ముంబై: ఇంటి కొనుగోలు నిర్ణయాల్లో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోంది. ఇంటిని కొనుగోలు చేయాలా? లేదా అద్దెకు తీసుకోవాలా? అనే అంశాల్లో మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయం హౌసింగ్.కామ్ సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం..ఇంటికి సంబంధించిన కొనుగోలు, అద్దె వంటి అంశాల్లో 95 శాతానికి పైగా మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే మహిళల శాతం 30కి పైగానే ఉంది. కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకునే మహిళలు 50 శాతంగా ఉన్నారు. ఇళ్లు, ఇతర రియల్టీ సంబంధిత నిర్ణయాలు తీసుకునేవారిలో 18-34 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా ఉన్నారు. ప్రాపర్టీ ప్లాట్ఫామ్స్ను సందర్శిస్తున్న మహిళలు 58 శాతంగా ఉన్నారు. ఇంటి కొనుగోలు, అద్దెకు సంబంధించిన లావాదేవీల్లో మహిళల పాత్ర పెరుగుతోంది. మహిళల స్వతంత్రత పెరిగే కొద్ది ఆస్తి కొనుగోలు నిర్ణయాల్లో వారి పాత్ర పెరుగుతుందని హౌసింగ్.కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రిషాబ్ గుప్తా తెలిపారు.
ఇంటి కొనుగోలు నిర్ణయాల్లో మహిళలదే పైచేయి
Published Wed, Jul 1 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- నేర చట్టాలు సరికొత్తగా..
- నెల్లిమర్ల జూట్మిల్ మళ్లీ మూత
- ఆక్వా రైతుల ఉద్యమ బాట
- వీర జవాన్లకు అశ్రు నివాళి
- రెండోరోజూ పోలవరం ప్రాజెక్టు పరిశీలన
- రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి
- మాయమయింది మళ్లీ వచ్చింది
- నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు
- నేనంటే లెక్కలేదా..?
- ఏపీలో హింస పెరిగింది: ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి
Advertisement