
ముగిసిన ఆంధ్రా బ్యాంక్ బాండ్స్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 1,000 కోట్ల సమీకరణ కోసం చేపట్టిన బాండ్స్ ఇష్యూ ముగిసినట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది. జూన్ 22న ప్రారంభమైన ఇష్యూ 27న ముగిసిందని, పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయ్యిందని వెల్లడించింది. పదేళ్ల కాల వ్యవధితో అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డెట్ బాండ్లు జారీ చేసింది. వీటికి 8.65 శాతం వడ్డీ రేటు ఉంటుంది.