
16 సెన్సెక్స్ కంపెనీల్లో పెరిగిన విదేశీ వాటా
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఏప్రిల్-జూన్ కాలానికి 16 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాలను పెంచుకున్నారు. ప్రస్తుత విలువల ప్రకారం రూ.17,465 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే 13 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాను తగ్గించుకున్నారు. ఈ 13 కంపెనీల్లో రూ.14,389 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో సెన్సెక్స్ కంపెనీల్లో వీరి నికర పెట్టుబడులు రూ.3,076 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీలో అధికంగా (6.58 శాతం) వాటా కొనుగోలు చేశారు.
ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్లో యాక్సిస్ బ్యాంక్లో 42.27 శాతంగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్ల వాటా ఈ ఏడాది జూన్ క్వార్టర్కు 45.81 శాతానికి పెరిగింది.