closed
-
జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!
సాక్షి, అమరావతి: ‘ఆరోగ్య శ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కనీసం రూ.2 వేల కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తాం’ అని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. పెద్ద ఎత్తున బిల్లులు నిలిచిపోవడం వల్ల ఆస్పత్రులకు మందులు, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు జరపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో విక్రేతలు నోటీసులు జారీ చేసి.. సరఫరాలను నిలిపివేశారని తెలిపింది.ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని వాపోయింది. ఈ సమస్యలను గత మూడు నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల వైద్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో సైతం పెండింగ్ బిల్లులకు నిధులు మంజూరుతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపునకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో తామెంతో నిరుత్సాహానికి గురయ్యామని పేర్కొంది. పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తే తప్ప.. ఆస్పత్రులు కోలుకోలేవని స్పష్టం చేసింది.అలాగే ప్రస్తుత ప్యాకేజీ ధరలను శాస్త్రీయంగా పునఃమూల్యాంకనం చేయాలని కోరింది. రూ.2 వేల కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేసి.. మిగిలిన బిల్లులను నిర్దిష్ట కాలపరిమితిలోపు ఇస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. గ్రీన్చానల్లో ప్రతి నెలా పెన్షన్లు, జీతాలతో పాటు ఆరోగ్య శ్రీ బిల్లులను కూడా క్రమబద్ధంగా చెల్లించాలని.. ఇందుకోసం చట్టబద్ధమైన చెల్లింపుల షెడ్యూల్లోకి చేర్చాలని కోరింది. -
జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్..
దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను (Bank Account)ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలు చేస్తోంది. ఈ మార్పులను అర్థం చేసుకోవడం, ఆలస్యం కాకముందే మేల్కోవడం చాలా అవసరం. లేకపోతే మీ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ను కోల్పోయే ప్రమాదం ఉంది.బ్యాంకింగ్ లావాదేవీల భద్రత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కొన్ని రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ను అరికట్టడం, బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్, ఆధునికీకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.రిస్క్లను తగ్గించడానికి, బ్యాంకింగ్ కార్యకలాపాల్లోని లోపాలను పరిష్కరించడానికి, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ మెరుగైన సేవలను అందించడానికి ఈ కొత్త మార్పులను అమలు చేస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం 2025 జనవరి 1 నాటికి మూడు నిర్దిష్ట రకాల బ్యాంక్ ఖాతాలను ఆర్బీఐ మూసివేస్తోంది.డార్మాంట్ అకౌంట్లుడార్మాంట్ అకౌంట్ అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా. మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్లు ఈ ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఖాతాదారులను, బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి ఆర్బీఐ అటువంటి ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది.ఇనాక్టివ్ అకౌంట్లునిర్దిష్ట వ్యవధిలో (సాధారణంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) లావాదేవీ కార్యకలాపాలు లేని వాటిని ఇనాక్టివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు. ఖాతా భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్బీఐ క్లోజ్ చేస్తోంది. మీకూ ఇలాంటి ఇనాక్టివ్ అకౌంట్ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్ని కొనసాగించే ఖాతాలు కూడా క్లోజ్ కానున్నాయి. అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆర్థిక నష్టాలను తగ్గించడం, కస్టమర్లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్బీఐ లక్ష్యం. అంతేకాకుండా కేవైసీ (KYC) నిబంధనలను బలోపేతం చేయడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం. -
Uttar Pradesh: విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు పొడిగింపు
నోయిడా: ఉత్తరప్రదేశ్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో యూపీలోని నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలల్లో ఆఫ్లైన్ తరగతుల నిర్వహణను పొడిగించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలనా అధికారులు నవంబర్ 25 వరకు అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆఫ్లైన్ తరగతులపై నిషేధాన్ని నవంబర్ 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం ఇటీవల ఆఫ్లైన్ తరగతులను నిలిపివేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 'చాలా తీవ్రమైన' కేటగిరీకి చేరుకోవడంతో ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు ఆఫ్లైన్ తరగతులను నిలిపివేశారు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డియోస్) ధరమ్వీర్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్లో శనివారం గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం అలీపూర్, అశోక్ విహార్, ఆనంద్ విహార్, బవానా, డీటీయూ, ద్వారక, చాందినీ చౌక్, జహంగీర్పురి, నరేలా, నెహ్రూ నగర్, మందిర్ మార్గ్, పట్పర్గంజ్, రోహిణి, వజీర్పూర్, పంజాబీ బాగ్ తదితర ప్రాంతాల్లో వాయునాణ్యత 400 కంటే ఎక్కువ నమోదైంది. ఇది కూడా చదవండి: 8 నుంచి 16 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ -
శివనామస్మరణలతో కేదార్నాథ్ తలుపులు మూసివేత
రుద్రప్రయాగ: శివనామస్మరణల మధ్య చార్ధామ్లలో ఒకటైన కేదార్నాథ్ ధామ్ తలుపులను ఈరోజు (ఆదివారం) మూసివేశారు. శీతాకాలంలో ప్రతీయేటా ఈ తంతు కొనసాగుతుంటుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కేదార్నాథ్లో మహాశివునికి ఘనంగా పూజలు జరిగాయి. ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులను మూసివేశారు. ఇకపై కేదారనాథుడు ఉఖిమఠ్లో ఆరు నెలల పాటు దర్శనం ఇవ్వనున్నారు. భయ్యా దూజ్ సందర్భంగా ఈ రోజున తలుపులు మూసివేశారు. ఈ సందర్భంగా పంచముఖి విగ్రహాన్ని సంచార విగ్రహ డోలీలో కొలువుదీర్చారు. అనంతరం ఈ విగ్రహం ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర్కు ఊరేగింపుగా తరలిస్తారు. ఈ ఏడాది 16 లక్షల మంది యాత్రికులు కేదార్నాథ్ ధామ్ను సందర్శించుకున్నారు. #WATCH | Uttarakhand: The portals of Shri Kedarnath Dham closed for the winter season today at 8:30 am. The portals were closed with Vedic rituals and religious traditions amidst chants of Om Namah Shivay, Jai Baba Kedar and devotional tunes of the Indian Army band.(Source:… pic.twitter.com/vCg2as6aJ7— ANI (@ANI) November 3, 2024కేదార్నాథ్ను ఇక్కడ చివరిసారిగా దర్శనం చేసుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని 10 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈరోజు కేదార్నాథ్లోని పంచముఖి విగ్రహాన్ని మొబైల్ విగ్రహం డోలీ ద్వారా ఉఖిమత్కు పంపనున్నారు. నిన్ననే(శనివారం) గంగోత్రి ధామ్ తలుపులు మూసివేశారు. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న ఉత్తరాఖండ్లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిలో గంగమ్మను పూజిస్తారు. ఇది కూడా చదవండి: త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం -
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్ధామ్గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్ధామ్లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత
డెహ్రాడూన్: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేయనున్నారు. అనంతరం ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనం కొనసాగుతుంది. ఇదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేయనున్నారు.దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ తెలిపారు. అనంతరం గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహిస్తూ శీతాకాలపు విడిదికి తీసుకువస్తామని చెప్పారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత, యమునా తల్లి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని ఆలయానికి తీసుకువస్తారు. ఈ యాత్రా కాలంలో శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల 21 వేల 752 మంది యాత్రికులు ఈ రెండు ధామాలను సందర్శించుకున్నారు.ఇది కూడా చదవండి: మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో -
Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్
రాంచీ: జార్ఖండ్లో నేడు (శనివారం) రేపు (ఆదివారం) ఐదు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (జేజీజీజీఎల్సీసీఈ)దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని, అలాగే ఆదివారం కూడా ఇదే పరిమితి కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా పరీక్ష ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రత్యేకంగా చర్చించారు. పరీక్ష సమయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సోరెన్ హెచ్చరించారు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాష్ట్రంలోని 823 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తుండగా, దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని సంబంధిత అధికారి తెలిపారు.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా సైట్ ఎక్స్లో ఒక పోస్ట్ను షేర్ చేస్తూ ‘ఇప్పుడే సీనియర్ అధికారులతో మాట్లాడి, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాను. అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను అందించాను. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు’ అని దానిలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకం -
శ్రీకృష్ణాష్టమికి బ్యాంకులు పనిచేస్తాయా?
జన్మాష్టమి.. దీనినే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది హిందువులు అత్యంత వేడుకగా చేసుకునే పండుగ. ఈసారి జన్మాష్టమి సోమవారం అంటే ఆగస్టు 26న వచ్చింది. ఆగస్టు 24, 25వ తేదీలు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. మరి సోమవారం, శ్రీకృష్ణాష్టమి నాడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా మూసివుంటాయా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయయనున్నారు. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్టక్, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, పట్నా, రాయ్పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్లలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేయవు. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు తమ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సెలవుల జాబితాను పొందవచ్చు.కాగా త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, న్యూఢిల్లీ, గోవాలలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేస్తాయి. అయితే సోమవారం సెలవు ఉన్న బ్యాంకులకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన సేవలు ఎప్పటిలానే కొనసాగుతాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు బ్యాంకు సేవలను పొందవచ్చు. -
Pakistan: ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయిన 700 మంది
పాకిస్తాన్లోని ఒక సంస్థలో పనిచేస్తున్న 700 మంది సిబ్బందికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇస్లామాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్ మోనాల్ను మూసివేయడంతో దానిలో పని చేస్తున్న 700 మంది రోడ్డున పడ్డారు.డాన్ నివేదిక ప్రకారం ఇస్లామాబాద్లోని మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్లోని మోనాల్ను మాత్రమే కాకుండా ఇక్కడున్న అన్ని రెస్టారెంట్లను మూసివేయాలని పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణను ఉద్దేశించి 2024, జూన్ 11న సుప్రీం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ పార్క్ చుట్టూ ఉన్న రెస్టారెంట్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు 2024 సెప్టెంబర్ 11 నుంచి రెస్టారెంట్ మూసివేయనున్నామని మోనాల్ యాజమాన్యం తెలిపింది.ఈ హోటల్ గత రెండు దశాబ్దాలుగా ఆహర ప్రియులకు ఇష్టమైనదిగా పేరొందింది. 2006లో ప్రారంభించినప్పటి నుండి మోనాల్ నిరంతరం ఆహార ప్రియులకు సేవలు అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్లో 700 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇస్లామాబాద్కు వచ్చే పర్యాటకులు ఈ రెస్టారెంట్లో ఆహారం తినేందుకు వస్తుంటారు.మోనాల్ మూసివేత ప్రకటనతో దానిలో పనిచేస్తున్న ఉద్యోగుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓ ఉద్యోగి స్పృహ తప్పి పడిపోయాడు. అందరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. తమ రెస్టారెంట్కు స్టార్ రేటింగ్ ఉందని మోనాల్ యజమాని లుక్మాన్ అలీ అఫ్జల్ తెలిపారు. -
Himachal: విరిగిపడిన కొండచరియలు.. 128 రోడ్లు బంద్
హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవిస్తున్నాయి. దీంతో 128 రహదారులు మూతపడ్డాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మండీ, బిలాస్పూర్, సోలన్, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లో వరద ముప్పు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. బలమైన గాలులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి తాకిడి కారణంగా పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయని, బలహీనమైన నిర్మాణాలు, కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మండీలో 60, కులులో 37, సిమ్లాలో 21, కాంగ్రాలో ఐదు, కిన్నౌర్లో నాలుగు, హమీర్పూర్ జిల్లాలో ఒక రోడ్డును మూసివేశారు. అలాగే 44 విద్యుత్, 67 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది.మండీ జిల్లాలోని జోగిందర్నగర్లో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మశాలలో 125.4, కటౌలాలో 112.3, భరారీలో 98.4, కందఘాట్లో 80, పాలంపూర్లో 78.2, పండోహ్లో 76, బైజ్నాథ్లో 75, కుఫ్రీలో 70.8, కుఫ్రిలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 28 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో సగటున 445.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది. ఇప్పుడు 321.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
బంగ్లాదేశ్లో ఎల్ఐసీ ఆఫీస్ మూసివేత
బంగ్లాదేశ్లోని తమ కార్యాలయాన్ని ఆగస్టు 7 వరకు మూసివేయనున్నట్లు ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సోమవారం తెలిపింది. బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా దళాలకు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో గత రెండు రోజుల్లో 100 మందికి పైగా మృతి చెందారు."బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న సామాజిక-రాజకీయ పరిస్థితుల కారణంగా, బంగ్లాదేశ్ లిమిటెడ్ ఎల్ఐసీ కార్యాలయం ఆగష్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు మూసివేస్తున్నాం" అని రెగులేటరీ ఫైలింగ్లో ఎల్ఐసీ తెలిపింది.బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు 3 రోజుల పాటు కర్ఫ్యూను ప్రకటించిందని పేర్కొంది. వివాదాస్పద ఉద్యోగ కోటా పథకానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో గత నెలలో విద్యార్థుల నిరసనలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనగా మారాయి. -
Himachal: హఠాత్తుగా ముంచెత్తిన వరద.. చాంగుట్- టింగ్రేట్ రోడ్డు మూసివేత
హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలోని మయాడ్ ప్రాంతాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మయాడ్ ఘాటీలోని చాంగుట్ కాలువలోకి అకస్మాత్తుగా వరదలు రావడంతో చాంగుట్ నుండి టింగ్రేట్ వరకుగల రహదారిని అధికారులు మూసివేశారు.ఈ వరదల కారణంగా ఇంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, కులు, మండీ జిల్లాల్లో సంభవించిన వరదల్లో సుమారు 45 మంది గల్లంతు కాగా, వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీనిలో ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, పోలీస్, హోంగార్డు బృందాలకు చెందిన మొత్తం 410 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. pic.twitter.com/rPvdpWnTvo— Lahaul & Spiti Police (@splahhp) August 3, 2024 -
విరిగిపడిన కొండచరియలు.. గంగోత్రి హైవే బంద్
ఉత్తరాఖండ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడుతూ జనాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా ఉత్తరకాశీలోని గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు.దీంతో ఉత్తరకాశీలోని మనేరి, భట్వాడిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) బృందం ఈ హైవేపై పడిన రాళ్లు, శిధిలాలను తొలగించేపని చేపట్టింది. వీలైనంత త్వరగా రహదారిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉత్తరాఖండ్లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, పిథోరాఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాఖండ్లోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కేదార్నాథ్లోని గౌరీకుండ్ సమీపంలో రాళ్లు పడడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. దీనికిముందు జూలై ప్రారంభంలో బద్రీనాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఉదంతాలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్పట్లో బద్రీనాథ్ మార్గాన్ని కూడా మూసివేశారు. అయితే బీఆర్ఓ బృందం శిధిలాలు, రాళ్లను తొలగించడంతో ఆ రహదారిని తిరిగి తెరిచారు. गंगोत्री नेशनल हाईवे भूस्खलन के कारण बंद, रास्ते से मलबा हटाने में जुटी BRO की टीम#Gangotri | #NationalHighway | #Landslide | #Uttarakhand pic.twitter.com/GmtrvQ72iF— NDTV India (@ndtvindia) July 21, 2024 -
ముంబైలో భారీ వర్షం.. అంథేరీ సబ్వే బంద్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివిధ రహదారులలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అంధేరి సబ్వే ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయింది. ఫలితంగా అధికారులు ఈ సబ్వేను మూసివేశారు.ముంబైలో నేటి (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల రైల్వే ట్రాక్లపైకి నీరు ప్రవేశించింది. ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెస్ట్రన్ ఎక్స్ప్రెస్వేతో పాటు విలేపార్లేలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రానున్న రోజుల్లో ముంబయిలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో భారీ వర్షాలు కరుస్తున్న దృష్ట్యా పలు పాఠశాలలు, కళాశాలను మూసివేశారు. Watch: Heavy rain in Mumbai has led to intense morning showers and four feet of water accumulation in the Andheri subway. The subway has been closed to traffic since 6: 30 AM. pic.twitter.com/jHcocRmTZY— IANS (@ians_india) July 20, 2024 -
పాతాళగంగ లైన్ క్లియర్.. తెరుచుకోని జోషిమఠ్ రహదారి
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రెండు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. వీటిలో ఒకటి బద్రీనాథ్ జాతీయ రహదారిలోని జోషిమఠ్లో, మరొకటి పాతాళగంగ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. అయితే తాజాగా చార్ధామ్ యాత్రికుల కోసం పాతాళగంగ రహదారిని క్లియర్ చేశారు. దీంతో 40 గంటల తరువాత ఈ రహదారిలో వెళ్లేవారికి ఉపశమనం లభించినట్లయ్యింది. జోషిమఠ్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన రహదారి ప్రాంతాన్ని ఇంకా క్లియర్ చేయలేదు.48 గంటలు గడిచినా జోషిమఠ్-బద్రీనాథ్ హైవేలో ఇంకా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోషిమఠ్లో కొండచరియలు విరిగిపడటంతో, బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్ మొదలైన ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్ధామ్ యాత్రికులు పలు అవస్థలు పడుతున్నారు.రెండు వేల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ హైవేపై చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు జోషిమఠ్లో రహదారిని క్లియర్ చేయడంలో బిజీగా ఉన్నారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లో 260కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. వాటిపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్లను శుభ్రం చేసేందుకు 241 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేశారు. -
అధికార మదం.. ఆర్యవైశ్యులపై ప్రతాపం డబ్బులివ్వలేదని మూసేశారు
తిరుపతి రూరల్: టీడీపీ కూటమి నేతల దృష్టి ఆర్యవైశ్యుల వ్యాపారాలపై పడింది. కష్టనష్టాలకోర్చి వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయాని్నవ్వడమే కాకుండా, పది మందికి ఉపాధి చూపిస్తున్న ఆర్యవైశ్యులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే అధికారులతో వ్యాపారాలను సీజ్ చేయిస్తున్నారు. వ్యాపారులతో పాటు వందలాది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా పలువురు వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.తాజాగా చంద్రగిరి నియోజకవర్గం కుంట్రపాకంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు కిషోర్కు చెందిన ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించారు. గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ మిల్లులో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి ఎంతో మంది రైతులు ధాన్యాన్ని ఈ మిల్లులో బియ్యం చేసుకుని వెళుతుంటారు. ఇటు కార్మికులకు, అటు అన్నదాతలకు బాసటగా నిలిచిన ఈ రైస్ మిల్లుపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కన్ను పడింది.తన బంధువులు, తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేతలు అమిలినేని మధు, చెరుకూరి మధు, శ్రీధర్ నాయుడును రైస్ మిల్లు యజమాని కిషోర్ వద్దకు పంపినట్లు సమాచారం. వారు ముగ్గురూ కిషోర్ దగ్గరకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంత ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే అధికారులను రంగంలోకి దించి, అన్ని రకాల అనుమతులతో నడుస్తున్న రైస్ మిల్లుకు బుధవారం అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సీజ్ చేయించినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.దీంతో రైసు మిల్లు మూతపడింది. 200 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిల్లు యజమాని కిషోర్ రెండుసార్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దకు వెళ్లి వేడుకోగా, ఆయన తీవ్రంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తాను లోకేశ్కు అత్యంత సన్నిహితుడినని, తన మాట వినకుంటే జిల్లాలో ఎక్కడా నిన్ను వ్యాపారం చేయనీయను అంటూ కిషోర్ను భయపెట్టినట్లు సమాచారం. దీంతో కిషోర్ కంట నీరు పెట్టుకొని బయటకు వచ్చినట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి.వ్యాపారుల ఆగ్రహంవ్యాపారుల్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఆర్యవైశ్యుల సంక్షేమ సంఘం నాయకుడు, చాంబర్ ఆఫ్ కామర్స్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, తిరుపతి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన కిషోర్నే వేధించి, ఆయన మిల్లును మూసివేయించడంపై వ్యాపారవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకొనేందుకు వ్యాపారులంతా సంఘటితమవుతున్నారు.తమ నేత కిషోర్కు న్యాయం జరిగేంత వరకు బాసటగా నిలుస్తామని చెబుతున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయిస్తే ఎంత మంది జీవితాలు రోడ్డున పడతాయన్నది ఆలోచించని ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన బంధువుల తీరును ప్రజలకు వివరించడంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకై వారు నిర్ణయించినట్లు సమాచారం.అధికారుల అత్యుత్సాహంఅధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన బంధువుల ఒత్తిడితో ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించడంలో అధికారులు అత్యుత్సాహం చూపించారు. సాధారణంగా ఏ వ్యాపార సంస్థనైనా సీజ్ చేయాల్సి వస్తే ముందుగా నోటీసు ఇచ్చి, మూడు నెలలు సమయం ఇవ్వాలి. నోటీసుకు యజమాని నుంచి వచ్చే సమాధానంతో పాటు మరికొన్ని నియమాలు పాటించాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండానే విద్యుత్తు సరఫరా నిలిపివేసి, మిల్లును సీజ్ చేసేశారు. అందులో పనిచేసే కార్మికుల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలి్సన కనీస బాధ్యతను కూడా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. -
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం పనిచేయవు. రోజంతా ఎటువంటి ట్రేడింగ్ సెషన్లు జరగవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) జూన్ 17 సోమవారం బక్రీద్ సందర్భంగా మూతపడనున్నాయి.ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ (సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ ఎరాక్టివ్) సెగ్మెంట్లపై ఈ మూసివేత ప్రభావం చూపుతుందని బీఎస్ఈ వెబ్సైట్ పేర్కొంది. తిరిగి జూన్ 18న ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) జూన్ 17న ఉదయం సెషన్ను మూసివేయనుంది. అయితే సాయంత్రం సెషన్లో మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి 11:30/11:55 గంటల వరకు ట్రేడింగ్ కోసం తిరిగి తెరవనున్నారు. -
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?
భారతీయ రైల్వేను ‘దేశానికి లైఫ్ లైన్’ అని అంటారు. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను రైల్వేలు తమ గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇంతటి ఘనత కలిగిన రైల్వేశాఖ నుంచి వచ్చిన ఒక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పునరాభివృద్ధి కోసం ఈ ఏడాది చివరి నాటికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను మూసివేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆ తరువాత న్యూఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను ఎప్పటి నుంచి మూసివేస్తారనేదానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది ఈ ఏడాది చివరి నాటికి జరగవచ్చని తెలుస్తోంది.రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో దేశంలోని సుమారు 1,300 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. దీనికి సంబంధించిన పనులు నిదానంగా పూర్తవుతున్నాయి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను పునరుద్ధరించే పనులు ప్రారంభంకానున్నాయి. కాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో రోజుకు ఆరు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి రైల్వే స్టేషన్ను అకస్మాత్తుగా మూసివేయడం రైల్వేకు పెను సవాలుగా మారనుంది. అయితే ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లను వివిధ స్టేషన్ల మీదుగా దారిమళ్లించనున్నారు. ఈస్ట్ ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లను ఆనంద్ విహార్ స్టేషన్కు మార్చనున్నారు. అలాగే పంజాబ్, హర్యానాకు వెళ్లే రైళ్లను సరాయ్ రోహిల్లా వైపు మళ్లించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే రైళ్లను ఢిల్లీ కాంట్, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల మీదుగా మళ్లించనున్నారు. మిగిలిన కొన్ని రైళ్లను ఘజియాబాద్కు మళ్లించే అవకాశ ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో రైల్వేశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడనుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ను అభివృద్ధి పనుల కోసం నాలుగేళ్లపాటు మూసివేయనున్నారు. ఈ రైల్వే స్టేషన్ను పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఈ పనులను ఏకకాలంలో చేయాలని గతంలో ప్రభుత్వం యోచించింది. అయితే ఇప్పుడు దశలవారీగా ఈ పనులను చేయాలని నిర్ణయించారు. 2023 బడ్జెట్ సెషన్లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. -
నేటితో ప్రచారం బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హోరాహోరిగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం ఆరు గంటలకు తెరపడనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇది సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. ఆ సమయం దాటిన తరువాత నుంచి బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారం తదితర ప్రచారంపై నిషేధం కొనసాగనుంది. దృశ్యరూపకంగా ఉండే ఏ ప్రకటన కూడా ప్రచారం చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి (ఉప ఎన్నిక) సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది..బరిలో 525 మంది అభ్యర్థులు..రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఏప్రిల్ 18న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం కూడా ప్రారంభమైంది. లోక్సభకు మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి 15 మంది పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని సీట్లలోనూ పోటీ చేస్తుండగా సీపీఎం, ఎంఐఎం ఒక్కోచోట బరిలో నిలిచాయి.అగ్ర నేతల ప్రచారం..నామినేషన్ల పర్వం నుంచి విస్తృత ప్రచారం ప్రారంభమవగా రాష్ట్ర, జాతీయ స్థాయిలోని ఆయా పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తోపాటు పలువురు బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించారు.అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతోపాటు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ప్రచార బాధ్యతనంతా మోశారు. ఈసారి భారీ బహిరంగ సభలు అతితక్కువగా జరగ్గా ప్రజలను కలుసుకొనేలా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు అన్ని పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి.పరస్పరం దూషణలపర్వం..ఈసారి ఎన్నికల ప్రచారంలో పార్టీల దూషణలపర్వం తారస్థాయికి చేరింది. ఆరు గ్యారంటీలంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినా.. అమలు చేయలేదని బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా విమర్శించాయి. గత పదేళ్లలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, కొత్త రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. మరోవైపు బీజేపీ తాము మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేస్తామని బదులిచ్చింది.ప్రలోభాలను అడ్డుకోవడంపై ఈసీ నజర్..నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుండటంతో పోలింగ్ జరిగే లోగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ఈసీ కృతనిశ్చయంతో ఉంది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు సీ–విజల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడైనా ప్రలోభాలు కొనసాగుతుంటే సమాచారం ఇవ్వాలని, తక్షణమే స్పందిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇస్తోంది. ఇప్పటివరకు 180 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణాలు, తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
చార్ధామ్ యాత్రపై సైబర్ నేరగాళ్ల కన్ను.. ఆటకట్టించిన పోలీసులు
చార్ధామ్ యాత్ర ప్రారంభమయ్యేందుకు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది. ఇంతలో సైబర్ నేరగాళ్లు ఈ యాత్రపై కన్నువేశారు. గతంలో హెలీ సర్వీసుల బుకింగ్ పేరుతో యాత్రికులను మోసగించిన ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పుడు హోటల్ బుకింగ్ పేరుతోనూ యాత్రికులను వంచించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ నేపధ్యంలో తాజాగా పోలీసులు హోటల్ బుకింగ్ పేరుతో సృష్టించిన ఏడు నకిలీ వెబ్సైట్లను, హెలీ సర్వీస్ బుకింగ్ కోసం సృష్టించిన 12 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఏడాది కాలంలో పోలీసులు చార్ధామ్ యాత్రతో ముడిపడిన 83 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఇటువంటి మోసాలను నివారించడానికి పోలీసు శాఖలోని ఇంటర్నెట్ మీడియా సెల్ను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో హెలీ సర్వీస్ బుకింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఆయుష్ అగర్వాల్ తెలిపారు. యాత్రికులు https://www.heliyatra.irctc.co.in/ ద్వారా చార్ధామ్ హెలీ సర్వీస్ను బుక్ చేసుకోవచ్చు. యాత్రికులెవరైనా నకిలీ వెబ్సైట్ను గుర్తించినప్పుడు డెహ్రాడూన్ ఎస్టీఎఫ్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 9456591505, 9412080875 మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి, వివరాలు అందించవచ్చని అధికారులు తెలిపారు. -
విమానం ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలి?
ఈ రోజుల్లో చాలామంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో విమాన ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే విమాన ప్రయాణం చేసేటప్పుడు పలు నిబంధనలు పాటించాలని ఎయిర్ హోస్టెస్లు చెబుతుంటారు. విమాన ప్రయాణంలో ధూమపానం చేయకూడదు, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలాంటి నిబంధనలలో ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ను మూసివేయాలని కూడా చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి? ట్రే టేబుల్ మూసివేయకపోతే ఏమైనా జరుగుతుందా? ఎయిర్ హోస్టోస్ హన్నా టెస్సన్(23) అమెరికాలోని కొలరాడోలో ఉంటున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలనే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రయాణికులు తాము చెప్పే సూచనలను పాటించనప్పుడు కోపం వస్తుందని అన్నారు. ప్రయాణీకులు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ మూసివేయాలని చెప్పినా, వెంటనే అమలు చేయరని ఆమె తెలిపారు. ఇలాంటి ఈ నిబంధనలను విమాన ప్రయాణికులు తప్పని సరిగా తెలుసుకోవాలని ఆమె అన్నారు. హన్నా తెలిపిన వివరాల ప్రకారం.. విమాన ప్రమాదాలు చాలావరకూ ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఓపెన్ ట్రే టేబుల్ కారణంగా ప్రయాణికులు గాయపడే అవకాశముంది. అందుకే ట్రే టేబుళ్లను మూసి వేయాలని ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్లు చెబుతుంటారు. ఆహారం అందించడం ఒక్కటే తమ పని కాదని, ప్రయాణికుల భద్రతను చూడటం కూడా తమ పనే అని హన్నా తెలిపారు. విమానం టేకాఫ్ చేయడానికి ముందు విమానంలోని భద్రతా పరికరాలను తనిఖీ చేస్తామని, అంతే కాకుండా ప్రయాణికుల వింత ప్రవర్తనపై కూడా నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
మంచు, వర్షాల కారణంగా ఐదు హైవేలు, 300 రోడ్లు మూసివేత!
ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాలయాలలోని ఎత్తైన పర్వతాలపై భారీ హిమపాతం కురుస్తుండగా, అక్కడి మైదాన ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో ఐదు జాతీయ రహదారులతో సహా 300కు పైగా రోడ్లను మూసివేశారు. హిమాచల్లో 263 రోడ్లు మూసివేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. గడచిన 24 గంటల్లో పంజాబ్, హరియాణా, రాజస్థాన్లోని పలు ప్రాంతాలతో సహా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇంతేకాదు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్, ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఉప-హిమాలయ ప్రాంతం, సిక్కిం, అస్సాం, మేఘాలయ, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యింది. వాతావరణంలోని మార్పుల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలుప్రాంతాల్లో 11 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ రాజస్థాన్లోని చురులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని పర్వత, మైదాన ప్రాంతాల్లో బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. -
జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్ఐ సర్వేలో వెల్లడి!
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన సర్వే నివేదికలో వెల్లడించింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీని ఉపయోగించి ఏఎస్ఐ జరిపిన పరిశోధనలో ప్లాట్ఫారమ్ కింద, ప్లాట్ఫారమ్ ప్రాంతంలో అనేక బేస్మెంట్లు ఉన్నాయని తేలింది. వాటి ఎగువ భాగం తెరిచి ఉండగా, దిగువ భాగమంతా చెత్తతో నిండి ఉంది. వీటిని మూసివేశారు. ప్లాట్ఫారమ్కు నైరుతి భాగంలో చెత్తతో నిండిన మూడు మీటర్ల వెడల్పుగల నేలమాళిగలు ఉన్నాయి. ఒక మీటరు మందపాటి గోడలతో తొమ్మిది చదరపు మీటర్ల పరిమాణంలో ఈ నేల మాళిగలు ఉన్నాయి. ఈ పెద్ద సెల్లార్లు దక్షిణ గోడ వైపు ప్రవేశద్వారాలను కలిగి ఉన్నాయి అవి ఇప్పుడు మూసివేసివున్నాయి. నేలమాళిగకు ఉత్తరం వైపున ఓపెన్ ఫంక్షనల్ తలుపులు ఉన్నాయి. తూర్పు వైపున రెండు మీటర్ల వెడల్పుతో మూడు నుండి నాలుగు నేలమాళిగలు ఉన్నాయి. తూర్పు గోడ మందంలో అనేక మార్పులు ఉన్నాయి. కారిడార్ ప్రాంతానికి ఆనుకుని, ప్లాట్ఫారమ్కు పశ్చిమ భాగంలో మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పు గల రెండు సెల్లార్ల రెండు వరుసలు ఉన్నాయి. నేలమాళిగలో దాగి ఉన్న బావి రెండు మీటర్ల వెడల్పు కలిగివుంది. దక్షిణ భాగంలో మరో బావి జాడలు కనిపించాయి. బేస్మెంట్ గోడల జీపీఆర్ స్కానింగ్లో మూసివున్న బావులు, కారిడార్లు కూడా ఉన్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. దక్షిణ నేలమాళిగ గోడతో కప్పినట్లు ఉందని జీపీఆర్ చూపించింది. ఏఎస్ఐ తన సర్వే సమయంలో పలు సున్నితమైన వస్తువులను శుభ్రపరచడం, లేబులింగ్ చేయడం, వర్గీకరించడం, పలు పరీక్షలను నిర్వహించడం మొదలైన పనులు చేసింది. ఇందుకోసం అదే ప్రాంగణంలో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది మెటల్తో సహా ఇతర పదార్థాలను పరిశీలించడంలో సహాయపడుతుంది. -
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ నిరవధికంగా మూసివేత
-
ఆ రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు
ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో తీవ్రమైన చలి వాతావరణం నెలకొనడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఫలితంగా విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించారు. పెరుగుతున్న చలి దృష్ట్యా ఈనెల 14 వరకూ ఘజియాబాద్లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జలౌన్లో జనవరి 6 వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాగ్రాజ్లోనూ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలను ఈ నెల 6 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తింపు పొందిన పాఠశాలలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారణాసిలో నిరంతరం పెరుగుతున్న చలి, దట్టమైన పొగమంచు దృష్ట్యా పాఠశాల సమయాలను మార్చారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాజలింగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించనున్నారు. -
భయంకరంగా మిచాంగ్ తుఫాన్..
-
గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? స్పెయిన్లో ఏం జరుగుతోంది?
స్పెయిన్లోని పర్యావరణ కార్యకర్తలు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఐరోపా దేశాలు తీవ్రమైన కరువుతో తల్లడిల్లుతున్న నేపధ్యంలో స్పెయిన్కు చెందిన పర్యావరణ కార్యకర్తలు నీటిని పొదుపు చేయడానికి నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మాడ్రిడ్, వాలెన్సియా, ఇబిజా, నవర్రాతో సహా ఆరు రాష్ట్రాలలో గోల్ఫ్ కోర్సుల రంధ్రాలను మూసివేశారు. గోల్ఫ్ కోర్స్ చుట్టూ ఉన్న పచ్చటి ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ 22,000 గ్యాలన్లకు పైగా నీరు అవసరమని వారు చెబుతున్నారు. కరువు కారణంగా స్పెయిన్ రైతులు తమ పంటలకు తగినంత నీరు అందకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దేశంలో గోల్ఫ్ కోర్సుల కంటే పంట పొలాలకు నీటి అవసరం అధికమని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం పర్యావరణ కార్యకర్తలు ప్రస్తుతం 10 గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేశారు. మైదానంలో కొన్ని గుంతలలో మొక్కలు నాటడమే కాకుండా కొన్నింటిని సిమెంటుతో మూసివేశారు. ఎక్స్టింక్షన్ రెబెల్లియన్ (ఎక్స్ఆర్) సంస్థ సభ్యులు పర్యావరణ కార్యకర్తలతో కలిసి ఈ పనులు చేపట్టారు. కరువు సంక్షోభం మధ్య నీటి వృథాను అరికట్టేందుకు గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేయడం తప్పనిసరి అని ఎక్స్టింక్షన్ రెబెల్లియన్ గ్రూప్ పేర్కొంది. దేశమంతా కరువుతో తల్లడిల్లిపోతున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఉన్నతవర్గం వారు గోల్ఫ్ కోర్సుల పేరుతో నీటిని వృథా చేయడం తగదన్నారు. సంపన్నుల అనవసర కార్యకలాపాల వల్ల వనరులు వృథా అవుతున్నాయని వారు ఆరోపించారు. కొన్ని నెలలుగా స్పెయిన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులలోని నీటిశాతం నిరంతరం తగ్గతూవస్తోంది. ఈ నేపధ్యంలోనే శాన్ రోమన్ డి కా సౌ రిజర్వాయర్ నీటి మట్టం 1990 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో రిజర్వాయర్లో మునిగిపోయిన పాత చర్చి పూర్తిగా కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్లో కరువు పరిస్థితులు మరింతగా పెరగనున్నాయి. ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? -
పాక్లో 72 ఏళ్ల క్రితం మూసిన ఆలయం తెరవగానే ఏం జరిగింది?
దేశ విభజన తర్వాత పాకిస్తాన్లోని హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాగే నాడు పాకిస్తాన్లో ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా కనిపించవు. కొన్ని దేవాలయాలను కూల్చివేయగా, మరికొన్నింటిని నిర్లక్ష్యం చేశారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదేవిధంగా పాకిస్తాన్లో కొన్ని దేవాలయాలు మూతపడ్డాయి. సియాల్కోట్లో 72 సంవత్సరాలుగా మూసివేసిన ఆలయం కొంతకాలం క్రితం తెరుచుకుంది. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం ఎంత విశిష్టమైనదనేది దాని నిర్మాణశైలి తెలియజేస్తుంది. భారీ పరిమాణంలోని రాళ్లతో నిర్మితమైన ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇది చిన్నగా ఉన్న శివాలయమే అయినప్పటికీ, దీని నిర్మాణాన్ని ప్రముఖ దేవాలయాలతో పోలుస్తుంటారు. 75 ఏళ్లుగా ఆలయాన్ని మూసివేసినా, ఆలయ గోడలు చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. ఆలయాన్ని పరిశీలించి చూస్తే ఆనాటి ఆలయాలు ఎంత బలంగా నిర్మించారో అంచనా వేయవచ్చు. ఈ ఆలయాన్ని 72 ఏళ్ల తర్వాత 2019లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెరిచారు. ఈ దేవాలయం పేరు శివాల తేజ సింగ్ టెంపుల్. ఈ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం ఆలయాన్ని తెరిచినప్పుడు అక్కడున్న హిందువులు హర్ హర్ మహాదేవ్ అని నినాదాలు చేశారు. ఈ నినాదాలు చాలా దూరం వరకూ ప్రతిధ్వనించాయని చెబుతారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్కు ధర్మశాలతో సంబంధం ఏమిటి? -
భారత్లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత!
ఈరోజు (ఆదివారం, అక్టోబర్ 1) నుండి భారతదేశంలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఎంబసీ ఆదివారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం గురించి ఆఫ్ఘన్ అధికారులు మాట్లాడుతూ న్యూఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం చాలా విచారకరం. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం సంయుక్తంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆతిథ్య దేశం నుండి తమకు సహకారం అందడం లేదని, ఈ కారణంగానే కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ రాయబారి, ఇతర సీనియర్ దౌత్యవేత్తలు భారతదేశం నుండి యూరప్కు వెళ్లి, యూఎస్ఏలో ఆశ్రయం పొందిన తరువాత ఈ పరిణామం జరిగిందని ఆఫ్ఘన్ ఎంబసీకి చెందిన ముగ్గురు అధికారులు తెలిపారు. ఐదుగురు ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు భారత్ను విడిచిపెట్టినట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2021లో కూడా ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. భారతదేశంలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయానికి ప్రస్తుతం రాయబారి ఫరీద్ మముంద్జే నేతృత్వం వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: 22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే పరారీ! Press Statement FOR IMMEDIATE RELEASE Date: 30th September, 2023 Afghanistan is closing its Embassy in New Delhi. The Embassy of the Islamic Republic of Afghanistan in New Delhi regrets to announce the decision to cease its operations, effective October 1, 2023. pic.twitter.com/BXesWPdLFP — Afghan Embassy India (@AfghanistanInIN) September 30, 2023 -
తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్షిప్ టోర్నీ షురూ
లక్డీకాపూల్: తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు హైదరాబాద్లోని గేమ్పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగే ఈ టోరీ్నలో దాదాపు 100 మంది క్రీడాకారులు ఎనిమిది విభాగాల్లో టైటిళ్ల కోసం పోటీ పడుతున్నారు. గేమ్పాయింట్తో కలిసి తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చాంపియన్షిప్లో రాష్ట్రంలోని అగ్రశ్రేణి జూనియర్ ప్లేయర్లు తనుజ్ రెడ్డి పులి, అర్నా ద్వివేది, సాన్వి శ్రీతో పాటు పురుషుల, మహిళల టాప్ ర్యాంకర్లు రోహన్ ఆర్యగోండి, ఐశ్వర్య పయ్యన్ బరిలో ఉన్నారు. బాలుర అండర్–11, అండర్–13, అండర్–15, బాలికల అండర్–13, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. పురుషుల 35, 45 వయో విభాగాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. శనివారం క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ జరుగనున్నాయి. రాష్ట్రానికి చెందిన స్క్వాష్ క్రీడాకారులకు గొప్ప వేదిక అయిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు టోర్నమెంట్ చైర్మన్ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఏజ్ గ్రూప్ పోటీల్లో అగ్ర ఆటగాళ్లు నమోదు చేసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి టోర్నమెంట్లో బలమైన పోటీ ఉంటుందన్నారు. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్రూమ్లు సైఫాబాద్లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
భారీ వర్షాలు: జీహెచ్ఎంసీ పరిధిలో రేపు, ఎల్లుండి స్కూల్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురవనుందని, కొన్ని ప్రాంతాల్లో 120 మిల్లీ మీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ పడే అవకాశం ఉందని, నగరవాసులు మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని మేయర్ తెలిపారు. చదవండి: హైదరాబాద్లో ఏకధాటిగా వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరికలు ఇవే.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలు పూర్తిగా జలమయ్యాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ సమీపంలోని కాలనీలు పూర్తిగా మోకాళ్ల లోతు నీటితో కాలనీలు మునిగాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండడం, ఆఫీస్ నుండి ఇండ్లలోకి వెళ్లేవారు తమ వాహనాలను సైతం ఆ మోకాల్లోతు నీళ్లలో నడిపించుకుంటూ వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
హైదరాబాద్లో బ్యాంకులకు సెలవులు 8 రోజులే..
వివిధ సెలవుల కారణంగా 2023 జూలైలో హైదరాబాద్లోని బ్యాంకులు ఎనిమిది రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకారం.. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జూలై నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి మొత్తం 15 సెలవులు ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రానికి, రాష్ట్రానికి మారవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ మొత్తం 15 రోజులూ సెలవులు ఉండవు. హైదరాబాద్లో ఉండే బ్యాంకులు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, అదనంగా మొహర్రం కారణంగా జూలై 29 న పనిచేయవు. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ కస్టమర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కార్యకలాపాలను కొనసాగించవచ్చు. హైదరాబాద్లో బ్యాంకు సెలవులు జూలై 2: ఆదివారం జూలై 8: రెండో శనివారం జూలై 9 : ఆదివారం జూలై 16 : ఆదివారం జూలై 22 : నాలుగో శనివారం జూలై 23 : ఆదివారం జూలై 29: మొహర్రం జూలై 30: ఆదివారం ఇదీ చదవండి: July Deadlines: ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి? -
కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..?
ఉత్తరాఖండ్ : చార్ధామ్ యాత్రికులకు వాతావరణం పరీక్ష పెడుతోంది. ఏటా కేవలం ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే గంగోత్రీ, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్ర.. అత్యంత క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్ర. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో 3584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడం మామూలు విషయం కాదు. గత మూడు రోజుల నుంచి రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండలు, కోనలు, ఆ పక్కనే లోయలు, నదులు.. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో ఆకస్మిక వర్షాలు రావడం, ఆ వెంటనే వరదలు పోటెత్తడం ఇక్కడ సాధారణం. తాజా వర్షాలు, వరదల కారణంగా కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ప్రకటించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. హరిద్వార్, రుషికేష్ల నుంచి యాత్రికులు ముందుకు రావొద్దని కోరారు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి. Char Dham Yatra halted due to bad weather, CM Dhami instructs officials to be vigilant Read @ANI Story | https://t.co/NkileHv4Xw#chardham #chardhamyatra #Kedarnath #Badrinath #PushkarSinghDhami pic.twitter.com/nM38Si9jDm — ANI Digital (@ani_digital) June 26, 2023 20 గంటలపైనే.. హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో కేదార్నాథ్ శివాలయం ఒకటి. హిమాలయాల్లో నిర్మించిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దీన్నిఆదిశంకరాచార్యులు నిర్మించారు. హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో కనీసం 20 గంటల పాటు ప్రయాణం చేస్తేనే బేస్ పాయింట్ గౌరీకుండ్ చేరుకుంటాం. అయితే ఏకబిగిన 20 గంటలు ప్రయాణం అనేది ఏ మాత్రం సాధ్యం కాని పని. ఇదీ చదవండి: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు.. ప్రతికూల వాతావరణం.. కేదార్నాథ్ మంచుకొండల మధ్య ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ కనిష్టంగా ఉంటాయి. హఠాత్తుగా కూలిపడే కొండచరియలు, దెబ్బతినే రోడ్ల నడుమ అసలు ముందుకు సాగుతుందా లేదా అన్నట్టుగా ప్రయాణం ఉంటుంది. పైగా ఆ కొండలపై ట్రాఫిక్ తరచుగా నిలిచిపోతుంది. కేదార్నాథ్కు వాహనాలు వెళ్లవు. దాని బేస్ పాయింట్ గౌరీకుండ్ వరకే వాహనాలుంటాయి. అక్కడి నుంచి నడక మార్గం లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు. హెలీకాప్టర్ ఉన్నా వాతావరణం అనుకూలిస్తేనే ప్రయాణం సాగుతుంది. కేదార్నాథ్ను జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలా మంది తహతహలాడుతారు. ఈ సారి బోలెడు మంది ఇప్పటికే హరిద్వార్, రిషికేశ్ చేరుకున్నారు. తాజా వరదలతో నిరాశపడిపోయారు. दयानिधान बाबा केदारनाथ की संध्या आरती दर्शन🙏खराब मौसम और बारिश की वजह से रोकी गई केदारनाथ यात्रा।यात्रियो को सुरक्षित स्थानों पर रुकने की सलाहजय केदार🕉#Kedarnath 🚩 pic.twitter.com/ljJpeEhLaM— श्री केदारनाथ (@ShriKedarnath) June 25, 2023 ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా?
బ్యాంక్ అకౌంట్లో నగదు బ్యాలెన్స్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ జారీ చేసిన రూల్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. బ్యాంకు ఖాతాలలో రూ. 30 వేల కంటే ఎక్కువ ఉంటే అటువంటి అకౌంట్లను క్లోజ్ చేస్తారన్నది దాని సారాంశం. అయితే ఆ వార్త ఫేక్ అని తేలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చేసిన ఫ్యాక్ట్ చెక్లో ఈ వార్త నిజం కాదని, ఆర్బీఐ అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని నిర్ధారించింది. హిందీలో ఉన్న ఆ వార్తను ట్విటర్లో షేర్ చేస్తూ అది పూర్తిగా ఫేక్ అని నిర్ధారించినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: Rs 500 Notes: రూ.88 వేల కోట్లు మిస్సింగ్! ఏమయ్యాయి? ఇంటర్నెట్లో తప్పుడు సమాచారం, ఫేక్ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్ లో ఈ ఫ్యాక్ట్-చెకింగ్ విభాగాన్ని ప్రారంభించింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించి సర్క్యులేట్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని గుర్తించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు పీఐబీ పేర్కొంటోంది. एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck ▪️ यह ख़बर #फ़र्ज़ी है। ▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9 — PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023 -
Secret Places In The World: భూమిపై మనం వెళ్ళడానికి నిషేధించబడిన టాప్ 10 ప్రదేశాలు
-
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మూడు రోజులపాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు కేబుల్ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లచే తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో భారీ బరువున్న క్రేన్లను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్ను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని కమిషనర్ సూచించారు. మరోవైపు రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్ను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. చదవండి: Alert: హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు -
భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు బంద్
-
పాక్కు చైనా షాక్.. కాన్సులర్ ఆఫీస్ క్లోజ్!
చైనా అనూహ్య నిర్ణయంతో పాక్కు షాక్ ఇచ్చింది. పాకిస్థాన్లోని కాన్సులర్ విభాగాన్ని(దౌత్యపరమైన) మూసేస్తున్నట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. పాక్లో ఉంటున్న చైనా పౌరులకు.. జాగ్రత్తగా ఉండాలని సూచించిన కొద్దిరోజులోనే చైనా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం. ఇక తదుపరి ప్రకటన వచ్చే వరకు మూసివేసే ఉంటుందని స్పష్టం చేసింది చైనా ఎంబసీ. ఈ మేరకు ఎంబీసీ వెబ్సైట్లో ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటనలో పేర్కొందే తప్ప.. అందుకు కారణాలేంటన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే.. పాక్ గడ్డపై చైనీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈ మూసివేత శాశ్వతమనే సంకేతాలను అందిస్తోంది చైనా. వాస్తవానికి తాలిబన్ గ్రూప్తో పాక్ ప్రభుత్వం సంధి విరమించుకున్న తర్వాత ఏడాది నుంచే.. అక్కడ దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(బీఆర్ఐ)నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పాక్ ఎకనామిక్ కారిడర్(సీపెక్)లో పనిచేస్తునన్న చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని వివిధ తీవ్రవాద గ్రూపులు తరుచుగా దాడి చేస్తున్నాయి. ఈ పరిణామాలపై చైనా, పాక్పై తీవ్ర అసంతృప్తితో ఉంది. వరదల సమయంలోనూ ఈ కారణంతోనే పెద్దగా సాయం కూడా అందించలేదు చైనా. గత ఏప్రిల్లో ఒక మహిళా ఆత్మాహుతి బాంబర్ కరాచీలో ముగ్గురు చైనా టీచర్లను, వారి స్థానిక డ్రైవర్తో సహా హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా, సీపెక్ అనేది చైనాను అరేబియా సముద్రాన్ని కలుపుతూ పాక్లోని రోడ్లు, రైల్వేలు, పైప్లైన్లు, ఓడరేవులకు సంబంధించిన 65 బిలియన్ డాలర్ల నెట్వర్క్. ఈ బీఆర్ఐ అనేది తన ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి, విస్తరించడానికి సహాయపడుతుందని పాక్ భావిస్తోంది. (చదవండి: ఇదే భారత్ ఇమేజ్..బాధితులకు అండగా మన బీనా, ఆనంద్ మహీంద్రా ప్రశంసలు) -
షూటింగ్స్ బంద్పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ బంద్పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు. 'మంచి కంటెంట్తో సినిమాలు తీయడంపై మీటింగ్లో మాట్లాడుకున్నాం. ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే టికెట్ ధరల అంశంపై చర్చించాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే విషయమై నిర్మాతలందరం మాట్లాడాం. ఓటీటీలో సినిమా విడుదల అనేది 8 వారాల లేక 10 వారాల అనే అంశంపై కూడా చర్చించాం. చర్చల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. షూటింగ్స్ బంద్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ వల్ల కథలు రాశారు, వాటిని హీరోలు ఒప్పుకున్నారు. నిర్మాతలు తెరకెక్కించారు. కానీ ప్రేక్షకుల గురించి ఆలోచించలేదు. కరోనా సమయంలో ఆడియెన్స్ చాలా ఎడ్యుకేట్ అయ్యారు. అందుకు తగిన స్థాయిలో సినిమాలు తీస్తేనే మెప్పించగలం' అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్లు బంద్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చదవండి:👇 అప్పటి నుంచి సినిమా షూటింగ్లు బంద్..! పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ -
మాట తప్పిన తాలిబన్లు.. షాకింగ్ నిర్ణయంతో ఆవేదనలో బాలికలు
కాబూల్: తాలిబన్లు మరోసారి మాట తప్పారు. ప్రపంచ దేశాలు తమ వైపు వేలెత్తి చూపించేలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో బాలికలను హైస్కూల్ విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు తాలిబన్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. తీరా స్కూల్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు షాకిచ్చారు. అయితే, ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదని.. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో బాలికలు ఆవేదనకు గురవుతున్నట్టు సమాచారం. అయితే, ఇందుకు కారణం గ్రామీణ ప్రజలేనని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారు తమ పిల్లలను స్కూల్స్కు పంపేందుకు అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి సీనియర్ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహిళ స్వేచ్చ పట్ల ఆంక్షలు ఉండాలని, కఠినంగా వ్యవహరించాలని సీనియర్లు కోరుతుండగా.. స్వేచ్చ అవసరమంటూ మరికొందరు పట్టుబడుతున్నట్టు సమాచారం. -
Hyderabad:ఈ రోజు రాత్రి ఫ్లైఓవర్లు బంద్.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: జగ్నేకీ రాత్గా పిలిచే షబ్బే బరాత్ నేపథ్యంలో నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసేవేయనున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము వరకు గ్రీన్ ల్యాండ్స్, లంగర్హోస్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మినహా మిగిలినవి మూసి ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. -
‘హిజాబ్’పై ధర్మాసనం.. కర్ణాటక హైకోర్టు సీజే నిర్ణయం
బెంగళూరు: హిజాబ్–కాషాయ కండువా గొడవతో కొద్ది రోజులుగా అట్టుడికిన కర్ణాటకలో విద్యా సంస్థల మూసివేత నేపథ్యంలో బుధవారం ప్రశాంతత నెలకొంది. దీనిపై విచారణకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన ఈ ఫుల్ బెంచ్లో న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ కూడా ఉంటారు. వివాదంపై మంగళ, బుధవారాల్లో విచారణ జరిపిన జస్టిస్ దీక్షిత్ నివేదన మేరకు సీజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దీక్షిత్ ముందు ఇరు పక్షాలు వాడివేడిగా వాదనలు విన్పించాయి. పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. విద్యార్థినులు తమ మత విశ్వాసాలను అనుసరించేందుకు అనుమతించాలని వారి తరఫు లాయర్ దేవదత్త కామత్ కోరారు. ఇందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ అభ్యంతరం తెలిపారు. ఈ దశలో అలాంటి ఉత్తర్వులివ్వడం పిటిషన్ను అనుమతించడమే అవుతుందని వాదించారు. విద్యార్థులు విధిగా డ్రెస్ కోడ్ను పాటిస్తూ తరగతులకు హాజరు కావాలన్నారు. కాలేజీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ (సీడీఎంసీ) తరఫున హాజరైన లాయర్ సజన్ పూవయ్య కూడా మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకించారు. ప్రస్తుత యూనిఫారాలు ఏడాదిగా అమల్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘తల్లిదండ్రులు, టీచర్లు తదితరులందరితో కూడిన సీడీఎంసీ ఏటా సమావేశమై యూనిఫాం తదితరాలపై ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకుంటుంది. యూనిఫాంపై ఇప్పటిదాకా లేని అభ్యంతరాలు ఇప్పడెందుకు?’’ అని ప్రశ్నించారు. మధ్యంతర ఉత్తర్వులపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. -
ఢిల్లీలో బార్లు, రెస్టారెంట్లు మూసివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో మరిన్ని ఆంక్షలు విధించాలని డీడీఎంకే నిర్ణయించింది. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలోని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిస్థితిని సమీక్షించేందుకు భేటీ అయింది. చదవండి: వైరల్: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్ అదిరింది! ఈ మేరకు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్న రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేస్తూ.. కేవలం టేక్అవేలకు మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాగే మెట్రో రైళ్లు, బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మళ్లీ తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే అమల్లో ఉన్న కరోనా ఆంక్షలను ఎన్సీఆర్ పరిధిలోనూ కఠినంగా అమలుచేయాలని డీడీఎంకే తీర్మానించింది. చదవండి: ఎవ్వరినీ వదలడం లేదు.. కరోనా బారిన పడ్డ మరో ఇద్దరు సీఎంలు -
కరోనా ఎఫెక్ట్: నుమాయిష్ బంద్ ఫొటోలు
-
తిరుమలలో భారీ వర్షాలు.. రెండు ఘాట్రోడ్లు మూసివేత
సాక్షి, తిరుమల: తిరుమలలో గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తిరుమల, తిరుపతి మధ్య ప్రయాణించే రెండు ఘాట్ రోడ్లలో రాకపోకలు నిషేదించారు. ఈ మేరకు టీటీడీ భద్రతా విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, తిరుమలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలలో భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు విరిగిపడతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో భారీగా నీరు తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షాలకి నడకదారిలో భారీగా నీరు ప్రవహిస్తోంది. మెట్లపై నడవలేని పరిస్థితి ఉంది. నడకమార్గంలో భక్తులు పిట్టగోడపై నడుస్తున్నారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదవండి: (Chennai Rains: తీరాన్ని తాకిన వాయుగుండం.. తమిళనాడులో 14 మంది మృతి) -
నిరవధిక దిగ్బంధనాలు సబబు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: నిరసనల పేరుతో నిరవధికంగా రహదారుల దిగ్బంధనాలు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విషయం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ నిరసనలు తెలపడానికి తామేమీ వ్యతిరేకం కాదని, అయితే ఈ విధంగా నిరవధికంగా రహదారులు దిగ్భంధనం సరికాదని దేశరాజధాని సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్లో గత 11 నెలలుగా ధర్నాను కొనసాగిస్తున్న రైతు సంఘాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో అమిత్ సాహ్ని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసులో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ రహదారులు బ్లాక్ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. రైతులు రహదారులను బ్లాక్ చేయడంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్ల ధర్మాసనం విచారించింది. ‘‘మొత్తానికి ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉంది. న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉన్నా నిరసనలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఈ రకంగా రహదారులు బ్లాక్ చేయడం సరికాదు. ప్రజలందరూ రహదారులపై హక్కు కలిగి ఉంటారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల్ని పోలీసులు నిలువరించిన తర్వాత రాంలీలా మైదానంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించిందని రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేన్నారు. ఈ ర్యాలీలో 5 లక్షల మంది పాల్గొన్నారని, దీనిపై ఎందుకు సుమోటోగా విచారణ చేపట్టడం లేదు, ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని దుష్యంత్ దవే పేర్కొన్నారు. రైతుల నిరసన వెనక దురుద్దేశం దాగుందని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రైతుల సంఘాలు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. ‘‘ఇదే అంశంపై వేర్వేరు పిటిషన్లు కోర్టు ముందుండటంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని లేదా ఈ ధర్మాసనమే వాటినీ విచారించాలని కోరుతున్నారు. తొలుత కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం అవసరమైతే... ఆ విషయం చెబుతాం. కౌంటరు మూడు వారాల్లో దాఖలు చేయండి. అనంతరం రెండు వారాల్లో రిజాయిండరు దాఖలు చేయండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘నూతన వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనలు చేయడం ఏంటి?’ అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
భారత్కు గుడ్బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..!
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత్లో ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. సనంద్, చెన్నై నగరాల్లోని ప్లాంట్లను ఫోర్డ్ మూసివేయనుంది. కంపెనీకి భారీ నష్టాలు, బహిరంగ మార్కెట్లో వృద్ధి లేకపోవడంతో ఫోర్డ్ మోటార్ కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..! లాభాలకంటే నష్టాలే ఎక్కువ..! 2021 నాల్గవ త్రైమాసికం నాటికి గుజరాత్లోని సనంద్లో వాహనాల తయారీని, 2022 రెండవ త్రైమాసికానికి చెన్నైలో వాహన ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపివేస్తుందని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎమ్ మోటార్స్ తరువాత భారత్ నుంచి వైదొలుగుతున్న రెండో కంపెనీగా ఫోర్డ్ నిలిచింది. 2017లో జనరల్ మోటార్స్ భారత్లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. గత 10 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా నిర్వహణ నష్టాలను ఫోర్డ్ చవిచూసింది. భారత్లో స్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి పునర్నిర్మాణ చర్యలు తీసుకున్న పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం కంపెనీలో పనిచేసే 4 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. కోవిడ్ -19 లాక్డౌన్, డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోతో ఫోర్డ్ మరింత నష్టపోతున్న స్థానిక సంస్థగా తయారైంది. జులై నాటికి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) షేర్ చేసిన డేటా ప్రకారం ఫోర్డ్ రెండు ప్లాంట్లలో ఉన్న 450,000 యూనిట్ల ఇన్స్టాల్ చేయబడిన సామర్థ్యంలో కేవలం 20 శాతం యూనిట్లను మాత్రమే ఆపరేట్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ ఇప్పటివరకు భారత్లో సుమారు రెండు బిలియన్ డాలర్లపైగా పెట్టుబడి పెట్టింది. 350 ఎకరాల చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 200,000 యూనిట్లు, 340,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 460 ఎకరాలలో విస్తరించి ఉండగా, సంవత్సరానికి 240,000 యూనిట్లు, 270,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ 1.57 శాతం మార్కెట్ వాటాతో, భారత అతిపెద్ద కార్ల తయారీదారుల జాబితాలో ఫోర్డ్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్, ఎండీవర్ భారత్లో ఐదు మోడళ్లను విక్రయిస్తుంది చదవండి: BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..! -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్...! ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు
సాక్షి, న్యూ ఢిల్లీ: ఈ నెలలో మీకు ఏమైనా బ్యాంకులో పనులు ఉంటే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఈ నెలలో పలు ప్రాంతాల్లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవులు ఆయాప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రభావితం చేయనున్నాయి. బ్యాంకుల ద్వారా జరిపే ముఖ్యమైన లావాదేవీలను వెంటనే జరుపుకుంటే మీకే మంచింది. బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రకాలుగా నిర్ణయిస్తుంది. నెగోషియేబుల్ ఇన్స్స్ట్రూమెంట్ యాక్ట్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల ముగింపు. జూలైలో పలు నగరాల్లో బ్యాంకు సెలవు దినాలు ఇవే... జూలై 12 -జగన్నాథ రథయాత్ర జూలై 13- భాను జయంతి(సిక్కింలో సెలవు) జూలై 14- ద్రుక్పా త్చేచి(సిక్కింలో సెలవు) జూలై 16- హారేలా ఫెస్టివల్(ఉత్తారఖండ్) జూలై 17- తీరథ్ సింగ్ డే/ ఖార్చి పూజ జూలై 18- ఆదివారం జూలై 19- గురు రింపోచే తుంగ్కర్ షెచు, (షిల్లాంగ్లో సెలవు) జూలై 20- బక్రీద్ (జమ్మూ, కొచ్చి) జూలై 21- బక్రీద్(దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు) జూలై 24- నాల్గవ శనివారం జూలై 25- ఆదివారం జూలై 31- కెర్ పూజ(త్రిపుర) -
హాంకాంగ్లో ‘యాపిల్ డైలీ’ కథ ముగిసింది
హాంకాంగ్: హాంకాంగ్ ప్రజాస్వామ్య డిమాండ్కు మద్దతుగా నిలిచిన చివరి పత్రిక ‘యాపిల్ డైలీ’ మూతపడింది. గురువారం ఆ పత్రిక చివరి సంచిక వెలువడింది. మొత్తం 10 లక్షల కాపీలు గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. యాపిల్ డైలీ కాపీల కోసం పాఠకులు ఎగబడ్డారు. దుకాణాల ముందు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అర్ధ స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్పై పూర్తిగా పట్టుబిగించేందుకు డ్రాగన్ దేశం చైనా పావులు కదుపుతోంది. హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమాలను కఠినంగా అణచివేస్తోంది. ఇన్నాళ్లూ ప్రజా పోరాటాలకు అండగా నిలిచిన యాపిల్ డైలీ పత్రిక మూతపడడంతో ఇక చైనాకు మరింత బలం చేకూరినట్లేనన్న వాదన వినిపిస్తోంది. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించేలా విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తోందంటూ యాపిల్ డైలీపై చైనా పాలకులు కన్నెర్ర చేశారు. ఇటీవల ఆ పత్రికకు చెందిన ఐదుగురు సంపాదకులను అరెస్టు చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 2.3 మిలియన్ డాలర్ల విలువైన యాపిల్ డైలీ ఆస్తులను స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలో ఇక పత్రికను మూసివేయడమే శరణ్యమని యాపిల్ డైలీ యజమానులు నిర్ణయాని కొచ్చారు. ఈ పత్రిక మూతపడడం హాంకాంగ్లో పత్రికా స్వేచ్ఛకు చీకటి రోజని జార్జిటౌన్ సెంటర్ ఫర్ ఆసియన్ లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ కెల్లాగ్ చెప్పారు. హాంకాంగ్ డౌన్టౌన్లో యాపిల్ ప్రతుల కోసం ప్రజల క్యూ -
వైరల్ వీడియో: మోదీజీ..ఏడేళ్లు స్కూల్స్ మూసేసినా ఫర్వాలేదు.. ఆన్లైన్ క్లాస్లు వద్దు
-
మోదీజీ... కరోనాపై పోరాటంలో మా చదువుల్ని త్యాగం చేస్తాం
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా అనేక విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులకు చదువులు ఆటంకం ఏర్పడకూడదని చాలా పాఠశాలలు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్యాభ్యాసం కొనసాగించే వెసలుబాటు లేని కొందరి విద్యార్థుల కష్టాలు మనల్ని కదిలించేలా ఉండగా, మరికొందరి పిల్లలు వారి పరిస్థితులను తెలుపుతున్న వీడియోలు ఫన్నీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో వారు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు వారి అమాయకత్వం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 19 సెకన్ల వైరల్ క్లిప్లో, ఆ ఇద్దరు పిల్లలు.. “ మోదీ జీ కరోనాతో పోరాడటం కోసం మా చదువులను త్యాగం చేయవలసి వస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏడేళ్లపాటు పాఠశాలలు మూసివేయాల్సి వస్తే, మేము ఆ త్యాగానికి సిద్ధంగా ఉంటాం” అని తెలిపారు. ఈ తరహా వీడియోనే ఇటీవల జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ ఆరేళ్ల బాలిక మాత్రం ఇందుకు భిన్నంగా ఆన్లైన్ చదువులపై తనకున్న అసహనాన్ని గట్టిగానే వెల్లగక్కింది. తన బాధను దేశ ప్రధాని నరేంద్ర మోదీతో మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: వరదలో చిక్కిన మహిళ.. సహాయక సిబ్బంది తెగువతో -
Ballari: మూడు రోజులు బ్యాంకులు బంద్
బళ్లారి టౌన్: కరోనా నియంత్రణ కోసం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులను బంద్ చేయాలని ఆదేశించినట్లు జిల్లాధికారి పవన్కుమార్ మాలపాటి తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం చేపట్టిన లాక్డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గాయని అన్నారు. కొంత మంది బ్యాంకుల్లో పని ఉందని తిరుగుతున్నారని, దీంతో బ్యాంకులు కూడా బంద్ చేస్తే జూన్ 7 వరకు చేపట్టిన లాక్డౌన్ వల్ల మరింత కేసులు తగ్గించవచ్చన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి జూన్ 7 ఉదయం వరకు సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సైదూల్ అడావత్ తెలిపారు. వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్, ఎస్పీ -
కోవిడ్ సెకండ్ వేవ్ :పార్కులపై పడ్డ ప్రభావం
-
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత
-
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ విలయతాండవం చేస్తుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మాహమ్మారిని కట్టడి చేసే పనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను మే 15వరకు మూసివేస్తున్నట్టు కేంద్రంలోని సీనియర్ అధికారులు ప్రకటించారు. గతేడాది కరోనా విశ్వరూపం చూపిన సందర్భంలో కూడా ఈ కట్టడాలన్నీ మూసివేయగా.. కొన్ని రోజుల తరువాత వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా గతంలో కంటే వేగంగా కరోనా 2.0 కమ్ముకొస్తోంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ను అదుపు చేసే చర్యల్లో భాగంగా మరోసారి కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను దశల వారీగా అమలు చేస్తున్నాయి. ( చదవండి: కోవిడ్-19 ఎఫెక్ట్ మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు ) -
లాక్డౌన్ ఎఫెక్ట్ షిర్డీ ఆలయం మూసివేత
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ మహారాష్ట్రలో కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో మహారాష్ట్రలో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా దేశంలోనే అత్యంత సంపద గల షిర్డీ సాయిబాబా ఆలయం మూతపడింది. సోమవారం రాత్రి 8 గంటలకు ఆలయం మూతపడింది. ఈ ఆలయం మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా సామూహిక ప్రార్థన స్థలాలు, మందిరాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు షిర్డీ ట్రస్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహారాష్ట్రలో 30,10,597 కేసులు నమోదవగా 55,878 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు 4,30,503. -
76 మందికి కరోనా.. ‘తాజ్’ మూసివేత
డెహ్రాడూన్: మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గతేడాది మాదిరి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్లో కరోనా కలకలం రేపుతోంది. ఒకేసారి 76 మందికి పాజిటివ్ సోకడంతో ప్రముఖ హోటల్ ‘తాజ్’ మూతపడింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్వాహకులు హోటల్ను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాలుగా ఉన్న రిశికేశ్, డెహ్రాడూన్లలో భారీగా కేసులు నమోదవుతుండడంతో కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. హోటల్ను శానిటైజ్ చేశామని.. ముందు జాగ్రత్తలో భాగంగా మూసివేసినట్లు ఎస్పీ తృప్తి భట్ మీడియాకు చెప్పారు. రిషికేశ్లోని తాజ్ రిసార్ట్ అండ్ స్పాలో గత మంగళవారం 16 మంది ఉద్యోగులకు కరోనా వ్యాపించింది. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు పరీక్షలు భారీగా చేయించారు. ఈ క్రమంలో మరికొందరి పరీక్షలు నిర్వహించగా మొత్తం కేసులు కలిపి 76 మందికి మహమ్మారి వ్యాపించింది. దీంతో మరో మూడు రోజుల పాటు హోటల్ను మూసివేశారు. అయితే కొన్ని రోజుల్లో ఉత్తరాఖండ్లో జరగాల్సిన మహాకుంభమేళాకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమయంలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా మేళాకు వచ్చేవారు కచ్చితంగా పరీక్షలు చేసుకోవాలని.. నెగటివ్ వస్తేనే అనుమతి ఇవ్వనున్నారు. -
తెలంగాణలో స్కూళ్లు బంద్ ఫోటోలు
-
130 కోట్ల ఫేక్ ఖాతాలు నిలిపివేత
వాషింగ్టన్: 2020లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 130 కోట్లకు పైగా ఫేక్ ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్బుక్ యాజమాన్యం సోమవారం తెలియజేసింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ ప్రతినిధి రోసెన్ వెల్లడించారు. 60కి పైగా భాషల్లోని కంటెంట్ను నిశితంగా పరిశీలించడానికి స్వతంత్ర ఫ్యాక్ట్ చెకర్స్ను నియమించినట్లు తెలిపారు. ఏదైనా సమాచారం అసత్యమని తేలితే అది ఎక్కువ మందికి చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాంటి సమాచారంపై హెచ్చరిక సంకేతం ఉంటుందని, దాన్నిబట్టి అప్రమత్తం కావాలని సూచించారు. ఈ సంకేతం ఉన్న సమాచారాన్ని 95 శాతం మంది యూజర్లు క్లిక్ చేయడం లేదని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్పై దుష్ప్రచారం చేస్తున్న కంటెంట్ను కూడా పూర్తిగా తొలగించామన్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించుకుంటున్నామని వివరించారు. -
టిక్టాక్ శాశ్వతంగా బంద్
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ అయిన టిక్టాక్ను భారత్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్టాక్ను ప్రమోట్ చేస్తున్న చైనా కంపెనీ బైట్డ్యాన్స్.. భారత్లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2,000 పైచిలుకు ఉద్యోగులను తీసివేయనుంది. ఈ ఉద్యోగులకు మూడు నెలల వేతనంతోపాటు కంపెనీలో పనిచేసిన కాలాన్నిబట్టి మరో నెల పారితోషికం ఇవ్వనున్నారు. టిక్టాక్ గ్లోబల్ ఇంటెరిమ్ హెడ్ వనెస్సా పప్పాస్, గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ బ్లేక్ చండ్లీ సంయుక్తంగా భారత్లోని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్స్లో ఈ విషయాలను వెల్లడించారు. -
భారత్కు ‘హార్లే’ గుడ్బై!
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్ విషయమై అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్సన్ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రీమియం బైక్ల విభాగంలో మంచి వాటాను సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షలతో భారత్లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ.. నష్టాల కారణంగా దశాబ్ద కాలం తర్వాత ప్రస్తుత వ్యాపార నమూనా నుంచి వైదొలగాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హరియాణాలోని బావల్లో ఉన్న తయారీ కేంద్రాన్ని మూసివేయనుంది. దీనివల్ల 70 మంది ఉపాధి కోల్పోనున్నారు. అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న ఏకైక తయారీ కేంద్రం ఇది కావడం గమనార్హం. అదే విధంగా గురుగ్రామ్లో ఉన్న విక్రయాల కార్యాలయం పరిమాణాన్ని కూడా తగ్గించనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. భారత్లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు, భవిష్యత్తులోనూ ఉత్పత్తి పరంగా సహకారం అందుతుందని ఈ సంస్థ భరోసా ఇచ్చింది. కాంట్రాక్టు కాలం వరకు ప్రస్తుత డీలర్ల నెట్వర్క్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. అంటే పరిమిత కాలం వరకు కంపెనీ వాహన విక్రయాలు, విక్రయానంతర సేవలు కొనసాగనున్నాయి. ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతోపాటు.. భారత్లోని కస్టమర్లకు ఇక ముందూ సేవలు అందించే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు హార్లే డేవిడ్సన్ వివరణ ఇచ్చింది. అయితే, భారత్లో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం హార్లే డేవిడ్సన్ చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కంపెనీ వ్యాపార పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగమే ఈ నిర్ణయాలు. పునర్ నిర్మాణంలో భాగమే ‘‘2020 చివరి నాటికి అమలు చేయాలనుకున్న ‘రీవైర్’ ప్రణాళికలో భాగమే ఈ చర్యలు. అదే విధంగా హార్లే డేవిడ్సన్ బ్రాండ్, ఉత్పత్తుల ఆదరణ కోసం 2021–25 కాలానికి రూపొందించిన ‘హార్డ్వైర్’కు మారడంలో భాగమే’’ అంటూ హార్లే డేవిడ్సన్ తన ప్రకటనలో వివరించింది. భారత్ లో విక్రయాలు, తయారీ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు కం పెనీ తెలిపింది. ట్రంప్ ఒత్తిడి.. హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ భారీ పన్నులు వడ్డిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు నిరసన స్వరం వినిపించారు. పన్నులు తగ్గించకపోతే తాము కూడా అదే విధమైన చర్యను తీసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. దాంతో అప్పటి వరకు 100 శాతంగా ఉన్న పన్నును భారత్ సగానికి తగ్గించింది. అయినా ట్రంప్ శాంతించలేదు. భారత వాహనాలపై అమెరికాలో సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ మరింత తగ్గించాలని పలు పర్యాయాలు డిమాండ్ కూడా చేశారు. ఎంట్రీ.. ఎగ్జిట్ ► 2007 ఏప్రిల్లో కాలుష్య ఉద్గార, పరీక్షా నియమాల్లో భారత ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో హార్లే డేవిడ్సన్ బైక్లు భారత మార్కెట్కు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది. ► 2009 ఆగస్ట్లో హార్లే డేవిడ్సన్ ఇండియా కార్యకలాపాలు మొదలు ► 2010 జూలైలో మొదటి డీలర్షిప్ నియామకం, విక్రయాలు మొదలు ► 2011లో హరియాణాలోని ప్లాంట్లో బైక్ల అసెంబ్లింగ్ మొదలు ► విక్రయిస్తున్న మోడళ్లు: 11 ► ప్లాట్ఫామ్లు: 6 (స్పోర్ట్స్టర్, డైనా, సాఫ్టెయిల్, వీ రాడ్, టూరింగ్, స్ట్రీట్) ► 2020 సెప్టెంబర్లో వైదొలగాలని నిర్ణయం -
కొత్తపేట్ మార్కెట్కు తాళం
సాక్షి, హైదరాబాద్: కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ను నేటి నుంచి మూసివేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్కెట్ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మార్కెట్కు పండ్లు తెచ్చే రైతులు, కొనుగోలుకు వచ్చే వ్యాపారులు కోహెడకు వెళ్లాలని సూచించారు. అయితే కోహెడలో సరైన వసతులు లేవని, తాత్కాలిక షెడ్లు మాత్రమే ఉన్నాయని, వ్యాపార లావాదేవీలు ఎలా చేపట్టాలని రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం కూడా కోహెడ వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయకపోవడంతో గాలివాన, భారీ వర్షానికి షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండా కోహెడ వెళ్లాలని అధికారులు ఆదేశిస్తున్నారని, ఇది సరికాదని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలమైనందున, అక్కడ ప్లాట్ఫారాలు లేకపోవడంతో పండ్లు నేల పాలవుతాయని ఆందోళ వ్యక్తం చేన్నారు. గతంలో షెడ్లు కొందరు రైతులు, వ్యాపారులు గాయపడ్డారని మళ్లీ కోహెడకు వెళ్లాలంటే భయమవుతోందంటున్నారు. అధికారులు కోర్టు ఆదేశాలును బేఖాతరు చేస్తున్నారు మూడు నెలల క్రితం ఫ్రూట్ మార్కెట్ను కోహెడకు తరలించారు. అయితే అక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో రైతులు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో కమీషన్ ఏజెంట్లు హై కోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో పక్కాగా నిర్మాణాలు చేపట్టిన అనంతరమే మార్కెట్ను కోహెడకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 12వ తేదీ నుంచి మార్కెట్ను కోహెడకు తరలిస్తున్నారు. కోర్టు అదేశాలను లెక్క చేయకుండా మార్కెటింగ్ శాఖ వ్యవహరిస్తోందని, కోర్టు ధిక్కర చర్యగా పేర్కొంటూ మళ్లీ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు కమీషన్ ఏజెంట్లు తెలిపారు. ఎక్కడైనా కరోనా ప్రబలుతుంది కొత్తపేట్ మార్కెట్ను మూసివేసి కోహెడకు తరలిస్తే కరోనా ప్రబలదా అని రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కొత్తపేట్ మార్కెట్లో శానిటైజేషన్ ఏర్పాట్లు చేయకుండా, వ్యాధి నిరోధక విధానాలు అవలంబించకుండా కోహెడకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని మార్కెట్ తరలించేందుకు ఇంత తొందరపాటు వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కోహెడ మార్కెట్ సమీపంలో ప్రజా ప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, మార్కెటింగ్ శాఖ అధికారులు భూములు కొనుగోలు చేశారని, వీటి విలువ పెంచుకోవడానికి మార్కెట్ను తరలించేందుకు తొందరపెడుతున్నారని కమీషన్ ఏజెంట్లు అరోపిస్తున్నారు. -
బెంగాల్లో జూన్ 30 వరకు స్కూళ్లు బంద్
కోల్కతా: కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్డౌన్ ప్రస్తుతం ఉంఫన్ తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్లో జూన్ 30 వరకు యదావిధిగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఎనిమిది జిల్లాల్లో ఉంఫన్ తుఫాను కారణంగా అనేక పాఠశాల భవనాలు దెబ్బతిన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ తెలిపారు. అయితే 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని గతవారం ప్రకటించినట్లే జూన్ 29 నుంచే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. (స్కూల్స్ పునఃప్రారంభానికి కసరత్తు) దాదాపు 1,058 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అయితే తుఫాను కారణంగా 462 పరీక్షా కేంద్రాలు దెబ్బతిన్నాయని అయినప్పటికీ ప్రత్యామ్నాయంగా కొన్ని పరీక్షా కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. అవసరమైతే మరికొన్ని కాలేజీ భవనాలను కూడా ఎగ్జామ్ సెంటర్లుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. మిడ్నాపూర్, బుర్ద్వాన్, నాడియా, హూగ్లీ, హౌరా జిల్లాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు ఉంఫన్ కారణంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాయని తెలిపారు. దాదాపు తుఫాను కారణంగా స్కూళ్లు, పాఠశాలలు దెబ్బతిని 700 కోట్ల నష్టాన్ని మిగిల్చాయని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని పార్థా ఛటర్జీ వెల్లడించారు. ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. (సరిహద్దులో ఉద్రిక్తత: రంగంలోకి మళ్లీ అదే టీం?! ) -
కూరగాయల రైతుకు నష్టాల దిగుబడి
సాక్షి, హైదరాబాద్: రైతుల రోజువారీ ఆదాయ మార్గమైన కూరగాయల సాగు సంక్షోభంలో పడింది. సాగు పనులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. మార్కెట్లో అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నా, ధరలు పతనం కావడంతో లాభాలు మడిలోనే ఆవిరవుతున్నాయి. టమాట, బీర, బెండ, దొండ, దోస తదితర పంట దిగుబడులు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. సాధారణంగా ఈ సీజన్లో కూరగాయల ధరలు భగభగమండేవి. పెళ్లిళ్లు, శుభకార్యాలతో డిమాండ్ బాగా ఉండేది. అయితే, కరోనా, లాక్డౌన్ ప్రభావాలతో కూరగాయల విక్రయాలకు గండిపడింది. రైతుబజార్లలో కూరగాయల మార్కెట్లు మూతబడ్డాయి. దాదాపు నెలన్నరగా రైతులు దిగుబడులను సగానికి సగం తగ్గిస్తూ విక్రయిస్తుండడంతో నష్టాలపాలవుతున్నారు. రవాణా చార్జీలు సైతం గిట్టుబాటు కాక దిగాలు పడుతున్నారు. కొనేవారు లేక.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో భాగంగా రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లకు తాళం పడింది. ఇప్పటివరకు కూరగాయల దిగుబడులను నేరుగా రైతుబజార్కు తెచ్చి హోల్సేల్, రిటైల్గా విక్రయించే రైతులకు తాజా పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. దిగుబడులను ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి నెలకొంది. రిటైల్ విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. ఇంటింటి విక్రయాలు జరిపినప్పటికీ కరోనా భయంతో కొనుగోళ్లకు వినియోగదారులు ముందుకు రావట్లేదు. దీంతో మధ్యవర్తులకు దిగుబడులను అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేసిన రైతులు కూలీలతో దిగుబడులను వేరు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కూలీలకు రోజుకు సగటున రూ.500 వరకు చెల్లించాలి. అయితే కూలీలకు చెల్లించే మొత్తం కూడా దిగుబడుల విక్రయంతో దక్కడం లేదు. దీంతో కొందరు రైతులు గిట్టుబాటు కావడం లేదని పంట దిగుబడులను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు కావడం లేదనే కారణంతో రైతులు కూరగాయల సాగును వదిలేయడమే మంచిదనే భావనతో ఉన్నారు. అదే జరిగితే ఇబ్బందులు తప్పవు. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గితే డిమాండ్కు సరిపడా దిగుబడులు మార్కెట్లోకి రావు. దీంతో ధరలు పెరిగిపోతాయి. రాబడి 60 శాతం తగ్గింది అరెకరంలో టమాట, మరో అరెకరంలో దొండ సాగుచేస్తున్నా. మరో రెండు మడుల్లో గోకర, బీర వేశాం. దిగుబడి బాగుంది. కానీ ధరల్లేవు. గతేడాది ఇదే సమయంలో రోజుకు సగటున రూ.1,000 రాబడి వచ్చేది. కానీ ఇప్పుడు రూ.400 దాటడంలేదు. ఇది పెట్టుబడికే సరిపోవట్లేదు. మా కుటుంబసభ్యులతోనే సాగు పనులు చేస్తున్నాం. కూలీలను పెట్టుకుంటే నష్టాలు తప్ప పెట్టుబడి కూడా దక్కదు. – సిలువేరు మల్లయ్య, రైతు, సర్వేల్, యాదాద్రి జిల్లా పంటను పొలంలోనే వదిలేశా.. రెండెకరాల్లో టమాట, ఎకరంన్నరలో క్యాబేజీ, మరో రెండెకరాల్లో మునగ పంటలు వేశా. కూరగాయలకు ధరల్లేకపోవడం, కూలీలను పెట్టుకుంటే గిట్టుబాటు కాదని పంటంతా పొలాల్లోనే వదిలేశా. పొలం పక్కనున్న వారికి అవసరమైన కూరగాయలను తెంపుకోమని చెప్పా. – రొక్కం భీంరెడ్డి, రైతు, తుర్కయాంజాల్, రంగారెడ్డి జిల్లా -
చిన్న స్క్రీన్ పెద్ద ఊరట
లాక్ డౌన్ కారణంగా కొత్తగా రిలీజ్ కావాల్సిన సినిమాల కంటెంట్ అంతా స్టూడియోల్లోనే ఉండిపోయింది. కొంచెం ఆలస్యం అయినా రేపటి రోజుని చూస్తాయి, విడుదలవుతాయనే గ్యారంటీ ఉంది. కానీ ఇబ్బంది అంతా ఆల్రెడీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలకే. ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించిన వారం ముందే థియేటర్స్ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆల్రెడీ థియేటర్స్లో ప్రదర్శితం అవుతున్న చిత్రాలకు చిక్కొచ్చి పడింది. థియేట్రికల్ రన్ పూర్తి కాకుండా మధ్యలోనే సినిమా ప్రదర్శన ఆగిపోతే నష్టం ఖాయం. అయితే అలాంటి సినిమాలకు ‘డిజిటల్ ప్లాట్ ఫామ్’ ఓ ఊరట అని చెప్పొచ్చు. ఇంటి పట్టున కూర్చుని కాలక్షేపం కోసం ఈ ప్లాట్ ఫామ్ లో వస్తున్న సినిమాలను వీక్షిస్తున్నారు. దాంతో కొన్ని చిత్రాలను నేరుగా డిజిటల్ లో విడుదల చేస్తున్నారు. టీవీ, ల్యాప్ టాప్, ఫోన్.. చిన్ని తెర అయినప్పటికీ పెద్ద ఊరటగా నిలుస్తున్నాయి. ఓ పిట్ట కథ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. నిత్యా శెట్టి, విశ్వంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. చెందు ముద్దు దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6న విడుదలయింది. థియేటర్లో ఆడటానికి స్కోప్ ఉన్నా లాక్ డౌన్తో ఆగింది. అందుకే సినిమా విడుదలయిన పదో రోజునే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. పలాస 1978 వర్గ బేధాల గురించి శ్రీకాకుళం నేపథ్యంలో తయారయిన రూరల్ డ్రామా ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 6న ఈ సినిమా విడుదలయింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రైమ్లో ఉంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, కోమలి, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రల్లో బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6నే విడుదలయింది. ఈ సినిమాని కూడా ప్రస్తుతం ప్రైమ్లో చూడవచ్చు. మధ ‘మధ’ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకముందే ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటింది. సుమారు 26 ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డులు, అభినందనలు గెలుచుకుంది. త్రిష్ణ ముఖర్జీ ముఖ్య పాత్రలో శ్రీ విద్య బసవ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 13న విడుదలయింది. అన్ని అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడి ఉండేది. అయితే మార్చి 15 నుంచి థియేటర్స్ క్లోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 8 నుంచి ప్రైమ్లో అందుబాటులో ఉంది. డబ్బింగ్ సినిమాలు డబ్బింగ్ సినిమాలదీ అదే కథ. శివకార్తికేయన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. తెలుగులో ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్తో అనువదించారు. మార్చి 20న ఈ సినిమా థియేటర్స్లోకి రావాలి. కానీ లాక్ డౌన్ కావడంతో సినిమాను డైరెక్ట్గా అమెజాన్లో రిలీజ్ చేశారు. విక్రాంత్, అతుల్య, మిస్కిన్ నటించిన ‘షూట్ ఎట్ సైట్ ఉత్తర్వు’ అనే అనువాద చిత్రాన్ని కూడా నేరుగా ప్రైమ్లోనే రిలీజ్ చేశారు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడికి చూపిస్తేనే అది తయారు చేసిన వాళ్లకు ఆనందం. కానీ అనుకోకుండా వచ్చిన ఈ ‘లాక్ డౌన్’ వల్ల థియేటర్లకు రాకుండా సినిమాలు లాక్ అయ్యాయి. అందరూ ఇంట్లోనే ఉండటంతో వినోదాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్లోనే వెతుక్కుంటున్నారు. తెర ఏదైనా సినిమా తెరకెక్కేది ప్రేక్షకుడికి వినోదం అందించడానికే. ఒక నెల క్రితం వరకూ సినిమా విడుదలయ్యాక డిజిటల్ ప్లాట్ ఫామ్లోకి రావాలంటే మినిమమ్ 7 నుంచి 8 వారాలు గ్యాప్ ఉంటే బాగుంటుందని నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ అధినేతలు భావించారు. కానీ ఎన్ని రోజుల్లో ఆన్ లైన్లో సినిమా అందుబాటులోకి రావాలనే వాదన పక్కన పెడితే ఈ పరిస్థితుల్లో, ఆ సినిమాలకు ఊరట అనే అనుకోవచ్చు. థియేట్రికల్ రెవెన్యూ పరంగా పలు ఇబ్బందులు ఎదురైనా ప్రేక్షకుడి వరకూ సినిమా వెళ్ళింది అనే ఆనందం అయితే కచ్చితంగా మిగులుతుంది. -
ఇక రెండు రోజులే..
సాక్షి, పాల్వంచ: సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు విద్యుత్ కాంతులు విరజిమ్మిన కేటీపీఎస్ ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్) చరిత్ర తుది అంకానికి చేరుకుంది. పర్యావరణ ఆదేశాల మేరకు ఈ నెల 31తో తన ప్రస్థానానికి ముగింపు పలకబోతోంది. దీంతో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్రం కోల్పోనుంది. పాల్వంచలోని కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని 1966 – 1978 మధ్య కాలంలో ఏ,బీ,సీ స్టేషన్ల వారీగా 8 యూనిట్లను నిర్మించారు. వీటి ద్వారా 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి వెలుగులు అందించింది. ఇంజనీర్లు, కార్మికులు కలిపి 2,500 మంది ఇప్పటివరకు పనిచేశారు. కిన్నెరసాని జలాశయం ఆధారంగా సమీపంలోని కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల సింగరేణి బొగ్గు సరఫరా చేసుకుని ఐదున్నర దశాబ్దాల పాటు ఏకధాటిగా ఉత్పత్తి అందించింది. జపాన్ టెక్నాలజీతో 1,2,3,4 యూనిట్లలో 240 మెగావాట్లు, 5, 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 7,8 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల ఉత్పత్తిని అందించింది. అయితే కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ యూనిట్లను మూసివేయాలని సెంట్రల్ ఎలక్రి్టసిటీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, దాని స్థానంలో సూపర్ క్రిటికట్ టెక్నాలజీతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా మరో ప్లాంట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఓఅండ్ఎం కర్మాగారాన్ని 2019 డిసెంబర్ 31న మూసి వేయాల్సి ఉండగా.. 7వ దశలో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో గత నవంబర్ 28వ తేదిన ఉత్పత్తిని నిలిపివేశారు. మరమ్మతు చేయడానికి నాలుగు నెలల కాలం తీసుకున్నారు. దీంతో డిసెంబర్ 31న మూసివేయాల్సిన ఓఅండ్ఎం కర్మాగారాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. మార్చి 31తో మూసేస్తాం కాలం చెల్లిన 720 మెగావాట్ల కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని మార్చి 31న మూసివేయాలని జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఐదున్నర దశాబ్దాల పాటు తన ప్రస్థానాన్ని సాగించి ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులు అందించింది. జ పాన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ కర్మాగారం ఇంతకాలం విజయవంతంగా ఉత్పత్తి అందించడం గొప్ప విషయం. కేటీపీఎస్తోనే పాల్వంచకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉందనడంలో సందేహం లేదు. మూసివేత నిర్ణయం బాధాకరమైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో విరామం ప్రకటిస్తున్నాం. - జె.సమ్మయ్య, సీఈ -
ఏపీకు వచ్చే అన్ని సరిహద్దుల మూసివేత
-
ఇంటి వద్దకే అంగన్వాడీ సరుకులు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను మూసేస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. అయినప్పటికీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పౌష్టికాహార పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోమవారం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు పంపిణీని గ్రామ కమిటీ ద్వారా చేపట్టాలన్నారు. ఈ కమిటీలో అంగన్వాడీ టీచర్, హెల్పర్, గ్రామ కార్యదర్శి, ఆశ వర్కర్, స్థానిక పోలీస్ను భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి వస్తువు సరైన పద్ధతిలో, సరైన సమయంలో లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ దివ్యను ఆదేశించారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితి నేపథ్యంలో సెలవు రోజుల్లో కూడా రోజు మాదిరిగానే సరుకులు పంపిణీ చేయాలన్నారు. కరోనాపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అప్రమత్తంగా ఉండాలని, విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. గర్భిణుల జాబితా సిద్ధం చేయాలి..: గ్రామాలు, పట్టణాల్లోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రసవ సమయానికి సిద్ధమైన గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి సత్యవతి ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో గర్భిణులు 3.3 లక్షలు ఆరోగ్య లక్ష్మి ద్వారా లబ్ధి పొందుతున్నారని కమిషనర్ దివ్య వివరించారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు బాలబాలికలు 4.40 లక్షలు, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు శిశువులు 8.40 లక్షల మంది ఉన్నారన్నారు. -
కరోనా: గుంటూరు మిర్చి యార్డు లాక్డౌన్
సాక్షి, గుంటూరు: కోవిడ్-19 ( కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా జిల్లాలోని మిర్చి మార్కెట్ను ఈ నెల 31 వరకు మూసివేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సోమవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మిర్చి రైతులు గుంటూరు మిర్చి మార్కెట్కు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి మిర్చి యార్డ్ తెరిచేంతవరకు రైతులు రావొద్దని ఆయన సూచించారు. సోమవారం నుంచి గుంటూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడి ఉండొద్దని కలెక్టర్ శామ్యూల్ తెలిపారు. (31వరకు ఏపీ లాక్డౌన్ ) ఇక గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 31 వరకు యార్డుకు మిర్చిని తీసుకురావద్దని, రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
భారత్ @ 158
న్యూఢిల్లీ/బెంగళూరు: భారత్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 158కి చేరింది. మంగళవారం నుంచి కొత్తగా 14 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక సైనికుడు కూడా ఉన్నారు. లద్దాఖ్ స్కౌట్ రెజిమెంట్కు చెందిన 34 ఏళ్ల సైనికుడికి కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని భారత సైన్యం ప్రకటించింది. ఇరాన్ నుంచి ఫిబ్రవరి 20న ఎయిర్ ఇండియా విమానంలో భారత్ తిరిగొచ్చిన తన తండ్రి నుంచి ఆ సైనికుడికి ఆ వైరస్ సోకిందని, అతడి తండ్రికి కూడా కోవిడ్ నిర్ధారణ అయిందని వెల్లడించింది. వారు లేహ్లోని చౌహత్ గ్రామానికి చెందినవారని తెలిపింది. ఆ సైనికుడి సోదరుడికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా ఆర్మీ చర్యలు ప్రారంభించింది. సెలవుపై వెళ్లి వచ్చిన సైనికులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడం, ఫ్లూ లక్షణాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, అనవసర ప్రయాణాలను, అన్ని శిక్షణ కార్యక్రమాలను, సదస్సులను రద్దు చేయడం.. తదితర చర్యలు చేపట్టింది. ఈ వైరస్ సోకిన 158 మందిలో ముగ్గురు మృతులు, 25 మంది విదేశీయులు ఉన్నారు. ఏకాంతవాస కేంద్రాల(క్వారంటైన్ సెంటర్స్)ను సందర్శించి, అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ బాధితులతో సన్నిహితంగా ఉన్న దాదాపు 5700 మందిని వివిధ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బుధవారం వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 42, కేరళలో 27, ఉత్తరప్రదేశ్లో 16, కర్ణాటకలో 11, ఢిల్లీలో 10, లద్దాఖ్లో 8, తెలంగాణలో 13 కేసులు నమోదయ్యాయి. హరియాణాలో కోవిడ్ బారిన పడిన 17 మందిలో 14 మంది విదేశీయులే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా చికిత్స అనంతరం కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. విదేశాల్లోని భారతీయులకు.. విదేశాల్లోని భారతీయుల్లో 276 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ బుధవారం లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. వారిలో ఇరాన్లోని 255 మంది, యూఏఈలోని 12 మంది, ఇటలీలోని ఐదుగురు, శ్రీలంక, కువైట్, రువాండా, హాంకాంగ్ల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారన్నారు. యూఏఈలో 8 మంది భారతీయులను క్వారంటైన్ చేసినట్లు వెల్లడించారు. ఇరాన్లో సుమారు 6 వేల మంది భారతీయులున్నారన్నారు. వారిలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్రల నుంచి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లిన 1100 మంది, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన 1000 మంది మత్స్యకారులు, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల నుంచి వెళ్లిన 300 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు ఇరాన్ నుంచి 389 మందిని వెనక్కు తీసుకువచ్చామన్నారు. రాజ్యసభలో మాస్కుల కలకలం రాజ్యసభకు తొలిసారి ఎంపీ డెరెక్ ఓ బ్రేన్ సహా నలుగురు టీఎంసీ సభ్యులు మాస్క్లతో వచ్చారు. సభా నిబంధనల ప్రకారం సభ్యులు మాస్క్లు ఉపయోగించరాదని సభ చైర్మన్ వెంకయ్యనాయుడు తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కరోనా ముప్పు నేపథ్యంలో మాస్క్ల వినియోగం తప్పనిసరి అని, దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసిందని, అందువల్ల మాస్క్లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం కోరడంతో, వెంకయ్యనాయుడు అంగీకరించారు. కరోనా ముప్పు పొంచి ఉందని, అందువల్ల బడ్జెట్ సమావేశాలను కుదించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు అభ్యర్థించారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ ఉంటామని, అందువల్ల ఎంపీలకు వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని, ఎంపీలమైనందువల్ల ఆ వైరస్ మన జోలికి రాదని అనుకోకూడదని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ గౌడ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అభ్యర్థనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సబ్బుల ధరలపై కేంద్రం దృష్టి న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నిత్యావసరాలైన సబ్బులు, నేలలు తుడిచే క్లీనర్లు, థర్మల్ స్కానర్ల ధరలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. సాధారణంగా ఈ శాఖ దేశవ్యాప్తంగా 22 నిత్యావసరాల ధరలను పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా ఫేస్ మాస్క్లు, చేతి శానిటైజర్లను ఆ జాబితాలో చేర్చింది. ‘కోవిడ్ కారణంగా డిమాండ్ పెరిగిన సబ్బులు, లైజాల్, డెటాల్ వంటి చేతులు, నేలలు శుభ్రపరిచే క్లీనర్ల ధరలను మేం పర్యవేక్షిస్తున్నాం’అని కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 114 కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల ధరలను కేంద్రం పర్యవేక్షిస్తోంది. 22 నిత్యావసర వస్తువుల్లో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, నూనెలు, కూరగాయలు, చక్కెర, పాలు, టీ, ఉప్పు తదితరాలు ఉన్నాయి. కోవిడ్పై ప్రజల్లో అవగాహన పెరగడంతో వేరే దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువగా వ్యాపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఐఐటీ బాంబే బంద్ ► కరోనా ముప్పు నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదని బీజేపీ నిర్ణయించింది. ► మా పరుపులు వాడితే కరోనా వైరస్ రాదని ప్రచారం చేస్తున్న ఒక వ్యాపారిపై మహారాష్ట్రలోని థానేలో కేసు నమోదైంది. ► కోవిడ్–19 లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించి, వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై నకిలీ వార్తలు ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ► కరోనా వైరస్ నుంచి రక్షిస్తుందని పేర్కొంటూ గో మూత్రాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని నారాయణ చటర్జీ అనే బీజేపీ కార్యకర్త కోల్కతాలో మంగళవారం నిర్వహించారు. ఆ గోమూత్రం సేవించి, అనారోగ్యం పాలయిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చటర్జీని అరెస్ట్ చేశారు. ► ఐఐటీ బాంబే క్యాంపస్ను మార్చి 31 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ► లండన్లో వేలాదిగా ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై అక్కడి హైకమిషన్ను అభ్యర్థిస్తున్నారు. అయితే, బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై మార్చి 31 వరకు భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. బ్రిటన్లో కోవిడ్ కారణంగా 104 మంది చనిపోగా, దాదాపు 2 వేల మందికి ఈ వైరస్ సోకింది. ► పారా మిలటరీ సిబ్బందికి సంబంధించిన అన్ని అత్యవసరం కాని సెలవులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పార్లమెంట్ వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యకు థర్మల్ స్క్రీనింగ్ దృశ్యం -
బీసీసీఐ కార్యాలయం మూసివేత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవులు ప్రకటించగా... ఐటీ కారిడార్లు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఇదే బాటలో నడుస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని తమ ప్రధాన కార్యాలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలంటూ ఆదేశించింది. కోవిడ్–19 కారణంగా ఇప్పటికే పలు టోర్నీలను బీసీసీఐ వాయిదా వేసింది. ఈ జాబితాలో దేశవాళీ క్రికెట్ టోర్నీలు, ఇరానీ కప్, మహిళల చాలెంజర్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ టోర్నీ కూడా ఉంది. మరోవైపు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అన్ని జోనల్ శిక్షణా శిబిరాలను నిలిపివేసింది. కానీ బెంగళూరులోని ఎన్సీఏ పునరావాస కేంద్రం మాత్రం సోమవారం కూడా తన విధుల్లో నిమగ్నమై ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈనెల 21 నుంచి జరగాల్సిన శిక్షణా శిబిరాన్ని వాయిదా వేసింది. -
‘సుప్రీం’ కాంప్లెక్స్లోకి సందర్శకులకు నో
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం మరిన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. న్యాయస్థానం ఆవరణలోకి ప్రతి శనివారం సందర్శకులకు బృందాలుగా ఇచ్చే అనుమతులను రద్దు చేసింది. కోర్టు క్యాంటీన్, కెఫేలను మూసివేయాలని ఆదివారం ఆదేశించింది. ఈ నెల 16వ తేదీన మొత్తం 15 ధర్మాసనాలకు గాను 6 మాత్రమే పనిచేస్తాయని, 12 అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తాయని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘çకోర్టు ఆవరణలోకి సాధారణ సందర్శకులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలి. లాయర్లు, కోర్టు సిబ్బంది, చిరు వ్యాపారులు ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకల్లా ఆవరణ విడిచి బయటకు వెళ్లిపోవాలి. 6 గంటలకల్లా కోర్టులోని విశ్రాంతి గదులు, కారిడార్లు, మెట్లు తదితరాలను శుభ్రం చేయాలి. లాయర్లు, కక్షిదారులు, గుమాస్తాలు ఆవరణలో గుమి కూడరాదని, విధులు ముగిసిన తక్షణమే వెళ్లిపోవాలి’అని ఆదేశించింది. -
తడ బడి.. మూతపడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్ల సంఖ్య పెద్దగా తగ్గకపోయినా విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. పాఠశాల విద్యాశాఖ తేల్చిన లెక్కల ప్రకారం విద్యా వాలంటీర్లు కలుపుకొని 2017–18 విద్యా సంవత్సరంతో పోల్చితే 2018–19లో 3,834 మంది టీచర్లు తగ్గిపోయారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 280 మందే తగ్గారు. విద్యార్థుల విషయానికొస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 39,107 మంది తగ్గగా, ప్రైవేటు పాఠశాలల్లో 77,447 మంది పెరిగారు. స్కూళ్ల పరంగా చూస్తే ప్రైవేటు స్కూళ్లే అత్యధికంగా మూత పడ్డాయి. అయినా వాటిల్లో విద్యా ర్థుల సంఖ్య పెరగటం గమనార్హం. 2017–18 విద్యా సంవత్సరంతో పోల్చితే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రైవేటులో 410 స్కూళ్లు మూత పడినా ఆ ప్రభావం విద్యార్థుల సంఖ్యపైనా పడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇక 2019–20 విద్యా సంవత్సరం లెక్కల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య మరింతగా తగ్గుతుందని విద్యాశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. రూ.వేలకోట్లు వెచ్చిస్తున్నా.. రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద వివిధ విద్యా పథకాలకు ఆమో దం తెలిపేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల కేంద్రానికి ఈ లెక్కలను అందజేసింది.అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లే మూత పడినట్లు పేర్కొంది. పట్ట ణాల్లో 453 పాఠశాలలు మూత పడగా, గ్రామీణ ప్రాంతాల్లో 26 మూతపడ్డాయి. విద్యా పథకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.వేల కోట్లను వెచ్చిస్తున్నా ఫలితాలు ఆశించిన మేర రావడం లేదు. సమగ్ర శిక్షా అభియాన్ కిందే ఏటా వెచ్చిస్తున్న రూ. 2 వేల కోట్లు కలుపుకొని ఏటా పాఠశాల విద్యకు రూ. 11 వేల కోట్లు కేటా యించినా ప్రభుత్వ బడులు విద్యార్థులను ఆకట్టులేకపోతున్నాయి. ప్రభుత్వ టీచర్లు సరిగ్గా చెప్ప రన్న అపవాదు, ప్రైవేటు పాఠశాలల ఆకర్షణీయ విధానాలతో తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. కేంద్రానికి ఇచ్చిన లెక్కల్లో మరికొన్ని అంశాలు.. ►రాష్ట్రంలో 2017–18 విద్యా సంవత్సరంలో మొత్తం స్కూళ్లు 42,834 ఉండగా, 2018–19లో వాటి సంఖ్య 42,355కు తగ్గిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 479 స్కూళ్లు మూత పడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో 453, గ్రామీణ ప్రాంతాల్లో 26 మూత పడ్డాయి. ►మూత పడిన వాటిలో ప్రైవేటువే అత్యధికంగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 410 మూత పడగా, మిగతావి ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ►రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో (ఇంటర్మీడియట్ కలుపుకొని) 2017–18 విద్యా సంవత్సరంలో 65,29,072 మంది విద్యార్థులు ఉండగా 2018–19 విద్యా సంవత్సరం వచ్చే సరికి వారి సంఖ్య 65,56,701 మందికి చేరుకుంది. అంటే పాఠశాలల్లో 27,629 మంది విద్యార్థులు పెరిగారు. ►2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా వలంటీర్లు కలుపుకొని 2,61,904 మంది టీచర్లు ఉండగా, వారి సంఖ్య 2018–19 విద్యా సంవత్సరంలో 2,57,367 మందికి తగ్గిపోయింది. అంటే పాఠశాలల్లోనే 4,537 మంది టీచర్లు తగ్గిపోయారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్య«ధికంగా 3,834 మంది టీచర్లు తగ్గిపోవడం గమనార్హం. -
గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుపతి: సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసి ఉంచుతున్నారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం గురువారం వీఐపీ బ్రేక్ దర్శనాలను (ప్రొటోకాల్ దర్శనాలు కూడా) రద్దుచేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును కూడా బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భవనాన్ని తెరుస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. శ్రీశైల ఆలయం మూత సూర్యగ్రహణం సందర్భంగా శ్రీశైల ఆలయ మహాద్వారాలను బుధవారం రాత్రి 10 గంటలకు మూసివేసినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆలయద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాత సేవ, స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, అనుబంధ ఆలయాలను గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.10 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో తెలిపారు. శుద్ధి అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి 8 గంటలకు మూసివేసినట్లు ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ తెలిపారు. గ్రహణం వీడిన అనంతరం శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించి గురువారం సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుస్తామని చెప్పారు. నేడు శ్రీకాళహస్తిలో గ్రహణకాల అభిషేకాలు శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వరుని ఆలయంలో గురువారం సూర్యగ్రహణం సందర్భంగా ప్రత్యేక గ్రహణకాల అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్రెడ్డి బుధవారం తెలిపారు. -
రేపు యాదాద్రి ఆలయం మూసివేత
సాక్షి, యాదగిరిగుట్ట : పాక్షిక సూర్యగ్రహణం కారణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రినుంచి ఈ నెల 26(గురువారం)వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8.26గంటల నుంచి 10.57గంటల వరకు మోక్షకాలం ఏర్పడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని బుధవారం (నేడు) రాత్రి ఆలయ ద్వారబంధనం చేస్తారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12గంటల తరువాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, మహానివేదన అనంతరం 2గంటలనుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తామని తెలిపారు. సాయంకాలం భక్తుల మొక్కుసేవలు, దర్బార్సేవ, అర్చనలు యధావిధిగా ఉంటాయని పేర్కొన్నారు. పాతగుట్ట ఆలయాన్ని సైతం మూసివేస్తామని తెలిపారు. పాక్షిక సూర్యగ్రహణం అనంతరం శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని శుద్ధి చేసి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వ్రతాలు జరిపిస్తామని పేర్కొన్నారు. వాడపల్లిలో.. దామరచర్ల(విుర్యాలగూడ): జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లిలోని దేవాలయాలను ఈ నెల 26న మూసివేయనున్నట్లు వాడపల్లి ఆలయాల మేనేజర్ మృత్యుంజశాస్త్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా గురువారం ఉదయం 7గంటల నుంచి శ్రీ మీనాక్షి ఆగస్తేశ్వరదేవాలయం, శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దేవాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు. -
మూతబడిన స్పాంజ్ ఐరన్ యూనిట్
సాక్షి, కొత్తగూడెం: పాల్వంచలోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్పాంజ్ ఐరన్ యూనిట్ మనుగడ మూడు నెలల ముచ్చటే అయింది. మూడేళ్ల పాటు మూతబడిన ఈ ప్లాంట్లో గత జనవరిలో ఉత్పత్తి పునఃప్రారంభించారు. అయితే మూడు నెలలకే మళ్లీ మూతబడింది. స్పాంజ్ ఐరన్ విక్రయిస్తే వచ్చే డబ్బు కంటే తయారీకే ఎక్కువగా ఖర్చవుతోందని, దీంతో నష్టాలు వస్తున్నాయని ఎన్ఎండీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రక్రియ భారం కావడంతో తిరిగి మూసేశారు. నష్టాలు వస్తున్నాయనే కారణంతో ఈ ప్లాంట్లో ఉత్పత్తిని 2016లో నిలిపివేశారు. ఉద్యోగుల కోరిక, జిల్లా ప్రజల ఆకాంక్ష, రాష్ట్ర విభజన నేపథ్యంలో బయ్యారంలో చేపట్టాల్సిన ఉక్కు కర్మాగారం విషయమై అనేక ఆందోళనల నేపథ్యంలో పాల్వంచలోని ఎన్ఎండీసీ స్టీల్ ప్లాంట్లో మూడేళ్ల తరువాత ఈ ఏడాది జనవరి 22న తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. అయితే ఉత్పత్తి ప్రక్రియ నిరాటంకంగా నడుస్తుందని ఆశించినప్పటికీ అది సాధ్యం కాలేదు. నడిపించి నష్టాలను పెంచుకోవడం కంటే ఉత్పత్తిని నిలిపివేయడమే మేలని నిర్ణయానికి వచ్చిన ఎన్ఎండీసీ.. గత మార్చిలో తిరిగి ఉత్పత్తిని ఆపేసింది. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. స్పాంజ్ ఐరన్ బదులు కోల్డ్ రోల్ మిల్ (మెటల్ ప్రాసెసింగ్ మిషనరీ) చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీనిపై అ«ధ్యయనం చేసేందుకు ఎంఎన్ దస్తూరి అనే కన్సెల్టెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్ఎండీసీలో విలీనం చేసినా నష్టాలే.. 1980లో స్పాంజ్ ఐరన్ యూనిట్(డీఆర్పీ 1) వార్షిక ఉత్పత్తి 30 వేల టన్నులతో ప్రారంభమైంది. లక్ష్యాలకు మించి 60 వేల టన్నుల ఉత్పత్తిని కూడా సాధించింది. 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఉక్కు పరిశ్రమలో మాంద్యం నెలకొంది. దీంతో నష్టాలు మొదలైన ఈ కర్మాగారాన్ని 2010 జూలై 31న లాభదాయకమైన నవరత్న స్థాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్లో విలీనం చేశారు. ఈ విధంగా అయినా తిరిగి స్పాంజ్ ఐరన్ యూనిట్ నష్టాలను అధిగమిస్తుందని ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉత్పత్తి ధర కంటే అమ్మకం ధర తక్కువగా ఉండటంతో 2016లో ఉత్పత్తిని నిలిపివేశారు. అనేక పరిణామాల మధ్య తిరిగి 2019 జనవరి 22న పునరుద్ధరించేందుకు నూతన జీఎం ఆర్డీ నంద్ ప్రత్యేక చొరువ తీసుకుని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీఎస్ చెరియన్ సహకారంతో 100 టన్నుల సామర్థ్యం గల ఒక యూనిట్ను ప్రారంభించారు. ఇందుకు అవసరమైన ముడి సరుకు ఐరన్ ఓర్, బొగ్గు దిగుమతికి చర్యలు చేపట్టారు. అయితే టన్ను ఉత్పత్తికి రూ.23 వేలు ఖర్చు అవుతుండగా.. అది అమ్మితే రూ.19 వేలు మాత్రమే వస్తోంది. అంటే టన్నుకు రూ.4 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. ఇలా నెలకు రూ.12 కోట్లు నష్టం వస్తున్నట్లు సమాచారం. దీంతో నడపడం కంటే మూసేయడమే మేలని భావించి గత మార్చిలో ఉత్పత్తిని నిలిపివేశారు. మరో వైపు సిబ్బంది జీతభత్యాలు కూడా భారమై సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కర్మాగారంలో ఉత్పత్తి లేక పోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సుమారు 30 మంది అధికారులు, 102 మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తెరపైకి కోల్డ్ రోల్ మిల్.. మార్కెట్లో స్పాంజ్ ఐరన్ ధర పెరిగితే తప్ప నష్టాలు తప్పవని అధికారులు అంటున్నారు. సిబ్బంది సంక్షేమం దృష్ట్యా నడపాలని యోచిం చినప్పటికీ అది సాధ్యం కావడం లేదని చెపుతున్నారు. ఛత్తీస్గఢ్లోని బైలడిల్లా నుంచి కాకుం డా సమీపంలో ఉన్న బయ్యారం ఐరన్ఓర్ ఉపయోగించుకుని నడపితే రవాణా చార్జీలు తగ్గుతాయని ఆలోచించినా.. ఇక్కడి ముడి సరుకు (ఐరన్ఓర్) ఉత్పత్తికి అవసరమైన మేర నాణ్యం గా లేదని తెలిసింది. దీంతో ఇక్కడ కోల్డ్ రోల్ మిల్ ఏర్పాటు చేస్తే బాగుంటదనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీనిపై యాజమాన్యం సైతం సానుకూలంగా ఉందని, కార్యరూపం దాల్చితే సంస్థకు మేలు జరుగుతుందని సిబ్బంది ఆశిస్తున్నారు. సాధ్యసాధ్యాలపై ఎంఎన్ దస్తూరి అనే కన్సెల్టెన్సీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇక్కడి సిబ్బందితో కూడా చర్చించినట్లు తెలిసింది. -
గాంధీ జయంతి : మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్టాక్మార్కెట్లకు ఈ రోజు (అక్టోబరు 2, బుధవారం) సెలవు. బాండ్, కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు కూడా బుధవారం పనిచేయవు. మరోవైపు గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ,రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా బాపూజీని స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. కాగా మంగళవారం ఆరంభంలోనే పాజిటివ్గా ఉన్నప్పటికీ మిడ్సెషన్ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాలలో అమ్మకాలు షాక్ తగిలింది. చివరికి సెన్సెక్స్ 362 పాయింట్లు పతనమై 38305 వద్ద , నిఫ్టీ 115 పాయింట్లు కోల్పోయి 11359 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. राष्ट्रपिता महात्मा गांधी को उनकी 150वीं जन्म-जयंती पर शत-शत नमन। Tributes to beloved Bapu! On #Gandhi150, we express gratitude to Mahatma Gandhi for his everlasting contribution to humanity. We pledge to continue working hard to realise his dreams and create a better planet. pic.twitter.com/4y0HqBO762 — Narendra Modi (@narendramodi) October 2, 2019 -
‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్ (ఎస్సీఎల్) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్ ఆగస్టు 15–18 దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్ ఈ సందర్భంగా వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్సీఎల్ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16, 17న (రెండు రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్ తదితర సంస్థలు డిమాండ్కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతీలో 3 వేల ఉద్యోగాలు కట్.. ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయలేదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు. -
మార్కెట్లకు సెలవు
సాక్షి,. ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లకు ఈ రోజు సెలవు. బక్రీద్ సందర్భంగా 12న(సోమవారం) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ప్రకటించారు. సాక్షి పాఠకులకు బక్రీద్ పర్వదినంగా సందర్భంగా ఈద్ శుభాకాంక్షలు. అలాగే ఈ వారం మార్కెట్లలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు. దీంతో వారంలో ట్రేడింగ్ మంగళ, బుధ, శుక్రవారాలకే పరిమితంకానుంది కాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడంతో గత వారంలో తొలి మూడు రోజులూ దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. దేశీయంగా రిలీఫ్ ర్యాలీ వచ్చినప్పటికీ , సెంటిమెంటు బలహీనంగా ఉందనీ, అప్రమత్తత అవసరంమని నిపుణులు చెబుతున్నారు.