతానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లు ఉన్నట్టు సమాచారం. అసలు సూత్రధారి పరారీ ఉండి, అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
ఆయనకు అరవై... ఆమెకు ఇరవై అయిదు... కెమిస్ట్రీ అదుర్స్!
ముగిసిన కాన్స్ చలన చిత్రోత్సవాలు ఉత్తమ చిత్రం: ‘ఐ, డేనియల్ బ్లేక్ ఉత్తమ దర్శకుడు: ఒలీవియర్ అసయస్ ఉత్తమ నటుడు : షాహెబ్ హొస్సేని ఉత్తమ నటి: జాక్లెన్ జోస్ ఫ్రాన్స్ నగరంలోని ఫ్రెంచ్ రివెరియా తీరంలో ఈ నెల 11న ఆరంభమైన కాన్స్ చలన చిత్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. విదేశీ తారలతో పాటు మన దేశీ తారలు కూడా పాల్గొన్న ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ని ఆకట్టుకున్నాయి. అవార్డు విజేతల వదనాల్లో ఆనందం వెల్లివిరిసింది. రెడ్ కార్పెట్ పై తారలు చేసిన సందడికి కొదవ లేకుండా పోయింది. మొత్తం మీద ముగింపు ఉత్సవాలు కనువిందుగా జరిగాయి. కొన్ని మెరుపులూ, విరుపులూ ఈ విధంగా... ♦ ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘పామ్ డ ఓర్’ (గోల్డెన్ పామ్) అవార్డు ‘ఐ, డేనియల్ బ్లేక్’ చిత్రాన్ని వరించింది. కెన్ లోచ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. పదేళ్ల క్రితం ఇదే దర్శకుడు తీసిన ‘ద విండ్ దట్ షేక్స్ ద బార్లీ’ చిత్రానికి ఇదే అవార్డు వచ్చింది. రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్న తొమ్మిదో ఫిలిం మేకర్గా కెన్ రికార్డు సాధించారు. చిత్రోత్సవాల ముగింపు చిత్రంగా కూడా ‘ఐ, డేనియల్ బ్లేక్’ ప్రదర్శితమైంది. ♦ చివరి రోజు ఉత్సవాల్లో ప్రధానంగా ఓ జంట అందర్నీ ఆకట్టుకుంది. నలుపు రంగు సూటూ బూటూ ధరించి, 60 ఏళ్ల నటుడు-దర్శకుడు మెల్ గిబ్సన్ తన 25 ఏళ్ల గాళ్ఫ్రెండ్, నటి రోసలిండ్ రోజ్తో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని రెడ్ కార్పెట్పై వాక్ చేశారు. అది మాత్రమే కాకుండా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను బహిరంగంగా బయటపెట్టారు. ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకునే సీన్ని కెమెరా కళ్లు క్లిక్మనిపించాయి. ♦ మాజీ ప్రేమికులైన నటుడు సీన్ పెన్, నటి చార్లెస్ థెరాన్ ఈ వేడుకల్లో అందరూ ఊహించినట్లుగా ఎడమొహం పెడ మొహంగా వ్యవహరించారు. ప్రేమికులుగా ఉన్నప్పుడు ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘ద లాస్ట్ ఫేస్’ చిత్రాన్ని విడిపోయాక జాయింట్గా ప్రమోట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇబ్బందిపడ్డారు. ఇద్దరూ ‘హలో’ చెప్పుకున్న విధానం నలుగురూ మాట్లాడుకునేంత అసహ్యంగా అనిపించిందట. తమ చిత్రం ప్రదర్శితమయ్యాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయేటప్పుడు చిన్న హగ్ ఇచ్చుకుని, టాటా చెప్పేసుకున్నారు. ♦ ఇక.. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవారిలో ఎరిన్ మొరియార్టి, కిరిస్టన్ డన్ట్స్, ఎలెజాండ్రా ఆంబ్రోసియో, ఐసబెలి ఫోంటేనా, క్యాట్రినెల్ మార్లన్, ఇరీనా షేక్ తదితరులు ఉన్నారు. -
ఆర్థిక, ఎన్నికల ఫలితాలు.. కీలకం
టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు * కొనసాగుతున్న విదేశీ విక్రయాలు * నిఫ్టీ ఒకింత హెచ్చుతగ్గులు: మోతిలాల్ ఓస్వాల్ న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఐటీసీ, లుపిన్ వంటి బ్లూ చిప్ కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వెలువడే ఏప్రిల్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి, ముడి చమురు ధరల కదలికలు కూడా కీలకమేనని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. వర్షపాతానికి సంబంధించి రుతుపవనాల కదలిక కూడా సెంటిమెంట్ను నిర్దేశిస్తుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా వ్యాఖ్యానించారు. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరిల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతుంది. ఫలితాలు కూడా అదే రోజు వెలువడుతాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(18 వ తేదీ-బుధ), లుపిన్(19న-గురువారం), ఐటీసీ(20న-శుక్రవారం), తదితర కీలక కంపెనీల గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే వెలువడుతాయి. వీటితో పాటు కార్పొరేషన్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, జస్డ్ డయల్, భారత ఫోర్జ్ తదితర కంపెనీల ఫలితాలు కూడా ఈ వారమే వస్తాయి. ఈ వారంలో నిఫ్టీ కదలికలు ఒకింత ఒడిదుడుకులమయంగానే ఉంటాయని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్క్యాప్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు వర్షపాత సూచనలు, అంతర్జాతీయ అంశాలు ఈ వారం మార్కెట్ పోకడను నిర్దేశిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. కాగా గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 261 పాయింట్లు లాభపడి 25,490 పాయింట్ల వద్ద ముగిసింది. గత శనివారం వెలువడిన చైనా పారిశ్రామికోత్పత్తి, స్థిరాస్థి పెట్టుబడుల గణాంకాల ప్రభావం ఒకింత ఉండవచ్చు. ఈ ఏడాది మార్చిలో 6.8 శాతంగా ఉన్న చైనా పారిశ్రామికోత్పత్తి గత నెలలో 6 శాతానికి తగ్గింది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో 10.7 శాతంగా ఉన్న ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ గత నెలలో 10.5 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు నిపుణుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక ఈ వారం అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే,మంగళవారం నాడు జపాన్, అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అదే రోజు మార్చి నెల యూరోజోన్ వాణిజ్య గణాంకాలు వెలువ డుతాయి. యూరోజోన్ రిటైల్ ద్రవ్యోల్బణ, అమెరికా ముడి చమురు నిల్వల, జపాన్ జీడీపీ గణాంకాలు బుధవారం వస్తాయి. గురు వారం నాడు అమెరికా ఉద్యోగ గణాంకాలు, శుక్రవారం అమెరికా ప్రస్తుత ఇళ్ల విక్రయ గణాంకాలు వస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు.. ఈ నెల మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర విక్రయాలు రూ.178 కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ పట్ల ఆందోళనలు, భారత-మారిషస్ పన్ను ఒప్పందానికి సవరణలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో గత రెండు నెలలుగా జోరుగా కొనుగోళ్లు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్ల దూకుడుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఈక్విటీ మార్కెట్లలో రూ.29,558 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. పీ-నోట్ల ద్వారా ఆర్జించిన లాభాలపై మూలధన లాభాల పన్ను విధించే నిర్ణయం వల్ల సమీప భవిష్యత్తులో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చే స్వల్పకాలిక ఇన్వెస్ట్మెంట్స్ ప్రభావితం అవుతాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం,, ఈ నెల 13 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి నికరంగా రూ.178 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఇదే కాలానికి డెట్ మార్కెట్లో రూ.595 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.12,733 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.345 కోట్లు ఉపసంహరించుకున్నారు. వెరశి భారత్లో వారి నికర పెట్టుబడులు రూ.12,388 కోట్లుగా ఉన్నాయి. -
రూ.13 వేల కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలకు ఓకే
యాక్సిస్ బ్యాంక్లో విదేశీ వాటా పెంపునకు ఆమోదం న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్కు విదేశీ వాటా పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సహా మొత్తం 13,030 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) మొత్తం 14 ఎఫ్డీఐ ప్రతిపాదనలను పరిశీలించి ఐదింటికి ఆమోదం తెలిపిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. యాక్సిస్ బ్యాంక్లో ప్రస్తుతమున్న విదేశీ వాటా పరిమితిని 62 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి అనుమతి లభించిందని, ఈ ప్రతిపాదన విలువ రూ.12,900 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుల్లో మొత్తం విదేశీ వాటా పరిమితి 74 శాతంగా ఉంది. వీటిల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా పరిమితి 49 శాతం. ఓకార్డ్, అరబిందో ఫార్మా కంపెనీల ప్రతిపాదనలు కూడా ఆమోదం పొందాయని ఆ అధికారి వివరించారు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 శాతం వృద్ధితో 2,944 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. కాగా పెట్టుబడుల జోరు కొనసాగుతోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. -
విదేశీ కార్యాలయాల ఏర్పాటుకు ఓకే
నిబంధనలను సరళీకరించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: విదేశీ సంస్థలు భారత్లో వ్యాపారం చేయడం మరింత మెరుగయ్యేలా కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా విదేశీ సంస్థలు భారత్లో ఏర్పాటు చేసే బ్రాంచ్, లయజన్, ప్రాజెక్ట్ ఆఫీసుల ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలను సరళీకరించింది. రక్షణ, టెలికం, ప్రైవేట్ సెక్యూరిటీ, సమాచార, ప్రసార మినహా ఇతర రంగాల కంపెనీలకు అనుమతులను గతంలో ఆర్బీఐ ఇచ్చేదని, ఇప్పుడు కేటగిరి-వన్ బ్యాంకులకు ఈ ఆమోదాలను ఇచ్చే వెసులుబాటును అందిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేటగిరి-1 బ్యాంకుల్లో ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, బంధన్ బ్యాంక్, దోహా బ్యాంక్ క్రెడిట్, సూసీ ఏజీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బార్క్లేస్ బ్యాంక్ పీఎల్సీ, అబుదాబి కమర్షియల్ బ్యాంక్ తదితర బ్యాంక్లున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రభుత్వం నుంచి ప్రాజెక్ట్లను కాంట్రాక్టుగా పొందిన కంపెనీలు ఆర్బీఐ అనుమతి లేకుండానే బ్యాంక్ ఖాతా తెరవవచ్చని పేర్కొంది. రక్షణ, టెలికం, ప్రైవేట్ సెక్యూరిటీ, సమాచార, ప్రసార, తదితతర రంగాల కంపెనీలు మాత్రం బ్యాంక్ ఖాతా ప్రారంభానికి ఆర్బీఐ అనుమతి పొందాల్సిందేనని తెలిపింది. -
ప్రభుత్వ నిబంధనలకు అమెజాన్ గండి
చైనా తర్వాత అతిపెద్ద ఆన్ లైన్ షాపింగ్ మార్కెట్ గా భారత్ ఎదుగుతోంది. షాపింగ్ కోసం భారత వినియోగదారులు ఎక్కువగా ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే విదేశీ ఈ-కామర్స్ సంస్థలు భారత్ లో ఆన్ లైన్ వ్యాపారం నిర్వహించడానికి మన ప్రభుత్వం కొత్తగా మరికొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన అమెజాన్ సంస్థ అసలు పట్టించుకోవడం లేదు. విదేశీ ఈ-కామర్స్ సంస్థలకు సరియైన ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే నిబంధనలను గాలికి వదిలేస్తున్నారని ఫార్రెస్టర్ రీసెర్చ్ సంస్థ విశ్లేషకుడు సతీష్ మీనా తెలిపారు. ఈ నిబంధనలపై సరియైన వివరాలు అందించాలని లేదా సెప్టెంబర్ వరకూ నిబంధనలు అమలుచేయకుండా ఉంటే బాగుంటుందని ఇంటర్నెట్ కంపెనీలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ట్రేడ్ అసోసియేషన్లు అభిప్రాయపడ్డాయి. మరోవైపు ప్రభుత్వం విధించిన నిబంధనలను విదేశీ ఈ-కామర్స్ సంస్థలు తప్పుబడుతున్నాయి. 2020 నాటికి భారత్ లో ఆన్ లైన్ వ్యాపారంలో 75 బిలియన్ డాలర్లుకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఈ మార్కెట్ 12.1 బిలియన్ డాలర్లుగా ఉంది. -
సాగరతీరాన... పల్లవించిన స్నేహగీతిక
ఘనంగా ఐఎఫ్ఆర్-2016 ముగింపు వేడుకలు.. నేడు విదేశీ యుద్ధ నౌకలకు వీడ్కోలు కార్యక్రమం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘బ్రిడ్జ్ త్రూ ఓషన్స్’ అనే అంతర్జాతీయ నౌకాదళ స్ఫూర్తి గీతం వీనులువిందుగా వినిపిస్తుండగా... దేశ, విదేశీ నౌకాదళాల సంయుక్త సంగీత విభావరి మంత్ర ముగ్ధులను చేస్తుండగా... పరస్పర అభివాదాలతో స్నేహ సౌరభాలు గుబాళిస్తుండగా విశాఖలో అంతర్జాతీయ నౌకాదళాల సమీక్ష(ఐఎఫ్ఆర్-2016) ఘనంగా ముగిసింది. ఈ నెల 4న ప్రారంభమైన ఐఎఫ్ఆర్ వేడుకలు సోమవారం ముగిశాయి. చివరిరోజు విశాఖ నేవల్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్కే ధోవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో అంతర్జాతీయ నౌకాదళాల సంయుక్త సంగీత విభావరి నిర్వహించారు. ఆయా దేశాల సంప్రదాయ గీతాలు, నృత్యాలతో నేవల్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణం హోరెత్తింది. ఏయూలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ఆర్ విలేజ్లో సోమవారం రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పండిట్ రమేష్ చౌరాసియా వేణుగానం సందర్శకులను మైమరిపించింది. ఐఎఫ్ఆర్ ముగింపు సంప్రదాయాల్లో భాగంగా నౌకాదళ సాహసస్ఫూర్తికి ప్రతీకగా ‘సెయిల్ ఇన్ కంపెనీ’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. విదేశీ యుద్ధనౌకలకు నేడు వీడ్కోలు ఐఎఫ్ఆర్లో పాల్గొన్న విదేశీ యుద్ధనౌకలకు భారత నౌకాదళం మంగళవారం వీడ్కోలు పలకనుంది. విదేశీ నౌకలను అంతర్జాతీయ సముద్ర జలాల వరకు సాదరంగా సాగనంపడం నౌకాదళ సంప్రదాయం. అందుకు అనుగుణంగా 27 విదేశీ నౌకలను రెండు బృందాలుగా చేసి సాదర వీడ్కోలు పలుకుతారు. మొదటి బృందానికి భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద పయనిస్తూ రియర్ అడ్మిరల్ రణ్వీర్ సింగ్ నేతృత్వంలో వీడ్కోలు పలుకుతారు. రెండో బృందానికి ఐఎన్ఎస్ విరాట్ మీద పయనిస్తూ రియర్ అడ్మిరల్ ఎస్వీ భోకరే నేతృత్వంలో వీడ్కోలు చెబుతారు. ఈ సందర్భంగా పలు విన్యాసాలు నిర్వహిస్తారు. విదేశీ యుద్ధ నౌకలను సాగనంపిన అనంతరం భారత యుద్ధ నౌకలు తిరిగివస్తాయి. -
టాటూ తెచ్చిన తంటా
బెంగళూరులో విదేశీ జంటపై బీజేపీ కార్యకర్తల వీరంగం! బెంగళూరు: శరీరంపై హిందూ దేవత టాటూ వేసుకున్నందుకు బెంగళూరులో ఓ ఆస్ట్రేలియా జాతీయుడు, అతని స్నేహితురాలిని బీజేపీ కార్యకర్తలు వేధింపులకు గురిచేయడం వివాదాస్పదమైంది. ఆస్ట్రేలియాలోని డైకిన్ వర్సిటీ లా విద్యార్థి మాట్ కీత్...తన స్నేహితురాలు ఎమిలీతో కలసి శనివారం ఓ రెస్టారెంట్కు వెళ్లారు. అయితే కీత్ కాలిపై ఎల్లమ్మ టాటూ ఉండటంతో(వీపుపై గణేశ్ టాటూ కూడా ఉంది) బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్న వారు అభ్యంతరం తెలిపారు. గొడవ రేగడంతో పోలీసులు అక్కడకు చేరుకొని విదేశీ జంటను పోలీసు స్టేషన్కు తరలించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వారి చేత బలవంతంగా క్షమాపణ లేఖ రాయించుకొని విడిచిపెట్టారు. కాగా, ఈ వివాదంపై స్థానిక బీజేపీ నేత రమేశ్ యాదవ్ స్పందిస్తూ ఆస్ట్రేలియన్ టాటూను పదేపదే ప్రదర్శించాడని... అతని భద్రత దృష్ట్యా పోలీసులను పిలిచినట్లు చెప్పారు.తమ దేశ పౌరుడిపై దాడిపట్ల ఢిల్లీలోని ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. -
ఆన్లైన్ టోకరా కేసులో మరో నైజీరియన్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ: విదేశీ లాటరీ వచ్చిందంటూ సంక్షిప్త సందేశాలు (ఎస్సెమ్మెస్) పంపి, వివిధ చార్జీల పేరుతో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి నుంచి నగదు కాజేసిన ముఠాలో మరో నిందితుడిగా ఉన్న నైజీరియన్ యుహుమ్వాన్సెబో జెరెమీని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఇతడు కూడా కీలక పాత్ర పోషించినట్లు అదనపు డీజీ సీహెచ్ ద్వారక తిరుమలరావు గురువారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఎబెగా మిఛెల్ అలియాస్ జెఫ్ మోర్గాన్, యుహుమ్వాన్సెబో జెరెమీ అలియాస్ ఒసా నాలుగేళ్ళ క్రితం స్టడీ వీసాపై భారత్కు వచ్చిన ఢిల్లీలో స్థిరపడ్డారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా అనేక మంది సెల్ఫోన్లకు బల్క్ ఎస్సెమ్మెస్లు పంపడం ప్రారంభించారు. ఆన్లైన్ లాటరీ, అవార్డు, క్యాష్ప్రైజ్ తదితరాలు వచ్చాయంటూ ఎరవేస్తాడు. ఆకర్షితులై సంప్రదించి వారితో ఫోనులో మాట్లాడి ముగ్గులోకి దించుతారు. ఈ ముఠా ఈ ఏడాది జనవరిలో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి కె.వెంకటేశ్వరరెడ్డికి ఓ ఎస్సెమ్మెస్ పంపాడు. యూఎస్ సామ్సంగ్ లాటరీలో భారీ మొత్తం వచ్చిందని, నగదు కోసం తమను సంప్రదించాలని వీటిలో పేర్కొన్నాడు. దీనికి ఆకర్షితుడైన వ్యాపారి ముఠాతో ఫోను, ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. వెంకటేశ్వరరెడ్డి పూర్తిగా ముగ్గులోకి దించిన తరవాత నగదు రిలీజ్ కావడానికి ఆదాయపు పన్ను, నగదు మార్పిడి చార్జీలు, కస్టమ్స్ డ్యూటీ పేర్లు చెప్పి వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.79 లక్షలు జమ చేయించుకున్నాడు. దాదాపు మూడు నెలల పాటు ఎదురు చూసినా లాటరీ సొమ్ము రాకపోవడం, ఎబెగా మిఛెల్ స్పందించకపోవడంతో మోసపోయానని గుర్తించిన వ్యాపారి సీఐడీ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కాంతి రాణా టాటా నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.శివాజీ తన బృందంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఎబెగా మిఛెల్ హర్యానాలోని గుర్గావ్లో ఉన్నాడని గుర్తించి జూన్ 25న అరెస్టు చేశారు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్, లాప్టాప్లను విశ్లేషించిన నేపథ్యంలో యుహుమ్వాన్సెబో జెరెమీ సైతం కీలక నిందితుడిగా తేలింది. దీంతో మరోసారి ఢిల్లీ వెళ్ళిన ప్రత్యేక బృందం మంగళవారం ఇతడిని పట్టుకుంది. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్పై గురువారం హైదరాబాద్ తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఎస్సెమ్మెస్లు, ఈ-మెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయని, అలాంటి వాటిని నమ్మిమోసపోవద్దని ఎస్పీ టాటా సూచించారు. -
మన విదేశీ రుణ భారం 476 బిలియన్ డాలర్లు...
ముంబై: భారత విదేశీ రుణ భారం 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం 476 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 మార్చితో పోల్చితే ఈ మొత్తం 29.5 బిలియన్ డాలర్లు (6.6 శాతం) ఎగశాయి. విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ), ఎన్ఆర్ఐ డిపాజిట్లు భారీగా పెరగడం రుణ భారం పెరగడానికి ఒక కారణమని ఆర్బీఐ నివేదిక విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2015 మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చిచూస్తే విదేశీ రుణ భారం 23.8 శాతంగా ఉంది. 2014 మార్చి నాటికి ఈ శాతం 23.6%. మొత్తం రుణంలో దీర్ఘకాలిక రుణ భారం వార్షికంగా 10 శాతం పెరిగి 391 బిలియన్ డాలర్లకు చేరింది. స్వల్పకాలిక రుణ భారం మాత్రం 7.6 శాతం క్షీణించి 85 బిలియన్ డాలర్లయ్యింది. ఇక మొత్తం రుణంలో ప్రభుత్వ (సావరిన్), ప్రభుత్వేతర రుణ భారాల వాటా 18.9%, 81.1%గా ఉన్నాయి. కాగా, గ్రీస్ సంక్షోభం భారత్ కంపెనీల విదేశీ రుణ సమీకరణ కార్యకలాపాలపై స్వల్ప కాలికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన అధ్యయన నివేదికలో తెలిపింది. -
విదేశీ గనుల కోసం వేట
కొత్తగూడెం(ఖమ్మం) : బొగ్గు ఉత్పత్తిలో 120 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి సంస్థ ఇప్పటికే గోదావరిలోయ పరివాహక ప్రాంతంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో బొగ్గు గనులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విదేశాలలోనూ బొగ్గు గనులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాప్రికా, మొజాంబిక్ దేశాలలో గనులను చేపట్టేందుకు ఈఓఐ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) అందించాలని సంస్థ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిపై సమీక్ష నిర్వహించింది. దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు విదేశాలలో సైతం బొగ్గు గనులను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నడిమిట్ల శ్రీధర్ విదేశాలలో గనుల ఏర్పాటుపై, అక్కడున్న పరిస్థితులను అవగాహన కల్పించుకునేం దుకు సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కూడిన బృందాన్ని గత ఏడాది డిసెంబర్లో విదేశాలకు పంపించారు. ఆ తర్వాత సీఎండీ స్వయంగా దక్షిణాప్రికా పర్యటన చేసి అక్కడున్న పరిస్థితులను పరిశీలించి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాప్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మొజాంబిక్ దేశాలలో బొగ్గు గనుల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని నిర్థారించుకుని అక్కడ గనుల ఏర్పాటుకు ప్రయత్నాలను మమ్మురం చేశారు. ఏడాదికి రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం సింగరేణి సంస్థ విదేశాలలో చేపట్టే గనులు 50 మిలి యన్ టన్నుల నిక్షేపాలు కలిగి, ఏడాదికి రెండు మిలి యన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గనులను తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతోపాటు అవసరమైతే 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. గనులను అమ్మే కంపెనీ లు తప్పనిసరిగా యాజమాన్య హక్కులను కలిగి ఉండటంతోపాటు బొగ్గు అమ్మకానికి సంబంధించిన అన్ని హక్కులు కలిగి ఉండాలని సూచించింది. జూన్ 10వ తేదీలోగా ఆయా దేశాలలోని గనుల యాజమానులు వాటా అమ్మకానికి సంబంధించిన ఈఓఐను అందించాలని కోరింది. ఏది ఏమైనా మరో ఏడాదిలో గా విదేశాలలో గనులను నిర్వహించాలని సింగరేణి యాజమాన్యం సంకల్పించి ముందుకు సాగుతోంది. -
విదేశీ అందాలకు దీటైన స్వదేశీ సౌందర్యం!
ఫొటో ఫీచర్ అద్భుతమనిపించే ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి... అపురూపమనే వాతావరణంలో గడపటానికి, అబ్బురమనిపించే అందాలను చూడటానికి... ఆకట్టుకొనే స్థలాల్లో ఆహ్లాదంగా గడపటానికి... ‘వేల మైళ్లు దాటి పోవాలి, సరిహద్దులు దాటాలి, వీసాలు తెచ్చుకోవాలి... విదేశీ కరెన్సీ చేతిలో ఉండాలి..!’ ఎంతోమందిలోని భావనలు ఇవి. అయితే మనదేశం గురించి పూర్తిగా తెలుసుకొంటే అవన్నీ కేవలం భ్రమలే అని స్పష్టమవుతుంది. ఓ సారి ఈ ఫొటోలను చూడండి... బ్యాంకాక్లోని ఫ్లోటింగ్ మార్కెట్కు దీటైన శ్రీనగర్ ఫ్లోటింగ్ మార్కెట్ స్విస్ అందాలకు సాటైన హిమాచల్ప్రదేశ్లోని కజ్జార్ వెనీస్తో పోటీలో వెనుకబడని కేరళలోని అలెప్పీ సహారా ఎడారికంటే నేనేం తక్కువ అంటున్నట్లు రాజస్థాన్ థార్ వెనిస్లోని బురానో కాలనీని ప్రతిబింబించే పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ కాలనీ కొత్త ప్రదేశాలను చూడాలంటే లక్షలే అక్కరలేదు. ఆస్వాదించే అభిరుచి ఉంటే మన అందాల సౌరభాలూ అపురూపమే. -
విదేశీ కంపెనీల ఒప్పందాలన్నీ బయటపెట్టాలి: ధర్మాన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నీ తక్షణమే బయటపెట్టాలని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద రావు డిమాండ్ చేశారు. ఒప్పందాలపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీతో సహా పౌరులందరికీ సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కేంద్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల చట్టాల పరిధిలో లేని అంశాలపై కూడా ఒప్పందాలు జరుగుతున్నట్లు అనుమానాలున్నాయని చెప్పారు. చంద్రబాబు పేరుప్రతిష్టల కోసం అడ్డగోలు రాయితీలిచ్చి విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం సరికాదన్నారు. 'చంద్రబాబు.. మీ పాలన నాలుగేళ్లు మాత్రమే' అంటూ ధర్మాన మండిపడ్డారు. గుదిబండ్లలాంటి ఒప్పందాలు ప్రజలకు శాపంలా మారుతాయని హెచ్చరించారు. స్వదేశీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిపోయి విదేశీ పెట్టుబడుల కోసం అడ్డగోలు రాయితీలివ్వడం సరికాదని ధర్మాన విమర్శించారు. -
విదేశీ ఉద్యోగాల కోసం మోసపోవద్దు : డీఐజీ
ఘంటసాల : విదేశీ ఉద్యోగాల కోసం గుర్తింపులేని ఏజెంట్లను సంప్రదించి మోసపోవద్దని ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ సూచించారు. స్థానిక పోలీస్స్టేషన్ను గురువారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉద్యోగాల కోసం మోసపోతున్న వారి కేసులు పెరుగుతున్నాయన్నారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఆరు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకునే గుర్తింపు ఉన్న ఏజెంట్లను మాత్రమే సంప్రదించాలని, ఈ విషయంలో అనుమానం వస్తే స్థానిక పోలీస్స్టేషన్ను సంప్రదించవచ్చని తెలిపారు. గుర్తింపు లేని, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, వ్యక్తుల వద్ద సొమ్ములు డిపాజిట్ చేయొద్దని సూచించారు. జిల్లాలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల నేరాల సంఖ్య తగ్గినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించుకోగలుగుతామన్నారు. అనంతరం ఆయన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డీఎస్పీ కేఎస్ ఖాదర్బాషా, చల్లపల్లి సీఐ వైవీ రమణ, స్థానిక ఎస్ఐ టీవీవీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విమాన నగరం
విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం విమానాల నిర్వహణ సముదాయం ఏర్పాటుకు విదేశీ సంస్థల ఉత్సాహం పెరుగుతున్న విదేశీ సర్వీసులు పర్యాటక, పారిశ్రామిక రంగాలను ఆకర్షించే ప్రయత్నం విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే పడింది. ఇక్కడి సహజ వనరులు, సదుపాయాలు పాలకుల్లో ఆశలు కల్పిస్తున్నాయి. జి ల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలు కూడా అందుబాటులో ఉండటం, పర్యాటక ప్రాం తాలు ఎక్కువగా ఉండటంతో పెట్టుబడులను ఆకర్షించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే దేశ, విదేశీ పెట్టుబడులు ఇక్కడికి రావాలంటే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. దానిపైనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుండి రోజుకి 16 నుంచి 18 విమాన సర్వీసులు నడుపుతున్నారు. నాలుగు దేశీయ, నాలుగు అంతరాతీయ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుత సర్వీసులు భవిష్యత్ అవసరాలకు ఏమాత్రం సరిపోవు. దీంతో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అజయ్జైన్ ఇటీవల విశాఖలో ప్రాధమికంగా వెల్లడించారు. ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ప్రస్తుత ఎయిర్పోర్టును విస్తరిస్తే సరిపోతుందని, భోగాపురం విశాఖకు 55 కిలోమీటర్లు ఉన్నందున ప్రయాణీకులకు ఇబ్బంది గా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని విస్తరిస్తారా లేక విశాఖ సమీపంలోని విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఏర్పాటు చేస్తామని ప్రకటించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు నిర్మిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా విమానాశ్రయం విస్తరణ తప్పనిసరి అనేది స్పష్టమవుతోంది. ఇక ఎయిర్ ఇండియాతో పాటు పలు విమానయాన సంస్థలు విశాఖలో విమానాల నిర్వహణ సముదాయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే 100 విమానాలతో ఇక్కడ హబ్ నెలకొల్పుతామని ప్రకటించింది. విమాన సర్వీసులు కూడా పెరుగుతున్నాయి. ఎయిర్ ట్రావెల్ర్స్ అసోసియేషన్ (ఇండియా) చేసిన ప్రయత్నాల వల్ల ఇటీవల ఎయిర్ ఏషియా కంపెనీ కౌలాలంపూర్-విశాఖ-కౌలాలంపూర్ సర్వీసును ఎయిర్ ఏషియా తక్కువ టిక్కెట్టుతో ప్రారంభించింది. వారంలో మూడు రోజుల పాటు ఆస్ట్రేలియా, సింగపూర్, బ్యాంకాక్, యునెటైడ్ స్టేట్స్, టోక్యో, బీజింగ్లను కలుపుతూ ఈ సర్వీసు నడుస్తోంది. ఇదే కంపెనీ బ్యాంకాక్-విశాఖ-బ్యాంకాక్ సర్వీసును త్వరలో ప్రారంభించనుంది. ఎయిర్ లంక నడుపుతున్న కొలంబో-విశాఖ-కొలంబో సర్వీసును కూడా రప్పించేం దుకు ప్రయత్నిస్తున్నట్లు ఎటిఎ అధ్యక్షుడు డి.వరదారెడ్డి అంటున్నారు. మరోవైపు ఫ్లై దుబాయ్, ఎఐ అరేబియా విమాన సంస్థలు కూడా ఆయా దేశాలకు నేరుగా విశాఖ నుంచి విమాన సర్వీసులు నడిపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
విదేశీ భాషలపై పట్టు పెంచుకోవాలి
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్రెడ్డి నంద్యాల: విద్యార్థులు విదేశీ భాషలపై పట్టుపెంచుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి సూచించారు. శనివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాలలో రిపల్స్-15 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జపాన్, జర్మన్తో పాటు మరికొన్ని దేశాలు భారీ ఎత్తున పరిశ్రమలను, ఇతర సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. జపాన్, జర్మన్ భాషలపై పట్టు సాధిస్తే ఉద్యోగాలు పొందడం సులభం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టుదలతో రాష్ట్రానికి విదేశీ సంస్థలను ఆహ్వానిస్తున్నారన్నారు. ఇందుకు విదేశీ సంస్థలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా 50వేల నుంచి లక్ష వరకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెప్పారు. విదేశీ భాషలను విద్యార్థులకు నేర్పడానికి ఇప్పటి నుంచే కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ప్రణాళికలను రూపొందించామన్నారు. ఎంబీఏ విద్యార్థులకు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. విశేష స్పందన.. రామకృష్ణ పీజీ కళాశాలో ఎంబీఏ విద్యార్థులు నిర్వహించిన రిపుల్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని 15 కళాశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు 200మందికి పైగా తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏడు విభాగాలను ఏర్పాటు చేసి ప్రతిభా పరీక్షలను నిర్వహించారు. వీటిని పరిశీలించి..పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులను రాష్ట్ర ఉన్న విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్రెడ్డి అభినందించారు. ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ఎంకాంలో ఈ కామర్స్, బీకాంలో మరికొన్ని కొత్త కోర్సులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం వేణుగోపాల్రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రతినిధి గడ్డం హేమంత్రెడ్డి, డాక్టర్ కళామురళీ, మోహన్రావుతో పాటు నిర్వాహకులు రత్నారెడ్డి, ఇంతియాజ్ అహమ్మద్, శ్రావణకుమారి, వెంకటరావు, నాగరాజమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. విదేశీ మైండ్సెట్ వద్దు
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ఏపీలో మరో జపాన్ను సృష్టిస్తానని, రాష్ట్రాన్ని సింగపూర్లా తయారు చేస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు.. విదేశీ మైండ్సెట్(ఆలోచన) నుంచి తెలుగు ప్రజల మైండ్సెట్లోకి రావాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. తెలుగు రాష్ట్రంలో మరో జపాన్ను సృష్టించేందుకు అక్కడి కంపెనీలన్నీ సిద్ధమయ్యాయని చంద్రబాబు భజన పత్రికల్లో వచ్చిన వార్తలను అంబటి ఉటంకించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. మార్చిలో జపాన్ కంపెనీలు రాజధాని ప్రాంతంలో పర్యటించి భారీగా పెట్టుబడులు పెడతాయని, 5 లక్షల ఉద్యోగాలు తాము కల్పిస్తామని జపాన్ మంత్రి ఒకరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయని అంబటి అన్నారు. అక్కడి నుంచి కంపెనీలు వచ్చి ఇక్కడి వారికి ఉద్యోగాలిస్తే తమ పార్టీ సంతోషిస్తుందని అయితే జపాన్ కంపెనీలు వచ్చి ఉద్యోగాలిస్తే తప్ప ఏపీ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. బాబు గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా రూ.కోట్లు ఖర్చు పెట్టి ఐదు సార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహించడమే కాక 7 సార్లు దావోస్లో పర్యటించి కూడా ఇలాంటి కబుర్లే చంద్రబాబు చెప్పారన్నారు. ఆచరణలో చూస్తే ఆయన చెప్పిన దాంట్లో 2 శాతం కూడా పెట్టుబడులు రాలేదన్నారు. మన రాష్ట్రంలో నిష్ణాతులైన పారిశ్రామిక వేత్తలుండగా జపాన్ పారిశ్రామిక వేత్తల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. ఆందోళనలో విద్యార్థులు.. గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాల భర్తీ జరగదేమోనన్న ఆందోళనతో ఉన్నారని అంబటి అన్నారు. తాము చెప్పే వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయొద్దని సర్వీస్ కమిషన్కు తాఖీదు నివ్వడం దారుణమని.. వెంటనే ఖాళీగా ఉన్న 1.5 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఉన్నత ఉద్యోగం వదలి..
సాక్షి,చిత్తూరు : ఉన్నత చదువులు చదివాడు. పేరు ముందు డాక్టర్ ఉండాలనే కల నెరవేర్చుకున్నాడు. విదేశీ ఉద్యోగం. నెలకు రూ. 6.5 లక్షల జీతం పొందాడు. ఉద్యోగ బాధ్యతలతో 14 దేశాలు చుట్టాడు. అరుుతే ఆ దేశాల్లో వ్యవసాయూనికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాడు. ప్రోత్సాహాన్ని చూసాడు. ఇదే స్ఫూర్తితో స్వదేశంలో అన్నదాత లను ప్రోత్సహిస్తే సంతృప్తికలుగుతుందని భావించాడు. అంతే ఉద్యోగం వదిలేశాడు. చిత్తూరు జిల్లాకు వచ్చి మామిడి రైతులను అతని తెలివితేటలతో ప్రోత్సహిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు వద్ద దమ్మెన్ను గ్రామంలో పుట్టి.. మామిడిని విదేశాలకు ఎగుమతి చేరుుంచడమే ధ్యేయంగా పనిచేస్తున్న డాక్టర్ దుద్దుపూడి శ్రీనివాస్బాబు ఆదర్శ జీవితం ‘సాక్షి’ పాఠకులకు ఆదివారం ప్రత్యేకం. రిటైర్డ్ తహశీల్దార్ రామకృష్ణ కుమారుడు దుద్దుపూడి శ్రీనివాస్బాబు. తండ్రి ఉద్యోగ విరమణ తరువాత బెంగళూరులో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఊటీ,పుట్టపర్తిలో ఇంటర్ పూర్తి చేసిన శ్రీనివాస్ బెంగళూరులో బీఎస్సీ గణితం డిగ్రీ పూర్తిచేశాడు. మలేషియాలో ఎంబీఏ కోర్సు చేశాడు. అక్కడే జయకృష్ణ హోల్డింగ్ కంపెనీ జనరల్ మేనేజర్గా నెలకు * 6.5 లక్షల జీతంతో 8 నెలలు పనిచేశాడు. పేరు ముందు డాక్టర్ ఉండాలనే లక్ష్యంతో ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ అనే విషయంపై పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందాడు. ఉద్యోగరీత్యా 14 దేశాలు తిరిగాడు. అక్కడి వ్యవసాయం, మార్కెటింగ్ విధానం, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. రైతులకు ఆ దేశాల్లో ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాడు. ట్యాక్స్ మొదలు అన్నింటిలోనూ రైతులకు రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తుండడం గమనించాడు. స్వదేశంలో రైతులకు ప్రోత్సాహాన్ని అందివ్వాలనే కోరిక పుట్టింది. ఉద్యోగం వదిలేసి బెంగుళూరు చేరుకున్నాడు. ఎగుమతులపై రైతులకు అవగాహన చిత్తూరులో సోదరి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు. వారి మామిడితోటల పెంపకం, కాయలు కాసినా మార్కెటింగ్ చేసుకోలేని రైతుల పరిస్థితిని కళ్లారా చూశాడు శ్రీనివాస్. చిత్తూరు మామిడికి విదేశాల్లో ఉన్న డిమాండ్ను గుర్తుచేసుకున్నాడు. మామిడి ఉత్పత్తి నుంచి ఎగుమతుల వరకూ రైతులకు ఉన్న అవగాహన లేమి,ఇబ్బందులు, దళారుల మోసం గమనించాడు. జిల్లా రైతులను ఒక్కతాటిపైకి తెచ్చి ఒకే బ్రాండ్ నేమ్ పై మామిడిని విదేశాలకు ఎగుమతులు చేయించడమే లక్ష్యంగా చేసుకున్నాడు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఎగుమతికి ఉపయోగపడే నాణ్యమైన మామిడి ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. ప్రతిరైతూ సొంతంగా మామిడిని ఎగుమతి చేసుకునే ందుకు అవసరమైన సర్టిఫికెట్ పొందే విషయంపై అవగాహన కల్పిస్తున్నాడు. విదేశీయులను ఇక్కడికే రప్పించి మామిడి ఎగుమతికి అనుమతులను సైతం ఇప్పిస్తున్నాడు. యూరఫ్కు సంబంధించిన గ్లోబల్ గ్యాప్ సర్టిఫికెట్, కోస్తారికాకు చెందిన రెయిన్ ఫారెస్ట్ అలియన్స్ అనుమతులను తెప్పించాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ 50 ఎకరాల మామిడికి విదేశీ ఎగుమతి అనుమతులను తెప్పించాడు. ఇంకా చాలా అనుమతులు రావాల్సి ఉన్నారుు. యూఎస్, యూకే, హాలెండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు,అక్కడి వ్యాపారులు జిల్లాకు వచ్చి మామిడి తోటలను పరిశీలించి ఎగుమతి అనుమతులు ఇస్తున్నారు. జిల్లా మామిడి రైతాంగాన్ని ఒకే వేదికపైకి తెచ్చి సహకార సంఘాన్ని ఏర్పాటుచేసి ఒకే బ్రాండ్ నేమ్పై మొత్తం మామిడిని విదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. రైతులకు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా... బెంగళూరు నుంచి వచ్చి అవసరమైనన్ని రోజులు ఇక్కడే ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. 2020 - 25 నాటికి మన దేశంలో వ్యవసాయరంగం ప్రథమ స్థానంలో ఉంటుందని శ్రీనివాసబాబు ‘సాక్షి’తో చెప్పాడు. చిత్తూరు రకం కాదర్, బేనిషా, ఇమామ్ పసంద్ మామిడి పండ్ల రుచి దేశంలో మరేచోట మామిడిలో లేదని, మార్కెటింగ్ సక్రమంగా చేసుకోగలిగితే రైతులు మంచి లాభాలు ఆర్జిస్తారని తెలిపారు. ప్రభుత్వం మార్కెటింగ్, విదేశీ అనుమతులపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రైతు మామిడి ఉత్పత్తులను సొంతంగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించడమే తన లక్ష్యమన్నారు. బతకడం కోసం ఆన్లైన్లో ప్రాజెక్టు వర్కర్లు చేస్తానన్నాడు. మిగిలిన సమయమంతా రైతు సంక్షేమం కోసమేనని చెప్పాడు. -
బెయిల్ కోసం విదేశీ రుణం!
సహారా విజ్ఞప్తికి సుప్రీం అనుమతి ఆర్బీఐ అనుమతి తప్పనిసరి న్యూఢిల్లీ: జైలు నుంచి తమ చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్పై విడుదలకు కొంత మొత్తాన్ని విదేశీ రుణ రూపంలో సమీకరించుకోడానికి వీలు కల్పించాలని సహారా గ్రూప్ చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ నిధులు దేశంలోకి రావడానికి సంబంధించిన ఫెమా నిబంధనలన్నింటినీ పాటించాలని పేర్కొంది. ప్రత్యేకించి రిజర్వ్ బ్యాంక్ నుంచి తగిన అనుమతులు పొందాలని స్పష్టం చేసింది. ఈ రూలింగ్తో అమెరికా సంస్థ మిరేజ్ కేపిటల్ నుంచి 1050 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,510 కోట్లు) పొందేందుకు సహారా గ్రూప్కు వీలు కుదిరింది. గ్రూప్కు విదేశాల్లో ఉన్న మూడు హోటళ్లలో వాటా తనఖాగా ఈ నిధులను మిరేజ్ కేపిటల్ అందిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మిరేజ్ కేపిటల్ నుంచి సహారాకు 650 మిలియన్ డాలర్లు లోన్గా, 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ రూపంలో అందుతుంది. రెండు సహారా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు రూ.24 వేల కోట్ల నిధుల సమీకరణ... పునఃచెల్లింపుల వైఫల్యం... కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో సహారా చీఫ్ రాయ్ 2014 మార్చి నుంచి తీహార్ జైలులో ఉన్నారు. మొత్తం డబ్బు సమకూర్చడానికి వీలుగా మధ్యంతర బెయిల్ పొందడానికి రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీం గతంలో షరతు విధించిన సంగతి తెలిసిందే. -
అద్భుత నిర్మాణంగా క్రైస్తవ భవన్
క్రిస్మస్ విందులో సీఎం కేసీఆర్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్రైస్తవ భవనాన్ని దేశంలోనే నంబర్ వన్గా నిలిచేలా అద్భుతంగా నిర్మిస్తామని, ఇందుకోసం దేశ, విదేశీ ఆర్కిటెక్ట్ల సేవలను వినియోగించుకుంటామని సీఎం కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ భవన్లోనే జరుపుకొనే విధంగా వేగం గా నిర్మాణం జరుపుతామని పేర్కొన్నారు. మూడు వేల మంది సామర్థ్యంతో ఎకరా స్థలంలో డైనింగ్ హాల్, మరో ఎకరా స్థలంలో పచ్చదనం ఉండేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. నలు దిక్కుల నుంచి కనిపించేలా భవనంపై నిలువెత్తు ఏసు ప్రభువు విగ్రహం, శిలువను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే ఇప్పటికే ఇచ్చిన రూ. 10 కోట్లకు అదనంగా మరో రెండు కోట్లను ఈ భవన నిర్మాణం కోసం ఇస్తామన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో సోమవారం రాత్రి సుమారు వెయ్యి మందికిపైగా క్రైస్తవ ప్రముఖులకు సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చెర్మైన్ స్వా మి గౌడ్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, టి.రాజయ్య, హోంమంత్రి నా యిని నరసింహారెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని మతాల సంగమంగా ఏర్పడిన అద్భుత సమాజం తెలంగాణ అని కొనియాడారు. నేడు నల్లగొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం నల్లగొండ జిల్లా దామరచర్ల, మఠంపల్లి మండలాల్లో ఏరియల్ సర్వేకు వెళ్తున్నారు. ఉదయం మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 10వ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న తరువాత, మహేంద్ర హిల్స్లో క్రైస్తవ భవన్కు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి నల్లగొండ జిల్లాలో విహంగ వీక్షణం చేస్తారు. -
క్యా బాత్ హై
చక్కటి చిరునవ్వు... అందమైన రూపంతో కనిపిస్తున్న ఈ విదేశీ భామను కాస్త దగ్గరగా గమనించండి. ఓ పక్క ఒత్తుగా జుత్తు... మరో వైపు గుండు... ఆమె హెయిర్ స్టైల్ చిత్రంగా ఉంది కదూ! బంజారాహిల్స్లో జరిగిన ఓ ఈవెంట్ కోసం వచ్చిన ఈ న్యూయార్క్ వనిత పేరు నికోలాస్. ఏమిటీ హెయిర్స్టైల్ అని అడిగితే... ‘భారత్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వారి జుత్తూ అంతే. అందులో నేను పోటీపడలేను. అందుకే వారందరిలో కాస్త ప్రత్యేకంగా కనిపించడానికి ఈ హెయిర్ స్టయిల్’ అంటూ గలగలా నవ్వుతూ చెప్పేసిందీ సుందరి. -
భారత్ను విడదీసేందుకు విదేశీ శక్తులు కుట్రలు
ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ తుమకూరు : భారతదేశాన్ని విడదీసేందుకు విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భగవత్ విమర్శించారు. అందువల్ల ప్రస్తుతం భారతీయులందరూ ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తన సందర్భంగా మంగళవారం తుమకూరులోని సిద్ధగంగా మఠంలో ఏర్పాటు చేసిన ‘సాధు సంతర సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్లో హిందూ ధర్మ సంప్రదాయాలు పాశ్చాత్య వైఖరి కారణంగా ఇప్పటికే చాలా వరకు నాశనమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలో హిందూ సంప్రదాయాలు అదృశ్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను హిందువులందరూ కలిసికట్టుగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగా ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులను తిరిగి మన మాతృ మతంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సాధుసంతర సమావేశాన్ని ప్రారంభించిన సిద్ధగంగా మఠం పీఠాధిపతి శివకుమార స్వామీజీ మాట్లాడుతూ....హిందూ ధర్మం ప్రపంచంలోని అన్ని ధర్మాలకు ఆదర్శమన్నారు. అయితే ప్రస్తుత తరంలో చాలా మంది యువకులు హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర గురూజీ, ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానంద నాధ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. -
కూలీ... ఊరి తలరాతే మార్చాడు!
అర్థవంతం: ఒక విదేశీ జంట అతడి వద్దకు వచ్చి డజను ఆరెంజ్ పళ్లు అడిగింది. కన్నడ మాత్రమే వచ్చిన హజప్ప వారికి వాటి ధర చెప్పలేకపోయాడు. మనిషికి దేవుడు జీవితమనే ఒక బ్లాంక్ చెక్ ఇస్తాడు. మనిషి దానిమీద ఏం రాసుకుంటాడో అతనికి అది దక్కుతుంది. ఈ ప్రపంచంలో అందరి జీవితాలు ఒకేలా ఉండకపోవడానికి ఇదే కారణం. ఇంత ఇంటెన్సిటీ ఉన్న విషయాన్ని ఇపుడు చెప్పడానికి ఒక బలమైన కారణం.. హజప్పా అనే ఒక స్ట్రీట్ వెండర్. తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక వ్యక్తి! కొందరు కారణ జన్ములు. వారిలో ఒకరు హజప్పా. అతను సామాన్యుడే. రోడ్డు పక్కన పళ్లు అమ్ముకుని బతికే ఓ చిరు వ్యాపారి. పనిచేస్తే కడుపు నిండుతుంది. చిన్నపుడు బీడీలు చుట్టి పెరిగాడు. పెద్దయ్యాక పెళ్లయ్యాక ఆ ఆదాయం చాలక రోజూ మార్కెట్లో పళ్లు కొనుక్కుని గంపలో నెత్తిమీద పెట్టుకుని మంగళూరులో అమ్మేవాడు. ప్రతిరోజూ తన స్వగ్రామం నెవపాడు హరేకళ నుంచి మంగళూరు (కర్ణాటక) వెళ్లొచ్చేవాడు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా అతను ఒక విషయాన్ని గమనించాడు. తన ఊరు పిల్లలు ఊర్లో బడిలేక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోని బడికి వెళ్లి చదువుకుంటున్నారు. బస్సుల్లేక అంతదూరం నడిచి వెళ్లడం రోజూ చూస్తున్న హజప్పకు అది అస్సలు నచ్చలేదు. ఆ పిల్లలు, తల్లిదండ్రులకు అలవాటైనా హజప్పలో మాత్రం... బడికోసం పిల్లలు ఎందుకు నడవాలి? అని ప్రశ్నించుకున్నాడు. ఓ సంపన్నుడు స్పందిస్తే అనుకున్న పది రోజుల్లో బడి కట్టేయగలడు. కానీ దిన సరి వ్యాపారి అయిన హజప్ప ఏం చేయగలడు? ఎవరిని ఒప్పించగలడు. అయినా తన కల మానలేదు. తన దారిన తాను పోలేదు. తన పని తాను చూసుకోలేదు. ఈ ఆలోచనలో ఉన్న అతనికి ఒక రోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఒక విదేశీ జంట అతడి వద్దకు వచ్చి డజను ఆరెంజ్ పళ్లు అడిగింది. కన్నడ మాత్రమే వచ్చిన హజప్ప వారికి వాటి ధర చెప్పలేకపోయాడు. అసలే మథనంలో ఉన్న అతన్ని ఈ ఘటన ఇంకా తీవ్రమైన ఆలోచనలో పడేసింది. నేను చదువుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అసలు మా ఊర్లో గవర్నమెంటు బడి ఉంటే నేను కూడా చదువుకునే వాడిని కదా, అని అనుకున్నాడు. బడి ఊర్లో లేకపోవడం వల్ల కొందరసలు బడే మానేశారు. దీంతో ఆరోజు నుంచే తన ఊళ్లో బడి కట్టాలని డిసైడయ్యాడు. మంగళూరు కలెక్టరేటుకు బడికోసం అర్జీ పెట్టాడు. కానీ, బడి మంజూరు అవడం అంటే నిధులతో పని కాబట్టి అంత సులువు కాదు. అయినా అతను ఆపలేదు. వారం వారం అదేపని. అక్కడున్న కొందరు ‘ఎందుకయ్యా ఊరికే నీ ప్రయత్నం, నీ పని నువ్వు చూసుకోక. బడి పెట్టాలంటే బిల్డింగు ఉండాలి కదా, ఇపుడది అయ్యేపనేనా’ అని కసిరేశారు. ఇది ఇంకో మలుపు. అతను ఆరోజు నుంచి తన ఆదాయంలో కొంత బడికోసం దాచడం మొదలుపెట్టాడు. అతడి భార్య నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీకు వచ్చేదే 100-150. అందులో ‘బడికి దాస్తావా బుద్ధి లేకపోతే సరి’ అంటూ ఆమె తిట్టే తిట్లకు అతను రోజూ అలవాటు పడ్డాడే కానీ తన ఆలోచన మార్చుకోలేదు. అలా తీవ్రంగా ప్రయత్నించి కొన్ని సంవత్సరాల పాటు శ్రమించాక కాళ్లరిగేలా తిరిగాక గవర్నమెంటు బడి మంజూరు చేసింది. కానీ దానికి బిల్డింగ్ లేదు. దీంతో తను దాచుకున్న డబ్బుకు తోడు విరాళాలు సేకరించి ఒక చిన్న గది కట్టించాడు. అది కొందరికి పిచ్చి అనిపిస్తే ఇంకొందరికి ఆశ్చర్యం అనిపించింది. ఈ విషయం తెలిసిన కన్నడ దినపత్రిక అతనిని మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడంతో అభినందనలతో పాటు విరాళాలు వచ్చాయి. ప్రభుత్వం కూడా రూ.లక్ష విడుదల చేసింది. హజప్పలో ఉత్సాహం రెట్టించి ఆ డబ్బులతో హైస్కూలు కూడా కట్టించేశాడు. అక్కడితో ఆపలేదు. మా ఊరికి కాలేజీ కూడా కావాల్సిందే అని పట్టబట్టేశాడు హజప్ప. ఇపుడదే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది వన్ మాన్ షో. ఫలితం దక్కాలంటే అడ్డంకులు దాటాలి, తీవ్రంగా శ్రమించాలి... అది ఎంతకాలమైనా పట్టొచ్చు. ఏడేళ్ల పాటు ఇంట్లో వారితో తిట్లు, ఊర్లో వాళ్లతో చీవాట్లు తిన్న హజప్పపై అతని ప్రయత్నం ఫలించాక అవార్డుల వర్షం, రివార్డుల వరద కురిసింది. విచిత్రం ఏంటంటే... ఆయన ఇంకా పళ్లు అమ్ముతూనే తన ఇంటిని పోషిస్తున్నాడు. పొట్టకూటి కోసం కాదు, అది తన వృత్తి. ఆ ఊరు మాత్రం సరస్వతీ క్షేత్రం అయ్యింది. ఆయన ఒక రియల్ హీరో. హజప్ప జీవితం సమాజాన్ని తీర్చిదిద్దాలనుకున్న వారికే కాదు, తమ జీవితాలు మార్చుకోవాలనుకున్న వారికీ పనికొస్తుంది. అందుకే మీ జీవితం మీకు నచ్చినట్లు తీర్చిదిద్దుకోవాల్సింది మీరే! - ప్రకాష్ చిమ్మల -
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
తణుకు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఓ వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు దిగమర్తి రామచంద్రరావు ఉద్యోగాల పేరుతో 29 మంది నిరుద్యోగుల నుంచి దాదాపు 25 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఎంతకాలమైన ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నాడు. -
బంజారాహిల్స్లో పట్టుబడ్డ విదేశీ మద్యం
-
బంజారాహిల్స్లో పట్టుబడ్డ విదేశీ మద్యం
హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో సోనా వైన్ షాపులో సోదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఎక్సైజ్ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. అక్రమంగా విదేశీ మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందటంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పది లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైన్ షాపు నిర్వహకుడు జయకిషన్ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోనా వైన్స్తో పాటు నగరంలో పలు మద్యం దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. -
నయాక్రేజ్.. స్టడీ ఆబ్రాడ్
విదేశీ విద్యకు నానాటికీ క్రేజ్ పెరుగుతోంది. భారత్ నుంచి ప్రతిఏటా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు పయనమవుతున్నారు. ప్రధానంగా అమెరికా, యునెటైడ్ కింగ్డమ్(యూకే), ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, న్యూజిలాం డ్లు విద్యార్థులకు హాట్ ఫేవరేట్గా మారాయి. వీటితోపాటు జర్మనీ, కెనడాల పట్ల కూడా మన విద్యార్థులు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాల్లో అత్యున్నత ప్రమాణాలను కలిగిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అందిస్తున్న కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటం.. తద్వారా అవకాశాలు విస్తృతం అవుతుండటంతో విద్యార్థులు విదేశీ విద్యవైపు మొగ్గుచూపుతున్నారు. విదేశీ డిగ్రీకి భారత జాబ్ మార్కెట్లో ఉన్న డిమాండ్ కూడా విద్యార్థులు స్టడీ అబ్రాడ్ దిశగా పయనమయ్యేట్లు చేస్తోందంటున్నారు నిపుణులు. పీజీ, డాక్టోరల్ కోర్సులకు విదేశీ యూనివర్సిటీల్లో ఉన్న అధునాతన సౌకర్యాలు, ఫ్యాకల్టీ, పరిశోధనలకు ప్రోత్సాహం కూడా భారతీయ విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. ఉన్నత విద్య కోసం మన సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఆయా దేశాల్లో కోర్సులు, పేరున్న విద్యాసంస్థలు, ప్రవేశ పరీక్షలు, ఫీజులపై స్పెషల్ ఫోకస్.. మొదటి ఓటు.. అమెరికాకే ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. భారత్లోని మిగతా నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు యూఎస్కు ఉన్నత విద్య కోసం వె ళ్తున్నట్లు తాజా సర్వే సైతం వెల్లడించింది. అక్కడ నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడమే ఇందుకు కారణం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం.. అమెరికాకు విదేశీ విద్యార్థుల రాక భారీగా పెరుగుతోంది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో 2012-13లో ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య 8,19,644. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 55 వేల మంది అధికంగా వచ్చారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా ఉండడం గమనార్హం. తర్వాత స్థానాల్లో చైనా, కొరియా విద్యార్థులు ఉన్నారు. అగ్రరాజ్యంలో నాణ్యమైన మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులో ఉండడం అన్ని దేశాల విద్యార్థులను ఆకర్షిస్తోంది. స్టూడెంట్స్లోని అసలైన శక్తిసామర్థ్యాలను వెలికితీసి, సుశిక్షితులైన మానవ వనరులుగా తీర్చిదిద్దేలా ఆయా కోర్సులు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ మిట్, స్టాన్ ఫోర్డ్, యేల్, హార్వర్డ్, ప్రిన్స్టన్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, న్యూయార్క్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, మిచిగాన్ యూనివర్సిటీ వంటి టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అమెరికాలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు కోర్సు ప్రారంభానికి ఏడాది నుంచి ఏడాదిన్నర ముందుగానే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 400 యూనివర్సిటీలు కామన్ అప్లికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికా యూనివర్సిటీలకు దరఖాస్తుకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు వ్యయమవుతుంది. అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉంటుంది. ఇతర ఖర్చులు అదనం. టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీమ్యాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ప్రతిభ చూపాలి. ఆస్ట్రేలియా విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్న మరోదేశం... ఆస్ట్రేలియా. అక్కడ 1200 విద్యాసంస్థలు, 22 వేల రకాల కోర్సులు ఉన్నాయి. 2013 జూలై నుంచి 2014 మార్చి వరకు 24,205 మంది భారతీయ విద్యార్థులు అస్ట్రేలియా స్టూడెంట్ వీసాలను పొందారు. గతంలో పోలిస్తే ఇది 32.9 శాతం అధికమని ఆస్ట్రేలియన్ హై కమిషన్ ప్రతినిధి వెల్లడించారు. ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్సలాండ్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ వంటి మంచి పేరున్న విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో విద్యాసంస్థలో ప్రవేశానికి, స్టూడెంట్ వీసా కోసం ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంచుకున్న యూనివర్సిటీని బట్టి దరఖాస్తుల తేదీలు వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమై డిసెంబర్లో ముగుస్తుంది. ఈ దేశంలో అండర్గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ డిగ్రీకి ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.8.5 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు అవుతుంది. జీవన వ్యయం దాదాపు రూ.10 లక్షలు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీల్లో చేరేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టుల్లో అర్హత సాధించడం తప్పనిసరి. యునెటైడ్ కింగ్డమ్ ప్రపంచంలోని అనేక ఆధునిక ఇన్స్టిట్యూట్స్కు ప్రేరణ ఆక్స్ఫర్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలని చెబుతారు. అలాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలు ఉన్న దేశమే యూకే. ఇక్కడ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లతోపాటు యూనివర్సిటీ కాలేజీ లండన్, ఇంపీరియల్ కాలేజీ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స, కింగ్స్ కాలేజీ లండన్ వంటి ప్రఖ్యాత కాలేజీలు ఉన్నాయి. యూకేలో దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్/అక్టోబర్ నుంచి జనవరిలోగా జరుగుతుంది. సెమిస్టర్ ప్రారంభానికి మూడు నెలలు ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం మేలు. యూకేలో విద్య ఖరీదైనదే. ఇక్కడ ట్యూషన్ ఫీజులు అధికంగానే ఉంటాయి. ప్రముఖ యూనివర్సిటీలో చదవాలంటే ఏడాదికి రూ.38 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర ఖర్చులు రూ.5 లక్షల వరకు ఉంటాయి. న్యూజిలాండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోసం న్యూజిలాండ్కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 50 శాతం పెరిగింది. నిబంధనలు సరళంగా ఉండటం, ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండటంతో మన విద్యార్థులు న్యూజిలాండ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ వర్సిటీలు ప్రతిఏటా స్థానం దక్కించుకుంటున్నాయి. ద యూనివర్సిటీ ఆఫ్ అక్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బెరీ, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్, ఏయూటీ యూనివర్సిటీ, వైకాటో యూనివర్సిటీ, మాస్సీ యూనివర్సిటీ. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ట్యూషన్ ఫీజు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు. కాస్ట్ ఆఫ్ లివింగ్ రూ.7 లక్షలు ఉంటుంది. న్యూజిలాండ్లో ఒక విద్యా సంవత్సరంలో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఫిబ్రవరి నుంచి జూన్, జూలై నుంచి నవంబర్. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య సమ్మర్స్కూల్ క్రెడిట్ కోర్సులను ఆఫర్ చేస్తారు. సెమిస్టర్లను బట్టి దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు ప్రారంభానికి 8 నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మేలు. ఫ్రాన్స్ స్టూడెంట్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న మరోదేశం.. ఫ్రాన్స్. ఫ్యాషన్, బిజినెస్, హాస్పిటాలిటీ కోర్సులను అందించడంలో ఫ్రాన్స్కు మంచి పేరుంది. అక్కడ బెస్ట్ అకడమిక్ ఇన్స్టిట్యూట్స్ ఉండడం, తక్కువ ఫీజులు, సరళమైన వీసా నిబంధనలు, ఎన్నో రకాల స్కాలర్షిప్స్, కోర్సు పూర్తయిన తర్వాత కూడా ఏడాదిపాటు దేశంలోనే ఉండేందుకు అనుమతి... వంటి సానుకూల కారణాల నేపథ్యంలో గత ఐదేళ్లలో ఫ్రాన్స్కు వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఈ దేశంలో ఎకోలీ నార్మలీ సుపీరియరీ, ఎకోలీ పాలిటెక్నిక్, యూనివర్సిటీ ఫియరీ ఎట్ మేరీ క్యూరీ వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీసా కోసం మూడు నెలలు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రాన్స్లో ట్యూషన్ ఫీజు ప్రతి సెమిస్టర్కు రూ.50 వేలు. ఇతర ఖర్చులు రూ.24 వేల నుంచి రూ.49 వేల వరకు ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవసరంలేదు. ముందస్తు ప్రణాళికతో సులభంగా ‘వీసా’.. ‘‘స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక విద్యార్థులు వీలైనంత ముందుగా అడ్మిషన్కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం. తర్వాత దశలో.. ఆఫర్ లెటర్, యాక్సప్టెన్స్ లెటర్ ఆధారంగా జారీ చేసే వీసా ప్రాసెస్ను విజయవంతంగా ముగించుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా దేశాల్లోని ఇన్స్టిట్యూట్లలో చదవాలనుకునే విద్యార్థులు అడ్మిషన్ ప్రక్రియను అకడెమిక్ సెషన్ ప్రారంభానికి ముందు 12 నుంచి 8 నెలల సమయంలో మొదలుపెట్టాలి. దీనివల్ల అడ్మిషన్ లెటర్ సరైన సమయంలో చేతికందుతుంది. వీసా దరఖాస్తుకు తగిన సమయం అందుబాటులో ఉంటుంది. సాధారణంగా వీసా మంజూరుకు నాలుగు నుంచి ఆరు వారాల గడువు పడుతుంది. కాబట్టి అకడెమిక్ సెషన్ ప్రారంభానికి నెల రోజుల ముందు నాటికే వీసా చేతిలో ఉండే విధంగా మొత్తం ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఆఫర్ లెటర్ ఆధారంగా మంజూరు చేసే వీసా విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా యూఎస్ వీసా (ఐ-20) జారీ క్రమంలో ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థి.. సదరు కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధంగా సమాధానం ఇవ్వాలి. అంతేకాకుండా స్టడీ అబ్రాడ్ కోణంలో ఒక దేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్న విద్యార్థులు తర్వాత దశలో తమకు సరితూగే ఇన్స్టిట్యూట్లను, యూనివర్సిటీలను అన్వేషించాలి. వాటికి సదరు ప్రభుత్వ నియంత్రణ సంస్థల గుర్తింపు ఉందో, లేదో క్షుణ్నంగా పరిశీలించాలి. గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం ఖరారైతేనే అడ్డంకుల్లేకుండా వీసా మంజూరవుతుంది’’ -అరుళ్ జోసఫ్, మేనేజర్, స్టడీ ఓవర్సీస్- గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ -
ఎన్కౌంటర్లో తీవ్రవాది హతం
జమ్మూ: తూర్పు కాశ్మీర్ హంద్వారా బెల్ట్లో ఆర్మీ జవాన్లకు, తీవ్రవాదులకు మంగళవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్లో ఓ తీవ్రవాది మరణించాడని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు. గస్తీ తిరుగుతున్న జావాన్లపైకి తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని... దాంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు తీవ్రవాదులపైకి ఎదురు కాల్పులకు దిగారు. దీంతో ఓ విదేశీ తీవ్రవాది హతమైయ్యాడని ఉన్నతాధికారి తెలిపారు. -
విదేశీ భాషల నిలయం.. ‘ఇఫ్లూ’
ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ.. సంక్షిప్తంగా ఇఫ్లూ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్గా 1958లో ఇంగ్లిష్ కోర్సుల బోధనతో హైదరాబాద్లో ప్రారంభమైంది. కాలక్రమంలో ఇంగ్లిష్తోపాలు పలు విదేశీ భాషలూ బోధిస్తూ.. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్గా పేరు మార్చుకొని పరిధిని మరింత విస్తృతం చేసింది. 2007లో సెంట్రల్ యూనివర్సిటీ హోదాను సొంతం చేసుకుని విభిన్న కోర్సులను అందిస్తూ.. నానాటికీ విస్తరిస్తున్న ఇఫ్లూపై ఇన్స్టిట్యూట్ వాచ్.. ఇంగ్లిష్, ఇతర విదేశీ భాషల్లో పదుల సంఖ్యలో కోర్సులను అందిస్తోంది ఇఫ్లూ. ఆయా భాషల్లో నెపుణ్యం పొందేలా మెరుగైన బోధన అందిస్తూ.. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేష గుర్తింపు పొందింది. ప్రతిఏటా ఇక్కడ ప్రవేశం పొందుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ ఇఫ్లూ తన క్యాంపస్లను విస్తరిస్తోంది. హైదరాబాద్ ప్రధాన క్యాంపస్గా ఉన్న ఈ యూనివర్సిటీ.. ఇప్పుడు షిల్లాంగ్, లక్నో, మలప్పురం(కేరళ) సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసి పలు కోర్సులను అందిస్తోంది. తద్వారా అన్ని ప్రాంతాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా నిరంతర ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంగ్లిష్ టు రష్యన్.. పలు భాషలు, విస్తృత కోర్సులు ఇఫ్లూలో ఇంగ్లిష్తోపాటు అరబిక్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, జపనీస్ కోర్సులను ప్రస్తుతం ఆఫర్ చేస్తున్నారు. ఇంగ్లిష్ భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా అనేక కోర్సులను రూపొందించింది. ఇంగ్లిష్ లిటరరీ స్టడీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్లు ఈ కోవకే చెందుతాయి. పలు స్థాయిల్లో అకడమిక్ కోర్సులు ఇఫ్లూలో సర్టిఫికెట్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా వరకు పలు స్థాయిల్లో, భాషల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషల్లో బ్యాచిలర్స్ డిగ్రీ (ఆనర్స్), పీజీ కోర్సులు ఇందుకు ఉదాహరణలు. వీటిలో బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధిత భాషలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతలు అర్హతలు. ఇంగ్లిష్కు సంబంధించి ఇఫ్లూకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందిస్తున్న కోర్సులు.. ఇంగ్లిష్లో బీఏ (ఆనర్స్). అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంగ్లిష్లో బీఈడీ. అర్హత: బీఏ(ఇంగ్లిష్) లేదా ఎంఏ (ఇంగ్లిష్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంఏ (ఇంగ్లిష్). అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. భాష నైపుణ్యాలతో మరెన్నో.. ఆయా భాషలకు సంబంధించి నైపుణ్యాలు అందించే విధంగా కోర్సులను ప్రవేశపెట్టిన ఇఫ్లూ.. మరెన్నో ఇతర కోర్సులను కూడా అందిస్తోంది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మాస్టర్స్ ఇన్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లిష్ వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు. హిందీలోనూ కోర్సులు ప్రవేశపెట్టడం ఇన్స్టిట్యూట్ అనుసరిస్తున్న వైవిధ్య విధానాలకు నిదర్శనం. అంతేకాకుండా ఇన్స్టిట్యూట్ అందిస్తున్న ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులన్నింటిలోనూ పీహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంది. ఔత్సాహికులకు స్పోకెన్ ఇంగ్లిష్, పార్ట్టైం కోర్సులు ఇంగ్లిష్ భాష ఔత్సాహికులు, నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే వారికి ప్రత్యేకంగా కొన్ని పార్ట్టైం కోర్సులు కూడా ఇఫ్లూలో అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్లో బేసిక్, అడ్వాన్స్డ్ ప్రొఫిషియన్సీ కోర్సులు ఇందులో ప్రధానమైనవి. వీటితోపాటు ఇతర ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల్లో ఇంగ్లిష్ భాష నైపుణ్యాలు పెంచే విధంగా స్వల్ప కాలిక వ్యవధిలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులను కూడా ఇఫ్లూ నిర్వహిస్తోంది. ఏఐఈఎల్టీఏ.. ఇఫ్లూ మరో ప్రత్యేకం ఆల్ ఇండియా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ అథారిటీ (ఏఐఈఎల్టీఏ) పేరుతో ఇఫ్లూ జాతీయ స్థాయిలో.. నిర్వహించే పరీక్ష ఇది. దీనికి ఔత్సాహికులు ఎవరైనా హాజరు కావచ్చు. ఇందులో మార్కుల ఆధారంగా అభ్యర్థులు తమకు ఇంగ్లిష్ భాష నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ సదుపాయం కూడా.. ఇఫ్లూలో ప్రతి ఏటా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. సగటున 92 శాతం మంది విద్యార్థులు వీటిలో విజేతలుగా నిలుస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలల నుంచి మన దేశంలోని వివిధ దేశాల ఎంబసీలు, టూరిజం సంస్థలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, బీపీఓ, కేపీఓ రంగంలోని కంపెనీలు ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్గొంటున్నాయి. పీజీ విద్యార్థులకు సగటున రూ.3 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. వేల సంఖ్యలో రిఫరెన్స బుక్స్, జర్నల్స్ లాంగ్వేజెస్ కోర్సులో నైపుణ్యాలు పొందాలంటే.. పలు రిఫరెన్స్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఇఫ్లూలో చక్కటి లైబ్రరీ సదుపాయం కూడా ఉంది. వేల సంఖ్యలో రిఫరెన్స్ పుస్తకాలతోపాటు దాదాపు 15 వందలకుపైగా పీహెచ్డీ థీసిస్లు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులు ఆయా అంశాలకు సంబంధించి పూర్తి అవగాహన పొందొచ్చు. అంతేకాకుండా యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన విద్యార్థులు అందజేసిన థీసిస్లను డిజిటలైజేషన్ పద్ధతిలో అమర్చి విద్యార్థులందరూ ఇంటర్నెట్లో చూసే అవకాశం కూడా కల్పించింది. డిస్టెన్స్ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ఇఫ్లూ రెగ్యులర్ కోర్సులతోపాటు దూర విద్యా విధానంలోనూ పీజీ కోర్సులను అందిస్తోంది. 2014-15కు ఎంఏ ఇంగ్లిష్ (వ్యవధి రెండేళ్లు); పీజీడీటీఈ (వ్యవధి: ఏడాది) ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తోంది. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 31. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. వెబ్సైట్: http://www.efluniversity.ac.in/ త్వరలో మరికొన్ని కోర్సులు.. ‘‘లాంగ్వేజ్ స్టడీస్లో పలు కోర్సులను అందిస్తున్న ఇఫ్లూకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. త్వరలో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశ పెట్టే ఆలోచన కూడా ఉంది. జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాల విద్యార్థులకూ అందుబాటులో ఉండేలా క్యాంపస్లను విస్తరిస్తున్నాం. ఇఫ్లూ కోర్సులకు విద్యార్థుల ఆదరణ పెరుగుతోంది. నేటి పోటీ ప్రపంచంలో మాతృభాషతోపాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ (రీడింగ్, స్పోకెన్) స్కిల్స్ ప్రాధాన్యం పెరుగుతుండటమే ఇందుకు కారణం. ఈ దిశగా సమాజ అవసరాలకు అనుగుణంగా కరిక్యులంలోనూ మార్పులు చేస్తున్నాం. త్వరలో మరికొన్ని కోర్సులను అందించేందుకు కృషి చేస్తున్నాం’’ - ప్రొఫెసర్ సునయన సింగ్, వైస్ ఛాన్స్లర్, ఇఫ్లూ ఇఫ్లూ ప్రత్యేకం.. పీహెచ్డీ ప్రోగ్రామ్స్ ఇఫ్లూకు ప్రత్యేకంగా ట్రేడ్ మార్క్గా నిలుస్తున్న మరో అంశం.. ఇక్కడ ఉన్న పీహెచ్డీ కోర్సులు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్; లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్; కంపేరిటివ్ లిటరేచర్ అండ్ ఇండియన్ స్టడీస్; ఇంగ్లిష్ లిటరేచర్; ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్; ట్రాన్స్లేషన్ స్టడీస్; కల్చరల్ స్టడీస్; ఫిల్మ్ స్టడీస్; సోషల్ ఎక్స్క్లూజన్ స్టడీస్ వంటి విభాగాల్లో పీహెచ్డీ కోర్సులున్నాయి. వీటిలో ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్; కంపేరిటివ్ లిటరేచర్ అండ్ ఇండియన్ స్టడీస్లో పీహెచ్డీలపై విదేశీ విద్యార్థులు అమితమైన ఆసక్తి చూపుతున్నారు. -
ఇద్దరికే అత్యధికం
►సచిన్ జట్టులో భారత సంతతి ఫుట్బాలర్ ►49 మందితో విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్ ►ఇండియన్ సూపర్ లీగ్ ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్లో గురువారం జరిగిన విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్లో ఇద్దరికే అత్యధిక ధర పలికింది. ఫ్రాన్స్కు చెందిన బెర్నార్డ్ మెండీ, జార్జి ఆర్నోలిన్లకు అత్యధికంగా 80 వేల డాలర్లు (రూ. 48 లక్షల 55 వేలు) దక్కాయి. మెండీని చెన్నై జట్టు, జార్జిని గోవా జట్టు తీసుకున్నాయి. ఐఎస్ఎల్లో ఆడబోతున్న మొత్తం 56 మంది విదేశీ ఆటగాళ్లకు గాను 49 మందిని డ్రాఫ్ట్లో ఉంచారు. మిగతా ఏడుగురు నాలుగు ఫ్రాంచైజీలతో నేరుగా ఒప్పందాలు చేసుకున్నారు. జుంకర్, మోర్టాన్ స్కోబో (ఢిల్లీ), బెలార్డీ, సిరిలో (పుణే), చాన్సా, గ్లెన్ (నార్త్ఈస్ట్ ఎఫ్సీ), బోర్జా ఫెర్నాండేజ్ (కోల్కతా)లు ఇందులో ఉన్నారు. ఏడు రౌండ్ల పాటు జరిగిన ఈ డ్రాఫ్ట్లో 8 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్రాంచైజీ ‘కేరళ బ్లాస్టర్స్’... భారత సంతతికి చెందిన ఇంగ్లిష్ ఫుట్బాలర్ మైకేల్ చోప్రాను 58,185 డాలర్లకు (రూ. 35 లక్షల 31 వేలు) కొనుగోలు చేసింది. స్పెయిన్ ఫుట్బాలర్ గోంజాలెజ్కు 70 వేల డాలర్ల (రూ. 42 లక్షల 48 వేలు)తో రెండో అత్యధిక ధర పలికింది. కోల్కతా ఫ్రాంచైజీ ఇతన్ని తీసుకుంది. ఓవరాల్గా డ్రాఫ్ట్లో ఉన్న 34 మందికి ఒక్కొక్కరికి 58,185 డాలర్లు దక్కనున్నాయి. మరో 12 మందికి ఒక్కోకరికి 38,790 డాలర్లు (రూ. 23 లక్షల 54 వేలు) చెల్లించనున్నారు. ఈ టోర్నీ అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనుంది. షెడ్యూల్ను ప్రకటించాల్సి ఉంది. స్పెయిన్ నుంచి 9 మంది అత్యధికంగా స్పెయిన్ నుంచి 9 మంది ఆటగాళ్లను ఐఎస్ఎల్ డ్రాఫ్ట్లో ఉంచారు. ఫ్రాన్స్ (8), చెక్ రిపబ్లిక్ (8), బ్రెజిల్ (5), పోర్చుగల్ (5), కొలంబియా (4), దక్షిణ కొరియా (2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అర్జెంటీనా, కెనడా, సెర్బియా, సెనెగల్, బుర్కినా ఫాసో, ఇంగ్లండ్, గ్రీస్, కామెరూన్ల నుంచి ఒక్కొక్కరు డ్రాఫ్ట్లో ఉన్నారు. బెంగళూరు స్థానంలో చెన్నై ఫ్రాంచైజీ ఐఎస్ఎల్ నుంచి తప్పుకున్న బెంగళూరు స్థానంలో చెన్నై ఫ్రాంచైజీని తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్కు ముందు ఈ అంశాన్ని టోర్నీ సీఈఓ అనుపమ్ దత్తా ప్రకటించారు. అయితే చెన్నై ఫ్రాంచైజీ యజమానులు ఎవరనేది వెల్లడించలేదు. డ్రాఫ్ట్లో ఆ ఫ్రాంచైజీ తరఫున ప్రశాంత్ అగర్వాల్ అనే వ్యక్తి పాల్గొన్నారు. -
విదేశీ ఉద్యోగానికి ఓ ‘వీసా’!
టాప్ స్టోరీ: సొంత రాష్ట్రంలోని ఓ మంచి సంస్థలో పాతిక వేల జీతం వచ్చే ఉద్యోగం లభిస్తే సాదాసీదాగా బతుకుబండి లాగించేయొచ్చు- కాలేజీ నుంచి కాలు బయటపెట్టింది మొదలు కొందరి ఆలోచనలు ఇలానే సాగుతాయి! మరికొందరు మాత్రం ఎలాగోలా కాదు.. కొలువు అడుగులో ప్రత్యేకత ఉండాలి, డాలర్ల వర్షం కురిపించే విదేశీ ఉద్యోగం కావాలని కలలు కంటారు. ముఖ్యంగా ఎంతో ముందుచూపుతో ఆలోచించే హైదరాబాద్ యువత.. తమ కలలను నిజం చేసుకునేందుకు కాలేజీలో ఉండగానే ప్రయత్నాలు మొదలెడతారు. అసలు నవతరం కుర్రకారుకు ఏ దేశాల్లో, ఏఏ రంగాల్లో అవకాశాలున్నాయి? విదేశీ ఉద్యోగానికి ఆయా దేశాల్లో ‘వీసా’ విధానాలు, నిబంధనలపై స్పెషల్ ఫోకస్.. ‘గో అబ్రాడ్.. జాబ్ అబ్రాడ్’.. లక్ష్యంగా నిర్దేశించుకుంటున్న యువత ఇటీవలి కాలంలో పెరుగుతోంది. నగరంలోని అధిక శాతం మంది ఇంజనీరింగ్ విద్య పూర్తిచేస్తుండటం, ఐటీ రంగం విస్తృతమవుతుండటం ఈ ధోరణికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మన యువతను నియమించుకునేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు, కష్టపడి పనిచేసే ఓర్పు, ఎలాంటి వాతావరణంలోనైనా ఇమిడిపోగల నేర్పు తెలుగు విద్యార్థుల సొంతం. అందుకే మన యువతను విదేశీ సంస్థలు సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. వీసాల కోసం విశ్వ ప్రయత్నం: విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వీసా కోసం ఔత్సాహికులు చేయని ప్రయత్నమంటూ ఉండదు. గుళ్లూ, గోపురాల చుట్టూ కూడా తిరుగుతారు. ‘వీసా వచ్చేలా ఆశీర్వదించాలని’ మనసారా కోరుకుంటారు. వీసా ఇచ్చేందుకు దేశాలు వివిధ నిబంధనలను నిర్దేశిస్తాయి. వీటిలో కొన్ని ప్రత్యేకంగా కనిపిస్తాయి. వివిధ దేశాల వీసా నిబంధనలను పరిశీలిస్తే.. అమెరికా: అమెరికా వీసాలలో ప్రముఖమైంది హెచ్1-బి వీసా. ఇది ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్, మెడిసిన్ వంటి ప్రత్యేక రంగాలకు చెందిన వివిధ దేశాల నిపుణులు యూఎస్లో పనిచేసేందుకు వీలుకల్పిస్తుంది. అమెరికా కంపెనీ.. తాను నియమించుకోబోయే వ్యక్తి వీసా కోసం యూఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంటుకు దరఖాస్తు చేయాలి. ఐటీ బూమ్ నేపథ్యంలో.. ఈ వీసాకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. హెచ్1-బీ వీసా పొందడంలో తీవ్ర ఇబ్బంది లేకున్నా, అన్ని దేశాలకూ కలిపి ఆర్థిక సంవత్సరానికి జనరల్ కేటగిరీకి 65వేల పరిమితి ఉండటం నిరాశ కలిగించే అంశం. అమెరికా పౌరసత్వం, ప్రవాస సేవల విభాగం కంప్యూటర్ ద్వారా లాటరీ తీస్తుంది. అందుకే వీసా రావడానికి అదృష్టం తోడుకావాలని అంటారు. హెచ్1-బీ వీసాను ప్రాథమికంగా మూడేళ్లకు మంజూరు చేస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. యూరోపియన్ యూనియన్: వీసా పొందేందుకు నాలుగు నుంచి 8 వారాలు పడుతుంది. సెంగెన్ వీసా అనేది ఒక విజిటర్ వీసా. దీని సహాయంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) పరిధిలో ఉన్న 22 దేశాలతో పాటు మరో మూడు ఇతర దేశాల్లో పర్యటించవచ్చు. ఒకే పర్యటనలో 25దేశాలను సందర్శించేందుకు ఈ వీసా ఉపకరిస్తుంది. కానీ, యూరోపియన్ యూనియన్ వర్క్ వీసాకు సంబంధించి ఇలాంటి ఏర్పాట్లు లేవు. ఏ దేశంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నామో ఆ దేశానికి విడిగా వర్క్ వీసా కోసం దరఖాస్తు చేయాల్సిందే! ఉదాహరణకు ఒక కంపెనీకి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలో కార్యాలయాలు ఉన్నాయనుకుంటే.. వాటిలో పనిచేయాలంటే విడివిడిగా బహుళ ప్రవేశ (మల్టీ ఎంట్రీ) వీసాలు ఉండాల్సిందే. దీన్నుంచి కొంత వరకు ఉపశమనం కలిగించేందుకు ఈయూ ఇంట్రా కార్పొరేట్ ట్రాన్స్ఫ్రీ వీసాను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో ఈయూలోని ఏ దేశంలోనైనా 90 రోజుల వరకు పనిచేయొచ్చు. దక్షిణాఫ్రికా: ఓ అభ్యర్థి వీసా కోసం తాను పనిచేసిన అన్ని దేశాల నుంచి పోలీసు సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. తాను పనిచేసిన ప్రాంతంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్న విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు ఈ సర్టిఫికెట్లను తప్పనిసరి చేశారు. ఉదాహరణకు ఐదేళ్ల కింద ఓ వ్యక్తి బెల్జియంలో ఆర్నెల్లు పనిచేస్తే ఇప్పుడు ఆయన దక్షిణాఫ్రియా వీసా పొందాలంటే బెల్జియం పోలీసుల నుంచి సర్టిఫికెట్ తీసుకొని సమర్పించాలి. సింగపూర్: సింగపూర్లోని ఏదైనా కంపెనీ.. విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే, వారికి స్థానిక ఉద్యోగుల కంటే 15 శాతం నుంచి 20 శాతం మేర అధిక వేతనాలు చెల్లించాలి. విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకోవడం తగ్గించి, స్థానికులకు అవకాశాలు పెరిగేలా చేయడం దీని ఉద్దేశం. సింగపూర్లో వర్క్ పర్మిట్ ప్రక్రియను మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ చూస్తుంది. సింగపూర్లో రకరకాల వర్క్ పర్మిట్లు ఉన్నాయి. ఇవి జీతం, ఉద్యోగం, నైపుణ్యాలు, పని అనుభవం ఆధారంగా ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ పాస్, ఎస్ పాస్, వర్క్ పర్మిట్ అనేవి ఉంటాయి. వీటికోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్రెజిల్: వర్క్ వీసా కంటే టూరిస్టు వీసాతో పర్యటించడం తేలిక. వర్క్ పర్మిట్ తీసుకునేందుకు మూడు నెలల వరకు పడుతుంది. పనికోసం తాత్కాలిక వర్క్ వీసా పొందాలంటే బ్రెజిల్కు చెందిన కంపెనీ, ప్రభుత్వ విభాగం లేదంటే బ్రెజిల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలో జాబ్ ఆఫర్ పొందాలి. సదరు ఉద్యోగి తరఫున కంపెనీ.. ఇమ్మిగ్రేషన్ డివిజన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్కు దరఖాస్తు చేయాలి. సరైన విద్యార్హతలు, పని అనుభవం, కంపెనీతో సరైన ఉద్యోగ ఒప్పందం, ఎలాంటి నేర నేపథ్యం లేదని చూపే పోలీసు నివేదిక, వైద్య పరీక్షల నివేదికలు వంటివి సంతృప్తికరంగా ఉంటేనే వర్క్ వీసా లభిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి రెండు నుంచి మూడు నెలలు పడుతుంది. ఆస్ట్రేలియా నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు, అక్కడ గుర్తింపు ఉన్న సంస్థలో ఉద్యోగం చేసేందుకు ‘457 వీసా ప్రోగ్రామ్’ వీలుకల్పిస్తుంది. దీని పూర్తి పేరు.. ‘ది టెంపరరీ వర్క్(స్కిల్డ్) వీసా (సబ్ క్లాస్ 457). ఈ వీసా ఆధారంగా నాలుగేళ్ల వరకు పనిచేయొచ్చు. ఒక ఆస్ట్రేలియా సంస్థ ఇతర దేశానికి చెందిన వ్యక్తిని ఉద్యోగిగా నియమించుకునే ముందు స్థానికంగా ఓ ప్రకటన విడుదల చేయాలి. ఏ నైపుణ్యం కలిగిన వ్యక్తిని ఇతర దేశాల నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారో అందులో వివరించాలి. స్థానికంగా సంబంధిత నిపుణులు లేకపోతేనే విదేశీయులను నియమించుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఈ ప్రక్రియను లేబర్ మార్కెట్ టెస్టింగ్ (ఎల్ఎంటీ)గా వ్యవహరిస్తారు. దీనికి కనీసం మూడు నెలలు పడుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎల్ఎంటీ నుంచి మినహాయింపు ఉంటుంది. దీన్నుంచి ఐటీ నిపుణులను మినహాయించేందుకు నాస్కామ్ లాబీయింగ్ చేసింది. అన్ని దేశాల్లోనూ అవకాశాలు శ్రీజాబ్స్ అబ్రాడ్ ఔత్సాహికులకు అమెరికా, కెనడా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్.. ఇలా అన్ని దేశాల్లోనూ అవకాశాలు ఉన్నాయి. ఇతర విభాగాలతో పోల్చి తే సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు ఇవి మరింత ఎక్కువే. ఫ్రెషర్స్ కంటే మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్కు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల యువత ఎక్కువగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఉద్యోగాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగ అన్వేషణకు అభ్యర్థులకు రెం డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి నేరుగా తమ అనుభవానికి తగిన గమ్యాన్ని నిర్దేశించుకుని జాబ్ సెర్చ్ ఇంజిన్ సైట్ల ద్వారా తెలుసుకోవడం. రెండోది కన్సల్టెన్సీల ద్వారా ముందుకెళ్లడం. ఉద్యోగం ఖరారయ్యాక సదరు సంస్థ ఇచ్చే స్పాన్సర్షిప్ లెటర్ ఆధారంగా వర్క్ పర్మిట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వర్క్ పర్మిట్ వీసాల నిబంధనల గురించి ఆందోళన అనవసరం. సంస్థ నుంచి స్పాన్సర్షిప్ లెటర్ ఉంటే.. ఏ దేశమైనా వర్క్ పర్మిట్ వీసా రెండు నుంచి నాలుగు వారాల్లోపు మంజూరుచేస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు చేయాల్సిందల్లా అత్యున్నత నాణ్యతతో కూడిన రెజ్యూ మెను సిద్ధం చేసుకోవడం, కంపెనీలకు అవసరమైన స్కిల్స్ గురించి తెలుసుకుని వాటిపై అవగాహన పెంచుకోవడం.్ణ - ఎ. జయలలిత, డెరైక్టర్, వై-యాక్సిస్ ఓవర్సీస్ కెరీర్స్ ఆ దేశాలంటే మక్కువెక్కువ! విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే సిటీ యువత జాబితాలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉంటున్నాయి. అయితే ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో కూడా ఇటీవలి కాలంలో కొత్త కంపెనీలు ఎక్కువగా ఏర్పాటవుతుండటం.. ఉన్న వ్యాపారాలను విస్తృతం చేస్తుండటం వల్ల ‘గ్లోబల్ మేధస్సు’ కోసం అన్వేషణ అధికమైంది. ఆఫ్రికా దేశాల్లో ఆయిల్, గ్యాస్, మైనింగ్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ), టెలికాం, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిపుణులకు అధిక డిమాండ్ ఉన్నట్లు నియామక కన్సల్టెంట్ సంస్థలు చెబుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లో ఫైనాన్స్, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిటైల్ రంగాల్లో భారతీయ నిపుణులకు అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇక్కడి యువత ప్రయత్నిస్తోంది. -
మేడిన్ ఫారిన్
తోటకూర, పాలకూర, వంకాయులు, బెండకాయులు, బీరకాయులో.. వున వీధుల్లో వినిపిస్తూనే ఉంటారుు. తోపుడు బళ్ల మీద వచ్చిన కాయుగూరలు లోకలా, హైబ్రీడా అని అడిగి వురీ కొంటాం. హైబ్రీడ్ కూరగాయలు రుచి ఉండవని దేశవాళీకే మొగ్గు చూపిస్తాం. తాజాగా విదేశీ కూరగాయులు వీధుల్లోకి వచ్చి చేరాయి థాయ్ మిర్చి తింటే కారం నషాలానికి ఎక్కుతుంది. లెవున్ గ్రాస్ టేస్ట్ చేస్తే వున నివ్ముకాయు రుచిని వురిపిస్తుంది. ఇవే కాదు రంగు రంగుల క్యాప్సికమ్, క్యాబేజీ రకరకాల వెరైటీ వెజిటబుల్స్ విదేశాల నుంచి లోకల్ వూర్కెట్లోకి వచ్చి చేరుతున్నారుు. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లే కాదు కూరగాయుల్లో కూడా ఫారిన్ సరుకు దేశంలోకి వచ్చేస్తోంది. థాయ్లాండ్, చైనా, వులేసియూ తదితర దేశాల నుంచి దిగువుతైన కూరగాయలు సిటీవాసులకు కొత్త రుచులు చూపిస్తున్నారుు. దాదాపు 70 రకాల విదేశీ కూరగాయులు హైదరాబాద్లో దొరుకుతున్నాయి. ఆస్పరగస్, అవకొడో, బ్రొకొలీ, క్యాప్సికమ్ రెడ్ అండ్ ఎల్లో, సెలేరీ, చెర్రీ టమాటా, చైనీస్ పాక్చాయ్, చైనీస్ క్యాబేజీ, గలంగల్, లెమన్ గ్రాస్, థాయ్ బ్రింజాల్, లేట్యూస్ లీఫ్, జుకినీ వంటి వెరైటీలు సూపర్ వూర్కెట్లు, బడా వెజ్ వూర్కెట్లలో అందుబాటులో ఉంటున్నారుు. ఇవే కాకుండా పిజ్జా, సాండ్ విచ్లో ఉపయోగించే బేజిల్, ఆర్గెనో, చిల్లీ ఫ్లేక్స్, రోజ్ మేరీలు విదేశాల నుంచే ఇంపోర్ట్ అవుతున్నారుు. దిగువుతి ఇలా.. విదే శాల నుంచి కూరగాయుల దిగువుతికి ఆన్లైన్, ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఆయూ దేశాల నుంచి ఆకాశవూర్గంలో నేరుగా నగరానికి వచ్చి చేరుతున్నారుు. థాయ్లాండ్తో పాటు ఊటీ, పుణే, బెంగళూరు, న్యూఢిల్లీ నుంచి కూడా విదేశీ కూరగాయలు దిగుమతి అవుతున్నారుు. థాయ్ నుంచి కూరగాయులు ఆర్డర్ చేసిన వుూడు రోజుల్లో నగరానికి చేరుకుంటున్నారుు. ఈ విదేశీ వెజిటేబుల్స్కి ఇక్కడి సూపర్వూర్కెట్లలో వుంచి డివూండే ఉంది. కాంటినెంటల్, థాయ్, చైనీస్ వంటకాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంటోంది. - బొప్పిడి మాధవరెడ్డి డిమాండ్ బాగానే ఉంది నాలుగు నెలలుగా మేం విదేశీ కూరగాయులు విక్రరుుస్తున్నాం. డివూండ్ బాగానే ఉంది. సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు వివిధ స్టార్ హోటళ్లు, సూపర్ మార్కెట్లు, పిజ్జా సెంటర్లకు విదేశీ కూరగాయులు సప్లయ్ చేస్తు న్నాం. బల్క్ ఆర్డర్ ఉంటే హోం డెలివరీ సౌకర్యం ఉంది. వీటి ధరలు అందుబాటులోనే ఉంటారుు. - బాలకృష్ణ, తర్కారీ స్టోర్ యజమాని ఫొటోలు: రాజేష్రెడ్డి -
మావోయిస్టులకు యూరప్ నుంచి అండదండలు
మన దేశంలోని మావోయిస్టులకు జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్, ఇటలీ లాంటి యూరోపియన్ దేశాల నుంచి సాయం అందుతోంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్వయంగా తెలిపింది. ఈ విషయాన్ని ఆయా యూరోపియన్ దేశాలతో చర్చిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో తెలిపారు. ఫిలిప్పీన్స్, టర్కీ దేశాలలోని వామపక్షాలతో కూడా మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఫిలిప్పీన్స్కు చెందిన సీనియర్ కేడర్ భారతదేశంలో 2005, 2011లో శిక్షణ పొందారని ఆయన చెప్పారు. వివిధ ఎన్కౌంటర్లు, కూంబింగ్ ఆపరేషన్ల సమయంలో విదేశాలకు చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వామపక్ష తీవ్రవాదుల నుంచి మన భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయని రిజిజు వివరించారు. దీంతో.. వాళ్లు వివిధ దేశాల నుంచి ఆయుధాలు సేకరిస్తున్నట్లు స్పష్టం అవుతోందన్నారు. మావోయిస్టులకు విదేశాల నుంచి నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. -
పరభాషను ఒడిసిపట్టి.. వైవిధ్య కొలువు తలుపుతట్టి!
విదేశీ భాషలను నేర్చుకోవడంలో ముందుంటున్న నగర యువత మాతృభాష.. మనిషి మేధో వికాసానికి విలువైన వారధి! అలాంటి అమ్మ భాష ఆసరాగా విద్యా సుమాలను అందుకుంటూ, పరభాషలో ప్రావీణ్యం పెంచుకుంటోంది భాగ్యనగరం యువత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ.. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చుతున్న వేళ.. విదేశీ భాషా నైపుణ్యాలున్న వారికి కార్పొరేట్ ప్రపంచం ఆకర్షణీయ వేతనాలతో స్వాగతం పలుకుతోంది. అందుకే విదేశీ భాషను ఒడిసిపట్టి, వైవిధ్యమైన కొలువును చేజిక్కించుకుంటామంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్.. ఐటీ రంగంలో దూసుకెళ్తుతున్న నగరం. అనేక విదేశీ కంపెనీలు భాగ్యనగరంలో ప్రవేశించి వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేసుకుంటున్నాయి. ఇక్కడి కంపెనీలు కూడా విదేశీ కంపెనీలతో జతకడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు, ప్రాజెక్టుల అప్పగింత వంటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు విదేశీ భాషా నైపుణ్యాలున్నవారు అవసరమవుతున్నారు. విదేశాల్లో చదువుకొని అక్కడే కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకున్నవారు అధికమయ్యారు. ఇలాంటి వారు కూడా ఫారెన్ లాంగ్వేజ్లను నేర్చుకుంటున్నారు. నగరానికి చెందిన భార్యభర్తలు ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. ఓ కంపెనీలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రముఖ కంపెనీ అడోబ్కు దరఖాస్తు చేసుకుంటే.. జర్మన్ భాషా పరిజ్ఞానం కలిగిన భార్యకు కంపెనీని నుంచి ఆఫర్ వచ్చింది. దాంతో భర్తకు కూడా జర్మనీ నేర్పించే పనిలో పడింది ఆ ఇల్లాలు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏలు చదివి ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్కు ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ లలో ఏదో ఒక భాష వచ్చి ఉండటం కెరీర్ ఉన్నతికి, మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవడానికి దోహదపడుతోంది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని నగరంలోని పలు సంస్థలు విదేశీ భాషలకు సంబంధించి వివిధ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. అదనపు అర్హత: ఒక్క ఐటీ కంపెనీల్లోనే కాదు.. బ్యాంకింగ్, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఉద్యోగాలు సంపాదించేందుకు విదేశీభాషా నైపుణ్యాలు అదనపు అర్హతగా ఉపయోగపడతాయంటున్నారు ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రొఫెసర్లు. కర్నూలు జిల్లా నుంచి నగరానికి వచ్చిన అనంతరాములు స్నేహితులతో కలిసి ‘లాటిన్’ నేర్చుకున్నాడు. విదేశీ బ్యాంకు హైదరాబాద్లో శాఖను ప్రారంభించి, ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. ఓ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూకు వచ్చిన వారితో పోల్చితే రాములుకు తక్కువ మార్కులు వచ్చినా, లాటిన్ భాష ప్రత్యేకత ఉన్న ఆయన్నే ఉద్యోగం వరించింది. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చిన యువతకూ విదేశీ భాషలు ఉద్యోగ అవకాశాలకు ఆయువుపట్టుగా మారుతున్నాయి. అవకాశాలు ఇలా: విదేశీ భాష కోర్సులను పూర్తిచేసిన వారిలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్లేషన్. విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు, వ్యాపార నివేదికలు, ఒప్పంద పత్రాలు వంటి వాటిని తర్జుమా చేసేందుకు ట్రాన్స్లేటర్లు అవసరమవుతున్నారు. ఒకరి మాటలను అనువదించి మరొకరికి అప్పటికప్పుడు వినిపించడమే ఇంటర్ప్రెటర్స్ పని. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు ఇంటర్ప్రెటర్స్ అవసరం ఉంటుంది. సదస్సులు, ఒక దేశ వాణిజ్య బృందం మరొక దేశంలో పర్యటించే సమయంలోనూ ఈ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే క్రమంలో విమానయాన, పర్యాటక, ఆతిథ్య సంస్థలు ఉద్యోగ నియామకాల్లో విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. విదేశీ భాషల కోర్సులు పూర్తిచేసిన వారికి మరో ఉపాధి వేదికగా బోధన రంగం ఉంటోంది. విదేశీ భాషలను నేర్చుకోవాలనుకుంటున్న ఔత్సాహికులు ఎక్కువ కావడంతో.. ఫ్యాకల్టీకి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆయా సంస్థలు.. తమ దగ్గర కోర్సులు పూర్తిచేసిన వారికి, వెంటనే భారీ వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం పలు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు విదేశీ భాషల కోర్సులను నిర్వహిస్తున్నాయి. విదేశీ భాషల్లో పట్టు సాధించినా, పూర్తిస్థాయి ఉద్యోగంపై ఆసక్తి లేని వారు ఫ్రీలాన్సింగ్ ద్వారా అధిక మొత్తాలను ఆర్జిస్తున్నారు. సొంతంగా భాష శిక్షణ కేంద్రాలను, ట్రాన్స్లేటింగ్, ఇంటర్ప్రెటింగ్ సేవల సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. దూరవిద్యలో: విదేశీ భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఇఫ్లూ ‘ది స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్’ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ, విదేశీ భాషలను నేర్పిస్తోంది. విదేశీ భాషలు నేర్చుకునేందుకు అవసరమైన పుస్తకాలను సైతం విక్రయిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని జర్మనీ సాంస్కృతిక సంస్థ గోథె జంత్రం (ఎౌ్ఛ్టజ్ఛ్డ్ఛ్టిటఠఝ) జర్మన్ భాషను, అలియన్స్ ఫ్రాంచైజ్ ఫ్రెంచి భాషలో కోర్సులను అందుబాటులో ఉంచాయి. విద్యార్థుల రోజువారీ చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా ఉదయం, సాయంత్రం బ్యాచ్లను నడుపుతున్నాయి. దోమలగూడలోని రామకృష్ణమఠం ఆధ్వర్యంలోని ‘వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్’.. ఏటా జనవరి, జూన్, సెప్టెంబరు నెలల్లో విదేశీ భాషల తరగతులను నిర్వహిస్తోంది. ఇక్కడ సంస్కృతం, హిందీతో పాటు ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచి, జపనీస్, స్పానిష్ వంటి విదేశీ భాషలను నేర్పుతున్నారు. ఔత్సాహికులు తమకు అనువైన సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గతేడాది ఇక్కడ విదేశీ భాషలు నేర్చుకునేందుకు నాలుగు వేల మందికిపైగా ఆసక్తి కనబరచడం విశేషం. ఫీజులు: విదేశీ భాషలు నేర్చుకునేందుకు స్థాయిలనుబట్టి (లెవెల్ 1, లెవెల్ 2..) ఫీజులు వసూలు చేస్తున్నారు. సంస్థను బట్టి ఈ ఫీజులు రూ.1200 నుంచి రూ.5 వేల వరకు ఉంటున్నాయి. జర్మన్, ఫ్రెంచ్ భాషలకు అధిక ఫీజులుంటున్నాయి. ప్రముఖ సంస్థలు: హైదరాబాద్లో ప్రధాన క్యాంపస్ను కలిగిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి.. విదేశీ భాషల కోర్సుల నిర్వహణలో మంచి పేరుంది. ఇఫ్లూ.. జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్ వంటి భాషల కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఏ, ఎంఏ స్థాయిలో కోర్సులను అందిస్తోంది. రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో పీహెచ్డీ కూడా ఉంది. వెబ్సైట్: www.efluniversity.ac.in రామకృష్ణమఠం: జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషల తరగతులు నిర్వహిస్తోంది. వెబ్సైట్: www.rkmath.org గోథె జంత్రం (Goethe-zentrum): జర్మన్లో ఎక్స్టెన్షివ్, ఇంటెన్షివ్ తదితర కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.goethe.de అలియన్స్ ఫ్రాంచైజ్: ఫ్రెంచ్ భాషలో శిక్షణ ఇస్తోంది. వెబ్సైట్: www.alliancefranchise.org విదేశీభాషపై పట్టు సులభమే ఇతర భాషలను నేర్చుకోవటమంటే.. వారి సంస్కృతీ, సంప్రదాయాలను అర్థంచేసుకోవటమే. కేవలం ఉద్యోగావకాశాలకేకాకుండా.. ఆయా దేశాల ప్రజల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, చరిత్ర తెలుసుకునే గొప్ప అవకాశం. ఇఫ్లూలో యూజీ నుంచి పీహెచ్ డీ వరకూ కోర్సులున్నాయి. ఇవిగాకుండా బయటి విద్యార్థుల కోసం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. వీటికి జనవరి-ఏప్రిల్, ఆగస్టు-నవంబరు నెలల్లో క్లాసులు ప్రారంభిస్తుంటాం. ప్రపంచీకరణ ప్రభావంతో విదేశీభాషలు నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలకు ఢోకాలేదు. ఇఫ్లూలో బీఏ ఫైనలియర్లో ఉన్నప్పుడే ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. టెలిమార్కెటింగ్, బీపీవో, బ్యాంకింగ్, విదేశీ మంత్రిత్వశాఖ, దుబాసీలుగా మంచి అవకాశాలున్నాయి. ఫ్రెంచి, జర్మన్, స్పానిష్, అరబిక్, జపనీస్ భాషలకు మంచి క్రేజ్ ఉంది. వీటిలో ఫ్రెంచ్, జర్మన్లదే హవా అని చెప్పాలి. ఇంగ్లిషును తేలిగ్గా నేర్చుకునే ఇక్కడి విద్యార్థులు మరికొంత శ్రమిస్తే.. విదే శీభాషలు అలవోకగా నేర్చుకోవచ్చు. -వెంకటరెడ్డి, రిజిస్ట్రార్(ఇఫ్లూ) -
విదేశీ భాషల్లో ప్రత్యేక కోర్సులు
న్యూఢిల్లీ: ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీస్, జపనీస్, ఇటాలియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవాలనుకుంటున్నారా? వైద్య పర్యాటకంలో దూసుకుపోతున్న పాష్తో, క జకి, టర్క్మెనిన్, ఉజ్బెక్ వంటి వాటిల్లో పట్టు సాధించాలనుకుంటున్నారా? అయితే మీకు జామియా మిలియా ఇస్లామియా(జేఎమ్ఐ) విశ్వవిద్యాలయం ఆ అవకాశం కల్పిస్తోం ది. మధ్య ఆసియా భాషల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తోంది ఈ యూనివర్సిటీ. ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యన్, పోర్చుగీస్, స్పానిష్ వంటి పలు యూరోపియన్ భాషల్లో కూడా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను జేఎమ్ఐ యూనివర్సిటీ అందిస్తోంది. పాష్టోకి కూడా ఇక్కడ డిమాండ్ బాగానే ఉంది. ఆ భాషలో 20 సీట్లు ఉంటే అందులో అన్నీ భర్తీ అయ్యాయని యూనివర్సిటీ పర్షియన్ విభాగంఅధినేత ఇరాక్ రజా జైదీ చెప్పారు. పాష్తో, ఇతర పర్షియన్ భాషల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులను కూడా అందజేస్తున్నామని తెలిపారు. అఫ్గానిస్తాన్తోపాటు ఇతర పొరుగు దేశాలనుంచి వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఇక్కడ పాష్తో, పర్షియన్ నేర్చుకున్న విద్యార్థులకు ఆస్పత్రుల్లో దుబాసీలుగా ఉద్యోగాలు దొరుకుతున్నాయని జైదీ చెప్పారు. అయితే కజకి, టర్కమెనిన్ భాషల పట్ల ఉత్సుకత ఉన్నా.. అధిక సంఖ్యలో లేద ని, ఉజ్బెక్కి మాత్రం ఎల్లప్పుడూ ఆదరణ ఉంటోందని అంటున్నారాయన. వ్యాపారం, పర్యాటక రంగాల్లో ఉపయోగపడుతుందనే ఉజ్బెక్ను నేర్చుకోవడానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు. ఉజ్బెక్ సర్టిఫికెట్ కోర్సులో 25 సీట్లు ఉంటే.. అందుకు సరిపడా దరఖాస్తులొస్తున్నాయని జేఎమ్ఐ డెరైక్టర్ టీసీఏ రంగాచారి తెలిపారు. అయితే చైనీస్కు ఎప్పుడూ ఎక్కువ డిమాండ్ ఉంటోందని ఆయన చెబుతున్నారు. భారత్తో చైనా వ్యాపారాలు పెరుగుతుండటమే ఇందుకు కారణమన్నారు. 25 సీట్లకు గాను 100కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, అందుకోసం ఈసారి సీట్ల సంఖ్యను 30కి పెంచామని ఆయన చెప్పారు. ఇతర భాషల్లో లాగా కాకుండా వారానికి నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే బోధన ఉంటుందని, చైనీస్ నేర్చుకోవాలనుకుంటున్నవారు అధికంగా ఉండటం వల్ల విద్యార్థులు ప్రతి రోజూ నాలుగు గంటలపాటు తరగతులకు హాజరవుతున్నారని రంగాచారి తెలిపారు. తైవాన్లో కూడా ఉపయోగపడే స్వచ్ఛమైన చైనీస్ భాషను నేర్పిస్తున్నామని, అందుకోసం తైవాన్కు చెందిన నేషనల్సింగ్ హువా యూనివర్సిటీనుంచి అధ్యాపకులను రప్పించామని చెబుతున్నారు. ప్రధాన చైనాలో ఉపయోగించే భాషకంటే స్వచ్ఛమైన చైనీస్ భాష లిపి కొంచెం భిన్నంగా ఉంటుందని ఆయన తెలిపారు. స్వచ్ఛమైన చైనీస్ను నేర్చుకున్నవారు ప్రధాన చైనాలో మాట్లాడే భాషలో మాట్లాడటం చాలా సులభమని ఆయన తెలిపారు. ఆయా భాషల్లో అడ్వాన్స్డ్ డిప్లొమా చేసిన విద్యార్థులను అదే భాషలో ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటున్నామని, దానివల్ల విద్యాసంస్థల్లో వారు బోధించడానికి అవకాశముంటుందని, కొందరు విద్యార్థులు అలా నేర్చుకుంటున్నారని జైదీ తెలిపారు. -
ఇంట్లో హిట్... బయట ఫ్లాప్
విదేశాల్లో ధోని చెత్త రికార్డు రక్షణాత్మక ధోరణిలో వ్యూహాలు పదే పదే అవే తప్పులు ‘ధోని టెస్టు కెప్టెన్సీ ఘోరాతిఘోరంగా ఉంది. వరల్డ్ కప్ ఏడాది లోపు లేకపోతే అతడిని వెంటనే తొలగించాలని నేనూ కోరేవాణ్ని’ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటు వ్యాఖ్య. ‘భారత కెప్టెన్కు తన పేస్ బౌలర్లపై నమ్మకం లేదు. అందుకే కొత్త బంతిని తీసుకునేందుకు వెనకడుగు వేస్తాడు. పాత బంతితో పరుగులు ఆపాలనేది అతని వ్యూహమైతే అది సరైంది కాదు’ మరో మాజీ కెప్టెన్ ద్రవిడ్ చురక. ‘రక్షణాత్మక ధోరణితో వ్యవహరించిన ప్రతీసారి ధోని ప్రత్యర్థి కోలుకునేలా చేస్తాడు. చాలా మంది ఇతర భారత కెప్టెన్లలాగే సొంతగడ్డపైనే అతనిది గొప్ప రికార్డే తప్ప ప్రత్యేకత ఏమీ లేదు. అతడిని తప్పించే సమయం వచ్చింది’ మాజీ ఆటగాడు మొహిందర్ అమర్నాథ్ మాట. తాజాగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ కోల్పోవడంతో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంపై మరోసారి విమర్శలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గత నాలుగు టెస్టుల్లో రెండుసార్లు విజయానికి చేరువగా వచ్చినా... ఆ అవకాశాలను అంది పుచ్చుకోవడంలో విఫలం కావడం ధోని నాయకత్వ లక్షణాలపై అనుమానాలు రేకెత్తిస్తోంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోని అనడంలో సందేహం లేదు. వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో నంబర్వన్ ర్యాంక్... ఇలా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన నాయకుడు అతను. అయితే విదేశీ గడ్డపై చాలా మంది భారత కెప్టెన్లలాగే ధోని రికార్డు కూడా చెత్తగా ఉంది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో ధోని ఎదురుదాడికి దిగకుండా, ఆత్మ రక్షణ ధోరణిలోనే ఆడటం ఇందుకు కారణమని విశ్లేషణ. -సాక్షి క్రీడా విభాగం ఇదేం ఫీల్డింగ్... విదేశాల్లో జరిగిన గత 14 టెస్టుల్లో భారత జట్టు ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. అయితే అసలు గెలిచే అవకాశమే రాలేదా అంటే అదీ కాదు. ఎన్నో సార్లు మన జట్టు ఆధిక్యంలో ఉన్నా తప్పుడు వ్యూహాలతో దానిని చేజార్చుకుంది. వెల్లింగ్టన్ టెస్టులో మూడో రోజు అప్పటికే 5 వికెట్లు కోల్పోయిన కివీస్ మరో 130 పరుగులు వెనుకబడి ఉంది. బంతి కూడా 45 ఓవర్లు పాతదే. అప్పుడు ఒక్క స్లిప్ కూడా లేకుండా ఆరుగురు ఫీల్డర్లను లెగ్సైడ్లో ఉంచి ఇషాంత్తో ధోని బౌలింగ్ చేయించాడు. జడేజా బౌలింగ్లో మెకల్లమ్ భారీ షాట్లు కొడతాడని ఆశించి లాంగాన్, లాంగాఫ్లలో ఒక్కో ఫీల్డర్ను కొనసాగించాడు. ఈ సమయంలో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న కివీస్ను అటాక్ చేయాల్సింది పోయి ఫీల్డర్లంతా బౌండరీ దగ్గరే ఉండటంతో మెకల్లమ్ చక్కటి సింగిల్స్ తీసుకున్నాడు. కివీస్ స్కోరు 100లోపే ఉన్నా స్లిప్లో ఫీల్డర్ లేక చక్కటి క్యాచ్ అవకాశాలు కూడా పోయాయి. మ్యాచ్ నాలుగో రోజు కివీస్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 5 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే ఆధిక్యంలో ఉండగా... ఉదయం పూట తేమతో వికెట్కు పేస్కు అనుకూలంగా ఉంది. దాదాపుగా కొత్త బంతి (19 ఓవర్లు) అందుబాటులో ఉన్న సమయంలో కూడా ఫీల్డింగ్ రక్షణాత్మకంగా ఉంచడం పరాకాష్ట! ఆ తర్వాత ఆఫ్సైడ్లో ఏడుగురు ఫీల్డర్లను ఉంచి ఇషాంత్, షమీలతో రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయించడం కూడా వ్యూహలోపంగానే చెప్పవచ్చు. అవసరం లేకపోయినా పార్ట్టైమర్ రోహిత్ శర్మ బౌలింగ్లో స్లిప్లో ఫీల్డర్ కనిపించాడు. గతంలోనూ ఇలాగే... కివీస్తో సిరీస్లోనే కాదు. గతంలో కూడా ధోని ఇలాంటి ఆత్మ రక్షణ ధోరణితో అనేక వ్యూహాత్మక తప్పిదాలు చేశాడు. ఎవరైనా ఫీల్డర్ ఒక్కసారి బంతిని ఆపేందుకు బౌండరీ వద్దకు వెళితే ఇక మళ్లీ వెనక్కి రావడం లేదు. అక్కడే ఆటోగ్రాఫ్లు ఇస్తూ నిలబడిపోతున్నారు. విదేశీ గడ్డపై వ్యూహాలను చూస్తే... విండీస్పై గెలిచే అవకాశం ఉన్నా ‘డ్రా’తోనే సరిపెట్టుకోవడం, లార్డ్స్లో ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయిన దశలో కొత్త బంతి అందుబాటులో ఉంటే రైనాతో బౌలింగ్ చేయించడం, మెల్బోర్న్లో ఆసీస్ 6 వికెట్లు కోల్పోయిన దశలో కొత్త బ్యాట్స్మన్ కోసం లాంగాన్, డీప్ మిడ్ వికెట్, డీప్ ఫైన్లెగ్లలో ఫీల్డర్లను ఉంచడం చెత్త కెప్టెన్సీకి నిదర్శనం. ఇటీవల డర్బన్ టెస్టులోనైతే 146 ఓవర్ల తర్వాత గానీ... అదీ అంపైర్లు ఆదేశించడంతో కొత్త బంతిని తీసుకోవడం విమర్శలపాలైంది. సరిగ్గా చెప్పాలంటే వికెట్లు తీయడంకంటే పరుగులు నిరోధించడంపైనే దృష్టి పెట్టిన ధోని వ్యూహం విదేశీ గడ్డపై ఎక్కడా పని చేయడం లేదు. ఇకపై ఏమిటి... గతంతో పోలిస్తే మా ప్రదర్శన చాలా మెరుగుపడిందంటూ ఆటతీరును సమర్థించుకున్న ధోని, తన ఆత్మ రక్షణ ధోరణి గురించి మాట్లాడేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు. ఫలితంకంటే నేర్చుకునే ప్రక్రియ గురించే మాట్లాడేందుకు తాను ఇష్టపడతానని చెప్పిన ధోని, మరి ఇటీవలి వ్యూహాత్మక తప్పిదాల నుంచి ఏం నేర్చుకున్నాడో తెలీదు. గతంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్లలో ఆరంభంలోనే పలు అవకాశాలు వచ్చినా వాటిని చేజార్చుకున్న భారత్, ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. ఈ ఏడాది కూడా మళ్లీ అవే దేశాల్లో భారత్ పర్యటించనుంది. ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించేందుకు ఎక్కడో ఒకసారి చాన్స్ లభిస్తుంది. దాన్ని వాడుకుంటేనే పట్టు చిక్కే అవకాశం ఉంటుంది. అలాంటి కీలక క్షణాల్లో ధోని మరింత సాధికారికంగా వ్యవహరిస్తేనే పరాజయాల పరంపరకు బ్రేక్ పడుతుంది. -
మాచన్పల్లిలో విదేశీ భక్తుల సందడి
షాబాద్, న్యూస్లైన్: రష్యా దేశానికి చెందిన ఓ ఆధ్యాత్మిక ట్రస్టు సభ్యులు బుధవారం షాబాద్ మండలం మాచన్పల్లి గ్రామాన్ని సందర్శించారు. హిందూ సంప్రదాయాల పరిశీలన, ఆలయాల సందర్శన కోసం వీరు మనదేశానికి వచ్చారు. ఇందులో భాగంగా వీరు మాచన్పల్లిలోని శివాలయాన్ని సందర్శించారు. హరోం హర, ఓం నమశ్శివాయ అంటూ ఆలయంలో పూజలు చేశారు. రష్యా దేశస్తులు అలెగ్జాండర్, స్వామి కృష్ణానంద, మైఖేల్, ల్యాడ్మీర్ తదితరులకు మొదట గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాలయానికి వెళ్లిన రష్యన్ బృందం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో కలిసి భజన చేశారు. హిందూ సంప్రదాయాలు, పూజా విధానాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గ్రామంలో చక్కటి దేవాలయం నిర్మించి, భక్తిశ్రద్ధలతో పూజలు కొనసాగిస్తుండటం అభినందనీయమని గ్రామస్తులను మెచ్చుకున్నారు. త్వరలో షాబాద్ మండల కేంద్రంలో కూడా దేవాలయాలను సందర్శిస్తామని, యోగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని రష్యన్ బృందం తెలిపింది. కార్యక్రమంలో గ్రామస్తులు శేఖర్, నర్సింలు తదితరులు ఉన్నారు. హిందూ సంప్రదాయాలు బాగా నచ్చాయని, తాము భారతదేశవ్యాప్తంగా పర్యటించి ఇక్కడి ప్రజలకు యోగా నేర్పుతామని, ఎక్కడైనా ఆలయాల నిర్మాణానికి ముందుకు వస్తే తాము సహకరిస్తామని తెలిపారు. -
ఉద్యోగాల పేరుతో మరో మోసం
విశాఖపట్నం, న్యూస్లైన్: మోసం చేయడంలోనూ ఓ ఆకు ఎక్కువే చదివాడీ ప్రబుద్ధుడు. దేశీయ ఉద్యోగాలనే కంటే విదేశీ ఉద్యోగాలంటే కాస్త గ్లామర్ ఎక్కువ ఉంటుందనుకున్నాడో ఏమో ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ-హూ)నే లక్ష్యంగా చేసుకున్నాడు. హూలో ఉద్యోగాలిప్పిస్తానంటూ విశాఖనగరం సీతంపేటకు చెందిన సుబ్రహ్మణ్యం నోటిఫికేషన్ జారీ చేశాడు. తన వలలో పడిన వారికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, గుర్తింపు కార్డులు జారీ చేసేశాడు. అవకాశాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసి ముఖం చాటేశాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు... ప్రముఖ దినపత్రికల్లో జూన్ 2వ తేదీన హూలో పీఓ, ఏపీఓ, డీపీఓ, ఫీల్డ్ఆర్గనైజర్స్ ఉద్యోగాల భర్తీ కోరుతున్నట్లు ఓ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన చూసిన కోటనందూరు, నర్సీపట్నం ప్రాంతాలకు చెందిన పలువురు నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. కొద్ది రోజుల తర్వాత ‘మీరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇవి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు కావున కలెక్టర్, జేసీ, డీఎంఅండ్హెచ్ఓలను మేనేజ్ చేసేందుకు కొంతమొత్తం ఖర్చవుతుంది. కావున మీరు కొంత నగదు మేమిచ్చిన అకౌంట్ నంబర్లలో జమ చేయగలరు’ అంటూ పోస్టును బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేలు చెల్లించాలంటూ సుబ్రహ్మణ్యం నిరుద్యోగులకు తెలిపాడు. పలువురి నుంచి ఆరు బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.7 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు చెల్లించిన వారందరికీ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు (నకిలీవి) ఇచ్చేశాడు. ఈనెల 19న నర్సీపట్నంలో కలుద్దామని చెప్పాడు. అభ్యర్థులు ఫోన్ చేస్తే జాయింట్ కలెక్టర్తో మీటింగ్లో ఉన్నానని 20న మేఘాలయ హోటల్లో కలుద్దామని నమ్మబలికాడు. నిజమే అనుకుని ఆశతో వచ్చిన వారికి అతని జాడ కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు తమకు ఇచ్చిన నియామక పత్రాలు, గుర్తింపులు కార్డులు పట్టుకుని డీఎంఅండ్హెచ్ఓను కలిశారు. అటువంటి నియామకాలేవీ తాము చేపట్టలేదని చెప్పడంతో కంగుతిన్నారు. మోసపోయామని గుర్తించాక సీతంపేటలోని సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లగా అతను పరారయినట్లు తెలిసింది. తాము డబ్బు డిపాజిట్ చేసిన ఎస్బీఐ అకౌంట్ (నంబర్ : 20080917217) నంబర్లో వివరాలు సేకరించగా కంచరపాలేనికి చెందిన బి.వెంకటరత్నందిగా గుర్తించి ఆమె వద్దకు వెళ్లారు. ఆమెను నాల్గో పట్టణ పోలీసుల వద్దకు తీసుకువచ్చారు. ‘ఆ డబ్బు సంగతి తనకు తెలియదని, సుబ్రహ్మణ్యం తన ఏటీఎం కార్డు అడిగితే ఇచ్చానని’ ఆమె చెప్పడంతో ఏం చేయాలో పాలుపోలేదు. కాగా, నాల్గోపట్టణ పోలీసులు కేసు తమ పరిధిలోకి రాదని తెలిసి కానిస్టేబుల్ను బాధితులోపాటు పంపి రెండో పట్టణ పోలీసులకు పంపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు బంగారు త్రినాథరావు, పి.శివకుమార్, ఎల్.గణేష్కుమార్, ఆర్.జోగిరాజు, గాడి శ్రీను కోరారు. కాగా, ఇతని మాయలో పడిన బాధితులు ఇంకెంతమంది ఉన్నారో వెలుగు చూడాల్సి ఉంది.