హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉన్న చోట నుంచే దేశంలో ఎక్కడి ఇన్వెస్టరికైనా యూనిట్లను విక్రయించే సౌకర్యాన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థ డీఎస్పీ బ్లాక్రాక్ అందుబాటులోకి తెచ్చింది. ‘ఐఫాక్స్ ప్రెస్’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ సాఫ్ట్వేర్లో ఏజెంట్లు నమోదు చేసుకోవడం ద్వారా నేరుగా లావాదేవీలను నిర్వహించుకోవచ్చని సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ మండల్ తెలిపారు. ఈ సౌకర్యం ద్వారా ఇన్వెస్టర్ల పాన్ నెంబర్, పుట్టిన తేదీ ఉంటే చాలని ఇక ఏ ఇతర కేవైసీ లేకుండానే ఇన్వెస్ట్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ఏజెంట్లకు వ్యాపార అవకాశాలు పెరుగుతాయన్నారు.