today
-
Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారతదేశంలో ఫిబ్రవరి 10కి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజును ప్రజాస్వామ్యంలో పండుగ రోజుగా అభివర్ణిస్తారు. దేశంలోని పౌరులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడం ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికలు పెద్ద సవాలుగా నిలిచాయి.1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూవచ్చారు. 1952 ఫిబ్రవరి 10.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ముఖ్యమైన రోజుగా మారింది. ఆరోజు నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ లోక్సభలోని 489 సీట్లలో 249 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో ఈ ఎన్నికలు విజయబావుటా ఎగురవేశాయి.ఫిబ్రవరి 10న భారత్తో పాటు ప్రపంచ చరిత్రలో ప్రముఖంగా నిలిచిన ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం.1818: ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్లో బ్రిటిష్ సైన్యం, మరాఠా సైన్యం మధ్య మూడవ, చివరి యుద్ధం జరిగింది.1921: మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠాన్ని ప్రారంభించారు.1921: బ్రిటిష్ పాలకుడు కన్నాట్ డ్యూక్ ఇండియా గేట్ నిర్మాణానికి పునాది రాయి వేశారు.1952: స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి, దేశంలో ప్రజాస్వామ్య స్థాపనను ప్రకటించింది.1990: గెలీలియో అంతరిక్ష నౌక బృహస్పతి వైపు వెళుతూ, శుక్ర గ్రహం ముందునుంచి వెళ్లింది.1996: చదరంగం ఒక మైండ్ గేమ్గా పేరొందింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్- డీప్ బ్లూ మధ్య ఫిబ్రవరి 10న ఒక మ్యాచ్ జరిగింది. దీనిలో కాస్పరోవ్ 4-2 తేడాతో గెలిచారు. మరుసటి సంవత్సరం ఈ పోటీలో డీప్ బ్లూ విజయం సాధించించారు.2005: బ్రిటన్ యువరాజు చార్లెస్ తన చిరకాల స్నేహితురాలు కెమిల్లా పార్కర్తో వివాహాన్ని ప్రకటించారు.2009: ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ భీమ్సేన్ జోషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2008 నవంబర్లో ఆయనకు భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.2010: పాకిస్తాన్లోని పెషావర్ సమీపంలోని ఖైబర్ పాస్ ప్రాంతంలో పోలీసు అధికారుల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. దీనిలో 13 మంది పోలీసు అధికారులతో పాటు మొత్తం 17 మంది మృతిచెందారు.2013: అలహాబాద్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతిచెందారు. 39 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు? -
పన్నూ మమ్మల్ని బెదిరించాడు: ఆస్ట్రేలియన్ టుడే
భారతదేశ విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఇంటరర్వ్యూ ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థపై ఇటీవల కెనడా నిషేధం విధించింది. అయితే.. వ్యవహారంపై తాజాగా ఆ మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ జితార్థ్ జై భరద్వాజ్ స్పందించారు. ప్రతికాస్వేచ్ఛను హత్య చేయటమేనని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై మండిపడ్డారు. గుళ్లపై పదేపదే దాడులు జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిచారు.‘‘ కెనడా చర్య.. పత్రికా స్వేచ్ఛను హతమార్చటం అవుతుంది. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంది. విభిన్న అభిప్రాయాలన్నింటినీ చర్చించడానికి, అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికే పత్రికలు ఉన్నాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూ మమ్మల్ని బెదిరించాడు. ...ఇతర వేర్పాటువాదుల నుంచి కూడా బెదిరింపులు వచ్చాయి. అమెరికా, కెనడాలో కవరేజీ చేసినందుకు మా చిత్రాలను పన్నూ ఆన్లైన్లో పెట్టారు. అనేక రకాలుగా హాని తలపెట్టమని ఆయన మద్దతుదారులను ఉసిగొల్పారు. అయినా.. మేం భయపడకుండా నిరంతరం రిపోర్టింగ్ చేస్తున్నాం’’అని అన్నారు.చదవండి: కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం -
రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది చలికాలం ప్రారంభానికి ముందే రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగింది. రాజధానిలో గాలి నాణ్యత వరుసగా రెండో రోజు ‘పూర్’ కేటగిరీలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీపీబీ) తెలిపిన వివరాల ప్రకారం దసరా తర్వాత ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224 కు చేరుకుంది.దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ఈ ఏడాది కూడా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గ్రాప్-1ని నేటి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవి నేటి నుంచి(మంగళవారం) నుంచి అమలు కానున్నాయి. గ్రాప్-1 దశలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని పరిమితం చేయడం, రెస్టారెంట్లలో బొగ్గు లేదా కట్టెల వినియోగాన్ని నిషేధించడం వంటివి ఉంటాయి. నగరంలో ఏక్యూఐ 200 దాటినప్పుడు గ్రాప్-1 అమలు చేస్తారు.గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే గాలి నాణ్యత క్షీణతను నిరోధించడానికి అమలు చేసే విధానం. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత ఆధారంగా గ్రాప్ విధానాన్ని నాలుగు దశలుగా విభజించారు. మొదటి దశలో ఢిల్లీకి 300 కి.మీ. పరిధిలో కాలుష్యం కలిగించే పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటారు. రెండవ దశలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో సీఎన్జీ/ఎలక్ట్రిక్ బస్సు మెట్రో సేవలను ప్రోత్సహిస్తారు.మూడవ దశలో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్లలో పెట్రోల్తో నడిచే బీఎస్-3 ఫోర్-వీలర్లు, డీజిల్తో నడిచే బీఎస్-4 ఫోర్-వీలర్ల వినియోగాన్ని నిషేధించనున్నారు. నాల్గవ దశలో అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులను నిషేధిస్తారు. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సిబ్బందికి ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.ఇది కూడా చదవండి: రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు -
ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈరోజు(శనివారం) కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్లలో అక్టోబర్ 12న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో అస్సాం, మేఘాలయలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల నుండి దాటనున్నాయి. యూపీలోని కొన్ని చోట్ల తేలికపాటి పొగమంచు కమ్ముకుంది. అక్టోబర్ 16 వరకు ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్గానూ, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గానూ ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు -
జమ్ముకశ్మీర్లో భూకంపం.. 3.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) విడుదల చేసిన సమాచారం ప్రకారం జమ్ము కాశ్మీర్లో శనివారం సాయంత్రం 5.34 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అయితే దీని కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.జమ్ముకాశ్మీర్లో సంభవించే తేలికపాటి భూకపాలు కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం కిష్త్వార్ ప్రాంతంలో ఉందని అధికారులు తెలిపారు. భూమికి 10 కి.మీ లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కశ్మీర్ లోయ కూడా ఒకటి. గతంలో ప్రకృతి ప్రకోపానికి ఈ ప్రాంతం బలయ్యింది.2005లో కశ్మీర్ లోయలో సంభవించిన భూకంపాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేదు. ఆ ఏడాది అక్టోబర్ 8న ఇక్కడ బలమైన భూకంపం వచ్చింది. దీని ప్రభావానికి 69 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 75 వేల మంది గాయపడ్డారు. నాడు భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. -
అలర్ట్: యూపీలో భారీవర్షాలు.. ఉత్తరాఖండ్కు కొండచరియల ముప్పు
దేశంలోని పలుప్రాంతాల్లో రుతుపవనాలు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీలోకి రుతుపవనాలు ప్రవేశించి, 20 రోజులకు పైగా సమయం గడిచినా గత కొద్ది రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు లేవు. ఊహించని విధంగా ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇక్కడికి పక్కనే ఉన్న తూర్పు యూపీలో ప్రతిరోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతున్నదనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) చినుకులు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉండవచ్చు. శుక్రవారం నాటి ఉష్ణోగ్రత కంటే ఈరోజు రాజధానిలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదుకానున్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరాఖండ్లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారాంతంలోగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా గుజరాత్లోని పోర్బందర్ ప్రాంతమంతా జలమయమైంది. జూలై 22 వరకు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
మూడు లక్షలకు అమర్నాథ్ యాత్రికుల సంఖ్య
అమర్నాథ్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్ముకశ్మీర్కు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శనివారం అమరనాథుణ్ణి 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2,93,929 మంది భక్తులు అమర్నాథ్కు తరలివచ్చారు.అమరనాథుణ్ణి త్వరగా దర్శించుకోవాలనే ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తోంది. ఇందుకోసం టోకెన్లు పొందేందుకు, భక్తులు తెల్లవారుజాము నుంచే సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తాజాగా 1,630 మంది భక్తులు 74 చిన్న, పెద్ద వాహనాల్లో జమ్ము నుంచి బల్తాల్కు బయలుదేరారు. వీరిలో 1068 మంది పురుషులు, 546 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా పహల్గాం మార్గంలో 109 చిన్న, పెద్ద వాహనాల్లో 3039 మంది భక్తులు కశ్మీర్కు తరలి వెళ్లారు. వీరిలో 2350 మంది పురుషులు, 584 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, 96 మంది సాధువులు, ఇద్దరు సాధ్వులు ఉన్నారు. కాగా ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. -
అత్త ఇంటికి జగన్నాథుడు.. రథయాత్రలో అద్భుత ఘట్టం
ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న (సోమవారం) ఉదయం మంగళ హారతితో రథయాత్ర ప్రారంభమైంది. జై జగన్నాథ్ అంటూ భక్తులు నినాదాలు చేస్తుండగా రథయాత్ర మొదలయ్యింది.భక్తులు రెట్టించిన ఉత్సాహంతో రథాల తాళ్లను ముందుకు లాగారు. డప్పుల దరువులుల మధ్య బలభద్రుడి రథంతో జగన్నాథుడు తన అత్త అయిన గుండిచా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి జగన్నాథుని సోదరి దేవి సుభద్ర ఆశీనురాలైన రథం కూడా గుండిచా ఆలయానికి చేరుకుంది. నేటి (మంగళవారం) తెల్లవారుజాము వరకు రథాలపైనే ఆశీనులై పూజలు అందుకున్న జగన్నాథుడు, సుభద్రలు గుండిచా ఆలయంలోకి ప్రవేశించనున్నారు.53 ఏళ్ల తర్వాత ఈసారి పూరీలో రథయాత్ర రెండు రోజుల పాటు జరుగుతోంది. కాగా ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో రథయాత్ర సందర్భంగా శ్యామ్ సుందర్ కిషన్ (45) అనే భక్తుడు రథం చక్రాల కింద పడి మృతి చెందాడు. ఆదివారం కుకుజుంఘా గ్రామంలో జగన్నాథ రథాన్ని లాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఆదివారం పూరీలో జరిగిన రథయాత్రలో కొంతమంది పోలీసులతో సహా 130 మంది గాయపడ్డారు, వారిలో సగం మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ కాగా, 40 మందికి చికిత్స కొనసాగుతోంది. -
పొంచివున్న ‘కారింగ్టన్ ఈవెంట్’.. మానవాళికి పెను ముప్పు?
ఈ అనంత విశ్వంలో ఊహకందని ఘటనలు అనేకం జరుగుతుంటాయి. ఇవి మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా ఆందోళనకు కూడా గురిచేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా విమానాలన్నీ రద్దయితే? శాటిలైట్లు పనిచేయడం మాసేసి, ఇంటర్నెట్ ఆగిపోతే? అటు ఫోన్లు మూగబోయి.. ఇటు విద్యుత్ అంతరాయం ఏర్పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వినడానికే ఆందోళన కలిగించే ఇటువంటి ఘటన 150 ఏళ్ల క్రితం సంభవించింది. దీనిని కారింగ్టన్ ఈవెంట్ అని పిలుస్తారు. కారింగ్టన్ ఈవెంట్ అంటే..1859, సెప్టెంబరు 2న కారింగ్టన్ ఈవెంట్ను నాటి శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్లోని రెడ్ హిల్లో ఉంటున్న శాస్త్రవేత్తలు రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్, అతని సహోద్యోగి రిచర్డ్ హోడ్గ్సన్లు సూర్యునిపై ఉన్న చీకటి మచ్చల సమూహం(సన్ స్పాట్)పై అధ్యయనం చేస్తుండగా వారు సూర్యునిపై సంభవించిన భారీ పేలుడును గమనించారు. దీనినే కారింగ్టన్ ఈవెంట్గా పేర్కొన్నారు. ఈ పేలుడు ప్రభావం భూమికున్న ధ్రువ ప్రాంతాలలో కనిపించింది. ఇదే తొలి సౌర తుఫానుగా నమోదయ్యింది.భారీ పేలుళ్ల గుర్తింపురిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్ సూర్యునిపై ఐదు నిమిషాల పాటు సంవించిన భారీ పేలుళ్లను గమనించారు. ఈ భారీ సౌర తుఫానును గమనించిన ఏడు రోజుల తర్వాత లండన్లోని క్యూ అబ్జర్వేటరీలోని అయస్కాంత సెన్సార్లు భూ అయస్కాంత క్షేత్రంలో గణనీయమైన మార్పును గుర్తించాయి. ఈ పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత భూమికి చెందిన మాగ్నెటోస్పియర్ చుట్టూ కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) విక్షేపం చెందడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.కుప్పకూలనున్న కమ్యూనికేషన్ వ్యవస్థ?1859లో సంభవించిన కారింగ్టన్ ఈవెంట్ సమయంలో ప్రపంచంలో భారీ విద్యుత్తు వ్యవస్థ, ఉపగ్రహాలు మొదలైనవి లేవు. అందుకే నాడు భారీ విధ్వంసం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ స్థాయి సౌర తుఫాను సంభవిస్తే, ప్రపంచంలో భారీ విపత్తులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో విద్యుత్తు అంతరాయాలు ఏర్పడవచ్చు. భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాలు స్థంభించిపోవచ్చు. కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ చాలా కాలం పాటు నిలిచిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో..కాగా 2003 అక్టోబరులో సంభవించిన సౌర తుఫాను దక్షిణాఫ్రికాలో కమ్యూనికేషన్ వ్యవస్థలను, విద్యుత్ సౌకర్యాలను అస్తవ్యస్తం చేసింది. దీనికి ‘హాలోవీన్ సౌర తుఫాను’అని నామకరణం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు భూమిని ఢీకొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర తుఫానుల కారణంగా భూ అయస్కాంత క్షేత్రాలలో హెచ్చతగ్గులు ఏర్పడతాయి. అది బ్లాక్అవుట్లకు దారితీసి, విద్యుత్ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే స్పేస్క్రాఫ్టులు అధిక రేడియేషన్ ముప్పును ఎదుర్కొంటాయి.భూమికి పొంచివున్న ప్రమాదం?రెండు దశాబ్దాల తర్వాత 2024 మే 10న అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. ఈ సౌర తుఫానును తొలుత తీవ్రమైంది కాదని భావించారు. కానీ, తర్వాత అత్యంత శక్తివంతమైందిగా అంచనా వేశారు. సూర్యుడి సన్స్పాట్ ఏఆర్ 3663 వద్ద అత్యంత శక్తివంతమైన రెండు విస్ఫోటనాలు సంభవించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు చేశారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సానుకూలంగా ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 35.80 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 23,661 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 132.49 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 77,729.48 వద్ద ప్రారంభమయ్యాయి.ఎల్టీఐ మైండ్ట్రీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాటా స్టీల్, హెచ్యూఎల్, టాటా మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజస్ టాప్ లూజర్స్గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నేటితో ‘హిమాచల్’కు 76 ఏళ్లు!
హిమాచల్ ప్రదేశ్ ఈరోజు 76వ ఏట అడుగుపెట్టింది. ఈ రాష్ట్రం 1948 ఏప్రిల్ 15న ఆవిర్భవించింది. నేడు హిమాచల్ దినోత్సవాన్ని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అనేక మైలురాళ్లను దాటిన హిమాచల్ ప్రదేశ్ నేడు అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉంది. 1948లో హిమాచల్ ప్రదేశ్లో అక్షరాస్యత రేటు ఏడు శాతంగా ఉంది. ఇది 76 సంవత్సరాల తర్వాత అంటే నేటికి 82.80 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. 1948లో వీటి సంఖ్య సున్నా. ఆరోగ్య రంగంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. హిమాచల్లో ప్రస్తుతం ఒక ఎయిమ్స్, ఐదు వైద్య కళాశాలలు, ఐదు డెంటల్ కళాశాలలు, పలు నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. 1948వ సంవత్సరంలో హిమాచల్ ప్రజల తలసరి ఆదాయం రూ.240 కాగా, ప్రస్తుతం రూ.2,35,199కి చేరుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ తొలి ముఖ్యమంత్రి. ఈయన 1952 నుండి 1977 వరకు అధికారంలో ఉన్నారు. ఠాకూర్ రామ్ లాల్ 1977, 1980లలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. శాంత కుమార్ 1977, 1990లో రెండుసార్లు అధికారంలో కొనసాగారు. వీరభద్ర సింగ్ 1985, 1993, 2003, 2012,2017లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ 1998, 2007లో అధికారాన్ని చేపట్టారు. 2017లో జైరాం ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు. సుఖ్విందర్ సింగ్ సుఖు 2023 నుండి అధికారంలో కొనసాగుతున్నారు. -
Bank holiday : ఈరోజు బ్యాంకులు పనిచేస్తాయా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి సంవత్సరం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో గెజిట్ పబ్లిక్ హాలిడేస్తోపాటు ముఖ్యమైన పండుగలు ఉంటాయి. అయితే ఈ జాబితాలో ప్రాంతీయ పండుగలు, సందర్భాలను బట్టి రాష్ట్రాల వారీగా సెలవులు ఉండవు. ఆర్బీఐ జాబితా ప్రకారం.. 2024 ఫిబ్రవరిలో మొత్తం 11 బ్యాంకు సెలవులు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం బ్యాంకులు పనిచేస్తాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి దృష్ట్యా మహారాష్ట్ర అంతటా బ్యాంకులు పనిచేయవు. మిగతా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు సోమవారం సాధారణ పని దినం ప్రకారం పనిచేస్తాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని శివ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర అంతటా జరుపుకుంటారు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ సెలవు దినం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న పండుగలా జరుపుకుంటారు. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఫిబ్రవరి 4 - ఆదివారం ఫిబ్రవరి 10- రెండవ శనివారం ఫిబ్రవరి 11- ఆదివారం ఫిబ్రవరి 14- బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో సెలవు) ఫిబ్రవరి 15- లూ-నాగి-ని (మణిపూర్లో సెలవు) ఫిబ్రవరి 18- ఆదివారం ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు) ఫిబ్రవరి 20- రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో సెలవు) ఫిబ్రవరి 24- రెండవ శనివారం ఫిబ్రవరి 25- ఆదివారం ఫిబ్రవరి 26- న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్లో సెలవు) -
‘బంగారం’ లాంటి వార్తే.. తెలిస్తే ఈరోజే కొనేస్తారు!
Gold Rate today : పసిడి ప్రియులకు ఇది నిజంగా బంగారం లాంటి వార్తే. వారం రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గిపోయాయి. నిన్నటి రోజున స్పల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు భారీగా దిగొచ్చాయి. వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు రూ.1000 పైగా తగ్గాయి. హైదరాబాద్తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (ఫిబ్రవరి 14) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 లకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. పవిత్రమైన మాఘమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గడంతో మహిళలు, పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం పసిడి కొనుగోలుచేసేవారికి భారీ ఊరట లభిస్తోంది. దేశంలోని ఇతర నగరాల్లో.. ➦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,150 వద్ద, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.680 తగ్గి రూ.62,310 వద్ద కొనసాగుతోంది. ➦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.62,180 వద్ద ఉంది. ➦ చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 దిగొచ్చి రూ.57,500లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.650 క్షీణించి రూ.62,730 ఉంది. ➦ ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.600 తగ్గి రూ.57,000 లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. Silver Price : ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు (ఫిబ్రవరి 14) కేజీకి ఏకంగా రూ. 1500 తగ్గింది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,500లుగా ఉంది. -
శుభ ముహూర్తాల వేళ పసిడి ప్రియులకు ఊరట!
Gold Rate today : దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతకు ముందు పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో పవిత్రమైన మాఘమాసం ప్రారంభమైంది. శుభ ముహుర్తాల వేళ బంగారం ధరల్లో పెరుగుదల లేకపోవడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. హైదరాబాద్తోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు (ఫిబ్రవరి 12) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద ఉండగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది. ఇతర నగరాల్లో ఇలా.. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.58,300లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.63,600 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.63,100 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద స్థిరంగా ఉంది. -
బంగారం కొనుగోళ్లు... ఇదే మంచి తరుణమా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఊరటనిచ్చాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధర ఈరోజు (ఫిబ్రవరి 9) స్వల్పంగా తగ్గింది. దీంతో ఈరోజు బంగారం కొనేవారికి ధరలు కాస్త దిగివచ్చినట్లయింది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.57,900 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.70 చొప్పున దిగొచ్చి రూ.63,160 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.57,900 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.63,160 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యల్పంగా రూ.10 తగ్గి రూ.58,390లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.10 చొప్పున తగ్గి రూ.63,710 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.58,050 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.20 తగ్గి రూ.63,310 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.57,900 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.63,160 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు పెరిగాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.76,500 వద్ద ఉంది. ఇది క్రితం రోజున రూ. 76,000 లుగా ఉండేది. -
పండగ పూట బంగారం కొనేవారికి షాక్!
పండగ పూట బంగారం కొనేవారికి పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (జనవరి 13) పసిడి ధరలు మరింతగా పెరిగాయి. నిన్నటి రోజున స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఇంకాస్త ఎగిశాయి. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ.320 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.300 ఎగిసింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,270లకు, 22 క్యారెట్ల పుత్తడి తులం ధర రూ. 58,000లకు చేరింది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 62,950, రూ.57,700 ఉండేవి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు ప్రభావితం చేసే ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. వెండి కూడా.. Silver Rate: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా పెరిగాయి. మూడు రోజుల నుంచి శాంతించిన వెండి ధరల్లో మళ్లీ పెరుగుదల నమోదైంది. హైదరాబాద్తోపాటు ఇరు రాష్ట్రాల్లో వెండి ధర కేజీకి రూ.500 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.78,000 లకు చేరింది. నిన్నటి రోజున కేజీ వెండి ధర రూ.77,500 ఉండేది. -
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతియేటా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 న జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ అధికారికంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ విలువల పట్ల పౌరులలో గౌరవ భావాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం అనేది ప్రారంభమైంది. సామాజిక న్యాయం, సాధికారతను గుర్తుచేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మొత్తం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తయింది. మన దేశ రాజ్యాంగం మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అనేక దేశాల నియమాలను చేర్చారు. అమెరికా, ఐర్లాండ్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల రాజ్యాంగాల సహాయం తీసుకున్నారు. ఈ దేశాల రాజ్యాంగాల నుండి, పౌరుల విధులు, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ పాత్ర, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన -
పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన చేయూత లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొనుక్కొంటారని చెప్పారు. ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారులకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిందే తప్ప వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించడానికి కాదన్నారు. సాధారణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు. -
ఈ సినిమా నాకో పెద్ద వేడుక
‘సత్యం’ రాజేష్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా, రాకేందు మౌళి, బాలాదిత్య, కరుణకుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. 2021లో వీక్షకుల ముందుకు వచ్చిన ‘మా ఊరి పోలిమేర’కు ఇది సీక్వెల్ చిత్రం. గౌరీకృష్ణ నిర్మించిన ఈ చితాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి నేడు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘మా ఊరి పోలిమేర’కు వీక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి ‘మా ఊరి పోలిమేర 2’ చేద్దామని అనుకున్నాం. తొలి భాగం ముగిసిన దగ్గర్నుంచే మలి భాగం ఆరంభమవుతుంది. కొమరయ్య (సినిమాలో ‘సత్యం’ రాజేశ్ పాత్ర) గురించి నిజాలు తెలుసుకున్న లక్ష్మి (కామాక్షీ పాత్ర) ఏం చేసింది? ఏ విధంగా పగ తీర్చుకోవాలనుకుంది? కవిత ఎలా జీవించి ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో మంచి ట్విస్ట్లతో సాగుతుంది. నా కెరీర్లో ఓ పెద్ద వేడుకలా ఈ సినిమాను భావిస్తున్నాను. ప్రస్తుతం ‘గీతాంజలి’ సీక్వెల్, వరుణ్తేజ్ ‘మట్కా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. హీరోగా ‘టెనెంట్’ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
తగ్గిన బంగారం, వెండి ధరలు - నేటి ధరలు ఇలా..
పండుగ సీజన్లో రోజురోజుకి పెరుగుతున్న పసిడి ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ. 150 (22 క్యారెట్స్) నుంచి రూ. 160 (24 క్యారెట్స్) తగ్గింది. ఈ రోజు విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 5495 & 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5995గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ఒక గ్రామ్ మీద రూ. 15 నుంచి రూ. 16 వరకు తగ్గింది. దీని ప్రకారం 10 గ్రాముల పసిడి ధర రూ. 54950 & రూ. 59950గా ఉంది. ఇదే ధరలు హైదరాబాద్, గుంటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి. చైన్నైలో నేటి బంగారం ధరలు రూ. 150 నుంచి రూ. 160 వరకు తగ్గి రూ. 55,150 (10 గ్రామ్స్ 22 క్యారెట్ గోల్డ్), రూ. 60,160గా (10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్) ఉన్నాయి. వెండి ధరలు కేజీ మీద రూ. 500 తగ్గి రూ. 77,000 వద్ద ఉంది. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 55,100 & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 60,100గా ఉంది. వెండి ధరలు కేజీ మీద రూ. 500 తగ్గి రూ. 73,600 వద్ద ఉంది. -
షాకిచ్చిన బంగారం! భారీగా పెరిగిన ధరలు.. ఇక కొన్నట్టే..!
Gold rate today: దేశంలో ఈరోజు (అక్టోబర్ 14) బంగారం ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఖచ్చితమైన రక్షణగా, ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని చూస్తున్న నేపథ్యంలో దేశంలో పసిడికి అత్యంత డిమాండ్ ఉంటోంది. దేశంలోని ప్రసిద్ధ జువెలర్స్ అందించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా ఈ రోజు బంగారం 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1400, 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1530 పెరిగింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1400 పెరిగి రూ. 55,400లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1530 పెరిగి రూ.60,440 లకు చేరింది. క్రితం రోజు ఈ ధరలు రూ. 54,000, రూ.58,910 లుగా ఉండేవి. ఎగిసిన వెండి Silver price today: దేశవ్యాప్తంగా వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి ఈరోజు (అక్టోబర్ 14) ఈరోజు ఏకంగా రూ.1500 పెరిగింది. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.77,000 ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
కొనేట్టులేదుగా! మళ్లీ పెరిగిన బంగారం ధర..
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (అక్టోబర్ 9) మళ్లీ పెరిగాయి. వరుసగా నాలుగు రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లో పుత్తడి 10 గ్రాములకు ఏకంగా రూ.1000 దాకా పెరిగింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.200 మేర పెరిగింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.220 ఎగిసింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53,350లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 58,200లకు చేరింది. క్రితం రోజు ధరలు వరుసగా రూ. 53,150, రూ. 57,980గా ఉండేవి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! వెండి కూడా.. Silver rate today: దేశవ్యాప్తంగా ఈరోజు (అక్టోబర్ 9) వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీకి రూ.500 చొప్పున వెండి ధర పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.75,500లకు చేరింది. క్రితం రోజు ఇది రూ.75,000 లుగా ఉండేది. -
దూసుకెళ్తున్న బంగారం.. స్థిరంగా వెండి - నేటి ధరలు ఇలా..!
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్ళీ భారీ పెరుగుదల దిశవైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 400 నుంచి రూ. 410 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు విజయవాడలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5315 (ఒక గ్రామ్), 24 క్యారెట్స్ పసిడి ధర రూ. 5798 (ఒక గ్రామ్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ పసిడి ధరలు వరుసగా రూ. 53150 & రూ. 57980గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 400, రూ. 410 ఎక్కువ. ఇదే ధరలు మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కావున నిన్నటికి.. ఈ రోజుకి పెద్దగా తేడా లేదు. 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5370 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5858గా ఉంది. ఈ లెక్కన 10 గ్రామ్స్ గోల్డ్ ఖరీదు వరుసగా రూ. 53700 & రూ. 58580గా ఉంది. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు.. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ ఒక గ్రామ్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 5330 & ఒక గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 5813గా ఉంది. దీని ప్రకారం 10 గ్రాముల పసిడి ధర రూ. 53300.. రూ. 58130 గా ఉంది. వెండి ధరలు వెండి ధరల విషయానికి వస్తే విజయవాడ, చెన్నై, ఢిల్లీలలో ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. అంటే నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నాయి. -
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు
గత వారం రోజులుగా రోజురోజుకి బంగారం ధరలు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ రోజు ఏకంగా 10 గ్రాముల బంగారం ధరలు మునుపటి కంటే రూ. 600 నుంచి రూ. 660 వరకు తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం & వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూసేద్దాం. ⭐ విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5260 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5738గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 55260, 24 క్యారెట్ పసిడి ధర రూ. 57380గా ఉంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణంలో కూడా ఉన్నాయి. ⭐ వెండి ధరల విషయానికి వస్తే విజయవాడలో 10 గ్రాముల వెండి రూ. 735. కావున ఒక కేజీ వెండి ధర రూ. 73500గా ఉంది. ఈ ధర నిన్నటి కంటే కూడా రూ. 2000 తక్కువ. నిన్న కేజీ వెండి ధర రూ. 75500గా ఉంది. వెండి కొనేవారికి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇదే ధరలు ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి. ⭐ దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 5275 (1 గ్రామ్ 22 క్యారెట్), రూ. 5753 (1 గ్రామ్ 24 క్యారెట్). దీని ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలు రూ. 52750 & రూ. 57530గా ఉన్నాయి. నిన్నటి పోలిస్తే ఈ ధరలు రూ. 600 & రూ. 660 తగ్గింది. ⭐ వెండి విషయానికి వస్తే.. ఒక గ్రామ్ వెండి రూ. 71. కావున 10 గ్రాముల వెండి రూ. 710, కేజీ ధర రూ. 71000గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 2000 తక్కువ కావడం గమనార్హం. ⭐ చెన్నైలో పసిడి ధరల విషయానికి వస్తే.. ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5290 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5771గా ఉంది. నిన్నటి కంటే ఏ రోజు ధరలు రూ. 660 & రూ. 720 తక్కువ. ⭐ వెండి ధర చెన్నైలో రూ. 73.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 75500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద రూ. 2000 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
తగ్గిన బంగారం ధరలు - తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇలా!
దేశీయ మార్కెట్లో ఈ రోజు (2023 సెప్టెంబర్ 11) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,840కు చేరింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధర రూ. 10 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 10 తగ్గి రూ. 59,830కు చేరింది. ఒక గ్రామ్ 22 క్యారెట్ అండ్ 24 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 5484 & రూ. 5983గా ఉన్నాయి. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54990 కాగా 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ రూ. 59830గా ఉంది. ముంబై, పూణే, కేరళలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, కడపలలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 54,840 కాగా 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు) ప్రైస్ రూ. 59,830 వద్ద ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55320 కాగా 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,340 వద్ద ఉంది. ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరలలో హెచ్చు తగ్గులకు కారణమవుతుందని తెలుస్తోంది. వెండి ధరలు.. వెండి ధరలు ఈ రోజు కొంత పెరిగినట్లు తెలుస్తుంది. 100 గ్రాముల వెండి ధర రూ. 7750 కాగా 1 కేజీ వెండి ధర రూ. 77500గా ఉంది. నిన్న ఒక కేజీ వెండి ధర రూ. 77000 కావడం గమనార్హం. హైదరాబాద్, విజయవాడలో కేజీ సిల్వర్ ధర రూ. 77500గా ఉంది. బెంగళూరులో కేజీ వెండి రూ. 73000 కావడం గమనార్హం. -
కర్ణాటక సర్కార్కు ఉచితాల సెగ..
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ వెహికిల్స్ ఓనర్ అసోసియేషన్ బెంగళూరులో బందుకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి స్కీంకు వ్యతిరేకంగా ఈ బందుకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బంద్ను కొనసాగిస్తామని వెల్లడించింది. మొత్తం 32 ప్రైవేట్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్స్ ఈ బంద్లో పాల్గొన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. The Federation of Karnataka State Private Transport Association had placed 28 demands in front of the #Karnataka government. With no consensus between the two parties, more than 10,000 members will gather for a protest march to Freedom Park in #Bengaluru.https://t.co/dw8rGmm4su — The Hindu-Bengaluru (@THBengaluru) September 11, 2023 బంద్కు కారణం.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం శక్తి స్కీంను అమలుపరిచింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీని వల్ల తమ ఉపాధిపై దెబ్బపడుతోందని ప్రైవేట్ ట్యాక్సీవాలాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోని బెంగళూరులో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఇతర ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విన్నవించారు. ప్రధాన డిమాండ్.. బంద్ అమలుతో బెంగళూరులో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ బైక్ ట్యాక్సీలు కూడా అందుబాటులో లేవు. శక్తీ స్కీంను ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలనేది యూనియన్ల డిమాండ్లలో ప్రధానమైనది. ప్రభుత్వ పథకంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో అనేకమార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని యూనియన్లు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల ప్రైవేట్ వాహనాలు నిలిచి ఉండనున్నాయి. Members 32 unions part of the Federation of Karnataka State Private Transport Association protest at Freedom Park in #Bengaluru demanding a ban on bike taxis. Around 7 lakh vehicles operated by private persons or companies will stay off the roads on Sept 11 📹: @photomurali1 pic.twitter.com/LOmi0awTLL — The Hindu-Bengaluru (@THBengaluru) September 11, 2023 ప్రభుత్వం చర్యలు.. బంద్తో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో వీలైనన్ని అధిక బస్సులను నడుపుతున్నామని రవాణా మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 500 అధిక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ.. -
స్టాక్ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ స్తర్త్స్
-
నేడు వివిధ మార్గాల్లో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్నగర్, బల్లా ర్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష, తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
ఇండియా కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
Updates.. ముంబైలో జరిగిన ఇండియా కూటమి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతల కూటమి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. జుడేగా ఇండియా.. జీతేగా ఇండియా నినాదంతో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అదే విధంగా చంద్రయాన్-3 విజయంపై ఇస్రోను అభినందిస్తూ కూటమి తీర్మానించింది. 13 మందితో సమన్వయ కమిటీని ఇండియా కూటమి ప్రకటించింది. ఇందులో శరద్ పవార్, స్టాలిన్ సహా పలువురు కీలక నేతలకు చోటు దక్కింది. ఇండియా కూటమి సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ వేదికపై 60 శాతం భారత్ ఉందన్నారు. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదని అన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా వచ్చాయని, త్వరలోనే జీ 20 శిఖరాగ్ర సదస్సు జరగనుందని తెలిపారు. అదానీ విషయంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన లఢక్ యాత్ర గురించి చెబుతూ..లఢక్లో చాలా భాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. మన భూభాగాలను చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్పడం పూర్తిగా అబద్ధమని అన్నారు. అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడానని అన్నారు. భారత ప్రభుత్వం తమను మోసం చేస్తోందని లఢక్లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసని అన్నారు. చైనా, భారత మధ్య సరిహద్దు విషయంలో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. సరిహద్దు మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "I spent a week in Ladakh. I went to Pangong Lake right in front of where the Chinese are. I had detailed discussions, probably the most detailed discussion that any politician outside Ladakh has had with the people of Ladakh. They… pic.twitter.com/neR3JPZ8ih — ANI (@ANI) September 1, 2023 ► కూటమి పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే ఓడించే సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సమర్ధవంతంగా ఐక్యంగా ఉండటమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కూటమిలో నాయకుల మధ్య ఏర్పడిన సంబంధాలే అసలైన బలమని రాహుల్ చెప్పారు. బీజేపీని తప్పుకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Congress MP Rahul Gandhi at INDIA alliance meet in Mumbai "Today, two very big steps were taken. If parties on this stage unite, it is impossible for BJP to win elections. The task in front of us is to come together in the most efficient way. Forming a coordination… pic.twitter.com/SyDw8Tzmhk — ANI (@ANI) September 1, 2023 ► బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. దాని ఫలితమే ఈ సమావేశం. కూటమి చేతిలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓడిపోతుండి. ప్రస్తుతం మీడియా వారి చేతిలో ఉంది. వారి చెర నుంచి ఒక్కసారి మీడియాకు విముక్తి కలిగితే మళ్లీ మీడియా స్వేచ్చగా పనిచేస్తుంది. ఇలా చాలా ముఖ్యమైంది. వారు చరిత్రను మార్చాలనుకుంటున్నారు. అందుకు మేము అంగీకరించం. దీనిపై ప్రజలు, మేము కలిసి పోరాడతామన్నారు. #WATCH | Bihar CM and JD(U) leader Nitish Kumar says, "...Parties are working together unitedly. So, as a result of this, those who are at the Centre will lose. They will go away. Be assured...You (media) are captive right now. Once you are free from them, you - the press - will… pic.twitter.com/53gmDcCin8 — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి కేవలం 28 పార్టీల కూటమి కాదు.. 140 కోట్ల కూటమిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దేశ చరిత్రలో మోదీ ప్రభుత్వం అత్యధిక అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రం కొందరి కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఇండియా కూటమిని చీల్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ఇండియా కూటమి ఉందని అన్నారు. ఇక్కడ పదవులు ఎవరూ ఆశించరని చెప్పారు. #WATCH | AAP National Convenor & Delhi CM Arvind Kejriwal on INDIA alliance meeting "This is an alliance not just of some 28 parties, but an alliance of 140 crore people...Modi government is the most corrupt and arrogant government in the history of independent India. We are… pic.twitter.com/Dqek2ybyVx — ANI (@ANI) September 1, 2023 ► 'ఎవరూ అడగకుండానే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ను ఏర్పాటు చేశారు. మణిపూర్ ఘటన జరిగిన సందర్భంలో ఎలాంటి సెషన్లు నిర్వహించలేదు. పెద్దనోట్ల రద్దు, చైనా దురాక్రమణ, కరోనా సమయంలో కూడా ఎలాంటి ప్రత్యేక సెషన్లను ప్రకటించలేదు. నియంతలా కేంద్రం దేశాన్ని పరిపాలిస్తోంది.' అని కేంద్రాన్ని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "Today, without asking anyone, the opposition, a special session of Parliament has been called. A special session of Parliament was never called even when Manipur was burning, during the COVID-19… pic.twitter.com/wjwkDEMzPJ — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి భేటీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీలకు ఒకటే ధ్యేయం దేశాన్ని రక్షించడమేనని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై పొరాడతామని చెప్పారు. కేంద్రం మొదట గ్యాస్ ధరలు పెంచిన మళ్లీ తగ్గిస్తున్నారు.. మోదీ ప్రభుత్వం పేదల కోసం పనిచేయడం లేదని అన్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "All parties conducted this meeting well. A structure was formed for the alliance during talks at my residence earlier, in the Patna meeting an agenda was set and now in Mumbai, everyone has kept… pic.twitter.com/3KKlz20UG8 — ANI (@ANI) September 1, 2023 మూడు తీర్మాణాలు.. ► మూడు తీర్మాణాలు 1) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం 2) ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు నిర్వహించనున్నారు. 3) జుడేగా భారత్-జీతేగా ఇండియా నినాదంతో ప్రజల ముందుకు #WATCH | Shiv Sena (UBT) leader Aaditya Thackeray says, "Today, INDIA parties passed three resolutions. One, we the INDIA parties hereby resolve to contest the forthcoming Lok Sabha elections together as far as possible. Seat-sharing arrangements in different states will be… pic.twitter.com/VAEXozqV9S — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమికి 14 మందితో కూడిన సమన్వయ కమిటీని నియమించారు. కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం ఇంకా ప్రకటించలేదు. లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. #WATCH | Shiv Sena (UBT) MP Sanjay Raut announces names of the 14-member coordination committee -- KC Venugopal (INC), Sharad Pawar (NCP), TR Baalu (DMK), Hemant Soren (JMM), Sanjay Raut (SS-UBT), Tejashwi Yadav (RJD), Abhishek Banerjee (TMC), Raghav Chadha (AAP), Javed Ali Khan… https://t.co/JrhGDqO74I pic.twitter.com/zPyGtxpdND — ANI (@ANI) September 1, 2023 ► సమావేశం జరగునున్న హోటల్ గదికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలు హాజరయ్యారు. #WATCH | Maharashtra | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party president Mallikarjun Kharge and MP Rahul Gandhi arrive at the venue of the meeting of INDIA alliance in Mumbai. pic.twitter.com/xOCth1XXm9 — ANI (@ANI) September 1, 2023 ► భేటీకి హాజరుకావడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముంబయిలోని హాయత్ హోటల్కు చేరుకున్నారు. #WATCH | Tamil Nadu CM and DMK leader MK Stalin arrives at the venue of the meeting of the INDIA alliance in Mumbai. pic.twitter.com/UNVMmvUGme — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి సమన్వయ కమిటీని నేడు ప్రకటించనున్నారు. అన్ని పార్టీల నుంచి ఒక అభ్యర్థి పేరు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూటమి నాయకులను కోరారు. Live: INDIA alliance meet Day 2 in Mumbai Live: Opposition bloc to unveil logo Read @ANI | https://t.co/OCbMsEp4Fp#INDIAAlliance #INDIA #OppositionMeeting pic.twitter.com/Tqotpp95UK — ANI Digital (@ani_digital) September 1, 2023 ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశం ముగిసింది. 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన డిన్నర్ భేటీలో కూటమికి లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. నేడు ప్రధానంగా మూడు అంశాల్లో తుది నిర్ణయం తీసుకున్నారు. ► సమన్వయ కమిటీతో పాటు ఎన్నికల ప్రచారం, ర్యాలీల నిర్వహణకు మరో నాలుగు బృందాలను నియమించనున్నారు. ఈ కమిటీ సభ్యులే సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నట్లు సమాచారం. ► అక్టోబర్ 2నాటికి ఇండియా కూటమి తన మేనిఫెస్టోని విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీకి హాజరైన నాయకులను కోరారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా కామన్ అజెండాను రూపొందించాలని కోరారు. ► కూటమికి లోగోను రూపొందిండంపై నేడు తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఉమ్మడిగా అధికార ప్రతినిధిని కూడా నియమించనున్నారు. ఇండియా కూటమికి కన్వినర్ పదవిని నియమించాలా..? వద్దా..? అనే అంశంపై కూడా నేడు చర్చలు జరగనున్నాయి. ► నిన్న రాత్రి శివ సేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని డిన్నర్ భేటీలో కూటమి నాయకులందరు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రానున్నాయని కొందరు నాయకులు అంచనా వేశారు. ఎన్డీయే వేసే ఎత్తులకు ధీటైన జవాబు ఇవ్వాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ► ఇండియా కూటమి ముంబయిలో సమావేశమైన మొదటి రోజే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ అంశం కూడా నేడు కూటమి నాయకుల చర్చకు రానుంది. ► ఇండియా కూటమి మొదటి సమావేశం పాట్నాలో జరగగా.. రెండవసారి బెంగళూరు వేదికగా పూర్తయింది. మూడోసారి ముంబయి వేదికగా కూటమి నాయకులు హాజరయ్యారు. ఎన్నికల దగ్గర పడనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
ఇండియా కూటమి భేటీ.. ఈ అంశాలే ప్రధానంగా..
ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు 28 పార్టీలు ముంబయి వేదికగా జరుగుతున్న డిన్నర్ భేటీలో పాల్గొననున్నాయి. కూటమికి ఓ లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. దేశంలో బీజేపీకి ధీటుగా ఐక్యంగా పోరాడుతామని ప్రతిపక్ష పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి భేటీకి ముంబయికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను పార్టీ శ్రేణులు గణంగా ఆహ్వానిస్తున్నాయి. ఈ మేరకు బ్యాండ్ బాజాలతో సోనియా గాంధీని, రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. #WATCH | Congress supporters gathered outside Mumbai airport to welcome party leaders Sonia Gandhi and Rahul Gandhi They will attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA) here. pic.twitter.com/VAAdjcUP6d — ANI (@ANI) August 31, 2023 కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ముంబయికి చేరుకున్నారు. #WATCH | Maharashtra | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi arrive at a hotel in Mumbai. Rahul Gandhi will hold a press conference shortly. pic.twitter.com/NXsA0IkdUD — ANI (@ANI) August 31, 2023 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ముంబయికి చేరుకున్నారు. మరికాసేపట్ల భేటీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. #WATCH | Maharashtra | Congress national president Mallikarjun Kharge arrives in Mumbai for the meeting of the INDIA alliance. pic.twitter.com/FVNd2UTWGF — ANI (@ANI) August 31, 2023 ఇండియా కూటమి మూడో భేటీకి హాజరవడానికి జమ్మూ కశ్మీర్ పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముంబయి చేరుకున్నారు. కూటమి వర్థిల్లాలని నినదించారు. #WATCH | PDP Chief Mehbooba Mufti arrives in Mumbai to attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA) "Judega Bharat, Jeetega INDIA," says Mehbooba Mufti pic.twitter.com/qPA4sp0r5v — ANI (@ANI) August 31, 2023 ముంబయిలో జరగనున్న సమావేశానికి హాజరవడానికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. #WATCH | Delhi | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi leave from Delhi airport to attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA), in Mumbai. pic.twitter.com/StAcj1OOKX — ANI (@ANI) August 31, 2023 ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి 28 పార్టీల తరుపున 63 మంది నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో భేటీ కానున్నారు. కూటమికి ఓ జెండాను ఎంపిక చేయనున్నారు. పార్టీల మధ్య సమన్వయం చేయడానికి ఓ కమిటీని కూడా నియమించనున్నారు. పాట్నా, బెంగళూరు సమావేశాల తర్వాత ముంబయి వేదికగా మూడోసారి జరుగుతున్న నేటి భేటీ చివరిది కావడం గమనార్హం. అందుకే ఈ సమావేశంలోనే కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్లు ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నితీష్ కుమార్, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ రోజు ముంబయికి చేరనున్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో నేటి డిన్నర్ భేటీ జరగనుంది. దేశంలో ప్రస్తుతం ఏర్పడుతున్న ఇండియా కూటమి రాజకీయ ప్రత్యామ్నాయంగా మారనుందని ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చలు ఉండవని పేర్కొన్నారు. ఇండియా కూటమి భేటీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర బీజేపీ కూడా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో లోక్సభ సీట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: Jammu Kashmir: జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం -
భారత్ ఎన్సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా?
భారతదేశంలో మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను మరింత పెంచడానికి ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' 'న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (Bharat NCAP) ప్రారంభించనున్నారు. వాహనాలలో సేఫ్టీ పెరిగితే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే భావనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ ప్రోగ్రామ్ కింద కార్ల తయారీదారులు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) 197 ప్రకారం.. కార్లను స్వచ్ఛందంగా టెస్ట్ చేయడానికి అందించవచ్చు. దీని ద్వారా వాహనాలు సేఫ్టీ రేటింగ్ పొందుతాయి. ఇంతకీ భారత్ ఎన్సీఏపీ వల్ల ఉపయోగాలేమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఇదీ చదవండి: మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా.. భారత్ ఎన్సీఏపీ ఉపయోగాలు.. ➤ ఒక కంపెనీ తమ ఉత్పత్తులను టెస్ట్ చేయడానికి అందించినప్పుడు.. వాటి పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్ కోసం రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. ➤ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు కార్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇది అధిక సేఫ్టీ కలిగిన కార్లను ఎంచుకోవడంలో ఉపయోగపడుతుందని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ➤ ఆధునిక కాలంలో భద్రత ఎక్కువగా ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. అయితే దేశీయ కార్లు అంతర్జాతీయ మార్కెట్లో కూడా గుర్తింపు పొందటానికి భారత్ ఎన్సీఏపీ చాలా ఉపయోగపడుతుంది. ➤ భారత్ ఎన్సీఏపీ గుర్తించిన కార్లు తప్పకుండా విదేశాలకు ఎక్కువ సంఖ్యలో ఎగుమతి అవుతాయని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని తెలుస్తోంది. ➤ ఇప్పటికే రోడ్లపై 'బ్లాక్ స్పాట్స్' తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని నితిన్ గడ్కరీ ఇదివరకే వెల్లడించారు. దీంతో ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ➤ ఒక్క 2021లో రోడ్డు ప్రమాదాలలో సుమారు 1.54 లక్షలమంది ప్రాణాలు కోల్పోగా.. 3.84 లక్షల మంది గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ➤ ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకి, టయోటా వంటి కంపెనీలు న్యూ కార్ అసెస్మెంట్ కార్యక్రమానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. మొత్తం మీద 2024నాటికి రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను సుమారు 50 శాతం తగ్గించాలని గడ్కరీ పిలుపునిచ్చారు. -
మూడు దశలు.. పెద్ద సవాల్
‘‘ఉస్తాద్’ కథ మూడు దశల్లో ఉంటుంది. నా పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఇది పెద్ద సవాల్గా అనిపించింది. ముఖ్యంగా కాలేజీ ఎపిసోడ్స్ కోసం బరువు తగ్గాను’’ అన్నారు శ్రీ సింహా కోడూరి. శ్రీ సింహా కోడూరి, కావ్యా కల్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్’. ఫణిదీప్ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, దువ్వూరు హిమాంక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో సూర్య అనే యువకుడి పాత్ర చేశాను. సూర్య కాలేజీకి ముందు ఏం చేశాడు? కాలేజీ లైఫ్ ఎలా సాగింది? పైలట్ ఎలా అయ్యాడు? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. -
సీఎం పర్యటనతో కరెంటు తీగలకు లింకేంటి!
సాక్ణి, అమరావతి: రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న విద్యుత్ తీగలకు సీఎం పర్యటనతో లింకు పెట్టి ఈనాడులో ఆదివారం ప్రచురించిన కథనంపై ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, వాస్తవాలు దాచి తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాల్లో 85 శాతానికి పైగా మరణాలకు పంపిణీ వ్యవస్థలోని లోపాలే కారణమని రాసిన వార్తలో నిజం లేదంటున్న సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ‘ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చర్యలు’ ఇటీవల అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన దృష్ట్యా విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలను ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. డిస్కంలో ప్రతి విద్యుత్ ఉద్యోగికి సరైన శిక్షణ ద్వారా అవగాహన కల్పిం చి, భద్రతా పరికరాలు అందించి, ఉద్యోగుల ప్రమాదాలు తగ్గించాం. ఎలక్ట్రికల్ షార్ట్ పోల్స్, లాంగ్ స్పాన్ ఉన్న చోట్ల మిడిల్ పోల్స్ ఏర్పాటు, ఒరిగిన స్తంబాలను సరి చేయడం, విద్యుత్ నియంత్రికల ఎత్తు పెంచడం, ఎర్తింగ్ ఏర్పాటు వంటివి క్రమం తప్పకుండా చేస్తున్నాం.సబ్ స్టేషన్లు, లైన్ల నిర్వహణ, లక్షలాది విద్యుత్ స్తంభాల మరమ్మతు పనులను చేపడుతున్నాం. నగరాలు, పట్టణాల్లో ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, వ్యాపార ప్రాంతాలు, ఇరుకు రోడ్లలో 30 ఏళ్లు దాటిన పోల్స్ , కండక్టర్స్ మార్చడం ద్వారా విద్యుత్ ప్రమాదాలు నివారించే ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడ శివాలయం వీధిలో కండక్టర్ లేని ఎంసీసీబీ బాక్స్తో కూడిన ఓవర్ హెడ్ కేబుల్ ఏర్పాటు చేసే పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. వర్షాల వల్ల పెదవేగి మండలం పినకమిడి పొలాల్లో నీరు నిలిచిన కారణంగా ఒరిగిపోయిన స్తంభాలను సరిచేశాం. విశాఖపట్నం పాత పోస్టాఫీస్ ప్రాంతంలో లక్ష్మి థియేటర్ దగ్గర వాడవీధిలో పోల్కి పోల్కి మధ్యలో ఉన్న బేర్ కండక్టర్ తొలగించి ఎల్టీ ఏబీ కేబుల్ వైరు అమర్చాం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇదో నిరంతర ప్రక్రియ. ఈ చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ‘కండక్టర్లు మార్చాం’ గతేడాది నవంబర్ నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎల్టీ లైన్ కండక్టర్ను 2,403 కిలోమీటర్లు, 11 కేవీ లైన్ కండక్టర్ 2,256 కిలోమీటర్లు, 33 కేవీ లైన్ కండక్టర్ 256 కిలోమీటర్లు, ఎల్టీ కేబుల్ 1,089 కిలోమీటర్ల మేర మార్చాం. ఒరిగిన ఎల్టీ విద్యుత్ స్తంభాలు 6,873, 11 కేవీ విద్యుత్ స్తంభాలు 7,498, 33 కేవీ విద్యుత్ స్తంభాలు 3,254 కొత్తవి వేశాం. విద్యుత్ లైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎల్టీ లైన్ల పరిధిలో 3,317 చోట్ల, 11 కేవీ లైన్ల పరిధిలో 3,383 చోట్ల, 33 కేవీ లైన్ల పరిధిలో 860 చోట్ల ప్రమాదాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేశాం. రోడ్డు క్రాసింగ్ల వద్ద ఎల్టీ లైన్ పరిధిలో 19,068, 11 కేవీ లైన్ల పరిధిలో 10,763, 33 కేవీ లైన్ల పరిధిలో 954 విద్యుత్ స్తంభాలను సరిచేశాం. సబ్స్టేషన్ల పరిధిలో ప్రొటెక్షన్ను పటిష్టం చేయడం ద్వారా లైన్లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా వెంటనే ట్రిప్ అయ్యేలా ఏర్పాటు చేశాం. ఈపీడీసీఎల్ పరిధిలో అన్ని విద్యుత్ ఉప కేంద్రాలకు, 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లు 2020 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సర్వే చేసి సరిదిద్దాం. ఈ క్రమంలో 38,850 వాలిన విద్యుత్ స్తంభాలను సరిచేసి వేలాడే వైర్ల మధ్యలో 7,454 మధ్యస్థ స్తంబాలను వేశాం. 31,324 విరిగిపోయిన స్తంభాలను మార్చి 2,557 కిలోమీటర్ల మేర వేలాడుతున్న వైర్లను సరిచేశాం. ప్రయాస్ కొత్తగా చెప్పిందేమీ లేదు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం రైతులకు ఒక వరం. దీనివల్ల రైతులకు విద్యుత్ ప్రమాదాలు తగ్గడమే కాకుండా చేలకు నీటిని కావలసిన విధంగా వాడుకుని పంటలు సంవృద్ధిగా పండిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయించిన రోజే రైతులు, మోటార్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని భద్రతా పరికరాలను ప్రభుత్వమే తన ఖర్చుతో పెట్టాలని నిర్ణయించింది. మినీయేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ), ఎర్త్ పైప్ పెట్టడం వల్ల రైతుకు, మోటార్కు, ఎలక్ట్రికల్ సామగ్రికి భద్రత ఉంటుంది. వోల్టేజీ హెచ్చుతగ్గులను కెపాసిటర్ నివారిస్తూ మోటార్ సామర్థ్యం పెంచుతుంది. విద్యుత్ వృథా కాకుండా నివారిస్తుంది. ఇవన్నీ సీఎం జగన్ ఎప్పుడో ఆలోచించారు. ఇక్కడ ప్రయాస్ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ‘తరచూ శిక్షణ ఇస్తున్నాం’ డిస్కంల పరిధిలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లకు తరచుగా భద్రత, లైన్ మరమ్మతులపై శిక్షణ ఇస్తున్నాం. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు, పెనుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, లైన్లు దెబ్బతినడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించి వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, దెబ్బతినడం, లైన్లు వేలాడుతుండటం వంటి సమస్యలను గుర్తిస్తే వినియోగదారులు వెంటనే 1912 కాల్ సెంటర్కు సమాచారం అందిస్తే వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. -
సాక్షి మనీ మంత్రా: మరో ఆల్ టైం రికార్డు స్థాయికి సూచీలు
Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ల బిఎస్ఇ సెన్సెక్స్ , ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 మంగళవారం ఆరంభంలోనే మరో రికార్డు స్థాయిని తాకాయి. . సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 66,828.96 వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 19,787.50 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాలషేర్లు లాభాల్లో ఉన్నాయి.ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫార్మా సెక్టార్లు లాభాల్లో, ఆటో మొబైల్ సెక్టార్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. లాభాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్లో ఉండగా, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇతర టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నయి. ఇక ఓఎన్జీసి, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, జెఎస్డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్గపోదున్నియి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఐసిఐసిఐ లాంబార్డ్, పాలిక్యాబ్ ఈరోజు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి. -
Daily Horoscope: ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు.. ప్రత్యేక గుర్తింపు..
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.అష్టమి రా. 9.33 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: రేవతి రా. 12.12 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: ప. 12.43 నుండి 2.15 వరకు, దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.23 వరకు, అమృతఘడియలు: రా.9.52 నుండి 11.15 వరకు; సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35. రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు.ఆత్మీయులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. వృషభం: కార్యజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. పలుకుబడి పెరుగుతుంది. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. మిథునం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. సింహం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. మీ నిజాయితీ పదిమందీ గుర్తిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తుల: రుణబాధల నుండి విముక్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వృశ్చికం: పరిస్థితుల ప్రభావంతో నిర్ణయాలు మార్చుకుంటారు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు ముందుకు సాగవు. మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలయ దర్శనాలు వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుంభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. మీనం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు కొద్దిగా గందరగోళంగా ఉంటాయి. -
కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం!
HDFC Merger: భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో ఈ రోజు (జులై 01) విలీనం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గతంలోనే వెల్లడైంది, కానీ ఈ రోజు ఇరు కంపెనీల బోర్డుల ఆమోదంతో మర్జర్కు లైన్ క్లియర్ అవుతుంది. దేశంలోనే తొలి హోమ్ ఫైనాన్స్ సంస్థగా పేరు పొందిన హెచ్డీఎఫ్సీ ఇక కనిపించదు. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన విషయం తెలసిందే. కావున రికార్డ్ డేట్ తరువాత హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్స్ - వివో వై36 నుంచి వన్ప్లస్ నార్డ్ వరకు..) సంబంధిత అధికారులు నాన్ కన్వర్టెబుల్ డిబెంచర్స్ బదిలీకి జులై 12, హెచ్డీఎఫ్సీ కమర్షియల్ పేపర్స్ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేరుకు బదిలీ చేసేందుకు జులై 7న డేట్ను ఫిక్స్ చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి హెచ్డీఎఫ్సీ తన పేరెంట్ కంపెనీ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కలవడానికి సుముఖత చూపింది. కాగా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. (ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!) నివేదికల ప్రకారం.. మార్చి 2023 నాటికి, హెచ్డీఎఫ్సీ & హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యాపార విలువ రూ. 41 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో లాభాలు రూ. 60 వేల కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక త్వరలో హెచ్డీఎఫ్సీలోని ఉద్యోగులందరు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులుగా మారిపోతారు. -
TS: పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి గురువారం బలహీనపడిందని... దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గద్వాల జిల్లా జూరాలలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఖిలా ఘన్పూర్లో 4, నల్లగొండ జిల్లా దేవరకొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కొమురం భీం జిల్లా కుంచవెల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
నిన్న నేడు రేపు
నేడులో ఉన్న మనం నిన్నను దాటుకుని వచ్చాం. నేడునూ దాటుకుని మనం రేపులోకి వెళ్లాల్సి ఉంది. నిన్న, నేడులకన్నా మనకు రేపు ఎంతో ముఖ్యం. నిన్న, నేడుల్లో లాభం, నష్టం, సుఖం, శోకం, ప్రగతి, పతనం మనకు వచ్చి ఉంటాయి. వీటి ప్రాతిపదికన మనం రేపులోకి వెళ్లాల్సి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితి ఏదైనా మనం తప్పకుండా రేపు వైపు కదలాలి; కదులుదాం. నిన్నవైపు కాదు మన చూపు రేపు వైపు ఉండాలి. నేడులో ఉండిపోవడం కాదు మనం రేపువైపు నడవాలి. రేపువైపు చూపు వేసి మనం కదులుతూ ఉండాలి. మన చూపు నిండా, మన కదలిక నిండా చేవను మనం నింపుకోవాలి. మనలో నీరసం ఉంటుంది. దాన్ని నిన్న మరిచిపోయినా నేడు నేల రాసేసుకోవాలి. మనలో చెడ్డతనం ఉంటుంది. అది నిన్నటి నుంచి నేడులోకి వచ్చేసినా రేపులోకి రాకుండా దాన్ని కూలదోసుకోవాలి. మనలోని మూర్ఖత్వాన్ని నేడు తప్పకుండా విడిచి పెట్టెయ్యాలి. మన జాడ్యాలు మన రేపులోకి రాకుండా నేడు మనమే వాటిని మట్టు పెట్టుకోవాలి. నిన్న మనకు మనమే వేసుకున్న కుత్సితాల సంకెలల్ని నేడైనా తెంచేసుకోవాలి. నిన్న మనలోకి వచ్చి చేరి నిలిచి ఉన్న మత్సరభావాల విషాన్ని నేడు పూర్తిగా ఒంపేసుకోవాలి. నిన్నకు నేడు కొనసాగింపు కాకూడదు. నిన్నకు నేడు కొనసాగింపు అయి ఉంటే అది తప్పు అని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ తప్పు కొనసాగకుండా నేడు మనం జాగ్రత్తపడాలి. జాగరూకతతో మనం రేపును స్పృశించాలి. నిలిచి ఉండే చెలిమితోనూ, నిజమైన నైజంతోనూ, నిర్మలమైన హదయంతోనూ, చల్లటి ఆశయాలతోనూ, చక్కని ఆలోచనలతోనూ సత్ప్రవర్తనతోనూ మనం రేపులోకి వెళ్లాలి. మన నిన్నలో, నిన్న మనలో అవి లేకపోయినా రేపు అవి మనకు ఎంతో అవసరం అని నేడైనా గ్రహించి మనం రేపులోకి వెళ్లాలి. నిన్న మనం ఎలా ఉన్నా, నేడు మనం ఎలా ఉంటున్నా రేపు మాత్రం మనం గొప్పగా ఉండాలి; అధమపక్షం రేపు మనం బావుండాలి. అందుకు నేడు మనం సిద్ధపడాలి. రేపులో మనం మెరుగ్గానూ, మేలుగానూ ఉండేందుకు మనం నేడు తయారుగా ఉండాలి; మనల్ని మనం తయారు చేసుకోవాలి. అలవాటుపడ్డ సోమరితనానికి, అభిప్రాయాలకూ నేటితో స్వస్తి పలికి, ఉండాల్సిన ఉత్సాహానికి, అవగాహనకూ నేడైనా నాంది పలికి అభ్యున్నతికి ప్రస్తావన కలిగేందుకు, కల్పించుకునేందుకు రేపులోకి వెళ్లాలి మనం. పనిచేస్తూ ప్రయోజనాన్ని పొందే చేతులతో, మెరిసే తలపులు కలిగే మస్తిష్కంతో భేషజాల పరదాలు తొలగించుకుని, వేషాలు పోయే గుణాన్ని మరచిపోయి మనం రేపులోకి చేరాలి. పరుల బాధను పట్టించుకోవడం పాపం కాదు; తోటి వాడికి మంచి చెయ్యడం నేరం కాదు; సాటివాడికి చేయూతను ఇవ్వడం దోషం కాదు కాబట్టి వాటిని చేపట్టడానికి కూడా మనం రేపును వేదిక చేసుకోవాలి. రేపైనా మనల్ని మనం నరులం అని నిరూపించుకోవాలి. మన కోసం, మన రాక కోసం వేచి ఉన్నది సుమా రేపు అన్నది; లేచి వెళ్లి అందుకోవడానికే మనం ఉన్నది. మనంత మనంగా, మనం మనంగా నిజమైన మనుషులంగా జీవం ఉన్నవాళ్లంగా జీవించేందుకుగా మనం రేపును అందుకోవాలి. మన రాగం, మన యాగం, మన త్యాగాలతో గణనీయమైన మనుగడను సాధించేందుకు, ఆపై మన గానం, మన ధ్యానం, మన జ్ఞానాలతో స్మరణీయమైన మనుషులం అయ్యేందుకు మనం రేపును ఆవాహన చేసుకోవాలి. ‘బెదురు లేకుండా కదులుతూ ఎదురు వెళ్లి రేపులోకి ప్రవేశిద్దాం; ఏ మాత్రమూ చెదిరిపోకుండా ఎదిగేందుకు విఫలం అవకుండా రేపుకు ప్రయుక్తం అవుదాం‘. – రోచిష్మాన్ -
ఏపీ మంత్రి అంబటి రాంబాబు పోలవరం పర్యటన
-
మునుగోడులో నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
-
టుడే హెడ్లైన్స్ @6:00PM 25 September 2022
-
TS SSC Exams 2022 : పదో తరగతి పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
-
నేడు పూరీ జగన్నాథుని రథయాత్ర
-
నేడు విశాఖకు సీఎం వైఎస్ జగన్ రాక
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం విశాఖ వస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఉదయం 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారని, కొద్ది సేవు అక్కడే ఉండి.. ఆ తర్వాత హెలికాప్టర్లో శ్రీకాకుళం వెళతారని జిల్లాకలెక్టర్ వినయ్చంద్ తెలిపారు. సీఎంతోపాటు హెలికాప్టర్లో మంత్రి మోపిదేవి వెంకటరమణ శ్రీకాకుళం జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటలకు సీఎం తిరిగి విశాఖ చేరుకుంటారు. 5.30 గంటలకు ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి గన్నవరం చేరుకుంటారని కలెక్టర్ వెల్లడించారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో హై అలెర్టు ప్రకటించినట్టు నగర పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా తెలిపారు. -
నేటి నుంచి ఇసుక అమ్మకాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా మంగళవారం నుంచి ఇసుకను సరఫరా చేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ లోతేటి శివశంకర్ వెల్లడించారు. సోమవారం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇసుక కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. ఇసుక గురించి ఎవరిని సంప్రదించాలంటే.. ఇసుక కోసం దరఖాస్తు చేయడంతోపాటు.. నిర్మాణానికి సంబంధించిన ఫొటో, ఫ్లాన్ అప్రూవల్, ఆధార్, రేషన్కార్డులను జత చేసి విశాఖ ఎంవీపీ కాలనీలోని టాస్క్ ఫోర్స్ పోలీసు ఆఫీసు వద్ద మైన్స్ కార్యాలయంలో అందజేయాలి. అక్కడ రెవెన్యూ, పోలీసు, సిటీప్లానర్, మైన్స్శాఖ వారు దరఖాస్తులను పరిశీలన చేస్తారు. ఎంత ఇసుక ఇస్తారు దరఖాస్తును పరిశీలించి ఒక యూనిట్ (మూడు క్యూబిక్ మీటర్లు ఒక ట్రాక్టర్ లోడ్) 4,500 రూపాయలు చెల్లిస్తే రశీదు ఇస్తారు. ఎక్కడ ఇస్తారంటే.. రశీదు తీసుకొని ముడసర్లోవలోని ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సిబ్బందికి రశీదు చూపించాలి. అక్కడ లారీ అసోసియేషన్ సెక్రటరీ కె.రమణ ( ఫోన్ నంబరు 7674922888)ను సంప్రదించాలి. రవాణా చార్జీలు లబ్ధిదారులే చెల్లించుకోవాలి. -ఇసుక స్టాక్ పాయింట్ ఫోన్ నంబర్ 9949610479 -సమస్య ఏమైనా వుంటే వారు మైన్స్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోట్ రూమ్ ఫోన్ నంబర్ 9949565479ను సంప్రదించాలి. ఇసుకనిచ్చే సమయం.. మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు. -రెండోసారి ఇసుక కావాలంటే భవనం పని జరిగిన కొత్త ఫొటో తీసి దరఖాస్తుతోపాటు ఎంవీపీ కాలనీలోని ఏడీ మైన్స్ కార్యాలయంలోనే అందజేయాలి. కొత్త ఇసుక విధానం వచ్చే వరకు సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇసుక సరఫరా చేయనున్నట్టు జేసీ వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 84 యూనిట్లు అందుబాటులో ఉందని మైన్స్ఏడీ తమ్మినాయుడు తెలిపారు. -
‘నవరత్నాల’బడ్జెట్ నేడే
సాక్షి, అమరావతి: తొలిసారిగా శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జనరంజకంగా తీర్చిదిద్దింది. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్కు రూపకల్పన చేసింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని సమా చారం. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. రైతుల పట్ల సీఎం చిత్తశుద్ధికి ఇదిగో నిదర్శనం.. టీడీపీ సర్కారు పెద్ద ఎత్తున బిల్లులను చెల్లించకుండా పెండింగ్లో పెట్టడమే కాకుండా భారీ అప్పులను నూతన ప్రభుత్వానికి అప్పగించింది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో కలసి బడ్జెట్ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు. గత సర్కారు బకాయిల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్లో కేటాయింపులు చేయడం విశేషం. ఇందుకు ఉదాహరణ రైతులకు గత సర్కారు బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీని చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించడం. కరువు కాటకాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేయించడం అన్నదాతల పట్ల ఆయన చిత్తశుద్ధిని రుజువు చేస్తోంది. మరోపక్క వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు. సంక్షేమానికి పెద్దపీట సుదీర్ఘ కసరత్తు అనంతరం రూపొందించిన బడ్జెట్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తగిన విధంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాభివృద్ధిపై దూరదృష్టితో ఆలోచించి గోదావరి జలాలను శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనతోపాటు పోలవరం, వంశధార, గాలేరు నగరి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా బడ్జెట్ రూపొందించారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన అన్ని కుటుంబాలకు యూనివర్శల్ హెల్త్ కేర్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలకు కొండంత ఆరోగ్య భరోసా కల్పించేలా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. చేనేత, మత్య్సకారులు, ఆటో డ్రైవర్లుతోపాటు అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకునేలా కేటాయింపులు ఉంటాయని పేర్కొంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతుల వివాహాల కోసం పెళ్లి కానుక కింద బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. అన్ని పథకాలకు తగిన విధంగా కేటాయింపులు.. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు కేటాయింపులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు ప్రభుత్వం ప్రత్యేక కేటాయింపులు చేయనుంది. ఆత్మహత్యకు పాల్పడటం లేదా ప్రమాదవశాత్తు చనిపోయిన రైతన్నల కుటుంబాలకు రూ. ఏడు లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నారు. సహకార రంగం పునరుద్ధణకు నిధులు కేటాయించనున్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించనున్నారు. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో రూ.1,740 కోట్లను కేటాయించనున్నారు. రూ.2.31 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్! గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించి నూతన సర్కారుకు ఖాళీ ఖజానా అప్పగించినప్పటికీ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ రూ. 2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలని సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర సొంత ఆదాయం రూ.85 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్ల వరకు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.60 వేల కోట్లకుపైగా వస్తాయని భావిస్తున్నారు. కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.34 వేల నుంచి రూ.36 వేల కోట్ల దాకా రాష్ట్రానికి వస్తాయని అంచనా వేశారు. రూ.28 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్! వ్యవసాయ మంత్రి కన్నబాబుకు బదులుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి బొత్స సాగుకు ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. అనుబంధ రంగాలతో కలిపి రూ.28,866 కోట్ల వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కేవలం వ్యవసాయ రంగానికే రూ.12,510 కోట్లను కేటాయించనున్నారు. పశు సంవర్ధక శాఖకు రూ.1,240 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ.3,212 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.5,000 కోట్లను కేటాయించనున్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ను గత ఏడాది కన్నా 10 – 15 శాతం ఎక్కువ అంచనాలతో రూపొందించినట్లు సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ అకాల మృతి చెందిన నేపథ్యంలో మంత్రులు బొత్స, మోపిదేవి అసెంబ్లీ, శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలని యోచించారు. 2013–14 నుంచి ఇది ఆచరణలోకి వచ్చింది. వ్యవసాయానికి గతంలో కేటాయింపులు(రూ. కోట్లలో) నేడు ఉదయం బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయానికి శాసన మండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ సమర్పిస్తారు. వ్యవసాయ బడ్జెట్ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేపెట్టనున్నారు. అంతకు ముందు శుక్రవారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమవేశమై బడ్జెట్కు ఆమోద ముద్ర వేయనుంది. -
హైదరాబాద్ నగరంలో నేడు
వేదిక: రవీంద్ర భారతి ఇచ్చట పెళ్లిల్లు చేయబడును– కామిక్ బై మంచ్ థియేటర్ సమయం: రాత్రి 7 గంటలకు పుష్పలత నవ్వింది సమయం: సాయంత్రం 6 గంటలకు శుభలఘ్నం– ప్లే బై మంచ్ థియేటర్ సమయం: రాత్రి 8 గంటలకు అలెక్స్ ఇన్ వండర్లాండ్: స్టాండప్ కామెడీ బై అలెగ్జెండర్ బాబు వేదిక: భారతీయ విద్యా భవన్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు బేసిక్ ఫొటోగ్రఫీ వర్క్ షాప్ వేదిక– పీపుల్స్ ప్లాజా సమయం: సాయంత్రం 5 గంటలకు వేదిక– లమాఖాన్ హైదరాబాద్ డిబేటింగ్ మీటప్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు వ్రైట్ క్లబ్ సాటర్ డే జనరల్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు బడ్జెట్ ఎనాలిసిస్: డాక్టర్ అమీర్ ఉల్లా సమయం– రాత్రి 7 గంటలకు సచ్ ఔర్ సహి– ప్లే సమయం: రాత్రి 7–30 గంటలకు ఫోర్ట్ నైట్ మీటింగ్ వేదిక: పార్క్ హయాత్ సమయం: ఉదయం 8 గంటలకు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేదిక: ఎస్టి ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ సమయం: ఉదయం 10–30 గంటలకు వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్ కాంటెంపరరీ డ్యాన్స్ క్లాసెస్ సమయం: ఉదయం 11 గంటలకు కుంగ్ ఫూ క్లాసెస్ సమయం: సాయంత్రం 5.15 గంటలకు యోగా క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు మాయాబజార్ వేదిక: సురభి థియేటర్ సమయం: సాయంత్రం 6.30 గంటలకు కీ బోర్డ్ క్లాసెస్ వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రెరీ ఆక్టివిటీ సెంటర్ సమయం: సాయంత్రం 5 గంటలకు కార్పోరేట్ క్రికెట్ లీగ్ వేదిక: మల్లారెడ్డి కాలెజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సమయం: ఉదయం 7 గంటలకు బేసిక్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ వేదిక: అమీన్ పూర్ లేక్ సమయం: ఉదయం 6 గంటలకు ఖేలో హైదరాబాద్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ వేదిక: జిఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియం సమయం: ఉదయం 7 గంటలకు క్రికెట్ టౌర్నమెంట్ వేదిక: రూఫెర్ హైదరాబాద్ సమయం: రాత్రి 7 గంటలకు ఛాంఫియన్ షిప్ క్రికెట్ టౌర్నమెంట్ వేదిక: గ్రీన్ హంస క్రికెట్ స్టేడియం సమయం: ఉదయం 7 గంటలకు కార్పోరెట్ క్రికెట్ స్టేడియం వేదిక: బ్యాట్ ఆండ్ బాల్ క్రికెట్ స్టేడియం సమయం: ఉదయం 7 గంటలకు వరల్డ్ బైస్కిల్ డే 2019 వేదిక: ఇన్స్టిట్యూట్ ఎట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సమయం: ఉదయం 7 గంటలకు సాటర్ డే నైట్ లైవ్ విత్ డిజె నవీన్ వేదిక: స్పోల్ ఫబ్ సమయం: రాత్రి 7 గంటలకు కూచిపూడి రెక్టికల్ బై ప్రతిభ రాజ్ గౌడ్ వేదిక: శిల్పారామం ఉప్పల్ సమయం: సాయంత్ర 5–30 గంటలకు -
నేడు తేలనున్న నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ వర్గాల్లో అంతకంతకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. నల్లగొండ లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపనున్నారో ఇంకా గోప్యంగానే ఉంది. ఆ పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు.. హోలి పండుగ సందర్భంగా గురువారం తమ మిగతా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. అదేగనుక నిజమైతే నల్లగొండ లోక్సభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ పడనున్నారో తేలిపోతుంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ పదమూడు మంది అభ్యర్థులను ప్రకటించగా, మరో మూడు స్థానాలే మిగిలి ఉన్నాయి. ఆ మూడింటిలో నల్లగొండ ఒకటి. గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండనుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్రెడ్డి మూడో స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది. వాస్తవానికి అప్పటి దాకా ఆయనకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నా.. నేరుగా టీఆర్ఎస్తో సంబంధాలు లేకపోవడం, ఒకేసారి అభ్యర్థిగా తెరపైకి రావడం, స్థానిక పరిస్థితుల వల్ల గెలవలేకపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి 1.93లక్షల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై విజయం సాధించారు. కొన్నాళ్లకు గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. కానీ, ఈ ఎన్నికల విషయానికి వచ్చే సరికి సిట్టింగ్గా ఉన్న గుత్తాకు టికెట్ ఇంకా ఖరారు కాలేదు. చర్చలోకి.. కొత్త పేర్లు శాసనసభ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఏకంగా ఆరు చోట్ల విజయం సాధించింది. దీంతో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కితే చాలు.. తేలిగ్గా గెలవచ్చన్న అభిప్రాయానికి పార్టీ నాయకులతోపాటు, బయటి వ్యక్తులూ భావించారు. ఈ కారణంగానే నల్లగొండ ఎంపీ టికెట్కు ఒకింత పోటీ ఎక్కువైందని చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీనుంచి పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన తేరా చిన్నపరెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన స్థానిక సంస్థల మండలి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన ఇప్పుడు నల్లగొండ ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కంచర్ల కృష్ణారెడ్డి .. తదితర పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యలోనే పార్టీతో ఎలాంటి సంబంధం లేని తటస్థుడిగా ఉన్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యాపార వేత్త వేమిరెడ్డి నర్సింహారెడ్డి టికెట్ ఆశిస్తూ పార్టీ నాయకత్వం వద్ద ప్రయత్నాలు కూడా సాగించారు. అయితే, పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ఇప్పటి దాకా ఎటూ తేల్చలేదు. తెరపైకి సిట్టింగ్ ‘గుత్తా’ పేరు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా హుజూర్నగర్ ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. దీంతో ఈ స్థానంనుంచి బలమైన అభ్యర్థినే పోటీకి పెట్టాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ హైకమాండ్ ఉందని అంటున్నారు. దీంతో కొత్తవారికి టికెట్ ఇచ్చి ప్రయోగం చేయడమా..? లేదంటే ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన సీనియర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పోటీకి నిలబెట్టడమా..? అన్న చర్చ పార్టీలో జరుగుతోందని చెబుతున్నారు. ఈ కారణంగానే సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చిందని చెబుతున్నారు. అయితే, ఇప్పటి దాకా గుత్తా తాను ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తానని కానీ, చేయనని కానీ స్పష్టం చేయలేదు. పార్టీ అధినేత తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆయన శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై మంత్రివర్గంలో చేరతారని, పార్టీ మారిన సమయంలో అధినేత కేసీఆర్ అదే హామీ ఇచ్చారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయనను ఎంపీ అభ్యర్థిగా ఇప్పటి దాకా ప్రకటించ లేదా అన్న చర్చ కూడా ఉంది. తాజా పరిణామాలు, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత నల్లగొండ నుంచి గుత్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుత్తాకు టికెట్ ఇస్తారా..? ఈ స్థానం నుంచి మరెవరైనా పార్టీ నేతకు అవకాశం ఇస్తారా..? కొత్తవారిని పోటీ చేయిస్తారా..? అన్న ప్రశ్నలకు గురువారం సమాధానం లభించనుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
జియో ఫోన్ -2 ముచ్చటగా మూడోసారి
సాక్షి, ముంబై: రిలయెన్స్ జియో ఫోన్ హై-ఎండ్ మోడల్ జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ ముచ్చటగా మూడోసారి కస్టమర్లను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ రోజు (సెప్టెంబరు12, బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు జియో ఫోన్2 ఫ్లాష్సేల్ ప్రారంభం కానుంది. మొదటి, రెండు ఫ్లాష్సేల్ ద్వారా కొద్ది నిమిషాల్లోనే రికార్డు అమ్మకాలను నమోదు చేసి ఔట్ ఆఫ్ స్టాక్గా నిలిచింది. ఈ సేల్ద్వారా జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజుల్లోగా ఆ ఫోన్లను డెలివరీ చేయనున్నారు. జియో 4జీఫోన్లు రెండింటిలోనూ వాట్సాప్ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు నిన్న ప్రకటించింది. దీంతో వాట్సాప్, ఫేస్బుక్,యూట్యుబ్లాంటి పాపులర్ యాప్లన్నీ జియో ఫోన్లలో అందుబాటులోకి వచ్చాయి. కాగా ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ, అట్టహాసంగా లాంచ్ చేసిన జియో మొదటి ఫోన్కు మంచి స్పందన రావడంతో, హై-ఎండ్ మోడల్ జియో ఫోన్-2 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో ఫోన్ 2 ధర రూ.2,999 మాత్రమే. క్వెర్టీ కీప్యాడ్, 2.4 అంగుళాల హారిజాంటల్ డిస్ప్లే, 4జీ సపోర్ట్తోపాటు స్టోరేజ్ కెపాసిటీని 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం. జియో ఫోన్-2 ఫీచర్లు 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకువిస్తరించుకునే అవకాశం 2 ఎంపీ రియర్ కెమెరా వీజీఏ ఫ్రంట్ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
-
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ డీజైన్లను ఆమోదించడంతోపాటు, 2014 పోలీస్ యాక్ట్ సవరిస్తూ చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే డీజీపీని రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఏపీఐఐసీకి పలు జిల్లాల్లో భూకేటాయింపులు, రూ.4,234 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ప్రతిపాదనపై సమావేశంలో చర్చించనున్నట్లు సచివాలయ అధికారులు తెలిపారు. -
చరిత్రలో ఈరోజు
-
చరిత్రలో ఈరోజు.....
-
చరిత్రలో ఈరోజు
-
శోకం నడిచిన దారి
-
నేడు, రేపు భారీ వర్షాలు..
-
నేడు ఫ్రెండ్ షిప్ డే
-
నేడు హీరో తనీష్ సిట్ విచారణ
-
నేడు ఏపీ సెట్
13 కేంద్రాలు 6623 మంది అభ్యర్థులు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : రాజమహేంద్రవరంలోని 13 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించే ఏపీ సెట్-2017 పరీక్షలకు గానూ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కేంద్రాల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 6623 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.సురేష్ వర్మ తెలిపారు. శనివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఏపీ సెట్ పరీక్షలు రాసే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో ఉదయం 9 గంటలకు సంబంధిత పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఆలసమైతే అనుమతించేది లేదన్నారు. రాజమహేంద్రవరంలో తరచూ ఎదురయ్యే ట్రాఫిక్ జామ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ టి.మురళీకృష్ణ, అసోసియేట్ రీజనల్ కోఆర్డినేటర్ ఎన్. సూర్యరాఘవేంద్ర, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ పద్మావతి, డాక్టర్ టి. సత్యనారాయణ, డాక్టర్ అశోక్, డాక్టర్ సింహాచలం పాల్గొన్నారు. -
నేటి నుంచి సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలకు రత్నగిరి ముస్తాబైంది. సోమవారం నుంచి బుధవారం వరకూ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ చేస్తారు. ఈ సందర్భంగా రుత్విక్కులకు దీక్షావస్త్రాలు బహూకరిస్తారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఆయుష్య హోమానికి అంకురార్పణ చేస్తారు. ఈ ఏడాది కొత్తగా పవిత్రోత్సవాలను కూడా ప్రారంభించనున్నారు. స్వామివారికి వివిధ కూరగాయలు, సుగంధద్రవ్యాలతో వండిన పిండివంట ‘కాయం’ నివేదిస్తారు. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. రెండో రోజు కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం చేతికి కట్టుకునే కంకణాలను భక్తులకు బహూకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు రత్నగిరి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రమూర్తి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేదికపై సూర్యనమస్కారాలు ప్రతి ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని కల్యాణ వేదిక మీద నిర్వహిస్తున్న సూర్య నమస్కారాలు ఈ వారం కూడా కొనసాగాయి. ఆకొండి కృష్ణ, రేపాక రామదాసు, తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. -
నేడు భారత్ - శ్రీలంక ఢీ
-
జీఎస్టీతో పన్నుల గందరగోళానికి తెర
-
టుడే న్యూస్ రౌండప్
నిజమైన నేస్తం మోదీ: ట్రంప్ కితాబు రెండు రోజుల పర్యటన కోసం శనివారం రాత్రి అమెరికాకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘రియల్ ఫ్రెండ్’ అంటూ కీర్తించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సోమవారం వైట్హౌస్లో ఇరుదేశాధినేతలు పలు వ్యూహాత్మక అంశాలపై చర్చించనున్నారు. ‘అఫ్ఘాన్- ఇండియా’ డ్యాంపై ఉగ్రదాడి ప్రతిష్టాత్మక సల్మా డ్యామ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 10మంది అఫ్ఘాన్ సైనికులు మృత్యువాతపడ్డారు. భారత యాత్రికులకు చైనా అడ్డంకి కైలాస మానస సరోవర్ యాత్రకు బయలుదేరిన భారత యాత్రికుల తొలి బృందాన్ని చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలోనే నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 100 జీఎస్టీ క్లినిక్లు వ్యాపారుల్లో వస్తుసేవల పన్నుపై మరింత అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా 100 జీఎస్టీ క్లినిక్లను నిర్వహించనున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) తెలిపింది. బెడ్రూమ్లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్! గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేశాడు. ప్రధాని నోట విజయనగరం తన మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఏపీలోని విజయనగరం జిల్లా ప్రజలను అభినందించారు. ఎందుకంటే..(హెడ్డింగ్పై క్లిక్ చేయండి) <<<<<<<లోకల్ న్యూస్>>>>>>>>> హీరో రవితేజ సోదరుడి దుర్మరణం శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(46) దుర్మరణం చెందారు. నుజ్జు నుజ్జైన భరత్ కారు నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరుపున రంగంలోకి దింపుతున్నట్లు వైఎస్సార్సీపీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. 'జగన్ సీఎం కావాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు' వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా! రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెళ్లిలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. (బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే!) మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్ సాయం అనారోగ్యం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్ను కలిశారు. <<<<<< ఫీచర్స్ >>>>>>> శ్రీదేవిని రాజమౌళి ఎందుకు... ఇప్పుడు శ్రీదేవిని రాజమౌళి ఎందుకలా అన్నాడు? అనే ప్రశ్న అందర్నీ వేధిస్తోంది. రాజమౌళి అన్న మాటలు శ్రీదేవిని కూడా చాలా బాధించాయి.. చాలా వేధించాయి. నన్నడగొద్దు ప్లీజ్ నేను ఒక అమ్మాయిని లవ్చేస్తున్నా. తను నన్ను లవ్ చేస్తోందో లేదో తెలియడం లేదు. కానీ.. <<<<<<<<< స్పోర్ట్స్ >>>>>>>> కిడాంబి శ్రీకాంత్ సంచలనం ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు. (శ్రీకాంత్ కు వైఎస్ జగన్ అభినందనలు) యువరాజ్ మరో మైలురాయి! ఇటీవల మూడొందల వన్డే మ్యాచ్ ను ఆడటం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న భారత వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఖాతాలో మరో మైలురాయి కూడా చేరింది. ధోని, యువరాజ్లు కష్టమేనా? 2019 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు, మేనేజ్మెంట్ ఈ దిశగా ఆలోచించాలని.. -
నేడు ఆకలిపోరాటం ఆడియో విడుదల
రాజమహేంద్రవరం కల్చరల్: రామ్సాయి గోకులం బ్యానర్పై నిర్మించిన ‘ఆకలిపోరాటం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జరుగుతుందని చిత్ర రచయిత, దర్శకుడు ఆనందసాగర్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో ఆ విశేషాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నానికి చెందిన స్వప్న యాంకర్గా వ్యవహరిస్తారన్నారు. మెయిన్ హీరో ‘సాక్షి విలేకరి’ గంగాధర్ కాగా మరో ముగ్గురు సహాయ హీరోలుగా నటించారన్నారు. చిత్రం షూటింగ్ మూడువంతులు ఉభయ గోదావరి జిల్లాలలోను, మిగిలిన భాగం హైదరాబాద్లో చేశామన్నారు. ఇంజినీరింగ్ చదివిన యువకులు ఉద్యోగాన్వేషణలో ఎదుర్కొనే సమస్యలు హాస్యాత్మకంగా తీశామన్నారు. జూలై 10–20 తేదీల మధ్యలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. హీరో గంగాధధర్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ఆశీస్సులను కోరుకుంటున్నానన్నారు. నిర్మాత రాఘవులు పాల్గొన్నారు. -
నేటి ముఖ్య కథనాలు
48 గంటలు గడుస్తున్నా చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. బోరుబావి నుంచి చిన్నారిని వెలికితీసేందుకు సహాయక సిబ్బంది విశ్రప్రయత్నాలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీని ఉపయోగించి పాపను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమయం గడిచేకొద్ది ఆశలు సన్నగిల్లుతున్నాయి. పాప సురక్షితంగా బయటపడేనా అన్నది ఉత్కంఠగా మారుతోంది. పాప బయటపడాలని ప్రజలంతా కోరుతున్నారు. దేవుళ్లను ప్రార్థిస్తున్నారు... ఇక ఈనాటి ముఖ్య కథనాలు ఇవి.. బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న క్షణాలు! 48 గంటలు గడుస్తున్నా చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేం! 180 అడుగుల వద్ద నీళ్లు తగలడంతో చిన్నారి ఆచూకీ లభించలేదని, దీంతో ప్రత్యేక మోటారు ద్వారా నీటిని అంతటిని తోడిస్తున్నామని... కోవింద్ విజయం ఖాయం: వైఎస్ జగన్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించారు. నీట్లో మెరిసిన కల్వకుర్తి వాసి కల్వకుర్తి పట్టణానికి చెందిన చేకూరి మహేశ్వరాచారి శుక్రవారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఆలిండియా 1280 వ ర్యాంకు సాధించి సత్తాడాటాడు. మృత్యుంజయురాలు ఈ అంజలి చేవెళ్లలో పాప బోరుబావిలో మృత్యువుతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన టీవీల్లో చూస్తున్న వారంతా అంజలిని గుర్తుచేసుకుంటున్నారు కాన్వాయ్ అడ్డుకుని.. ఎంపీని చితకబాదారు! అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యకర్తలు ఏకంగా ఓ బీజేపీ ఏంపీని టార్గెట్ చేసి చితకబాదారు. భార్య చేతిలో చెయ్యేస్తే నొప్పి మాయం ఆలు మగలు చేతిలో చేయేసి పట్టుకు తిరగాలోయ్! అని ఓ భావ కవి ఊరికే అనలేదేమో! అల్ జజీరాను మూసేయాల్సిందే! ఖతార్ను ఇప్పటికే బహిష్కరించిన అరబ్ దేశాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు తమ 13 డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా అల్టిమేటమ్ జారీ చేశాయి. ట్రంప్ హత్య.. సారీ చెప్పిన హీరో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్యచేయబోయేది ఎవరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్ హీరో జానీ డెప్ ఎట్టకేలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మోదీ-ట్రంప్ భేటీలో ఆ ప్రస్తావనే ఉండదు మోదీ-ట్రంప్ భేటీలో హెచ్-1బీ వీసా సమస్యను ప్రస్తావించే ప్రణాళికలేమీ లేవని వైట్ హౌజ్ పేర్కొంది. అందుకే సమంతను అంబాసిడర్ చేశాం: మంత్రి సీఎం కేసీఆర్ చిన్నప్పటి నుంచి చేనేత కార్మికుల కష్టాలను కళ్లారా చూశారని అందుకే నేతన్నల ఇబ్బందులు తీర్చేందుకు భారీగా నిధులు కేటాయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఒక నెల జీతం రైతులకు! తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీనగర్లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు! జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. ఎమ్మెల్యే కుమారుడి కిరాతకం ఇద్దరు మైనర్ బాలురను సజీవసమాధిచేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకుతోపాటు ఇసుక మైనింగ్ కాంట్రాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుజ్జి గజరాజు అమేజింగ్ వీడియో! అప్పుడప్పుడే తప్పటడుగులు వేసే బుజ్జాయిలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. మీరా కుమారే ప్రధాని అయితే... ప్రతిపక్షాల పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దళిత మహిళ మీరా కుమార్ రాష్ట్రపతి భవన్లోకి అడుగుపెట్టలేక పోవచ్చు. ఇదిగో బండ బూతుల.. బండారం! టీడీపీ ఎమ్మెల్యే బండారు జుగుప్సాకర వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన. భారత్ గురించి ట్రంప్ ‘రియలైజ్’ అయ్యారా! ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్ను అగ్రరాజ్యం పెద్దగా పట్టించుకోవడం లేదన్న కథనాల నేపథ్యంలో.. బిజినెస్.. మూర్తి కనిపించకపోవడం ఆశ్చర్యం తొలిసారి ఇన్ఫోసిస్ సహా-వ్యవస్థాపకులు నేడు జరిగిన అత్యంత కీలకమైన సమావేశానికి హాజరుకాలేదు. హోండా వెహికిల్స్ రేట్లు దిగొస్తున్నాయ్! దేశమంతటిన్నీ ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు కాబోతున్న తరుణంలో ప్రముఖ వాహన దిగ్గజం తన టూ-వీలర్ రేట్లను తగ్గించబోతుంది. రాకెట్లా ఎగిసిన రాష్ట్రాల లోటు రాష్ట్రాల వాణిజ్య లోటులు స్కై రాకెట్ లా ఎగిసినట్టు ఆర్బీఐ నేడు వెల్లడించిన గణాంకాల్లో తెలిసింది. సినిమా.. ‘క్వీన్’ అవ్వడానికి నేను రెడీ: నటి క్వీన్గా మారడానికి ఏ భాషలోనైనా తాను రెడీ అంటోంది నటి కాజల్ అగర్వాల్. ఫస్ట్డే కలెక్షన్లు ఎంతో తెలుసా? బాక్సాఫీస్ దగ్గర భాయిజాన్ ఈసారి మెరవలేదు. గత ‘ఈద్’ సినిమాల కంటే దారుణంగా వెనకబడ్డాడు. విజయ్ కొత్త సినిమా 'అదిరింది' కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మెర్సల్. యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ కెరీర్ లోనే డీజే టాప్..! అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల -
ఇన్చార్జి ఈఓ గా జగన్నాథరావు నేడు బాధ్యతల స్వీకరణ
అన్నవరం (ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమితులైన ఈరంకి వేంకట జగన్నాథరావు బాధ్యతల స్వీకరణ ఆదివారానికి వాయిదా పడింది. శనివారమే బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా అష్టమి తిథి మంచిది కాకపోవడంతో ఆయనకు ఈఓ నాగేశ్వరరావు బాధ్యతలు అప్పగించలేదు. కాగా బదిలీ అయిన దేవస్థానం ఈఓలను రెండు మూడు రోజుల వ్యవధిలో రిలీవ్ చేయడం ఇప్పటివరకూ జరిగింది. ఈసారి ఏకంగా ఈ ప్రక్రియకు పది రోజులు సమయం పట్టింది. ఈ నెల ఎనిమిదో తేదీన ఈఓ నాగేశ్వరరావును విజయనగరం జేసీ–2గా బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఇక్కడ రిలీవ్ అయి అక్కడ జాయిన్ కావడానికి ఆయన మూడు ముహూర్తాలు పెట్టుకున్నారు. అయినా ఈఓ గా ఎవరినీ నియమించకపోవడంతో ఆ ముహూర్తాలు దాటిపోయాయి. తాజాగా ఇన్చార్జి ఈఓ ను నియమించినా అష్టమి, నవమి కారణంగా బాధ్యతలు అప్పగించడం కుదరలేదు. ఇదంతా దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. -
నాడు...నేడు
నాటి నాన్న... ఎదురు పడితే భయం ... మాట్లాడాలంటే ‘అమ్మో’ ... కన్నెర్ర చేస్తే గజగజ ... గద్దిస్తే ఇక జ్వరమే పుస్తకం, పెన్ను, పెన్సిల్, ఏ అవసరమున్నా అమ్మే మధ్యవర్తి జిహ్వ చాపల్యం తీర్చుకోవాలన్నా, నేత్రానందం తీరాలన్నా కన్న తల్లే నిచ్చెన... . నాన్నకు కోపం వచ్చి కొట్టడానికి నా పైకి వస్తే అడ్డుకున్న పుణ్యానికి సగం దెబ్బలు అమ్మకే మిగిలిన అరకొరే నాపైకి... . నేటి డాడీ... . తరం మారింది... స్వరం మారిపోయింది అమ్మ కొడితే...తిడితే వెనుకేసుకొచ్చే డాడీలొచ్చేశారు . ఇన్నాళ్లూ వంతెనగా నిలిచిన అమ్మ పాత్ర అదృశ్యమైంది ఏ ఆనందమైనా చిటికెలో తీర్చే నాన్న అనురాగం సాక్షాత్కరించింది . అమ్మకు కోపం వస్తే నాన్నే అడ్డుపడి... గుండెలపై కాదు ... తన భుజాలపై కొలువుదీరనిచ్చి...ఆప్యాయతలు పంచి అనురాగాలతో పెంచిన కనిపించిన దేవుళ్లు నేటి మన డాడీలు... -
నేడు బాలసుబ్రహ్మణ్యం పుట్టిన రోజు
-
నేడు సీబీఐ కోర్టుకు అద్వానీ, జోషీ
-
నేడు ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏజెన్సీ పర్యటన
రంపచోడవరం : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ గురువారం ఏజెన్సీలో పర్యటించనున్నారని ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు ఐటీడీఏ సమావేశపు హాలులో ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటలు వరకు మారేడుమిల్లిలో ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం చట్లవాడ గ్రామంలో జరిగే పర్ణశాల పండగలో పాల్గొంటారని తెలిపారు. -
నేటి నుంచి ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలు
-
నేడు కుల్భూషణ్ కేసుపై తీర్పు
-
నేడు తెలంగాణ ఐసెట్ పరీక్ష
-
కులభూషణ్ కేసులో నేడు ఐసిజె తీర్పు
-
సొమ్ము ఒకరిది... పేరు మరొకరిది..!
– పర్యాటకం అభివృద్ధికి ‘అఖండ గోదావరి’ ప్రకటించిన ప్రభుత్వం – రూ. 100 కోట్లు కేటాయించిన చంద్రబాబు సర్కారు – ఇప్పటి వరకు మొదటి దఫాగా రూ.32 కోట్లు ఖర్చు – నగరంలో నదీతీర అభివృద్ధికి నగరపాలక సంస్థ యంత్రాంగం చర్యలు – రూ.20 కోట్లతో కౌన్సిల్ అజెండాలో చేర్చిన వైనం – రాష్ట్ర ప్రభుత్వం పనిని నెత్తికెత్తుకుంటున్న అధికారులు – నగరంలో మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు అనేకం – నేడు కౌన్సిల్ సాధారణ సమావేశం సాక్షి, రాజమహేంద్రవరం: ఉట్టికెక్కలేనమ్మ.. స్వర్గానికి ఎక్కుతాన¯¯¯న్న చందంగా ఉంది రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పరిపాలన తీరు. నగరం నడిబొడ్డున, ÐÔశివారు ప్రాంతాలలో ఇప్పటికీ అనేక చోట్ల రోడ్డు, డ్రైనేజీలు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. అక్కడ నివసిస్తున్న ప్రజలకు సదుపాయాలు కల్పించాల్సిన పాలకులు, యంత్రాంగం అది మరచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులను నెత్తికెత్తుకుంటోంది. ఇందుకోసం ప్రజల డబ్బు రూ.20 కోట్లు ఖర్చు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గోదావరి పుష్కరాల అనంతరం సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అఖండ గోదావరి పేరుతో ఓ ప్రాజెక్టును ప్రకటించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధుల ద్వారా కాటన్ బ్యారేజీ నుంచి ఎగువన నగరంలోని కోటిలింగాలఘాట్ వరకు అనువైన గోదావరి తీరం, లంకలను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. కేటయించిన రూ.100 కోట్లను మూడు దఫాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దఫాగా ఇప్పటికే రూ.18 కోట్లతో కాటన్ బ్యారేజి వద్ద ఉన్న పిచ్చుకలంకను చదును చేశారు. మరో రూ.13 కోట్లను హెవలాక్ బ్రిడ్జి కోసం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించారు. రూ.1 కోటితో రోడ్డు కం రైల్ బ్రిడ్జిని సుందరీకరిచారు. ఇలా ఇప్పటి వరకు రూ.32 కోట్లు అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అయితే తాజాగా అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా చేయాల్సిన పనులను నగరపాలక సంస్థ చేపట్టేందుకు ఆసక్తి చూపుతోంది. గోదావరి గట్టున సర్వసతీ ఘాట్ నుంచి గౌతమీఘాట్ వరకు నదీ ముఖ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాజమండ్రి రైజింగ్, ఐడియాస్ ఫర్ రాజమండ్రి డెవలెప్మెంట్ ద్వారా ప్రజలు సూచించారని పేర్కొంటూ కౌన్సిల్ ఆమోదానికి యంత్రాంగం అజెండాలో చేర్చింది. దీనికోసం రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ నిధులు బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాల ద్వారా నగర పాలక సంస్థకు వచ్చిన ఆదాయం నుంచి కేటాయించాలని, పరిపాలన అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు ఆమోదించాలని కోరింది. నిద్దురపోతున్న పాలక మండలి... నగరంలో కనీసం మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు అనేకం ఉన్నా వాటి అభివృద్ధిని పట్టించుకోని పాలక మండలి, యంత్రాంగం ఇలా రాష్ట్ర ప్రభుత్వ పనులను నెత్తికెత్తుకుని రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యంత్రాంగం ఇలా ప్రతిపాదించడం వెంటనే మండలి అజెండాలో చేర్చడంపై నగరవాసులు పాలకమండలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పన్నుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం పనులకు ఖర్చు చేయాలన్న ప్రతిపాదనలపై మండిపడుతున్నారు. యంత్రాంగం ఇలా చేస్తుంటే పాలక మండలి నిద్దురపోతోందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. యంత్రాంగం ప్రతిపాదన సోమవారం జరిగే పాలక మండలి సాధారణ సమావేశంలో చర్చకు రానుంది. దీనిపై పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోన్న ఉత్కంఠ నగర వాసుల్లో నెలకొంది. -
నేడు ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర జిల్లా సన్నాహక సభ
అమలాపురానికి కృష్ణ మాదిగ రాక అమలాపురం టౌ¯ŒS : ఎమ్మార్పీఎస్ 24వ ఆవిర్భావ కురుక్షేత్ర జిల్లా సన్నాహక సభ అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం మూడు గంటలకు జరగనుంది. సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.ఎమ్మారీ్పఎస్ జిల్లా ఇ¯ŒSచార్జి మంద వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై ఏడున పది లక్షల మందితో అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభను విజయవంతం చేసేందుకు జిల్లా సన్నాహాక సభను అమలాపురంలో శనివారం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగలు ఈ సభకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సభ వేదిక ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం వెంకటేశ్వరరావుతో పాటు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు ఆకుమర్తి చిన్నా, గంపల సత్యప్రసాద్, ఆకుమర్తి భాస్కరరావు, మల్లారపు సత్తిబాబు, మిరియాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలితాలు ‘పది’లమేనా..
రాయవరం: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పది పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఈ పరీక్షలు మార్చి 17 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా స్థానంలో నిలవనుందోనన్న ఉత్కంఠ విద్యాశాఖాధికారుల్లో నెలకొంది. 68,853 మంది విద్యార్థులు.. జిల్లాలో ఈ ఏడాది 304 పరీక్షా కేంద్రాల్లో 68,853 మంది విద్యార్థులు ‘పది’ పరీక్షలు రాశారు. వీరిలో 34,172 మంది బాలురు, 33,568 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 48 వేల మంది వరకు పరీక్షలకు హాజరుకాగా ప్రైవేటు పాఠశాలల నుంచి 20,853 మంది హాజరయ్యారు. గత మూడేళ్లుగా.. పది పరీక్షల ఫలితాల్లో గత మూడేళ్లుగా మొదటి మూడు స్థానాల్లో జిల్లా నిలిచింది. 2015–16లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవగా, 2014–15లో రెండో స్థానం, 2013–14లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గత మూడేళ్లుగా ఫలితాలను చూస్తే జిల్లా మొదటి మూడు స్థానాల్లో నిలవడంతో ఈసారి కూడా అదే ప్రతిష్ఠను కొనసాగిస్తుందన్న ఆశతో విద్యాశాఖాధికారులు ఉన్నారు. గతేడాది ఫలితాల సమయంలో జిల్లా విద్యాశాఖాధికారిగా ఆర్.నరసింహారావు ఉండగా, ఈ ఏడాది జనవరిలో నరసింహారావు బదిలీపై వెళ్లారు. జనవరి నుంచి ఎస్.అబ్రహాం ఇ¯ŒSచార్జి డీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది పది పరీక్షలకు ముందుగా ఒకటే ప్రీఫైనల్ నిర్వహించారు. అంతకు ముందు ఏడాది రెండు ప్రీ ఫైనల్స్ నిర్వహించారు. గతేడాది ఆగస్టు నుంచే పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జనవరి నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేశారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇవన్నీ ఫలితాలపై మంచి ప్రభావాన్ని చూపుతాయని పలువురు హెచ్ఎంలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి సీసీఈ విధానంలో.. తొలిసారి ఈ ఏడాది సీసీఈ విధానంలో పరీక్షలు నిర్వహించారు. కేవలం 80 మార్కులకు మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా, ఇంటర్నల్స్ 20 మార్కులు కేటాయించారు. తొలిసారిగా సీసీఈ విధానం అమలవుతున్న నేపథ్యంలో జరిగిన పరీక్షల ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న ఆందోళన విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. జిల్లాలో పరీక్షా కేంద్రాలు : 304 జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాసిన విద్యార్థులు : 68,853 బాలురు : 34,172 బాలికలు : 33,568 ప్రభుత్వ పాఠశాలల నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు : 48,000 ప్రైవేటు పాఠశాలల నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు : 20,853 మొదటి మూడు స్థానాల్లో ఉంటాం.. ఇ¯ŒSచార్జి డీఈవోగా ఈ ఏడాది పది పరీక్షలకు సారధ్యం వహించాను. జనవరిలో బా«థ్యత తీసుకున్న అనంతరం జిల్లాలో పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఈ ఏడాది పది ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో ఉంటామన్న ఆశాభావంతో ఉన్నాం. – ఎస్.అబ్రహాం, డీఈవో, కాకినాడ. -
నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు
-
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
నల్లజర్ల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నల్లజర్ల మండలంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచే ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 1,500 మంది కానిస్టేబుళ్లు, 2 ప్లటూన్ల ఏఆర్ (100 మంది) సిబ్బంది, మహిళా కానిస్టేబుల్స్, కమ్యూనిటీ పోలీసింగ్ సేవలు, డాగ్ స్క్వాడ్లను నియమించినట్టు కొవ్వూరు ఇన్చార్జ్ సీఐ ఎం.మురళీకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించనున్న ప్రాంతాలలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా శుక్రవారం భారీ కాన్వాయ్తో ముందస్తు రిహార్సల్స్ చేశారు. ఈ సందర్భంగా తలెత్తిన లోటుపాట్లను సరిదిద్దుకోవాలని అధికారులు సిబ్బందికి సూచించారు. సీఎం పర్యటన ప్రాంతాలను డీఐజీ రామకృష్ణ పరిశీలన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించే ప్రాంతాలను డీఐజీ పీవీఎస్ రామకృష్ణ శుక్రవారం ఉదయం జేసీ కోటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. పోతవరం, నల్లజర్ల హెలీప్యాడ్స్, పోతవరం, నల్లజర్లలో జరగనున్న మీటింగ్ ప్రాంతాలు సభావేదికలు, సభకు వచ్చే వారికి ఎటు నుంచి అనుమతులు, అనంతరం బయటకు పంపించే మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఎటువంటి అసౌకర్యాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని కొవ్వూరు డీఎస్పీ మురళీకృష్ణకు సూచించారు. -
నేడు వైఎస్సార్ సీపీలో భారీగా చేరికలు
పి.గన్నవరంలో బహిరంగ సభ, కన్నబాబు రాక పి.గన్నవరం : పి.గన్నవరంలో మంగళవారం సాయంత్రం జరుగనున్న బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో భారీగా చేరనున్నారని పార్టీ కోఆరి్డనేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు వెల్లడించారు. స్థానిక గణపతి గ్రౌండ్స్లో బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను సోమవారం సాయంత్రం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన పి.గన్నవరం మండల నాయకులు ఉలిశెట్టి బాబీ, పిల్లి శ్రీనుల నాయకత్వంలో కొండేటి ఆధ్వర్యంలో 600 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరనున్నారని మోహనరావు చెప్పారు. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు అంబాజీపేట నుంచి పి.గన్నవరం అక్విడెక్టు వరకూ మోటారు సైకిలు ర్యాలీ జరుగు తుందన్నారు. అక్కడ దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో పాటు, జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఈ చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. మిగిలిన మూడు మండలాల్లో కూడా ఇదే రీతిలో చేరికలు ఉంటాయని కొండేటి చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేసారు. మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర రావు, వాసంశెట్టి చినబాబు, రాష్ట్ర నాయకులు మెల్లం మహలక్ష్మీ ప్రసాద్, పేరి శ్రీనివాస్, జిల్లా నాయకులు దొమ్మేటి వెంకట శివరామన్, తోలేటి బంగారునాయుడు తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు.