నేడు ప్రైవేట్ విద్యా సంస్థల బంద్
Published Fri, Sep 9 2016 9:15 PM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
అమలాపురం టౌన్ :
ప్యాకేజీల పేరుతో ఆంధ్రా ప్రజలను మోసగిస్తున్నందుకు నిరసనగా శనివారం జరిగే రాష్ట్ర బంద్కు జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ బంద్ పాటిస్తున్నాయని జిల్లా ఏపీ అన్ ఎయిడ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఆపుస్మా) అధ్యక్షుడు మంగళంపల్లి అంజిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు మూసి వేసి బంద్ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement