సహారా ఆస్తుల వేలం ప్రారంభం | Auction begins for Sahara land parcels | Sakshi
Sakshi News home page

సహారా ఆస్తుల వేలం ప్రారంభం

Published Tue, Jul 5 2016 1:02 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Auction begins for Sahara land parcels

న్యూఢిల్లీ: రెండు గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్లకు డబ్బు పునఃచెల్లింపుల వైఫల్యం కేసుల అంశానికి సంబంధించి సహారా ఆస్తుల వేలం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలకు దిగిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సూచనల మేరకు, ఎస్‌బీఐ క్యాప్స్ , హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీలు పలు సహారా భూములను దశలవారీగా వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. రూ.722 కోట్ల రిజర్వ్ ధరకు ఐదు వేర్వేరు ఆస్తులను హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ నేడు ఈ-వేలానికి పెట్టింది. ఎస్‌బీఐ క్యాప్స్ జూలై 7న రూ.470 కోట్ల రిజర్వ్ ధరకు మరో ఐదు భూములను ఈ-ఆక్షన్‌కు పెట్టనుంది. కాగా సోమవారం ఆక్షన్‌కు సంబంధించి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement