Deputy Superintendent of Police (DSP)
-
తొలియత్నంలోనే గ్రూప్-1లో విజయం
అకుంఠిత దీక్షతో గెలుపుతీరాలను చేరొచ్చని నిరూపించారు భానోదయ. తండ్రి మరణించినా ఆమె కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో.. తల్లి ప్రోత్సాహంతో ముందడుగు వేశారు. తన కోసం తల్లి పడే కష్టాన్ని చూసి చదువుతోపాటు కూచిపూడి నృత్యంపైనా శ్రద్ధపెట్టారు. నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చలించిన ఆమె వాటి నివారణకు తనవంతు కృషి చేయాలని తలంచి గ్రూప్-1కు సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె పూర్తి పేరు గొందేశి భానోదయ.లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): విశాఖ ప్రాంతానికి చెందిన గొందేశి భానోదయ తండ్రి రమణారెడ్డి స్టీల్ ప్లాంటులో చిరుద్యోగి. ఈమెకు తల్లి, ఓ సోదరి కూడా ఉన్నారు. చిన్ననాటి నుంచి కూచిపూడి నాట్యంపై అభిరుచితో తర్ఫీదు పొందారు. సిలికాన్ ఆంధ్ర సంస్థ వెయ్యి మందితో నిర్వహించిన నృత్య పోటీలో భానోదయ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 2011లో గిన్నిస్ బుక్ రికార్డును కైవసం చేసుకున్నారు. 2012లో కూచిపూడిలో డిప్లమా సాధించారు. 2013లో తండ్రి మరణించడంతో తల్లి వెంకటలక్ష్మి ఇంటి బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఇద్దరు కూతుళ్ల విద్యాభ్యాసంపై దృష్టిపె ట్టారు. తల్లి ప్రోత్సాహంతో 2018లో ఎంఏ పూర్తిచేసిన భానోదయ సివిల్స్ సర్వీసెస్ కు శిక్షణ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 మెయిన్స్ పూర్తిచేశారు. రిజల్ట్ పెండింగ్ పడింది. 2020లో హైదరాబాద్ లో నిర్మాణ రంగ వ్యాపారం చేస్తున్న రామ్మనోహర్తో పెళ్లయింది. 2022లో గ్రూప్-1 ఫలితాలు వచ్చాయి. భానోదయ విజయం సాధించారు. డీఎస్పీగా శిక్షణ పూర్తిచేసుకుని తొలుత గ్రేహౌండ్స్లో పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిసున్నారు. భానోదయ దంపతులకు మూడేళ్ల కూమార్తె జుషరిత ఉన్నారు.తల్లి, భర్త ప్రోత్సాహంతోనే -ఈస్థాయికి..సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధ కలిగిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు నా వంతు కృషి చేయాలని పోలీస్ శాఖ వైపు అడుగులు వేశా. నా తల్లి వెంకట లక్ష్మి నా భర్త రామ్మనోహర్ ప్రోత్సాహంతో ఈస్థాయికి వచ్చా. యువత దృఢమైన ఆశయంతో కష్టపడితే గెలుపు తీరాలకు చేరడం సులువే.- గొందేశి భానోదయ, సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ -
20 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు 20 మంది పేర్లతో కూడిన బదిలీల ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమల రావు పేరిట శుక్రవారం విడుదలయ్యింది. బదిలీ అయిన ప్రాంతాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని ఆ డీఎస్పీలను ఆర్డర్ కాపీల్లో ఆదేశించారు.ఇదీ చదవండి: విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఓవరాక్షన్ -
గుప్తనిధి, బంగారం అంటూ రూ. 17 లక్షలు స్వాహా చేసిన డీస్పీ సారు!
కామారెడ్డి క్రైం: ఎవరైనా మోసం చేస్తే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తాం. అయితే బాధితు లకు అండగా ఉండి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే దొంగ బంగారం పేరిట డబ్బులు కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి. గతంలో వరంగల్ జిల్లాలో పనిచేసిన డీఎస్పీ మదన్లాల్ ఏడు నెలల క్రితం కామారెడ్డి డీసీఆర్బీ విభాగానికి బదిలీపై వచ్చాడు. జిల్లా పోలీస్ కార్యాలయానికి సమీపంలోని ఓ కాలనీలో ఇల్లు కిరాయికి తీసుకుని నివసిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తితో కొద్దిరోజుల క్రితం పరిచయం ఏర్పడింది. తనకు తెలిసిన వ్యక్తికి తవ్వకాల్లో గుప్త నిధులు లభించాయని, రూ.6 లక్షలకే కిలో చొప్పున బంగారాన్ని ఇప్పిస్తానని నమ్మించాడు. తాను పోలీసునని, అంతా చూసుకుంటానని చెప్పడంతో నమ్మిన సదరు వ్యక్తి.. రూ. 17 లక్షలకుపైగా ఇచ్చినట్లు తెలిసింది. అయితే రోజులు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో బాధితుడు 15 రోజుల క్రితం జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించాడు. దీంతో ఈనెల 6న డీఎస్పీ మదన్లాల్ను ఐజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. అంతేకాకుండా దేవునిపల్లి ఠాణా లో ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు జరిగిన ఘ టనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రాష్ట్ర అధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో డీఎస్పీ మదన్లాల్ను సస్పెండ్ చేస్తూ రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. ఈ కేసులో డీఎస్పీతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా గతంలో సదరు డీఎస్పీ పనిచేసిన ఇతర చోట్ల కూడా ఫిర్యాదులు ఉన్నాయని సమాచారం. జిల్లాకు వచ్చిన తర్వాత కూడా మాయమాటలు చెప్పి చాలామంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
డీఎస్పీగా నియామక పత్రాన్ని అందుకున్న క్రికెటర్ సిరాజ్
టీమిండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా (డీఎస్పీ) నియామక పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ డీజీపీ జితేందర్ సిరాజ్కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిరాజ్తో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.టీ20 వరల్డ్కప్-2024 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రూప్-1 ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. తనకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి సిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.30 ఏళ్ల సిరాజ్ 2017లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. సిరాజ్ టీ20 వరల్డ్కప్-2024తో పాటు అంతకుముందు జరిగిన ఆసియా కప్లో విశేషంగా రాణించాడు. సిరాజ్ తన తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కూడా ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేశాడు.సిరాజ్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 28 టెస్ట్లు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. ఇందులో 161 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ అందరూ బౌలర్లలా కాకుండా ఆల్ ఫార్మాట్ బౌలర్గా రాటుదేలాడు. ఐపీఎల్ ద్వారా సిరాజ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సిరాజ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడతాడు. ఐపీఎల్లో అతను 93 మ్యాచ్లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. చదవండి: చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్ -
చంద్రగిరి DSPపై వేటు
-
చంద్రగిరి DSPపై వేటు
-
ట్యాపింగ్కు సహకరించిందెవరు? ప్రణీత్రావుపై ప్రశ్నల వర్షం
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో అరెస్టయి తమ కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావును మూడోరోజు మంగళవారం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ప్రణీత్ను పోలీసులు విచారిస్తోంది. ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో ఎస్బీఐ అధికారులు ఎవరెవరు సహకరించారన్నదానిపై పోలీసులు ప్రణీత్ నుంచి కూపీ లాగుతున్నారు. సహకరించిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ధ్వంసం చేసిన ప్రణీత్రావు కంప్యూటర్ల హార్డ్ డిస్క్లు ఎక్కడ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హార్డ్ డిస్క్లు దొరికిన తర్వాత వాటి నుంచి డేటా పునరుద్ధరిస్తే ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు, ఎందుకు చేశారనే కీలక విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చెప్పిన నెంబర్లు మాత్రమే ప్రణీత్రావు ట్యాప్ చేయలేదని.. పలువురు రాజకీయ నేతలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన నెంబర్లను సైతం ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బేగంపేట ఎస్ఐబీలోని కీలకమైన లాగర్ రూంను ఇందుకు వినియోగించుకున్నారని.. అలాగే అక్కడి సిబ్బందిని ప్రమోషన్ ఆశ చూపించి రహస్యాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డట్లు తేలింది. ప్రస్తుతం ప్రణీత్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న స్పెషల్ టీం.. అతని డైరీలో దొరికిన వందల నెంబర్లపై ప్రశ్నలు గుప్పిస్తూ మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తోంది. ఇదీ చదవండి.. ఇబ్రహీంపట్నంలో పరువు హత్య -
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏకంగా 62 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా.. తాజాగా పోలీసు శాఖలో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఆదివారం 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో డీజీ ఆఫీస్లో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్సీలతో పాటుగా హైదరాబాద్లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు బదిలీలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
చిన్న వివాదం.. ఆ డీఎస్పీ ప్రాణం తీసింది!
ఛండీగఢ్: చిన్న వివాదం పంజాబ్లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఓ ఆటోడ్రైవర్తో గొడవ కారణంగానే ఆయన ప్రాణం పోయింది. అయితే.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు జలంధర్ పోలీసులు. అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారి(డీఎస్పీ స్థాయి) దల్బీర్ సింగ్ డియోల్ (54)హత్యకు గురికావడం పంజాబ్లో అలజడి రేపింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ ఆటో డ్రైవర్ అని, అతనితో దల్బీర్ వాగ్వాదానికి దిగడమే హత్యకు కారణమైందని చివరకు పోలీసులు నిర్ధారించారు. ఏం జరిగిందంటే.. దల్బీర్ సింగ్ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో తనను ఇంటి దగ్గర దింపాలని సదరు ఆటో డ్రైవర్ను కోరారు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణగా మారే క్రమంలో.. దల్బీర్ దగ్గర ఉన్న సర్వీస్ తుపాకీని లాక్కుని ఆ డ్రైవర్ కాల్పులు జరిపాడు. దాంతో దల్బీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆపై జలంధర్ నగర శివారులో ఓ కాలువ సమీపంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు జుగల్ కిషోర్ అనే పోలీసాధికారి ఆ మృతదేహాన్ని మొదటగా గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు మొదలైంది. ఛేదించారిలా.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. ఓ ఆటోను గుర్తించారు. దాని నెంబర్ ప్లేట్ ఆధారంగా.. అక్కడి నుంచి ఉన్న మూడు దారుల్లో ట్రేస్ చేసే యత్నం చేశారు. అదే సమయంలో ఆ కాలువకు దగ్గర్లోని టవర్కు వచ్చిన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగానూ సమాంతరంగా దర్యాప్తు కొనసాగించారు. చివరకు నిందితుడిని ఆటో డ్రైవర్ విజయ్ కుమార్గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఆసియా క్రీడల్లో దల్బీర్ వెయిట్ లిఫ్టింగ్లో బంగారు పతకాన్ని సాధించారు. అందుకే 2000లో ఆయనను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. అనంతరం ఆయన పోలీసుశాఖలో చేరారు. -
తిరుమల: శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి చెందారు. 1,805వ మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కుప్పకూలారు. తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఆయన స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్ తిరుమలకు వచ్చారు. ఈ ఘటనపై ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. చదవండి: ఇన్స్టా రీల్కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య -
నాలుగు నెలల్లో 4 కొలువులు.. అయినా సివిల్స్ లక్ష్యంగా..
మంచి ప్యాకేజీతో వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదనుకున్నాడు. ప్రభుత్వ రంగంలో ప్రజాసేవతో వీలున్న కొలువు కావాలనుకున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా ధిక్కరించాడు. లక్ష్య సాధనకు పరాక్రమించాడు. ఏ దశలోనూ నిరాశను దరి చేరనీయరాదనుకున్నాడు. ఆత్మవిశ్వాసమే మార్గమని విశ్వసించాడు. ఫలితంగా ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. చివరకు గ్రూప్–1 ద్వారా డీఎస్పీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చుక్కల సూర్యకుమార్. అయినప్పటికీ అంతిమ లక్ష్యం.. సివిల్స్పై గురి వీడలేదు. నిరంతర పరిశ్రమకు చిరునామాగా నిలిచే సూర్యకుమార్ను ఒకసారి పలకరిస్తే.. రాజమహేంద్రవరం: మాది మధ్య తరగతి కుటుంబం. సొంత ఊరు కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ. నాన్న వెంకట రమణ కడియం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు గోవిందరాజు, అక్క స్వాతి ఉన్నారు. తమ్ముడు ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్నాడు. నాకు టెన్తులో మంచి మార్కులొచ్చాయి. స్టేట్లో ఆరో ర్యాంకు వచ్చింది. ఆ మార్కులు ఆధారంగా 2008లో నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ నా చదువుకు గట్టి పునాది పడింది. ఇంటర్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ స్థాయిలో టాప్ టెన్లో ఒకడిగా నిలిచాను. 2014లో బీటెక్ అయ్యాక ఇన్ఫోసిస్ ఉద్యోగానికి క్యాంపస్లో సెలక్టయ్యాను. అప్పట్లోనే నాకు వార్షిక జీతం రూ.35 లక్షలు. అందులో కొనసాగి ఉంటే ఇప్పుడు రూ.కోటిన్నరకు చేరేవాడిని. త్రుటిలో చేజారిన అవకాశాలు ఎక్కువ జీతం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు సంతృప్తి కలిగించలేదు. అందులో సంతోషంతో ఇమడలేకపోయాను. రెండేళ్లు పని చేశాను. కానీ పబ్లిక్ సర్వీసుతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. ఇదే విషయాన్ని నాన్నతో చెప్పాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఇది ఇబ్బందికరమైనా నాన్న నన్ను ప్రోత్సహించారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగుకు జాయినయ్యాను. 2017–20 మధ్య నాలుగుసార్లు రాశాను. ఇంటర్వ్యూ దశకు చేరుకోలేకపోయాను. ఇదే సమయంలో ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాను. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల్లో తుది జాబితాలో మిస్సయ్యాను. 2020 గ్రూప్–2లో సర్టిఫికెట్ వెరిఫికేషన్లో అవకాశం పోయింది. అదే ఏడాది గ్రూప్–1 మెయిన్కు అర్హత సాధించినా ఇంటర్వ్యూ పోయింది. ఎస్సెస్సీ సీజీల్, నాబార్డు, ఆర్బీఐ.. ఇలా నాలుగైదు పరీక్షలు పాసైనా త్రుటిలో విజయం దూరమయ్యేది. ఈ దశలో మానసిక దృఢత్వం కోల్పోతానేమోనని సంశయించాను. అయినా పట్టుదలతో కష్టపడేవాడిని. నిరాశ చెందేవాడిని కాదు. అంతిమ లక్ష్యం సివిల్స్ 2023– ఈ ఏడాది నా జీవితంపై చాలా మంచి ప్రభావం చూపించింది. వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కించేలా చేసింది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. దేవదాయ శాఖలో ఈఓ పోస్టుకు ఎంపికయ్యాను. కాగ్ అకౌంటెంటుగా సెలక్టయ్యాను. సరదాగా రాసిన గ్రూప్–4 ఉద్యోగమూ వచ్చింది. గ్రూప్–1లో విజేతగా నిలిచాను. జైల్స్ డీఎస్పీగా ఎంపికయ్యాను. ప్రస్తుతానికి దేవదాయ శాఖలో ఈఓ శిక్షణ పొందుతున్నా.. వచ్చే జనవరిలో డీఎస్పీ ట్రైనింగ్ ఆర్డర్ రాగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. డీఎస్పీ అయినా నా జీవిత లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావాలన్నదే. ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉంది. పేరు : చుక్కల సూర్యకుమార్ తండ్రి : వెంకటరమణ,హెడ్ కానిస్టేబుల్ తల్లి : లక్ష్మి, గృహిణి చదువు : బీటెక్ (ట్రిపుల్ ఐటీ, నూజివీడు) ఎంపిక : గ్రూప్–1లో డీఎస్పీ (జైళ్లు)ప్రస్తుతం ఉంటున్నది : వేమగిరి (తూర్పు గోదావరి) లక్ష్యం నిర్ణయించుకుని శ్రమించాలి జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో మన సామర్థ్యానికి అనుగుణంగా ముందుగానే లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఏదైనా సాధించాలంటే కష్టం తప్ప మరో మార్గం ఉండదని తెలుసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనా ఏ సమయంలోనూ ఆత్మ విశ్వాసాన్ని దూరం చేసుకోకూడదు. నేనైతే ఈ పరీక్షల ప్రిపరేషనులో అన్ని సరదాలు, షికారులు వదులుకున్నాను. ఫెయిల్యూర్స్ వస్తున్నా నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించాలి. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే తప్పకుండా విజయం సాధిస్తాం. – చుక్కల సూర్యకుమార్ -
కీచక డీఎస్పీ.. బాధితురాలి ఫోన్కు రొమాంటిక్ పాటలు, వీడియోలు
సాక్షి,హైదరాబాద్: పోలీసు నినాదం గతి తప్పింది. మహిళలకు రక్షణకుకల్పించాల్సిన పోలీసే వేధింపులకు గురి చేశాడు. సమస్య ఉందని ఆశ్రయించిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) డీఎస్పీ కిషన్ సింగ్జీపై చైతన్యపురి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్గదర్శి కాలనీకి చెందిన మహిళ (48) తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డి్రస్టిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తోంది. 2020లో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఇంటర్ డిపార్ట్మెంట్ క్రీడా పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో సీఐడీ డీఎస్పీ కిషన్ సింగ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. శిక్షణ తరగతులకు హాజరుకావాలని అతను ఆమెకు సూచించాడు. సీనియర్ పోలీసు అధికారి కావటంతో అంగీకరించిన బాధితురాలు.. తన ఫోన్ నంబరును పోలీసు అధికారికి ఇచి్చంది. అప్పటి నుంచి ఆ పోలీసు ఉన్నతాధికారి ఆమె వాట్సాప్ నంబరుకు రొమాంటిక్ హిందీ పాటలు, సెన్సార్ చేయని వీడియోలను పంపించడం మొదలుపెట్టాడు. శిక్షణ తరగతులకు చీర కట్టుకోవాలని రావాలంటూ ఒత్తిడికి గురి చేసేవాడని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సాయం కోసం వెళితే.. కిషన్సింగ్ ప్రవర్తన బాగా లేకపోవటంతో ఫోన్ కాల్స్కు, వీడియోలకు ఏడాది పాటు స్పందించడం మానేసింది. కొన్ని నెలల క్రితం హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం బాధితురాలు సదరు సీఐడీ పోలీసు అధికారిని సంప్రదించింది. దీన్ని ఆసరా చేసుకున్న అతను.. తనతో చనువుగా ఉండాలని, తనను కౌగిలించుకోవాలని పట్టుబట్టాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో భవిష్యత్తులో ఎలాంటి సహాయం చేయనని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్ను ఆశ్రయించింది. వారి సూచన మేరకు.. చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు కిషన్సింగ్పై 354 (డి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితురాలి సెల్ఫోన్ను స్వా«దీనం చేసుని మరిన్ని వివరాలు, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
ఆంధ్రప్రదేశ్లో భారీగా డీఎస్పీల బదిలీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో భారీగా డీఎస్పీల బదిలీ జరిగింది. రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్కి విశాఖ క్రైమ్ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్డీపీఓగా బదిలీ, కాశీబుగ్గలో ఎస్డీపీఓగా విధులు నిర్వహిస్తున్న శివరాం రెడ్డికి విశాఖ నార్త్ ఏసీపీగా, అలాగే హర్బర్ ఏసీపీగా పనిచేస్తున్న శిరీషకి నెల్లూరు జిల్లాకి బదిలీ అయ్యింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన అధికారులంతా నార్త్ విశాఖ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఏసీసీ శ్రీనివాసరావుకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బదిలీల ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి (చదవండి: బాబు చీకటికి.. జగన్ వెలుగులకు ప్రతినిధి) -
41 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 41 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్–సివిల్ (డీఎస్పీ)లను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు (పీఈబీ) సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు, ఈ పోస్టింగ్లు వెంటనే అమల్లోకి వస్తాయని శనివారం డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే పెద్దసంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలీసు అధికారుల బదిలీలు చోటుచేసుకుంటున్నాయి. ఇక వచ్చేనెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రబడ్జెట్ సమర్పణ, వచ్చేనెల 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఆ తర్వాతే పెద్ద ఎత్తున పలు స్థాయిల్లోని ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
Fact Check: బైక్పై బాలుడి మృతదేహం వార్తల్లో అసలు వాస్తవం ఇదీ..
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం బీచ్లో మృతి చెందిన బాలుడిని ద్విచక్రవాహనంపై తరలించారని, పోలీసులు సరిగా స్పందించలేదన్న వార్తల్లో వాస్తవం లేదని కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. పోలీసులు వాహనం ఏర్పాటు చేయలేదని చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినా, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు బాలుడి మృతిపై కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటన చేసింది. పోలీసుల ప్రకటన ప్రకారం.. గొడుగు పేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి మంగినపూడికి ఆదివారం వెళ్ళాడు. ఈ క్రమంలో అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యాడు. తనతో కలిసి స్నానానికి వెళ్లిన మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకుని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న స్థానిక రాబర్ట్ సన్ పేట ఇన్స్పెక్టర్, బందరు తాలూకా, ఆర్ పేట ఎస్ఐలు, మెరైన్ ఎస్ఐ, సిబ్బంది బీచ్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు గల్లంతైన సమాచారం తల్లిదండ్రులకు తెలియపరిచారు. చీకటి పడే వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచి గాలింపును తిరిగి కొనసాగించారు. పెదపట్నం, ఇంతేరు చిన్న గొల్లపాలెం వరకు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మరోవైపు.. పెదపట్నం బీచ్ ఒడ్డుకు బాలుడి మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా సంఘటన స్థలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై బాలుడి మృదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బాలుడు మృతదేహం పెదపట్నం బీచ్ వద్ద లభ్యమైందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై వస్తున్న బాధిత కుటుంబాన్ని ఆపి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి బాలుడి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో పోలీసు వారు సరైన గాలింపు చర్యలు చేపట్టలేదని, మృతదేహాన్ని తరలించడానికి సైతం వాహనం ఏర్పాటు చేయలేదని, సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది అసత్యాలను ప్రచారం చేశారు. గాలింపు చర్యలు వేరు వేరు ప్రాంతంలో జరగటం వలన పెదపట్నం బీచ్ వద్దకు చేరుకునే సరికి సమయం పట్టింది గాని, ఇందులో పోలీసు వారు సరిగా స్పందించలేదన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రచారం చేసిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం తప్పదని పోలీసులు హెచ్చరించారు. పోలీసు వారిని సంప్రదించి ఎలాంటి వివరణ తీసుకోకుండా తమప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించాలని చూస్తే చర్యలు తప్పవని బందరు డీఎస్పీ మాసుం భాష హెచ్చరించారు. ఇదీ చదవండి: Fact Check: 'ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం' -
వాట్సాప్లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ
చెన్నై: మోస పోయిన వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులది. తప్పు చేసిన వారిని శిక్షించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత వాళ్లది. అలాంటి గౌరవమైన వృత్తిలో ఉన్న ఓ ఉన్నత అధికారి నీచానికి దిగజారారు. తోటి మహిళా పోలీసులకు అసభ్యకర ఫోటోలు షేర్ చేస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తన ప్రైవేటు ఫోటోలను వాట్సాప్లో పంపి రాక్షస ఆనందం పొందాడు. చివరికి తను తీసుకున్న గోతిలో తానే పడినట్లు డీఎస్పీ కామ క్రీడల వ్యవహారం అతన్ని చిక్కుల్లో పడేసింది. ఐపీఎస్ అధికారి పారా వాసుదేవన్ తమిళనాడులోని తిరుచ్చి డీఎస్పీగా(డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 19న నేర సంబంధిత విషయాల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో తన న్యూడ్ ఫోటోలు షేర్ చేశాడు. కాసేపటి తరువాత ఆ ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అవి నెట్టింట్లో లీక్ అయ్యాయి. దీంతో అసభ్యకర ఫోటోలు షేర్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా పోలీసులు పారా వాసుదేవన్పై ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా పోలీస్ అధికారులు డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులకు రాసిన లేఖలో.. తమ అనుమతి లేకుండా మహిళా పోలీసులను అసభ్యకరంగా ఫోటోలు తీసి తనతో శృంగారంలో పాల్గొనాలని పారా వాసుదేవన్ బలవంతం చేసినట్లు ఆరోపించారు. ఇప్పటికే డీఎస్పీపై మే 23, సెప్టెంబరు 30న ఫిర్యాదు చేసినప్పటికీ డీఎంకే మంత్రి అండదండలతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఈ లేఖ వైరల్ కావడంతో విచారణ కోరుతూ పారా వాసుదేవన్ను పోలీస్ శాఖ వెయిటింగ్ లిస్ట్లో పెట్టింది. చదవండి: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేసిన యువకుడు.. ఇద్దరిని ఇంటికి పిలిపించి.. -
నల్గొండ జిల్లా: బైక్ను ఢీకొట్టిన డీఎస్పీ వాహనం
-
Manisha Ropeta: పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్
దాయాది దేశం పాకిస్తాన్లో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ హిందువులకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారిని చిన్నచూపు చూస్తారు. కానీ, తాజాగా ఓ హిందూ మహిళ.. పాకిస్తాన్లో సంచలనం క్రియేట్ చేశారు. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని.. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వివరాల ప్రకారం.. పాకిస్తాన్కు చెందిన హిందూ మహిళ మనీషా రోపేటా(26) రికార్డులు బ్రేక్ చేశారు. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకుందన్న తొలి హిందూ మహిళగా గుర్తింపు పొందారు. ఈ స్థానానికి చేరిన తొలి హిందు మహిళగా హిస్టరీ క్రియేట్ చేశారు. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో మనీషా నిలిచారు. కాగా, ప్రస్తుతం.. మనీషా రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్ చెందిన మనీషా.. మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె 13వ ఏట తండ్రి మరణించడంతో.. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు. డీఎస్పీగా బాధత్యలు స్వీకరించిన తర్వాత మనీషా రోపేటా మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి.. తాను, తన సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థను చూసినట్టు తెలిపారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. అలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్టు స్పష్టం చేశారు. పాకిస్తాన్లో అమ్మాయిలకు ఎక్కువగా.. డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. పోలీసు శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా...యూఎస్కి స్ట్రాంగ్ వార్నింగ్ -
తెలంగాణ: డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. అభ్యర్థుల ఎత్తును 167 సెం.మీ నుంచి 165 సెం.మీకు తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. డీఎస్పీ అభ్యర్థుల ఎత్తు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ఎత్తు ఎక్కువగా ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ డిమాండ్కు తలొగ్గి.. ఇప్పుడు ఎత్తు తగ్గించి నిరుద్యోగులకు ఊరట ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చదవండి👉తెలంగాణ పోలీస్ నియామక అభ్యర్థులకు మరో గుడ్న్యూస్ -
బాక్సర్ లవ్లీనాకు బంపరాఫర్.. డీఎస్పీగా ఉద్యోగం, అదనంగా నెలకు రూ.లక్ష
Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో లవ్లీనా భారత్కు ప్రాతినిథ్యం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ఆమె సెమీస్ చేరారు. అయితే వరల్డ్ నంబర్ వన్ టర్కీకి చెందిన బుసెనజ్తో జరిగిన సెమీస్లో ఓడిపోవడంతో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత ఆమెకు డీఎస్పీ ఉద్యోగంతోపాటు కోటి రూపాయల పారితోషికం ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఉదయం లవ్లీనాకు డీఎస్పీ నియామక పత్రం అందజేశారు. నెలవారీ జీతంతోపాటు లవ్లీనాకు బాక్సింగ్ ట్రైయినింగ్ ఖర్చుల కోసం అదనంగా రూ.లక్ష ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. దాంతోపాటు పంజాబ్లోని పటియాలలో కోచింగ్ తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే అంతర్జాతీయ స్థాయి కోచ్తో గువాహటిలోనే ట్రయినింగ్ ఇప్పిస్తామని చెప్పారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలిస్ శాఖకు కృతజ్ఞతలు చెప్పిన లవ్లీనా.. తన లక్ష్యం వచ్చే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమేనని అన్నారు. (చదవండి: హాకీ జట్టు కెప్టెన్గా సవితా పునియా.. గోల్కీపర్గా మన అమ్మాయి రజని) -
శాంతి కపోతం.. డీఎస్పీ సీతారెడ్డికి ఐరాస శాంతి పతకం
తెలంగాణ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (డీఎస్పీ) విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నారు. ఈ ఏడాది దక్షిణ భారత దేశం నుంచి ఎంపికైన వారిలో సీతారెడ్డి మాత్రమే ఏకైక మహిళ. ఈమెకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) శుక్రవారం (భారత కాలమాన ప్రకారం) పీస్ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఉన్నత విద్యనభ్యసించి పోలీసుగా... హైదరాబాద్కు చెందిన సీతారెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు. నగరంలోనే వివిధ యూనివర్శిటీల్లో ఎంఏ (ఇంగ్లీష్), ఎంఏ (సైకాలజీ), ఎంఈడీ, సైబర్ క్రైమ్స్లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1996లో సబ్–ఇన్స్పెక్టర్గా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. ఇన్స్పెక్టర్, డీఎస్పీ హోదాల్లో నల్లగొండ టూ టౌన్, జీడిమెట్ల, సరూర్నగర్ ఉమెన్, పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పని చేశారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో (సీఐడీ) డీఎస్పీ గా పని చేస్తుండగా సీతారెడ్డి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేయడానికి ఎంపికయ్యారు. రెండోసారి ఈ దళంలో పని... అంతర్గత ఘర్షణలతో అతలాకుతలం అవుతున్న సూడాన్, తైమోర్ తదితర దేశాల్లో శాంతి పరిరక్షణకు, అక్కడి పోలీసు విభాగానికి శిక్షణ ఇవ్వడానికి ఐక్యరాజ్య సమితి ఈ శాంతి పరిరక్షక దళాన్ని వినియోగిస్తోంది. వివిధ దేశాలకు చెందిన పోలీసు విభాగాల నుంచి ఏడాది సమయం పని చేయడానికి అధికారులను ఎంపిక చేస్తుంది. రాత పరీక్ష, మౌఖిక పరీక్షలతో పాటు డ్రైవింగ్, షూటింగ్ వంటి పోటీలు నిర్వహించి.. ఉత్తీర్ణులైన వారికే దళంలో పని చేసే అవకాశం ఇస్తుంది. ఈ ఏడాది భారతదేశం నుంచి మొత్తం 29 మందికి ఈ అవకాశం దక్కగా... వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి సీతారెడ్డికే ఈ అవకాశం దక్కింది. ఇలా ఐక్యరాజ్య సమితి దళంలోకి ఈమె ఎంపిక కావడం ఇది రెండోసారి. తెలుగు రాష్ట్రాల నుంచి రెండుసార్లు ఎంపికైన వాళ్లు ఇంకెవరూ లేరు. జూలై నుంచి జూబాలో విధులు... యూఎన్ శాంతిపరిరక్షక దళంలో పని చేయడానికి సీతారెడ్డి ఈ ఏడాది జూలై 19న సౌత్ సూడాన్ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడి జూబా ప్రాంతంలో ఉన్న పోలీసు ట్రై నింగ్ అండ్ సెన్సిటైజేషన్ యూనిట్లో పోలీసు అడ్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో పని చేస్తూ ఎలాంటి ప్రతికూల రిమార్క్స్ లేని వారిని ఎంపిక చేసిన యూఎన్ శుక్రవారం పీస్ మెడల్, సర్టిఫికెట్ అందించింది. వీటిని అందుకున్న వారిలో సీతారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘సూడాన్ పోలీసుల్లో శక్తిసామర్థ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం మా విధి. పూర్తి ప్రతికూల వాతావరణంలో పని చేయడం కొత్త అనుభవాలను నేర్పిస్తోంది. యూఎన్ మార్గదర్శకాల ప్రకారం వారికి నేర్పడంతో పాటు ఎన్నో కొత్త అంశాలను ఇక్కడ నేర్చుకోగలుగుతున్నా’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో సభ్యురాలిగా సీతారెడ్డి (ఎడమనుండి రెండవ వ్యక్తి) – శ్రీరంగం కామేష్ ,సాక్షి సిటీ బ్యూరో -
తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్! -
స్విమ్మింగ్పూల్లో రాసలీలలు: రెడ్హ్యాండెడ్గా దొరికిన డీఎస్పీ
జైపూర్: ఓ పోలీస్ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్ అర్ధనగ్నంగా స్విమ్మింగ్పూల్లో జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో రిసార్ట్పై పోలీసులు దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్గా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఒక పోలీస్ ఉన్నతాధికారే ఇలా చేయడంతో రాజస్థాన్లో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి వివరాలు ఇలా ఉన్నాయి. అజ్మీర్ జిల్లాలోని డీఎస్పీ హీరాలాల్ సైనీ. జైపూర్ కమిషనరేట్లో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్తో కలిసి ఆయన జూలై 13వ తేదీన ఉదయ్పూర్లోని ఓ రిసార్ట్కు వెళ్లాడు. రిసార్టులోని స్విమ్మింగ్పూల్లో ఇద్దరూ ఆడుకుంటున్నారు. అర్ధనగ్నంగా ఉన్న ఇద్దరూ సన్నిహితంగా కలిశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కానిస్టేబుల్ వాట్సప్ స్టేటస్గా పెట్టుకుంది. ఆ వీడియోలో ఇద్దరూ జలకాలాడుతూ మైకంలో మునిగి తేలుతున్నట్లు ఉంది. ఆ వీడియో వైరల్గా మారడంతో పోలీసులు స్పందించారు. వెంటనే రిసార్ట్పై దాడి చేసి ఆ అధికారితో పాటు కానిస్టేబుల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కన్న కొడుకు (6) కళ్లెదుటే ఆ కానిస్టేబుల్తో ఆయనతో సన్నిహితంగా మెలగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఏడీజీ అశోక్ రాథోడ్ దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరినీ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. నాగౌర్ జిల్లాలోని చిట్టావా పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ భర్త ఫిర్యాదు చేశాడు. చదవండి: చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం -
భారీ నగదుతో పరుగులు తీసిన డీఎస్పీ.. విషయం ఏంటంటే..
తిరువొత్తియూర్: తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షల నగదుతో డీఎస్పీ పరుగులు తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుచి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్పోర్ట్ సమీపంలో వాహనాల తనిఖీ కేంద్రం ఉంది. ఇక్కడ గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును నిలిపి తనిఖీ చేస్తుండగా, కారులో నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తాడు. ఇది చూసిన పోలీసులు అతన్ని వెంబడించి.. పట్టుకున్నారు. విచారణలో పరిగెత్తిన వ్యక్తి డీఎస్పీ అని స్నేహితులతో కలిసి రూ. 11 లక్షల నగదును తీసుకొని తిరుచ్చికి వచ్చినట్లు తెలిసింది. అనంతరం అతను మాట్లాడుతూ... తనిఖీ కేంద్రంలో మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి.. విజిలెన్స్ అధికారులు అనుకొని నగదుకు తగిన ఆధారాలు లేకపోవడంతో పరిగెత్తినట్లుగా తెలిపాడు. దీంతో డీఎస్పీ తో పాటు.. అతని స్నేహితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: శునకం నోటిలో పసికందు తల -
వైరల్: కొడుక్కు సెల్యూట్ చేసిన తల్లి, నెటిజన్లు ఫిదా
గాంధీనగర్: పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. సహజంగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అయితే, పిల్లలను తమే గౌరవించాల్సిన ఉన్నత స్థితికి వారు చేరుకుంటే తల్లిదండ్రులకు పట్టపగ్గాలు ఉండవని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఈ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలను మనం చూసాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ చిత్రంలో కన్నతల్లి.. ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్ చేస్తూ మురిసిపోతుంటుంది. చదవండి: భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోకి అరవల్లి ప్రాంత డీఎస్పీకి (పోలీస్ శాఖ).. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఏఎస్సై సెల్యూట్ చేస్తుంది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా. అక్కడ పరస్పరం సెల్యూట్ చేసుకున్న వారు తల్లి కొడుకు కావడమే విశేషం. ఈ సందర్భంగా తల్లి మురిసిపోతూ, కళ్ల నిండా ఆనందంతో కొడుకుకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం హైలైట్గా నిలిచింది. ఈ అపురూప దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ దినేశ్ దాస ట్వీట్ చేయడంతో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మనస్సుకు హత్తుకునే ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మ కళ్లల్లో అసలుసిసలైన ఆనందాన్ని చూడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: తండ్రితో పెళ్లికూతురు హుషారైన స్టెప్పులు.. ఫిదా అవ్వాల్సిందే -
లవ్లీనాకు భారీ ప్రోత్సాహకాలు: డీఎస్పీ ఉద్యోగం.. రూ. కోటి నజరానా
డిస్పూర్: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్కు అసోం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహాకాలు ప్రకటించింది. లవ్లీనాకు డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేయడంతో పాటు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన లవ్లీనాకు గురువారం గౌహతిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం బాక్సర్ లవ్లీనాను రాష్ట్ర పోలీసుశాఖలో డీఎస్పీగా చేరమని అభ్యర్థించారు. అంతేకాక ఆమెకు కోటి రూపాయల నజరాన ప్రకటించారు. అలానే లవ్లీనా కోచ్కు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది అసోం ప్రభుత్వం. అలానే అసోంలోని గోలాఘాట్ జిల్లాలోని సౌపాతర్లో లవ్లీనా బోర్గోహెయిన్ పేరు మీద రూ. 25 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు హిమంత శర్మ తెలిపారు. సన్మాన కార్యక్రమం సందర్భంగా హిమంత బిస్వా శర్మ స్వయంగా గౌహతి విమాన్రాశయం చేరుకుని లవ్లీనాకు స్వాగతం పలికారు. అనంతరం బాక్సర్ భారీ కటౌట్లతో అలంకరించిన బస్సులో లవ్లీనాను ఎక్కించుకుని సిటీ హోటల్కు తీసుకెళ్లారు. అక్కడ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో లవ్లీనాకు సన్మానం జరిగింది. సాయంత్రం లవ్లీనా.. గవర్నర్ జగదీష్ ముఖిని కూడా కలిసే అవకాశం ఉంది. -
ఏపీలో 22 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్ మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ వీరంగం -
బిహార్ : తొలిసారి డీఎస్పీగా ముస్లిం యువతి
పట్నా: బిహార్ రాష్ట్రం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో కాస్త వెనుకబడి ఉంది. అక్కడ అక్షరాస్యత శాతం కూడా తక్కువ. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మహిళల చదువులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే, కొన్ని ముస్లిం కుటుంబాలలో మహిళల విద్యపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక ముస్లిం యువతి గ్రూప్1 సర్వీస్లో అత్యున్నత హోదా అయిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. బిహార్లోని గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల రజియా సుల్తానా అనే యువతి చరిత్రను సృష్టించింది. ఆమె తాజాగా, ప్రకటించిన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగానికి ఎంపికైంది. అయితే, బిహార్ రాష్ట్రంలో, ఒక ముస్లిం సామాజిక వర్గం నుంచి ఈ సర్వీస్ను సాధించిన తొలి యువతి కూడా రజియానే. దీంతో ఇప్పుడిమే వార్తల్లో నిలిచింది. కాగా, రజియాతో పాటు మరో 40 మంది కూడా డీఎస్పీ సర్వీస్కు ఎంపికయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె హతూవా నగరంలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తుంది. రజియా తండ్రి మహమ్మద్ అస్లామ్ అన్సారీ బొకారోలోని ఒక ఫ్యాక్టరీలో స్టెనోగ్రాఫర్గా పనిచేసేవాడు. అన్సారీకి 7 గురు సంతానం. వీరిలో రజియా అందరికన్నావయసులో చిన్నది. ఆమెకు ఒక అన్నయ్య .. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ప్రాథమిక విద్యను బొకారోలో, బీటెక్ను జోధ్పూర్లో పూర్తి చేసుకుంది. అయితే రజియా తండ్రి 2016లోనే చనిపోయాడు. దీంతో ఆమె కష్టపడి విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించింది. తన తల్లితో కలిసి ఉంటుంది. ఎలాగైన ప్రభుత్వ సర్వీస్ సాధించాలనే తపనతో 2017 నుంచి తన ప్రిపరేషన్ను ప్రారంభించింది. ఉద్యోగం చేస్తునే మిగతా సమయంలో ప్రిపరేషన్ సాగించేది. ఈ క్రమంలో, మొత్తానికి తన కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రజియా మాట్లాడుతూ... ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. మానాన్న గారికి నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉండేదని తెలిపింది. దీంతో నేను ఆయను కలను, నా ఆశయాన్ని పూర్తిచేశానని తెలిపింది. అయితే, ఇప్పటికీ చాలా చోట్ల మహిళలకు న్యాయం జరగడం లేదని వాపోయింది. బాధిత మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. ప్రధానంగా, కొన్ని ముస్లిం కుటుంబాలలోని మహిళలు ఇప్పటికీ విద్యపట్ల వివక్షతకు గురౌతున్నారని బాధపడింది. అలాంటి కుటుంబాలలో విద్యపట్ల అవగాహన పెంచుతానని చెప్పింది. అయితే, ఇప్పటికే తాను, కోవిడ్ బారిన పడి కోలుకున్నానని చెప్పింది. ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని దానిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని వివరించింది. చదవండి: Shocking: స్టోర్లో ప్రవేశించిన పాము.. దీంతో ఆ మహిళ.. -
చావు అంచున డీఎస్పీ.. చచ్చాక పరిహారం ఎందుకంటూ వీడియో
పంజాబ్లో సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేసింది. నా ట్రీట్మెంట్ కోసం సాయం చేయండి. బతకడానికి నాకొక అవకాశం ఇవ్వండి. అంటూ ఓ డీఎస్పీ లెవెల్ అధికారి మాట్లాడిన వీడియో ఒకటి వాట్సాప్, ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. చావు అంచున ఉన్న తనను కాపాడాలంటూ వేడుకున్న ఆయన వీడియో పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని పార్టీలు, ప్రజలు విమర్శించడంతో ఆ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. ఛంఢీఘడ్: డిప్యూటీ జైలు సూపరిడెంట్గా పని చేస్తున్న 49 ఏళ్ల హర్జిందర్ సింగ్కు ఈ మధ్యే కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రకరకాల సమస్యలతో ఆయన లూథియానాలో ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే ఊపిరితిత్తులు చెడిపోవడంతో ఆయన పరిస్థితి రోజురోజూకీ దిగజారింది. లంగ్స్ మారిస్తే ఆయన బతుకుతాడని డాక్టర్లు ఆయన కుటుంబ సభ్యులతో చెప్పారు. ఇక ఆయనకు సాయం అందించే విషయంలో పంజాబ్ ప్రభుత్వం మూడువారాల పాటు అలసత్వం ప్రదర్శించింది. పరిస్థితి విషమిస్తుండడంతో.. చచ్చాక తన కుటుంబానికి నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే బదులు.. బతికేందుకు అవకాశం ఉన్న తనకు సాయం చేయాలని, తన కుటుంబాన్ని తానే పోషించుకుంటానని ఆయన దీనంగా వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్స్గ్రేషియాపై విమర్శలు డిప్యూటీ జైలు సూపరిడెంట్గా పని చేస్తున్న హర్జిందర్ సింగ్.. భార్య వదిలేసి పోవడంతో ముగ్గురు పిల్లలను ఆయనే పోషిస్తున్నారు. ఏప్రిల్ నెలలో కొవిడ్ బారినపడి కోలుకున్నారు. లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ కోసం 80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అంత ఖర్చు ఇవ్వడానికి వీల్లేదు. చనిపోయాక యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తారు. దీంతో సాయం గురించి ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్ సోదరుడిని తిప్పించుకున్నారు. ఈ తరుణంలో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయన వీడియో ద్వారా వేడుకున్నాడు. Grateful to Punjab CM @capt_amarinder for supporting the treatment of DSP Harjinder Singh, after his recovery from #COVID...1/2 — DGP Punjab Police (@DGPPunjabPolice) June 2, 2021 మూడువారాల తర్వాత.. ఇక ఈ వీడియోపై రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సిన్సియర్ ఉన్నతాధికారి రక్షించుకోలేని చేతకాని ముఖ్యమంత్రి అంటూ.. అమరిందర్ సింగ్పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. కొందరు నెటిజన్స్ ఈ విమర్శలకు మద్ధతు తెలపడంతో ప్రభుత్వం దిగొచ్చింది. డీఎస్పీ ట్రీట్మెంట్కు అవసరమయ్యే సాయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని డీజీపీ దిన్కర్ గుప్తా ట్వీట్ చేశారు. హర్జిందర్ సింగ్కు డిపార్ట్మెంట్ తరపున లూథియానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించబోతున్నట్లు, ట్రాన్స్ఫ్లాంట్ కోసం హైదరాబాద్ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్ అగర్వాల్ ప్రకటించారు. చదవండి: సీఎంని కదిలించిన పిల్లాడు -
పాక్లో హిందూ డిఎస్పీ
కొద్ది రోజుల క్రితం వరకు మనీషా రూపిత కరాచీలోని జిన్నా పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్లో వైద్యురాలు. ఇప్పుడు ఆమె సిం«ద్ ప్రావిన్సులోని జకోబాబాద్ జిల్లా డిఎస్పీ! ‘డీఎస్పీలు వస్తుంటారు పోతుంటారు’ అనుకోవచ్చు. ఇక్కడ అలా అనుకోడానికి లేదు. పాకిస్తాన్లోనే తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూపిత! అయితే.. సర్వీస్ కమిషన్ విజేతగా సింద్ ప్రావిన్స్లోని హిందూ మహిళలకు తననొక ప్రతినిధిగా రూపిత భావించడం లేదు. సింద్ గ్రామీణ మహిళలందరికీ తన విజయం ఒక ప్రేరణ అవాలని మాత్రమే కోరుకుంటున్నారు! ‘సింద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ (ఎస్పీఎస్సీ) పరీక్షలో ర్యాంక్ సంపాదించి, ఈ ఘనతను సాధించారు రూపిత. మొదట ఆమె ‘సెంట్రల్ సుపీరియర్ సర్వీసు’ (మన దగ్గర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) రాశారు. అదొక్కటే అత్యున్నతస్థాయి ఉద్యోగాలకు మార్గం అనుకున్నారు. ఆ తర్వాతే ఆమెకు.. సిం«ద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ర్యాంకు సాధించినా కూడా డైరెక్టు నియామకాలు ఉంటాయని తెలిసింది. పట్టుపట్టి బుక్స్ ముందు వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు డీఎస్పీ సీట్లో కూర్చోబోతున్నారు. నియామక ఉత్తర్వులు అందాయి. బాధ్యతలు చేపట్టడమే తరువాయి! మనీషా రూపిత, పాక్ పోలీస్ దళం ఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడై, ర్యాంకు సాధించి, డీఎస్పీ అయ్యాక గానీ రూపిత పాకిస్తాన్లోనే మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీ అన్న సంగతి ఎవరి దృష్టికీ రాలేదు. పాకిస్తాన్లో కపిల్ దేవ్ అనే ఒక హక్కుల కార్యకర్త ‘ప్రథమ’ అనే ప్రత్యేకత కలిగిన ఈ నియామకం గురించి తన ట్విట్టర్లో వెల్లడించడంతో రూపితకు అభినందనలు మొదలయ్యాయి. ‘‘పాకిస్తాన్లోని హిందువులందరికీ ఇది గర్వకారణం’’ అని ఆయన ట్వీట్ చేశారు. రూపిత జకోబాబాద్లో బల్లో మాల్ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్ సెంటర్లో మెడికల్ థెరపీ డాక్టర్గా పని చేస్తున్న రూపిత కు కంబైండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ (సి.సి.ఇ) అయిన ఎస్పీఎస్సీ రాసి గవర్నమెంట్లో డైరెక్ట్ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా డాక్టర్గా సేవలు అందిస్తూనే సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంకుతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ‘‘అయితే ఇదేమీ అంత తేలికైన ప్రయాణం కాదు. 2007 నాన్నగారు చనిపోయారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయాం. అయినా అమ్మ మా చదువును మాన్పించలేదు’’ అంటారు రూపిత. ఫీజులు, సర్వీస్ కమిషన్ పరీక్ష పుస్తకాలు కొనడం కోసం ఆమె ట్యూషన్ లు చెప్పారు. ‘‘గెలిచింది నేనే అయినా గెలిపించింది మా అమ్మే. ఆమె కలను నేను నెరవేర్చగలిగాను. అదే నా సంతోషం’’ అంటున్నారు రూపిత. తన విజయం సింద్లోని గ్రామీణ మహిళలందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని ఆమె ఆశిస్తున్నారు. -
డీఎస్పీగా హిమా దాస్ నియామకం
డిస్పూర్: భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్ను అస్సాం ప్రభుత్వం ఉన్నతోద్యోగంతో గౌరవించింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పదవిలో నియమించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో 21 ఏళ్ల హిమా దాస్కు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నియామక పత్రాలు అందజేశారు. 2018లో ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో హిమా 400 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచింది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం సాధించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Welcome Aboard! Heartiest Congratulations to @HimaDas8 and all 597 newly selected Sub Inspectors of Assam Police. Together, we'll write a new saga of people friendly policing in the State, to serve the citizens of Assam.@CMOfficeAssam @DGPAssamPolice#SIsRecruitment pic.twitter.com/KBeFUGHLuW — Assam Police (@assampolice) February 26, 2021 -
డీఎస్పీగా హిమదాస్
భారత యువ అథ్లెట్ హిమ దాస్ను ప్రోత్సహిస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఉద్యోగం ఆఫర్ చేసింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన ఈ అమ్మాయి ప్రస్తుతం 400 మీటర్ల పరుగు జూనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్ కూడా. -
స్ప్రింటర్ హిమదాస్కు డీఎస్పీ కొలువు
గౌహతి: స్టార్ స్ప్రింటర్ హిమదాస్ను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. లీస్, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించడం ద్వారా రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరి విలేకరులకు తెలిపారు. అసోం పోలీస్ విభాగంలో డీఎస్పీ ర్యాంకు అధికారిగా హిమదాస్ను.. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల ఈ అస్సామీ స్టార్ స్పింటర్ 2018లో అద్భుతంగా రాణించింది. ఫిన్లాండ్లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్షిప్ 400మీ.ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్గా నిలిచింది. ఇదే చాంపియన్షిప్లో 4*400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 చాంపియన్ షిప్స్లో గ్లోబల్ ట్రాక్ ఈవెంట్ ఏదైనా ఫార్మాట్లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్గా రికార్డు సాధించింది. -
కామారెడ్డి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
-
కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బెట్టింగ్ కేసులో నిందితుల నుంచి కామారెడ్డి సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్ డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో డీఎస్పీని కూడా విచారించారు. అయితే బెట్టింగ్ కేసులో లక్ష్మీ నారాయణ ప్రమేయం లేదని తేలినప్పటికీ, ఆయన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ విచారణ చేపట్టింది. దీంతో ఆయనను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిచించారు. చదవండి: ఎస్ఐ గోవింద్పై సస్పెన్షన్ వేటు చదవండి: కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు! -
వైద్య వృత్తిని వదిలి డీఎస్పీగా..
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఆయన ఒక డాక్టర్.. గిరిజనుల సమస్యలకు చలించిపోయారు.. వైద్యవృత్తిని నిర్వహిస్తూనే వారి సమస్యల పరిష్కారానికి కృషిచేశారు.. ఈ సమయంలో గిరిజనులు చూపించిన ఆప్యాయతతో వైద్య వృత్తి నుంచి అడ్మినిస్ట్రేటివ్ వైపు మరిలారు.. పాలనా విభాగంలో ఉంటే మరిన్ని సమస్యలు పరిష్కరించవచ్చనే తలంపుతో గ్రూప్–1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యారు. తన ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు. వైద్యుడిగా పేర్గాంచి.. జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బి.రవికిరణ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయన డీఎస్పీగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్గా జంగారెడ్డిగూడెం వచ్చారు. వృత్తిరీత్యా ఈయన డాక్టర్. 2002–2008లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2010లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రిలో విధుల్లో చేరారు. అక్కడ 2014 వరకు విధులు నిర్వహించి, తర్వాత అదే జిల్లా అక్కులపేట పీహెచ్కీ బదిలీ అయ్యారు. వైద్యాధికారిగా పీహెచ్సీని ఆధునీకరించారు. కార్పొరేట్ ఆస్పత్రి స్థాయిలో పీహెచ్సీని మార్పు చేసి వైద్య సేవలు అందించారు. 2016, 2017లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఆస్పత్రి, ఉత్త వైద్యులుగా రవికిరణ్ పురస్కారాలు అందుకున్నారు. 2017, 2018లో విశాఖలో పనిచేశారు. బీజం పడిందిలా.. రవికిరణ్ అక్కులపేట పీహెచ్సీలో పనిచేస్తుండగా గిరిజనుల సమస్యలు గుర్తించారు. అల్లిపల్లిగూడెం గిరిజనులు, గిరిజనే తరులు మధ్య భూవివాదాలు గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేశారు. అప్పుడే ఆయనకు అడ్మినిస్ట్రేటర్ కావాలనే ఆలోచన వచ్చింది. 2016లో గ్రూప్–1కు రాయగా 2017 ఫలితాలు వచ్చాయి. రవికిరణ్ 12వ ర్యాంకు సాధించారు. దీంతో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్గా జంగారెడ్డిగూడెం వచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ ముఖ్యం సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయం అని డీఎస్పీ రవికిరణ్ అన్నారు. తాను చేపట్టాల్సిన పనులపై విజన్ ఉందని, ప్రధానంగా సైబర్, ఆర్థిక నేరాలు, బాలలు, స్త్రీల వేధింపుల కేసులపై దృష్టి, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో సబ్డివిజన్లో శాంతిభద్రత పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామన్నారు. యువతను సామాజిక సేవ, క్రీడలు, సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పిస్తామన్నారు. సీఎం పిస్టల్ అందుకుంటూ.. డీఎస్పీగా ఎంపికైన రవికిరణ్ 2018లో అనంతపురంలో శిక్షణ పొందారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సీఎం పిస్టల్ అవార్డును అందుకున్నారు. శిక్షణలో ఆల్రౌండర్గా నిలిచి హోంమంత్రి, డీజీపీ చేతుల మీదుగా పురస్కారం పొందారు. అథ్లెటిక్స్లో రాణించి.. శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చెందిన రవికిరణ్ తండ్రి రాధాకృష్ణ, తల్లి విజయకుమారి. ఆయన భార్య విశాఖలోని మెప్మా జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. రవికిరణ్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రవికిరణ్ ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో అథ్లెటిక్స్లో రాణించారు. లాంగ్ జంప్, హైజంప్, పరుగు పోటీల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో 73 వరకు పతకాలు సాధించారు. మొత్తంగా 126 వరకు ఆయన పతకాలు పొందారు. -
ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి: శ్రావణి
లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండడంతోపాటు.. అందుకు తగ్గట్టుగా సాధన చేస్తే ఉన్నత శిఖరాన్ని చేరుకోవడం ఖాయమని పాలకొండ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి అన్నారు. కృషి.. పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. 2018 గ్రూప్–1 బ్యాచ్కు చెందిన ఈమె అప్పటి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 14, మహిళా విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలుత కృష్ణా జిల్లా బందర్ సబ్డివిజన్ ఇన్చార్జి డీఎస్పీగా విధులు నిర్వహించిన శ్రావణి ఈ నెల 19న పాలకొండ పోలీస్ సబ్డివిజన్ అధికారిగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆమెను కలిసిన ‘సాక్షి’తో ముచ్చటించారు. – పాలకొండ రూరల్ సాక్షి: మీ కుటుంబ నేపథ్యం? డీఎస్పీ: మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. హైదరాబాద్లో స్థిరపడ్డాం. అక్కడ బీఈ ఎలక్ట్రానిక్స్ చదివా. తండ్రి గాంధీ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శేషపద్మ గృహిణి. నాకో సోదరుడు ఉన్నారు. సాక్షి: పోలీస్ శాఖను ఎంచుకోవడంలో ఉద్దేశం? డీఎస్పీ: మిగాతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే పోలీస్ శాఖ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్స్కు సిద్ధమై విజయం సాధించాను. సాక్షి: భవిష్యత్ లక్ష్యాలు? డీఎస్పీ: ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి వచ్చాను. అన్నివర్గాల ప్రజలకు చట్టం సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. భవిష్యత్లో ఎక్కడ విధులు చేపట్టినా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓ ఉద్యోగిగానే కాకుండా ప్రజలు మెచ్చిన అధికారిగా ఉంటా. సాక్షి: పాలకొండలో తొలి పోస్టింగ్ కదా.. ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు? డీఎస్పీ: ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల భద్రత, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాను. ఏజెన్సీ కలబోసి ఉన్న ఈ సబ్డివిజన్లో సారా అమ్మకాలు, తయారీపై కఠినంగా వ్యవహరిస్తా. సమస్యల పరి ష్కారం కోరి వచ్చిన వారితో గౌరవంగా సిబ్బంది మెలి గేలా చొరవ తీసుకుంటా. ట్రాఫిక్ సమస్యను గాడిలో పెట్టేందుకు ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై అపోహలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా. సాక్షి: ఈ సబ్డివిజన్లో ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతాలున్నాయి. మావోల ప్రభావం కూడా ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఎస్పీ: సరిహద్దు గ్రామాల వద్దగల చెక్ పోస్టులు మరింత పటిష్టంగా నిర్వహిస్తాం. గస్తీ, ముందస్తు సమాచార సేకరణపై దృష్టిసారిస్తా. మా పరిధిలో గల పోలీస్ స్టేషన్లను పరిశీలించి, లోపాలు గుర్తించి ఉన్నతాధికారుల సూచనలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నాకు తెలిసి మావోయిస్టుల ప్రభావం గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం లేదు. సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎటువంటి చర్యలు చేపడతారు? డీఎస్పీ: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరించనుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపడతాం. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని ముందుగానే బైండోవర్ చేస్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తాం. సాక్షి: నేటితరం యువతకు, ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు? డీఎస్పీ: యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. లక్ష్యం కోసం కృషిచేస్తే కోరుకునే ఆనందం దక్కుతుంది. ఆ లక్ష్యం చేరుకున్నప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుంది. కన్నవారు సంతోషిస్తారు. ఈ ప్రాంత ప్రజలకు శాఖా పరంగా అందుబాట్లో ఉంటా. ఏ సమస్య ఉన్నా నేరుగా కలిసి తెలియజేయవచ్చు. -
నాగలి పట్టిన కుర్రాడు.. నేడు డీఎస్పీ
సాక్షి, ప్రొద్దుటూరు: ఆ యువకుడు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.. వారికున్న కొద్దిపాటి పొలంలో వ్యవసా యం చేసి కష్టపడి తల్లిదండ్రులు బాగా చదివించారు.. తన అభ్యున్నతి కోసం తండ్రి పడిన కష్టాలను చిన్నప్పటి నుంచి కళ్లారా చూశాడు ఆ యువకుడు. కుటుంబ పరిస్థితులు అతడిలో కసిని పెంచాయి. బాగా చదివి పది మందికి సాయం చేసే ఉద్యోగం పొందాలి... తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఎంతో క్రమశిక్షణ.. అంతకు మంచి నిబద్ధతతో చదివాడు. నాడు నాగలి పట్టిన విజయనగరం కుర్రాడు నేడు లాఠీ పట్టాడు. ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏగిరెడ్డి ప్రసాదరావు గురించి ఆయన మాటల్లోనే.. రైతు కుటుంబం నుంచి... విజయనగరం జిల్లాలోని పార్వతీపురం సమీపంలో ఉన్న గుణానుపురం మా స్వగ్రామం. తల్లిదండ్రులు మహాలక్ష్మి, సత్యంనాయుడు. మేము ఇద్దరం అన్నదమ్ములం. మా అన్న శంకర్రావు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే మాకు జీవనాధారం. కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి మా తల్లిదండ్రులు మా ఇద్దరినీ చదివించారు. మేము నాన్నతో పాటు పొలం పనులు చేసేవాళ్లం. మా ఊళ్లోని ప్రభుత్వ హైస్కూళ్లో 10వ తరగతి వరకు చదివాను. విజయవాడలోని గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశా ను. గౌహతిలోని ఐఐటీలో డిగ్రీ చదివాను. తర్వాత హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. కుటుంబ పరిస్థితుల ప్రభావంతో సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను, గ్రూప్స్లో మంచి ర్యాంక్ రావడంతో ఇష్టమైన పోలీసు శాఖలో చేరాను. 2018 బ్యాచ్లో డీఎస్పీగా ఎంపికై అనంతపురంలోని పీటీసీలో శిక్షణ పొందాను. డి్రస్టిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిగా వైఎస్సార్ జిల్లాలోనే చేశాను. రాయచోటి, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందులలో ట్రైనీ డీఎస్పీగా విధులు నిర్వర్తించా ను. అందువల్ల జిల్లాపై మంచి అవగాహన ఉంది. చట్టపరిధికి లోబడి పని చేస్తా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారనే భావన చాలా మందిలో ఉంది. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి చెప్పుకోవచ్చు. నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ మా విధానం. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారు. సబ్డివిజన్లోని అన్ని గ్రామాలు తిరిగి స్వయంగా సమస్యలు తెలుసుకుంటాను అని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. -
తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయింది వీరే కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్ బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్ సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి పంజాగుట్ట ఏసీపీగా గణేష్సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్ శంషాబాద్ ఏసీపీగా భాస్కర్ బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావు బదిలీ -
'ఆట కంటే డ్యూటీనే కష్టంగా ఉంది'
హిసార్ : 'క్రికట్ కంటే నాకు ఈ పోలీస్ డ్యూటీనే కష్టంగా ఉందంటూ' 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ పేర్కొన్నాడు. జోగిందర్ శర్మ క్రికెట్కు దూరమైన తర్వాత హర్యానాలోని హిసార్ జిల్లా డీఎప్పీగా విధుల నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. జోగిందర్ కూడా అందరి పోలీసుల్లాగే డీఎస్పీగా కరోనా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాను 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నానని జోగి చెప్పుకొచ్చాడు. ఆటతో పోలిస్తే ఈ డ్యూటీ కొంచెం కష్టంగానే అనిపిస్తున్నప్పటికి తాను దేశం కోసమే సేవ చేస్తుండడంతో బాధ అనేది లేదని పేర్కొన్నాడు. (ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ అవసరమా?) 'పొద్దున ఉదయం 6గంటలకు లేవడంతో నా డ్యూటీ మొదలవుతుంది. రోజూ ఉదయం 9గంటలకు డ్యూటీ నిమ్మిత్తం వెళ్లి రాత్రి 8గంటల తర్వాత కూడా ఎమర్జెన్సీ కాల్స్ ఉండడంతో 24 గంటల పాటే విధులు నిర్వహిస్తున్నా. నా పరిధిలో హిసార్ జిల్లా రూరల్ భాగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతీరోజు చెక్పోస్ట్ వద్ద నిలబడి బస్ డ్రైవర్లకు, ప్రైవేటు వాహనాలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి.. అవసరం ఉంటేనే బయటికి రండి అని సూచిస్తున్నాం. ఇంకా కొన్ని సందర్భాల్లో దేశంలో లాక్డౌన్ ఉండడంతో యూపీ, బీహార్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కాలి నడకన వారి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. నేను నా టీంతో కలిసి వారిని ఆపి కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలిస్తున్నాం. ఇదంతా కష్టంగా అనిపిస్తున్నా దేశంకోసమే చేస్తున్నాననుకొని సరిపెట్టుకుంటున్నా. నా కుటుంబంతో కలిసి రోహ్తక్లో నివసిస్తున్న నాకు హిసార్ ప్రాంతం 110 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నా.. డ్యూటీ నేపథ్యంలో రోజుకు ఎంతోమందిని కలవడంతో ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.(నెట్వర్క్ కోసం చెట్లు ఎక్కుతూ అంపైర్ పాట్లు!) 2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ అద్భుతమైన బౌలింగ్తో భారత్ను గెలిపించాడు. దీంతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయిన జోగిందర్ 2018లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్లో అందించిన సేవలకుగానూ హర్యానా ప్రభుత్వం అతన్ని డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమించిన విషయం తెలిసిందే. జోగిందర్ శర్మ టీమిండియా తరపున 4 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 6వేలకు పైగా చేరుకోగా, మృతుల సంఖ్య 206కు చేరింది. -
కరోనా: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు
సాక్షి, కొత్తగూడెం: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని కొత్తగూడెం డీఎస్పీ క్వారైంటన్లో పెట్టకుండా తీసుకెళ్లాడు. దీంతో అతనిపై 1897 అంటువ్యాధుల నిర్మూలన చట్టం కింద కేసు నమోదైంది. అయితే, లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో కొత్తగూడెం పోలీసు యంత్రాంగంలో కలవరం మొదలైంది. డీఎస్పీతో సహా అతని కుంటుంబాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు వరంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, డీఎస్పీ కుంటుంబం ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది. (చదవండి: బయటకు వచ్చే సాహసం చెయ్యొద్దు: సీపీ సజ్జనార్) సర్కార్ కొరడా.. క్వారంటైన్లో ఉండకుండా తప్పించుకు తిరుగుతున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లఘించిన 60 మందిపై 1897 ఎపిడెమిక్ డిజీజ్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి ఇళ్లనుంని బయటికి వచ్చే వారిని ఉపేక్షించొద్దని స్పష్టం చేసింది. (చదవండి: తెలంగాణలో ఒక్కరోజే 6 పాజిటివ్ కేసులు: ఈటల) -
మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: డీఎస్పీ
సాక్షి, గుంటూరు: రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తే వారికి జోలికి వెళ్లం.. కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోమని తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రైతుల ముసుగులో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. వారి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. నిన్న(గురువారం) రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తే డ్రోన్ ఆపరేట్ చేశామని పేర్కొన్నారు. అయితే డ్రోన్ను కిందకు దించే సమయంలో ఆపరేటర్పై దాడి చేసి డ్రోన్ను ఎత్తుకెళ్లారని ఆయన తెలిపారు. అయితే డ్రోన్ల ద్వారా మహిళలు స్నానం చేసే విజువల్స్ను పోలీసులు తీసుక్నునారంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాశారన్నారు. అంతేగాక గతంలో కూడా ఓ మహిళను కాలితో తన్నినట్లు తప్పుడు వార్తలు రాశాని తెలిపారు. ఇక రైతులను రెచ్చగొడుతున్న జేఎసీ నాయకుడు పువ్వాడ సుధాకర్ను అరెస్టు చేసే పయత్నం చేశామని, కానీ మహిళా రైతులు అడ్డుపడటంతో అరెస్ట్ చేయలేకపోయామన్నారు. హోంమంత్రి, డీజీపీలు సచివాలయానికి వస్తుంటే ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డుపెట్టిన వారిపై కేసు పెట్టామన్నారు. ఎమ్మెల్యే రోజాను కూడా అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా రైతులు తమకు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. -
నన్ను మరో జైలుకు పంపండి
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దవీందర్ సింగ్ తనను మరో జైలుకు మార్చాలంటూ.. జమ్మూలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించారు. తను గతంలో అరెస్ట్ చేసిన పులువురు ఉగ్రవాదులు కోట్బాల్వాల్ జైలులో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారితో తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు విన్నవించుకున్నారు. తనను కోట్బాల్వాల్ జైలు నుంచి హీరానగర్ జైలుకు పంపించాలని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని దవీందర్ అభ్యర్థించారు. కాగా దవీందర్ అభ్యర్థనకు కోర్టు అనుమతిస్తూ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: ఉగ్రవాద డీఎస్పీ దవీందర్ సింగ్! ఇక పదిరోజుల పాటు జమ్మూకశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న దవీందర్ను.. దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ 15 రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం దవీందర్ను రిమాండ్కి పంపించింది. కాగా డీఎస్పీ దవీందర్ సింగ్ కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ జనవరి 11న పోలీసులకు చిక్కిన విషయం విదితమే. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు తన ఇంట్లో ఆశ్రయించి కల్పించినందుకు పోలీసులు దవీందర్ సింగ్ను ఆరెస్ట్ చేశారు. -
ఉగ్ర ఖాకీ!
చుట్టూ ఉన్న వాస్తవాలను గమనిస్తూ, తమ ఊహాశక్తికి పదనుపెట్టి, ఆ వాస్తవాలకు కాల్పనికత జోడిస్తారు సృజనాత్మక రచయితలు. కానీ ఒక్కోసారి వాస్తవం కాల్పనికతను మించిపోతుంది. ఎవరి ఊహలకూ అందనంత దిగ్భ్రాంతికరంగా వుంటుంది. జమ్మూ–కశ్మీర్లోని శ్రీనగర్ విమానాశ్రయ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తూ, గత ఆగస్టు 15న రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా పొందిన డీఎస్పీ దేవిందర్ సింగ్ కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ శుక్రవారం పోలీసులకు చిక్కిన ఉదంతం ఇటువంటిదే. నవీద్ బాబా ఇటీవలికాలంలో ఎందరో అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు. అలాంటివారికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలోని తన ఇంట్లో ఆశ్రయమివ్వడం ఊహకందదు. పంజాబ్లో మిలిటెన్సీ తీవ్రంగా వున్నప్పుడు కూడా ఉగ్రవాదులకు కొందరు పోలీసు అధికారులు సహకరించిన వైనం బట్టబయలైంది. కానీ ఆ ఉదంతాలకు లేని ప్రాముఖ్యత ఇప్పుడు దీనికి రావడానికి ముఖ్యమైన కారణం వుంది. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అరెస్టయిన నిందితుల్లో ఒకడైన అఫ్జల్ గురు అప్పట్లో తన న్యాయవాది సుశీల్కుమార్కు రాసిన లేఖలో తొలిసారి దేవిందర్ పేరు ప్రసావించాడు. తనను ఈ రొంపిలోకి లాగింది ఆయనేనని ఆ లేఖలో అఫ్జల్ గురు నేరుగా చెప్పాడు. కానీ అప్పట్లో అతని మొర ఆలకించినవారు లేరు. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం అఫ్జల్ గురును దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. 2005 ఆగస్టులో అతని ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయగా, 2013 ఫిబ్రవరి 9న అతన్ని ఉరితీశారు. పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగాక న్యాయ ప్రక్రియంతా ముగిసి ఉరిశిక్ష ఖరారు కావడానికి నాలుగేళ్ల సమయం పడితే, అతని క్షమాభిక్ష పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి మన రాజకీయ నాయకత్వానికి దాదాపు ఎనిమిదేళ్ల వ్యవధి కావలసివచ్చింది! దురదృష్టమేమంటే... ఏ దశలోనూ అతను ప్రస్తావించిన దేవిందర్పై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటో ఎవరూ పట్టించు కోలేదు. అఫ్జల్ గురు అఫిడవిట్లో దేవిందర్ సింగ్ పేరు ప్రస్తావించినప్పుడు బాధ్యతగల ప్రభుత్వం లోతుగా ఎందుకు దర్యాప్తు చేయించలేదన్నది కీలకమైన ప్రశ్న. ఏ నేరంలోనైనా సంశయానికి తావులేని స్థాయిలో ప్రమేయం ఉన్నదని రుజువైనప్పుడే నిందితుడికి న్యాయస్థానాలు శిక్ష విధి స్తాయి. ఉరిశిక్ష విధించినప్పుడైతే ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. అఫ్జల్ విషయంలో అది జరగలేదని నిర్ద్వంద్వంగా చెప్పలేం. ఎందుకంటే పార్లమెంటుపై ఉగ్రవాద దాడికి పాల్పడి, భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన మహమ్మద్ను కశ్మీర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిందీ, అతను పాత కారు కొనుక్కోవడానికి సాయపడిందీ అఫ్జలే. అతనితోపాటు తాను కూడా ఆ కారులో ప్రయాణించి ఢిల్లీలోనే వేర్వేరు వ్యక్తులను కలిశామని కూడా అఫ్జల్ అంగీకరించాడు. ఆ పాత కారులోనే ఉగ్రవాదులు పార్లమెంటుకొచ్చి దాడి చేశారు. అందులో పాల్గొన్న అయిదుగురు ఉగ్ర వాదులూ మరణించగా, కారు నంబర్ ఆధారంగా దాన్ని కొన్నదెవరో పోలీసులు తెలుసు కోగలిగారు. పోలీసులు ప్రశ్నించినప్పుడు అదనంగా అఫ్జల్ ఇంకేమి చెప్పాడన్నది అలావుంచితే, ఉరిశిక్ష పడ్డాక అతను దేవిందర్ పేరును ప్రస్తావించి, ఆయన తనను చిత్రహింసలకు గురిచేశాడని, చివరకు మహమ్మద్ను పరిచయం చేసి, అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లమన్నాడని అఫ్జల్ గురు ఆరోపిం చాడు. అతను మరో ముఖ్య విషయం చెప్పాడు. మహమ్మద్ను కశ్మీర్ వాసిగా దేవిందర్ పరిచయం చేసినా, అతని ముఖకవళికలు అలా అనిపించలేదని, అతనికి కశ్మీరీ భాష కూడా రాదని, కానీ విధిలేక ఆ అధికారి చెప్పినట్టల్లా చేశానని తెలిపాడు. అప్పట్లో కశ్మీర్ పోలీసులు ఈ ఆరోపణను కొట్టిపారేశారు. కేసు నుంచి తప్పించుకోవడానికి అఫ్జల్ నాటకమాడుతున్నాడని చెప్పారు. అఫ్జల్ నేర ప్రమేయంపై వారికి నమ్మకం ఏర్పడటాన్ని తప్పుబట్టనవసరం లేదు. కానీ ఒక నిందితుడు అంత వివరంగా దేవిందర్ గురించి చెబుతున్నప్పుడు కాస్తయినా సంశయం కలగొద్దా? ఇది అఫ్జల్ కోసం కాదు...తమలో ఒకడిగా వున్న అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు వాటి నిజానిజాలు నిర్ధారించడం అత్యవసరమని అనిపించలేదా? పోనీ ఇలా ఒక అధికారిపై ఆరోపణలు రావడం కశ్మీర్లో మొదటి సారి కావచ్చునేమోగానీ, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ వంటిచోట్ల అంత క్రితం బయటపడలేదా? సైన్యంలో పనిచేస్తూ గూఢచర్యానికి పాల్పడినవారిని పట్టుకున్న ఉదం తాలు లేవా? ఏ ఉద్దేశంతో అప్పట్లో దేవిందర్సింగ్ పాత్రపై దర్యాప్తు చేయలేదన్నది ఇప్పుడు తేల వలసివుంది. అలా దర్యాప్తు చేసివుంటే, ఎన్నో దిగ్భ్రాంతికర అంశాలు బయటపడేవి. వందల మంది ప్రాణాలు కాపాడటం, ఆస్తుల విధ్వంసాన్ని నివారించడం సాధ్యమయ్యేది. అఫ్జల్ ప్రస్తావించడానికి చాలా ముందే దేవిందర్సింగ్ వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డాడు. మిలిటెన్సీని సమర్థవంతంగా అదుపు చేసినందుకు ఆరేళ్ల వ్యవధిలో ఎస్ఐ నుంచి డీఎస్పీ దాకా ఎదిగాడు. కానీ తన పరిధిలో లాకప్ మరణాలు జరగడంతో మళ్లీ వెనక్కు పంపారు. అనంతరకాలంలో చాలా త్వరగానే కోల్పోయినదాన్ని సాధించుకున్నాడు. అఫ్జల్ను ప్రశ్నించడం, చిత్రహింసలు పెట్టడం వాస్తవమేనని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో దేవిందర్ అంగీకరించాడు. ఏ ఉగ్రవాద ఘటనైనా స్థానికంగా వుండేవారి తోడ్పాటులేనిదే సాధ్యం కాదు. ఇప్పుడు ఎటూ పార్లమెంటు దాడి కేసులో తిరిగి దర్యాప్తు జరుగుతుంది. ఇన్నేళ్లుగా దేవిందర్ సింగ్ ఎలాంటి ఘోరాలకు ఒడిగట్టాడో తేలుతుంది. కనీసం ఇకముందైనా నేరాల దర్యాప్తునకు, ముఖ్యంగా ఉగ్ర వాద నేరాల దర్యాప్తునకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలేమిటో, సూక్ష్మ స్థాయి అంశాలపై సైతం ఎంత తీక్షణమైన దృష్టి సారించాలో, ఎందుకు సారించాలో మన దర్యాప్తు విభాగాలు గ్రహిం చగలిగితే అది దేశ భద్రతకు ఎంతగానో మేలుచేస్తుంది. -
‘వర్షిత హత్య కేసులో రీకన్స్ట్రక్షన్’
చిత్తూరు, మదనపల్లె: కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని చేనేతనగర్ కల్యాణ మండపంలో ఇటీవల జరిగిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసును రీకన్స్ట్రక్షన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ రవిమనో హరాచారి తెలిపారు. సోమవారం ఆయన వర్షిత పోస్టుమార్టం విషయమై స్థానిక జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. హత్యాచారం కేసులో నిందితుడిపై ఆధారాలు బలంగా ఉన్నాయన్నారు. నిందితునికి కఠిన శిక్ష తప్పదన్నారు. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, పోర్టుమార్టం నివేదికలు రావడంతో కేసుకు మరింత బలం చేకూరిందన్నారు. కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన తీర్పు వచ్చేలా చూస్తామన్నారు. డీఎస్పీ వెంట మదనపల్లె రూరల్ సీఐ అశోక్కుమార్ తదితరులు ఉన్నారు. చదవండి: వర్షిత కేసు; ‘నిందితుడిని ఉరి తీయాలి’ చదవండి: వర్షిత హంతకుడు ఇతడే! -
అవినీతి నిర్మూలనెట్లా?
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు అవినీతి నిరోధకశాఖ ఆధ్వర్యంలో కేవలం మూడంటే మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2015 సంవత్సరం కంటే ముందు కరీంనగర్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఏసీబీ పనిచేసేది. అప్పట్లో డబుల్ డిజిట్లో కేసులు నమోదు కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ ఏసీబీ అప్గ్రేడ్ అయి డీఎస్పీ పోస్టు కేటాయించిన తర్వాత వరుస సంవత్సరాల్లో కేసులు కేవలం ఇతని పేరు గణపతివార్ వెంకట్రాజు. బేల మండలం సాంగిడి గ్రామం. 2013 సంవత్సరంలో ఓ అధికారి అవినీతిపై ఏసీబీని ఆశ్రయించి అతన్ని పట్టించేలా చేశాడు. ఈ కేసు తర్వాత రాజుపై భూ సంబంధిత వ్యవహారంలో ఓ అధికారిపై దౌర్జన్యం చేసిన కేసు నమోదైంది. దీనిపై ఐదేళ్ల పాటు పోరాడి దాని నుంచి బయట పడ్డాడు. ఇతనికి సహాయపడ్డ ఓ న్యాయవాదిపై కూడా కేసు నమోదైంది. బాధితుడి తల్లిదండ్రులను కూడా ఓ కేసులో ఇరికించారు. అవినీతికి పాల్పడిన ఒక్క అధికారిని ఏసీబీకి పట్టిస్తే తనకు ఇన్ని శిక్షలా అని ఆయన మదనపడే పరిస్థితి. సింగిల్ డిజిట్కే పరిమితం కావడం గమనార్హం. అయితే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ డీఎస్పీ పోస్టు భర్తీ చేయకపోవడం, కరీంనగర్ డీఎస్పీకే ఆదిలాబాద్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది. గత ఐదారు నెలలుగా ఆయన ఇన్చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక పైన పేర్కొన్నట్లు ఎవరైన బాధితుడు అవినీతికి వ్యతిరేకంగా అధికారులపై ఏసీబీని ఆశ్రయించిన తర్వాత జరుగుతున్న పరిణామాలకు కూడా బాధితుడి పరంగా ఎలాంటి స్వాంతన లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. ∙ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీబీ శాఖ కార్యాలయంలో ప్రస్తుతం కరీంనగర్ డీఎస్పీ ఇన్చార్జిగా ఉండగా, సీఐలుగా ప్రశాంత్, నర్సింహ వ్యవహరిస్తున్నారు. ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. నలుగురు కానిస్టేబుల్ పోస్టులకు గాను ఒకరు మాత్రమే ఉన్నారు. మూడు హోంగార్డు పోస్టులకు ముగ్గురు పనిచేస్తున్నారు. 2015లో ఆదిలాబాద్ ఏసీబీని అప్గ్రేడ్ చేస్తూ డీఎస్పీ పోస్టు కేటాయించారు. మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్తోపాటు ఆదిలాబాద్ జిల్లాలో దీని పరిధి విస్తరించి ఉంది. ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలోనూ వెనకబడడం కూడా కేసులు పెరగకపోవడానికి ఓ కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. డిసెంబర్లో ఏసీబీ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు మినహాయిస్తే ఏడాది పొడవున ఎలాంటి ఉలుకు పలుకు ఉండదు. దీంతో శాఖ పరమైన ప్రభావం కనిపించదు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ 2018 యాక్ట్ ప్రకారం ఏసీబీ కేసుల్లో అదనంగా కొన్ని అంశాలను జోడించడం జరిగింది. దాని ప్రకారం లంచం డిమాండ్ చేసినట్లు రికారి్డంగ్ ఉన్న ఏసీబీ అధికారులు పరిగణలోకి తీసుకొని నిఘా పెట్టే ఆస్కారం ఉంది. ప్రభుత్వ శాఖలో ఒక వ్యవహార నిర్వహణకు సంబంధించి ఎవరైన వ్యక్తికి, అధికారికి మధ్యవర్తిత్వం వహిస్తే అతనిపై కూడా కేసు నమోదు చేసే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ శాఖల వ్యవహారంలో అధికారులు లాడ్జి, హోటళ్లలో గదులు అరేంజ్ చేయమని, విందు ఇవ్వమని చెప్పడం కూడా నేరమే. అలాగే వాహనం ఏర్పాటు చేయాలనడం కూడా నేరం కిందికే వస్తుంది. పని జరిగిన కొంత కాలం తర్వాత కూడా లంచం డిమాండ్ చేయడం నేరమే. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుడు ఏసీబీని ఆశ్రయించవచ్చని అధికారులు తెలుపుతున్నారు. ఇలా చట్టంలో అనేక అంశాలు జోడించినప్పటికీ బాధితులు ముందుకు రాకపోవడం, కేసులు పెరగకపోవడం గమనించదగ్గ విషయం. అవినీతిపై ఫిర్యాదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా టోల్ఫ్రీ నం.1064 ఏర్పాటు చేశాం. దీనికి కాల్చేసి ఫిర్యాదు చేసిన పక్షంలో పైస్థాయిలోనూ వివరాలు నమోదవుతాయి. తద్వారా జిల్లా స్థాయిలో ఏసీబీ అధికారులు కేసుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుంది. గోప్యంగా ఉంచుతాం.. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచి అవినీతి అధికారిపై నిఘా ఉంచి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేస్తాం. ఫిర్యాదు వస్తే కేసులు నమోదు చేయడానికి మేము సిద్ధమే. – భద్రయ్య, ఇన్చార్జి డీఎస్పీ, ఏసీబీ, ఆదిలాబాద్ -
కొత్త డీఎస్పీలకు జీతాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం ఎదురు చూశారు... ఎట్టకేలకు పదోన్నతి పొందారు... పక్షంలో పోస్టింగ్ అనుకున్నారు... రెండు నెలలుగా కనీసం జీతాలు కూడా లేకుండా పని చేస్తున్నారు... ఆగస్టులో ఇన్స్పెక్టర్ నుంచి పదోన్నతి పొందిన డీఎస్పీల పరిస్థితి ఇది. ఇప్పటి వరకు పోస్టింగ్స్ లేకపోవడంతో వీరికి జీతాలు చెల్లించడానికి సాంకేతిక అంశాలు అడ్డు వస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 68 మంది డీఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో కొత్తగా డీఎస్పీలు అయిన వాళ్ళు కేవలం 14 మంది మాత్రమే. మిగిలిన 39 మంది డీఎస్పీలు ఇంకా ఎదురు చూస్తున్నారు. పోలీసు విభాగంలో జీతాల చెల్లింపు అధికారి ఆధారంగా కాకుండా పోస్టు ఆధారంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏ పోస్టు కేటాయించాలన్నా, సృష్టించాలన్నా దానికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఓ అధికారి ఏ పోస్టులో పనిచేస్తుంటే దానికి సంబంధించిన జీతం ఆయనకు అందుతుంది. ఆగస్టు వరకు ఇన్స్పెక్టర్లుగా వివిధ పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన 53 మందికి ఆ నెల 29న పదోన్నతులు వచ్చాయి. వీరిలో 1995తో పాటు 1996 బ్యాచ్కు చెందిన వారూ ఉన్నారు. అప్పటివరకు ఆయా ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్హెచ్ఓ), ప్రత్యేక విభాగాల్లోని పోస్టుల్లో పనిచేసిన వీరిని పరిపాలన పరమైన కారణాల నేపథ్యంలో ఎటాచ్మెంట్ పద్ధతితో అక్కడే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 12న గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉండి, ఆ తర్వాత పోస్టింగ్స్ వస్తాయని అధికారులు భావించారు. అయితే ఆ తర్వాత వరుసగా దసరా, ఆర్టీసీ సమ్మె వంటివి రావడంతో వీళ్ళంతా ఎటాచ్మెంట్ మీదే కొనసాగుతున్నారు. దీంతో ఇన్స్పెక్టర్ పోస్టులో వీళ్ళు లేకపోవడం, డీఎస్పీగా పోస్టింగ్ రాకపోవడంతో జీతాలు చెల్లించడానికి సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో సెప్టెంబర్ నెల జీతాలు అందని వీరికి అక్టోబర్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ పదోన్నతి పొందిన అధికారుల స్థానాల్లో ఇన్స్పెక్టర్లుగా వేరే అధికారుల్ని నియమించారు. దీంతో ఆ పోస్టు కూడా పోయి కేవలం సూపర్ వైజింగ్ ఆఫీసర్లుగా మారిపోయారు. శుక్రవారం 68 మంది డీఎస్పీల బదిలీలు జరిగినా వీరిలో 14 మంది మాత్రమే పదోన్నతి పొందిన అధికారుల్లో ఉన్నారు. మిగిలిన వారంతా గతం నుంచి డీఎస్పీలుగా పనిచేస్తున్న వారే. దీంతో ఆగస్టులో పదోన్నతి పొందిన వారిలో ఇంకా 39 మందికి పోస్టింగ్స్ దక్కలేదు. ఇలా జీతాలకు దూరంగా ఉన్న అధికారులకు పోస్టింగ్ వచ్చిన తర్వాత అక్కడ చేరి పాత జీతం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టింగ్ వచ్చిన 14 మందికీ అక్టోబర్ నెలలో జీతం అందే అవకాశం లేదు. వీరికంటే ఆలస్యంగా ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన సబ్–ఇన్స్పెక్టర్లకు కొన్ని రోజుల్లోనే పోస్టింగ్స్ రావడంతో జీతం ఇబ్బంది తప్పింది. మరోపక్క దాదాపు ఆరు నెలల క్రితం పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు సైతం పోస్టింగ్స్ లేకుండా ఉన్నారు. ఫలితంగా అదనపు డీజీగా పదోన్నతి పొందిన వారు ఐజీ పోస్టులు, డీఐజీగా పదోన్నతి పొందిన వారు ఎస్పీ పోస్టుల్లో కొనసాగుతున్నారు. అయితే వీరికి జీతాల చెల్లింపులో ఇబ్బంది లేదని, తమకు మాత్రం జీతాలు కూడా అందట్లేదని కొత్త డీఎస్పీలు వాపోతున్నారు. చదవండి: 68 మంది డీఎస్పీలకు స్థాన చలనం -
68 మంది డీఎస్పీలకు స్థాన చలనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 68 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న వారు నేరుగా చీఫ్ ఆఫీసర్కు రిపోర్టు చేయాలని సూచించారు. -
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
డోన్ రూరల్ : గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ ఖాదబాషా అన్నారు. మండల పరిధిలోని కోట్లవారిపల్లి, ఎర్రగుంట్ల గ్రామాల్లో సోమవారం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలను భయభ్రాంతుకు గురిచేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదన్నారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మట్కా, పేకాట, మద్యం వంటి వాటికి గ్రామ ప్రజలు దూరంగా ఉండాలన్నారు. గొడవలు సృష్టిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని చెప్పారు. గ్రామాలల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హోటల్, దుకాణాల వారు తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. రూరల్ సీఐ సుధాకర్రెడ్డి, రూరల్ ఎస్ఐ.మధుసుధన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫెయిలే జీవితాన్ని మార్చేసింది
అపజయమే విజయానికి సోపానమంటారు పెద్దలు. అది నిజమేనని నిరూపించారు శివకుమార్ గౌడ్. ఈయనెవరనేదేనా మీ సందేహం. మన జిల్లాకు చెందిన వ్యక్తే. మొదట్లో పరీక్షల్లో ఫెయిలైనా ఆ అపజయాన్నే విజయానికి పునాదిగా మార్చుకుని సక్సెస్ బాట పట్టారు. అంతటితోనే ఆగకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఉన్నతస్థాయిలో నిలబడ్డారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు పరీక్షల్లో తప్పామని కుంగిపోకుండా గుండె నిబ్బరంతో విజయం కోసం తపించాలని శివకుమార్ గౌడ్ పిలుపునిస్తున్నారు. సాక్షి, కామారెడ్డి : పరీక్ష తప్పితే కుంగిపోనవసరం లేదు.. పట్టుదలతో చదివితే సక్సెస్ కావచ్చు.. ఉన్నతస్థాయికి ఎదగొచ్చునని రుజువు చేశారు శివకుమార్గౌడ్. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన శివకుమార్గౌడ్ పదో తరగతి వరకు సొంత ఊల్లోనే చదివాడు. ఇంటర్మీడియట్ చదివేందుకు కామారెడ్డి పట్టణానికి చేరుకున్నాడు. 1987–89లో స్థానిక జీవీఎస్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివిన శివకుమార్ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్లో ఫెయిలయ్యాడు. అప్పుడు 150 మార్కులకు 53 మార్కులు వస్తే పాస్ అవుతారు. అయితే ఆయనకు 43 మార్కులు మాత్రమే వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యానని కుంగిపోలేదు. కసితో చదివాడు. సప్లిమెంటరీలో రాసి పాసయ్యాడు. ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు సాధించాడు. అప్పుడు 643 మార్కులతో ఎంపీసీలో క్లాస్ సెకండ్గా, కాలేజీలో థర్డ్ ర్యాంకర్గా నిలిచాడు. ఏ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఆయన్ను ఇబ్బంది పెట్టిందో దాని మీదే ఎక్కువ దృష్టి సారించాడు. డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ సబ్జెక్టును ఎంచుకున్నాడు. 1989–1992 సంవత్సరంలో ఆయన మ్యాథ్స్కు సంబంధించి నాలుగు పేపర్లు రాశాడు. రెండింటిలో 150 మార్కులకు 150 మార్కులు, ఒకదానిలో 139, మరొకదానిలో 142 మార్కులు సాధించి కాలేజీలో మంచి గుర్తింపు పొందాడు. 89 శాతం మార్కులతో కాలేజీ టాపర్గా నిలిచాడు. 1992–94లో ఉస్మానియా పరిధిలోని నిజాం కాలేజీలో ఆయన పీజీలో 90 శాతం మార్కులు సాధించి యూనివర్సిటీలో నాలుగో ర్యాంకు సాధించాడు. 1994–96లో నాగార్జన సాగర్లో బీఈడీ చదివారు. అక్కడా ఏడో ర్యాంకు సాధించారు. 1996లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికైన శివకుమార్గౌడ్ 2002 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 2002లో జూనియర్ లెక్చరర్గా ఎంపికై 2012 వరకు రామారెడ్డి, కామారెడ్డి కాలేజీల్లో పని చేశాడు. లెక్చరర్గా పని చేస్తూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. 2008లో అప్లయి చేసిన ఆయ న 2011లో జరిగిన పరీక్షలో నెగ్గాడు. 2012లో ఆయనకు జైళ్ల శాఖ డీఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్లో తరువాత కరీంనగర్లో ఆ తరువాత మహబూబ్నగర్లో ప్రస్తుతం సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ మార్కులే గ్రూప్–1 సక్సెస్కు కారణం.. శివకుమార్గౌడ్ గ్రూప్–1లో సక్సెస్ కావడానికి మ్యాథ్స్లో వచ్చిన మార్కులే కారణం కావడం విశేషం. ఇంటర్లో ఏ సబ్జెక్టులో అయితే ఆయన ఫెయిల్ అయ్యాడో, తరువాత అదే సబ్జెక్టు ఆయన జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. గ్రూప్–1 ఎగ్జామ్లో మ్యాథ్స్కు సంబంధించి 150 మార్కులు ఉంటాయి. అందులో శివకుమార్గౌడ్కు 143 మార్కు లు వచ్చాయి. అన్ని మార్కు లు రావడం కారణంగానే గ్రూప్–1 ఉద్యోగం వచ్చిం దని చెబుతారు శివకుమార్గౌడ్. విద్యార్థులు కుంగిపోవద్దు.. గెలుపు ఓటములు అనేవి సహజం. టెన్త్, ఇంటర్లో ఫెయిల య్యాన ని కుంగిపోతే పెద్ద నష్టమే జరుగుతుంది. ఫెయిలైన సబ్జెక్టుకు సం బంధించి మరింత కసితో చదివితే సక్సెస్ కావొచ్చు. ఫెయిల్ అయినవారంతా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరూ మిగలరు. ధైర్యంగా చదవాలి. ముందుకు సాగాలి. ఫెయిలై సక్సెస్ అయిన వ్యక్తుల్లో నేనొకరిని. ప్రతి ఒక్కరూ ధైర్యంగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. – శివకుమార్గౌడ్, సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్ -
బుక్కయిన మహిళల టీ20 కెప్టెన్..!
భారత మహిళల టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన హర్మన్ప్రీత్ పంజాబ్ డీఎస్పీగా బాధ్యతల చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె ఆ ఉద్యోగం కొల్పోయే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం చేపట్టే సమయంలో ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని పోలీసుల వెరిఫికేషన్లో తెలింది. ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ బోగస్ అని నిర్ధారించిన పోలీసులు ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హర్మన్ప్రీత్ను ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పంజాబ్ డీజీపీ ఎంకే తివారీ ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడుతూ.. ‘హర్మన్ప్రీత్ తాను మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ అందజేసింది. కానీ వెరిఫికేషన్లో ఆ యూనివర్సిటీ అధికారులు హర్మన్ప్రీత్ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ రిజిస్ర్టేషన్ నంబర్ తమ రికార్డులో లేదని తెలిపారు. ఈ నివేదికను సంబంధిత శాఖలకు అందజేశామ’ని తెలిపారు. తర్వాత స్పందిస్తాను : హర్మన్ప్రీత్ దీనిపై హర్మన్ప్రీత్ వివరణ కోరగా.. ‘అలాంటిది ఎం జరగలేదు. మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడుతాను’ అని తెలిపారు. -
ఎక్కడి డీఎస్పీలు అక్కడే!
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా నలుగుతున్న డీఎస్పీ సీనియారిటీపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ మధ్యేమార్గానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీనియారిటీపై పట్టువిడవకుండా వ్యవహరిస్తున్న ప్రమోటీ, డైరెక్ట్ రిక్రూట్ అధికారులకు సమన్యాయం చేసేందుకు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. విభజన సమస్యలపై ఇటీవల జరిగిన భేటీలో డీఎస్పీల పంపకాలు, ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ సమస్య, పరిష్కారాలపై ఇరు రాష్ట్రాల సీఎస్లు చర్చించినట్లు తెలిసింది. తుది కేటాయింపులు జరిగితేనే.. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని డీఎస్పీలు ఇక్కడే పనిచేసేలా, ఏపీలోని అధికారులు అక్కడే ఉండేలా ఇరు ప్రభుత్వాలు ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే కమలనాథన్ కమిటీ చేసిన తాత్కాలిక కేటాయింపులను తుది కేటాయింపులుగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చేలా చూడాలని ఇరు రాష్ట్రాల సీఎస్లు కేంద్రానికి విన్నవించబోతున్నారు. తాత్కాలిక అలాట్మెంట్ కింద ఇప్పటికే 95 శాతం అధికారులు వారి వారి రాష్ట్రాలకు పరస్పర ఒప్పందంతో వెళ్లారు. దీంతో తుది కేటాయింపులు జరిగితేనే పూర్తి స్థాయి, కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతులు, సీనియారిటీ సమస్యలు తీరనున్నట్లు పోలీసు శాఖ భావిస్తోంది. ఎక్కడికక్కడే సీనియారిటీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సీనియారిటీ జాబితా పొరపాట్లపై ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ జాబితా రూపొందించాలని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. దీనిపై రెండు రాష్ట్రాల పోలీసు అధికారులు మూడేళ్లు కసరత్తు చేసినా కొలిక్కి రాలేదు. దీంతో తెలంగాణ, ఏపీకి వేర్వేరుగా ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ జాబితా రూపొందించుకోవాలని ఇరు రాష్ట్రాల పోలీసు పెద్దలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
ప్రజల భయం పోగొట్టేందుకే కార్డన్ సెర్చ్
నవాబుపేట: ప్రజల్లో భయాన్ని పోగొట్టి పోలీసులపై నమ్మకాన్ని కల్పించేందుకు కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని వికారాబాద్ డీఎస్పీ శిరీష అన్నారు. మండల పరిధిలోని మైతాప్ఖాన్గూ డ గ్రామంలో ఆదివారం ఉదయం డీఎస్పీ శి రీష ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని ఇళ్లు, కిరాణం షా పులు, ఫాస్టుఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వ హించారు. తనిఖీలో 3,080 గుట్కా ప్యాకెట్లు, 148 మద్యం బాటిళ్లు, పత్రాలు లేని ఏడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అనుమానిత వ్య క్తులు సంచరిస్తే వెంటనే 100కు డయ ల్ చేసి సమాచారం అంది ంచాలన్నారు. గ్రామంలో మ ద్యం విక్రయాలు చేపడితే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమం లో సీఐలు శ్రీనివాస్, వెంకట్రామయ్య, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, వికారాబాద్ టౌన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. శంషాబాద్లో విస్తృతంగా కార్డన్ సర్చ్ శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని అహ్మద్నగర్, ఖాజీగల్లి, కోమటి బస్తీల్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ పీ.వీ.పద్మజ ఆధ్వర్యంలో ఏసీపీ అశోక్కుమార్, ఐదు గురు సీఐలు, 200 మంది కానిస్టేబుళ్లతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివా రం ఉదయం 8 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పత్రాలు లేని 100 బైక్లు, 20 ఆటోలు, ఐదు కార్లు, మూడు డీసీఎంలతో పాటు 15 మంది రౌడీషీటర్లు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ కోసం విస్తృతంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని డీసీపీ పద్మజ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్లను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ ప్రాంగణానికి తరలించారు. తనిఖీల్లో ఆర్జీఐఏ సీఐ మహేష్, శంషాబాద్ సీఐ కృష్ణప్రసాద్ తదితరులున్నారు. -
మావోల పోరాటంతో ప్రజలకు ఒరిగేదేం లేదు..
గూడెంకొత్తవీధి : ప్రజా ఉద్యమాల పేరిట మావోయిస్టులు చేస్తున్న పోరాటంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చింతపల్లి డీఎస్పీ అనిల్ పులిపాటి అన్నారు. ఆదివారం మండలంలోని జర్రెల పంచాయితీ కేంద్రంలో ఉచిత మెగా వైద్యశిబిరం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకే అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరిట దారుణంగా హతమారుస్తున్నారని అన్నారు. పోలీసుశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన్యంలోని చేయూత, ఉజ్వల, భవిత, రైతు నేస్తం, ముందడుగు వంటి కార్యక్రమాలతో గిరిజనులతో మమేకమవుతున్నట్టు చెప్పారు. తమశాఖ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అదనపు డీఎస్పీ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ గిరిజన యువతకు స్వయం ఉపాధి సూచించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి సారించడానికి పోలీసుశాఖ తగిన సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. జర్రెల మాజీ సర్పంచ్, 2016లో మావోయిస్టుల చేతిలో మృతి చెందిన సాగిన వెంకటరమణ తల్లిదండ్రులకు బట్టలు, సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో 600 మంది రోగులకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశా రు. చింతపల్లి, జీకేవీధి సీఐలు చంద్రశేఖర్, నారాయణరావు, ఎస్బీఎఫ్ సీఐ వెంకటరావు, బీఎస్ఎఫ్ ఏసీ ఉపేంద్రోసింగ్, జీకేవీధి, చింతపల్లి ఎస్ఐలు చంద్రశేఖర్, రమేష్ పాల్గొన్నారు. -
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
భామిని: ఎస్టీ వివాహితను మోసగించాడన్న ఫిర్యాదుపై పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి దర్యాప్తు చేశారు. భామిని మండలం చిన్నదిమిలి కాలనీలో డీఎస్పీ స్వరూపారాణి, కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారణ చేపట్టారు. వివాహిత ఎడ్ల పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నదిమిలి కాలనీకి చెందిన యువకుడు టి.మనోజ్కుమార్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు, వీఆర్ఓ కె.బాలరాజు, వార్డు సభ్యులు ఎ.యశోద, గ్రామస్తులు ఉన్నారు. -
ఇంకా మంటలు అదుపులోకి రాలేదు : డీఎస్పీ
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరు పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అగర్వాల్ రబ్బరు పరిశ్రమలో సంభవించిన ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పడానికి 6 అగ్నిమాపక యంత్రాల సాయంతో ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఈదురు గాలులు తోడవడంతో సిబ్బంది వాటిని అదుపు చేయలేక పోతున్నారు. దీనిపై డీఎస్పీ సీతారాం మాట్లాడుతూ.. ఈ రోజు తెల్లవారుజామున 2.45 గంటలను అగ్ని ప్రమాదంకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందిన వెంటనే ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాము. అయినా ఇప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదని, మరో మూడు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహని జరగలేదన్నారు. ఈ ప్రమాదం శాట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేక మరేదైనా కారణమా అన్న విషయంపై ఇంకా స్పష్టతలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. -
పిచ్చి వేషాలేస్తేడిస్మిస్ అవుతావ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘‘ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్. పద్ధతిగా నడుచుకో. లేదంటే ఏకంగా డిస్మిస్ అయ్యి జైలుకు పోతావు’’ జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్ను తెలంగాణకు చెందిన సీఐడీ డీఎస్పీ బెదిరింపుతో అన్న మాటలివి. ఈ బెదిరింపులపై సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినా కనీసం చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు యంత్రాంగం ముందుకు రాకపోగా మూడు రోజుల్లోనే రెండు ప్రాంతాలకు అతన్ని బదిలీ చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. దెందులూరులో తెలుగుదేశం నాయకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటున్న విషయంపై కానిస్టేబుల్ మధు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉన్నతాధికారి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులను ఎస్పీ వద్దకు పంపారు. వారి ఫిర్యాదుతో కనీసం విచారణ చేయకుండా కానిస్టేబుల్ మధును వేరే స్టేషన్కు బదిలీ చేశారు. గతంలో ఇతనిపై చింతమనేని ప్రభాకర్ దాడికి దిగారు. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్న ఇతనిపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. ప్రభాకర్పై పెట్టిన కేసును ఫాల్స్ కేసు కింద తీసేసిన పోలీసులు.. కానిస్టేబుల్పై కేసును కొనసాగిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదు. 2014లో ఇంటి స్థలం విషయంలో ఇతనికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో వివాదం జరిగింది. అప్పట్లో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దెందులూరులో ఎంపీటీసీ సభ్యుడు ఇరిగేషన్ పంట బోదెలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. దానిపై కానిస్టేబుల్ మధు జిల్లా కలెక్టర్కు, స్థానిక తహసీల్దార్కు మీ కోసంలో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. మరోవైపు కానిస్టేబుల్ మధుపై కక్షసాధింపు చర్యలు ప్రారంభం అయ్యాయి. సదరు తెలుగుదేశం నాయకుని బంధువైన తెలంగాణకు చెందిన డీఎస్పీ రంగంలోకి దిగారు. తెలంగాణ సీఐడీ డీఎస్పీ బెదిరింపులు కానిస్టేబుల్ మధు కథనం ప్రకారం... రెండురోజుల క్రితం ఆంధ్రా సీఐడీ డీఎస్పీని అంటూ ఒక అధికారి ఫోన్ చేశారు. మొదట ఆ వ్యక్తి ఏ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ నువ్వు అంటూ ప్రస్తావించి తరువాత ఏంటి నీ ఓవర్యాక్షన్.. డిస్మిస్ అయ్యి జైలుకి పోతావ్, ఉరిపోసుకుని చస్తావ్ అంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. నీకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. అసలు నీకు ఉద్యోగం లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆఖరికి ఉరిపోసుకుని చస్తావంటూ బెదిరించడంతో మనస్తాపానికి గురైన మధు తనను ఇలా వేధించే బదులు చంపించేయండంటూ బదులిచ్చాడు. మీ ఎస్పీతో మాట్లాడి నీ సంగతి తేలుస్తానంటూ ఫోన్ పెట్టేశారు. అది జరిగిన రోజు సాయంత్రమే దెందులూరుకు చెందిన తెలుగుదేశం నాయకులు, అతని బంధువులు జిల్లా ఎస్పీని కలిసి ఒక వినతిపత్రం ఇచ్చారు. మొబైల్ పోలీస్ నుంచి బదిలీ దీంతో కొంత కాలంగా దెందులూరు జాతీయ రహదారిపై మొబైల్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్న మధుని, బీటు మార్చారు. మరుసటి రోజే మళ్లీ ఉన్నతాధికారులు తాడేపల్లిగూడెంలో జాయిన్ అవ్వమని ఆదేశాలు జారీచేశారు. తనను బెదిరించిన అధికారిపై కానిస్టేబుల్ మధు దెందులూరు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్ఐ తీసుకోలేదు. సీఐతో మాట్లాడమని చెప్పడంతో ఆయన సీఐకి ఫోన్ చేశారు. సదరు సీఐ కూడా నీ పద్ధతి మార్చుకోవాలంటూ హితబోధ చేసి ఫోన్ పెట్టేశారు. కాని ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో మధు ఉన్నతాధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. తన సమస్యను ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని కానిస్టేబుల్ మధు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రైవేట్ టీచర్ కిడ్నాప్ కలకలం
కణేకల్లు : ఓ ప్రైవేట్ టీచర్ కిడ్నాప్ కలకలం రేపింది. ప్రయాణికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం చేరవేయడంతో 45 నిమిషాల్లోనే కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వివరాల్లోకెళితే.. రాయదుర్గానికి చెందిన యువతి కణేకల్లు మండలం ఆలూరులోని ప్రైవేట్ స్కూలులో టీచరుగా పనిచేస్తోంది. విధినిర్వహణలో భాగంగా గురువారం ఉదయం 7గంటలకు రాయదుర్గంలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. సరిగ్గా 7.40గంటలకు ఆలూరు వద్ద బస్సు దిగి స్కూలు వద్దకు నడుచుకుంటూ వెళుతోంది. కణేకల్లులోని ద్విచక్రవాహన షో రూం యజమాని ముగ్గురు స్నేహితులతో కలిసి ఏపీ31 సీజే 2349 నంబర్ గల ఇన్నోవా కారులో వచ్చి టీచరును బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకున్నారు. నన్ను కాపాడండి అంటూ ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంకా ముందుకు కదలని ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు గమనించి వచ్చేలోపు కారు స్పీడుగా వెళ్లిపోయింది. వెంటనే జరిగిన విషయాన్ని ఎస్ఐ రామరావుకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఆయన సమీపంలోని బెళుగుప్ప, రాయదుర్గం, కళ్యాణదుర్గంతోపాటు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లనూ అప్రమత్తం చేశారు. దుండగులు కణేకల్లువైపు వచ్చి షిర్డిసాయిబాబా దేవాలయం వద్ద కుడివైపున కొత్తపల్లి మీదుగా వెళ్లారు. కళ్యాణదుర్గం వెళ్లే అవకాశముండటంతో అక్కడి పోలీసులు వాహనానికి ఎదురుగా వచ్చారు. అంతలోనే రాయదుర్గం ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వాహనాన్ని ఛేజ్ చేయగా.. రమనేపల్లి వద్ద దుండగులు పట్టుబడ్డారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ రామరావులు ఘటనస్థలానికెళ్లిన దుండగులను అదుపులో తీసుకున్నారు. అక్కడే గంటన్నర సేపు విచారణ చేపట్టారు. అనంతరం కణేకల్లు పోలీసుస్టేషన్కు బాధితురాలిని, కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని తీసుకొచ్చారు. కిడ్నాప్ కాదంటూ డీఎస్పీ క్లీన్చిట్ ప్రైవేట్ స్కూల్ టీచర్ది కిడ్నాప్ కాదంటూ డీఎస్పీ వెంకటరమణ క్లీన్చిట్ ఇచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్.. సదరు అబ్బాయి ప్రేమించుకుంటున్నారన్నారు. అయితే అబ్బాయికి ఇదివరకే పెళ్లయ్యిందని, భార్యకు విడాకులిస్తున్నాడని తెలిపారు. రెండో పెళ్లి చేసుకునే విషయమై మాట్లాడేందు కోసమే టీచర్ను కారులో తీసుకెళ్లాడని చెప్పారు. తననెవరూ కిడ్నాప్ చేయలేదంటూ టీచర్ కూడా చెప్పడంతో కేసును ఇంతటితో క్లోజ్ చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. ఇరువురి స్టేట్మెంట్లు రికార్డు చేసిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాళ్లను ఇళ్లకు పంపారు. భారీ ప్యాకేజీ! కిడ్నాప్ ఘటన విషయమై ఓ మంత్రి సోదరుడు పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు సమాచారం. కిడ్నాప్ చేసినోడు తమకు కావల్సిన వాడేనని కేసుల్లాంటివి లేకుండా చూడాలని హకుం జారీ చేసినట్లు తెల్సింది. అంతేకాక ఈ కేసులో హెల్ప్ చేసిన పోలీసులకు మంత్రి సోదరుడు కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని నుంచి భారీ ప్యాకేజీ ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐ రామరావును వివరణ కోరగా ఆరోపణలను కొట్టిపారేశారు. -
ప్రజలను రక్షించేందుకే పోలీసులు
మెదక్రూరల్: ప్రజలను రక్షించేందుకే పోలీసులు ఉన్నారనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి గ్రామంలో ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రతీ ఇంటిని తనిఖీ చేసి వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకే పోలీసులు ఉన్నారన్నారు. పోలీసులు అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తెలియజేయాలని తెలిపారు. ప్రజలు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్డన్ సెర్చ్లో భాగంగా ఇంటింటికీ తనిఖీలు చేస్తామని అనుమానితులుగా ఎవరు కనిపించినా, ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు ఉన్నా పోలీస్స్టేషన్కు తరలిస్తున్నట్లు వివరించారు. వాహనాల పత్రాలు తీసుకొస్తే యజమానులకు వాహనాలను అప్పగిస్తామని, లేని పక్షంలో కోర్టుకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్లో ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 12 మంది ఏఎస్ఐలు, 42 కానిస్టేబుల్స్, 50 మంది ట్రైనింగ్ సిబ్బంది.. మొత్తం 125 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రామకృష్ణ, భాస్కర్, రవీందర్రెడ్డి, మెదక్ రూరల్ ఎస్ఐ లింబాద్రి, సందీప్ తదితరులు ఉన్నారు. -
కత్తిపోట్లతో ఎస్పీ ఆఫీసుకు.
అనంతపురం సెంట్రల్ : కత్తిపోట్లకు గురైన బాధితుడు తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రక్తమోడుతున్న అతన్ని డీఎస్పీ వెంకటరావు చొరవతో ఆస్పత్రికి తరలించారు. బాధితులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. యాడికి మండలం రాయలచెరువులో ఉదయం 7 గంటల సమయంలో శ్రీరామ్ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే రాజేష్ (35)పై హత్యాయత్నం జరిగింది. సొంత బావ (అక్క భర్త) రవిప్రసాద్, మరో వ్యక్తి ఈశ్వరయ్యతో కలిసి కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచేశారు. రక్తమోడుతున్న రాజేష్ను కుటుంబ సభ్యులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం నేరుగా అంబులెన్స్లో ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తన భర్తకు రక్షణ కల్పించా లని, యాడికి పోలీసులను వేడుకున్నా పట్టించు కోలేదని, క్షతగాత్రుడి భార్య భాగ్యలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. అక్కడికి సకాలంలో చేరుకున్న అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్ వెంటనే హాస్పటల్కు డీఎస్పీ ఆదేశాలతో క్షతగాత్రుడిని కుటుంబ సభ్యు లు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎవరైతే మాకేంటి?
ధర్మవరం : ‘ఎవరైతే మాకేంటి.. దారి వదిలేది లేదు..లెక్క చేసేది లేదు..ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యేతో మాట్లాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీ టిప్పర్ డ్రైవర్లు పట్టణంలో హల్చల్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు..ధర్మవరం ఇన్చార్జ్ డీఎస్పీ రామవర్మ తమ వాహనంలో రోడ్డుపై వెళ్తున్నారు. మార్గం మధ్యలో సెల్ఫోన్లో మాట్లాడుతూ వరదాపురం సూరి కంపెనీ అయిన నితిన్సాయి కనస్ట్రక్షన్ (ఎన్ఎస్సీ)కి చెందిన టిప్పర్లు రోడ్డుపై వేగంగా నడుపతున్నారు. డీఎస్పీ వాహనానికి సైడ్ ఇవ్వకుండా ర్యాష్ డ్రైవింగ్ చేశారు. పోలీస్ సైరన్ మోగించినప్పటికీ దారి వదలకుండా కొంతదూరం అలాగే వెళ్లారు. విసుగెత్తిన డీఎస్పీ గాంధీనగర్ అండర్బ్రిడ్జి వద్దకు వెళ్లగానే టిప్పర్లను ఓవర్టేక్ చేసి అటకాయించారు. టిప్పర్లను రోడ్డుపై నిలిపి వేసి డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు డ్రైవర్లు ‘ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి. తక్షణం టిప్పర్లను వదలండి’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఆగ్రహించిన డీఎస్పీ రోడ్డుపైనే టిప్పర్లను ఆపి తమదైన శైలిలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. చివరకు ఎమ్మెల్యే జోక్యంతో వ్యవహారం సద్దుమనిగనట్లు తెలిసింది. ఈ విషయమై డీఎస్పీని సాక్షి వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. -
ఉలిక్కిపడిన మక్తల్
మక్తల్ : మహబూబ్నగర్ ఎస్పీ అనురాధ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలో నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం రాత్రి 7 గం టల నుంచి దాదాపు 9 గంటల వరకు పోలీసు బృందాలు ఇళ్లలోకి వచ్చి తనిఖీలు చేపట్టడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 26 వాహనాలు, 20 తులాల బంగారం, 9 కిలోల వెండిని స్వా ధీనం చేసుకున్నారు. అలాగే గుట్కాలు, జీపులను స్వాధీనపరుచుకున్నారు. పట్టణంలోని ఎల్లమ్మకుంట, రాఘవేంద్రకాలనీల్లో ప్రతి ఇంటిలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పట్టణంలో రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతు న్న పలువురు వ్యక్తుల ను అదుపులోకి తీ సుకుని వేలిముద్రలను సేకరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రజల రక్షణే ధ్యేయం.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో పేట డీఎస్పీ శ్రీధర్ మా ట్లాడుతూ ప్రజల రక్షణే కార్డెన్ సెర్చ్ ప్ర ధాన లక్ష్యమన్నారు. కొత్తగా ఎవరైనా వ్య క్తులు ఇళ్లలో అద్దెకు వచ్చినా వారికి సం బంధించిన పూర్తి వివరాలు సేకరించాలన్నారు. కార్డెన్ సెర్చ్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆభరణాలకు సంబం ధించి యజమానులు సరైన పత్రాలు చూ యించి తీసుకెళ్లాలన్నారు. విడతల వారీ గా అన్ని ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేపడు తామన్నారు. తనిఖీల్లో సీఐ వెంకట్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రామకృష్ణ, మరో ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 141 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
కాటారం : జిల్లాలో సంచలనం సృష్టించిన టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు రామిళ్ల కవిత(35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కాటారం మండలం కొత్తపల్లిలో ఈ నెల 11 అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రామిళ్ల కవితను దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన విషయం విధితమే. కాగా కవిత హత్యకు అసలు కారణం వివాహేతర సంబ ంధమే అని పోలీసులు తేల్చారు. తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కవితను పలుమా ర్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో విరక్తి చెంది పథకం ప్రకారం ఓ భార్య కాంట్రాక్ట్ మర్డర్ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేఆర్కే ప్రసాద్రావు, సీఐ చింతల శంకర్రెడ్డి నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కవితకు కాటారంకు చెందిన రామిళ్ల మల్లయ్యకు గత 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి శ్రీజ, శిరిణి కూతుర్లు ఉన్నారు. భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో గత పదేళ్లుగా విడిపోయి కవిత తన తల్లిగారి ఊరైన కొత్తపల్లిలో కూతుర్లతో కలిసి జీవనం సాగిస్తుంది. గత రెండేళ్లుగా టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో కవితకు దూరపు బంధువు వరుసకు బావ అయిన ములుగు సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా కొంత కాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరుచు ఇరువురు కలుస్తుండడంతో విషయం కాస్తా సాగర్ భార్య సుజాతకు తెలియడంతో వారిద్దరిపై నిఘా పెంచింది. గత ఏడాది కవిత–సాగర్లు కలిసి ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సుజాత పద్ధతి మార్చుకోవాలని కవితను తీవ్రంగా మందలించింది. పెద్దమనుషులు సర్దిచెప్పడంతో పాటు పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు. ఇదంతా జరిగినప్పటికీ కవిత–సాగర్ల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో తన భర్త ఎక్కడ దూరమవుతాడో తన పిల్లల పరిస్థితి ఏంటని తీవ్ర మనోవేదనకు గురైన సుజాత తన పిల్లలతో కలిసి పలుమార్లు ఆత్మహత్యకు యత్నించింది. హత్యకు ప్లాన్ జరిగిందిలా.. గత కొంత కాలంగా సాగర్–సుజాత ఇంట్లో ఆశ్రయం పొందుతున్న వెంకటాపూర్ మండల పెద్దాపూర్ గ్రామానికి చెందిన రజనీకాంత్కు తన బాధను చెప్పుకొని సుజాత కన్నీరుమున్నీరయింది. ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని నీ జీవితాన్ని నాశనం చేస్తున్న కవితను అడ్డుతప్పిస్తే ఎలాంటి గొడవ ఉండదని అది నేను చూసుకుంటానని రజనీకాంత్ సుజాతకు భరోసా కల్పించాడు. కవితను హత్య చేయించాలని నిర్ణయానికి వచ్చిన సుజాత రజనీకాంత్ సాకారం కోరుతుంది. గతంలో ప్రజాప్రతిఘటన కొరియర్గా పని చేసిన రజనీకాంత్ పెద్దాపూర్ గ్రామానికి చెందిన నిషేధిత పీపీజీ కొరియర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పని చేసిన కన్నూరి కుమారస్వామిని సంప్రదించాడు. కుమారస్వామి కవితను చంపేందుకు ఒప్పుకోవడంతో సాగర్ భార్య సుజాతతో రజనీకాంత్ ఫోన్లో మాట్లాడించి రూ.5లక్షలకు సుపారి మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉండి విభేధాలతో దూరమైన కొత్తపల్లి మాజీ ఉపసర్పంచ్ చిట్యాల చంద్రయ్య ద్వారా కవిత కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న సుజాత సమాచారాన్ని కుమారస్వామికి చేరవేస్తూ వచ్చింది. కవితను హత్య చేసేందుకు రజనీకాంత్, కుమారస్వామి, బస్వరాజుపల్లికి చెందిన కుక్కుమూడి అశోక్, పందికుంటకు చెందిన దుప్పటి మోహన్ అలియాస్ చింటూ, మాడుగుల జగదీశ్, హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆత్కూరి రాజుతో కలిసి ఫిబ్రవరి నెల నుంచి పలుమార్లు కొత్తపల్లికి వచ్చి కవిత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. మార్చి 11 అర్థరాత్రి అశోక్, రజనీకాంత్, మలుగు మండలం పందికుంటకు చెందిన నూనుగంటి చిరంజీవి అలియాస్ అభిలాష్తో కలిసి భూపాలపల్లిలో చేతి గ్లౌజులు, మంకీ క్యాప్స్, కిచెన్ నైఫ్స్ కొనుక్కొని కొత్తపల్లికి చేరుకున్నారు. కవిత తన ఇంట్లో పెద్ద కూతురు శ్రీజతో కలిసి నిద్రిస్తుండగా ఇంటి వెనక గల తలుపులు లేని కిటీకి నుంచి అశోక్, చిరంజీవి మంకీ క్యాప్లు ధరించి ఇంట్లోకి వెళ్లగా రజనీకాంత్ ఇంటి బయట కాపలగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు కలిసి నిద్రిస్తున్న కవితను తమ వెంట తెచ్చుకున్న కత్తులతో కవిత ముఖంపై దాడి చేయడానికి ప్రయత్నించగా పక్కనే నిద్రిస్తున్న శ్రీజ నిద్రలేచి కేకలు వేయబోగా దుండగులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. ఇంట్లో ఉన్న కత్తిపీటతో కవిత ముఖం, గొంతుపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురైన కవిత అక్కడికక్కడే మృతి చెందింది. కవిత మృతి చెందినట్లు నిర్థారించుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్య విషయాన్ని తెలుసుకున్న ఏఎస్పీ రాజమహేంద్రనాయక్, కాటారం డీఎస్పీ కేఆర్కే ప్రసాద్రావు, సీఐ చింతల శంకర్రెడ్డి, ఎస్సైలు తిరుపతి, నరేశ్, రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం ద్వారా వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. కవిత కాల్ డేటా, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు కూతురు శ్రీజ చెప్పిన వివరాలను తీసుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టి చివరకు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య మిస్టరీ వీడినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఏడుగురు నిందితులు సుజాత, రజనీకాంత్, కుమారస్వామి, అశోక్, మోహన్, చంద్రయ్య, జగదీష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కాగా హత్యలో పాల్గొన్న మరో నిందితుడు చిరంజీవి, హత్యతో సంబంధం ఉన్న రాజులు పరారీలో ఉన్నట్లు త్వరలోనే వారిని పట్టుకోనున్నట్లు ఆయన తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా చేధించిన సీఐ శంకర్రెడ్డి, ఎస్సైలు తిరుపతి, రాజు, నరేశ్లను ఈ సందర్భంగా డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
బీమా కోసం భర్తను హత్య చేయించిన భార్య
సాక్షి, కర్నూలు : బీమా మొత్తం కోసం భర్తనే హత్య చేయించిన భార్య ఉదంతమిది. హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం కర్నూలులో డీఎస్పీ ఖాదర్బాషా, తాలూకా సీఐ నాగరాజుయాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోలవీడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, భార్య రమాదేవి, ఆయన బావమరిది రమేష్ కలిసి హైదరాబాద్లో ఉంటూ ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు. రమాదేవికి చోలవీడు సర్పంచు మధుసూదన్రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. రమాదేవి, మధుసూధన్రెడ్డి, రమేష్, ఆయన భార్య శివప్రణీత కలిసి శ్రీనివాసులును హత్య చేసేందుకు ప్రణాళిక రచించారు. భర్తతో కాపురం చేయటం ఇష్టంలేని రమాదేవి, డబ్బుపై దురాశగల రమేష్, శివప్రణీత దంపతులు కలిసి శ్రీనివాసులు చేత తెలివిగా బీమా చేయించి, వాటిపై రుణాలు పొందారు. ఈ మేరకు ఆయనపై వేర్వేరు చోట్ల బీమా చేయించారు. అతన్ని చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తే రూ.2కోట్ల దాకా బీమా మొత్తం వస్తుందని వారు అంచనా వేశారు. ఈ మేరకు శ్రీనివాసులుకు మాయమాటలు చెప్పి రమేష్ తన వద్ద పనిచేసే రమణ, మొయిన్బాషలతో తీర్థయాత్రలకు తీసుకెళ్లాడు. జనవరి 25వ తేదీన వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓర్వకల్లు సమీపంలో ఆపి రోడ్డుపై మాట్లాడుతున్నట్లు నటించారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీని గమనించి దాని కిందకు శ్రీనివాసులును తోసేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును మొయిన్బాషా గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత శ్రీనివాసులును గుర్తు తెలియని వాహనం ఢీకొందని ఓర్వకల్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే శ్రీనివాసులు మృతిపై అతని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రమణ, మొయిన్బాషాను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోగా, శ్రీనివాసులు భార్య రమాదేవి, బావ మరిది రమేష్, మధుసూదన్రెడ్డి, శివప్రణీత పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
-
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : ఢిల్లీ, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన నలుగురిని ప్రొద్దుటూరు రూరల్, చాపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 250 కిలోల 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం రూరల్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. రూరల్ సీఐ ఓబులేసు, ఎస్ఐలు చంద్రశేఖర్, చాపాడు ఎస్ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలసి మంగళవారం మైదుకూరు రోడ్డులోని మీనాపురం క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో మైదుకూరు వైపు నుంచి వస్తున్న స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే స్మగ్లర్లు వాహనం ఆపకుండా పోలీసులను గుద్ది చంపే ప్రయత్నం చేశారు. తర్వాత వాహనాన్ని పోలీసులు వెంబడించగా రాళ్లు, కట్టెలతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో చుట్టుముట్టిన పోలీసులు అనంతరపురం జిల్లా, నార్పల మండలం, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ తిరుపాలరెడ్డి, కమలాపురం మండలం, కొండాయపల్లి గ్రామానికి చెందిన చెప్పలి గంగాధర్, బి.మఠం మండలం, రేకులకుంట గ్రామానికి చెందిన పెద్దపోతు వెంకటస్వామిలను అరెస్ట్ చేశారు. స్కార్పియోలో ఉన్న 102 కిలోలు కలిగిన 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాపాడు స్టేషన్ పరిధిలోని అల్లాడుపల్లె క్రాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశారు. మైదుకూరు వైపు నుంచి వస్తున్న కారును ఆపగా అందులో ఉన్న చాపాడు మండలం, ఖాదర్పల్లి గ్రామానికి చెందిన షేక్ సింపతి ఫకృద్ధీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ఉన్న 148 కిలోల 8 చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరికి తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఏపీలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్ఐలు, సిబ్బందికి డీఎస్పీ ప్రశంసలు ప్రాణాలకు తెగించి ధైర్యసాహసాలతో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన సీఐ ఓబులేసు, ఎస్ఐలు చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఏఎస్ఐలు అహ్మద్, నారాయణ, కానిస్టేబుళ్లు మధుసూదన్రెడ్డి, సుబ్బయ్య, లక్ష్మీపతిరెడ్డి, శంకర్, కమాల్బాషా, ఖాదర్, వెంకటసుబ్బయ్యలను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేస్తానని డీఎస్పీ పేర్కొన్నారు. -
బైక్ను వెంబడించిన పోలీసులు.. గర్భిణి మృతి..!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి హైవేపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదని బైక్పై వెళ్తున్న దంపతులను పోలీసులు వెంబడించారు. ఈ ఘటనలో బైక్పై నుంచి గర్భిణి జారిపడింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. వివరాలివి.. గణేష్ సర్కిల్ వద్ద పోలీసులు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సూలపేటకు చెందిన రాజా, అతని భార్య ఉష బైక్పై వెళ్తున్నారు. వారి వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు నిలిపే ప్రయత్నాం చేశారు. కానీ రాజా బైక్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. బైక్ వెనుక కూర్చున్న ఇన్స్పెక్టర్ వాహనాన్ని బలంగా తన్నాడు. ఇన్స్పెక్టర్ కాలు గర్భిణీ పొట్టపై బలంగా దంపతులిద్దరూ వాహనం నుంచి నడిరోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో అక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల చర్యను ఖండిస్తూ స్థానికులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. స్థానికుల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పలువురు పోలీసులకు గాయపడ్డారు. పరిస్థితి మితిమిరడంతో డీఎస్పీ అక్కడికి చేరుకున్నాడు. చర్చలకు వచ్చిన డీఎస్పీపై ఆందోళనకారులు చెప్పులు విసిరారు. రోడ్డుపై బైఠాయించడంతో బారీ స్థాయిలో పోలీస్ బలగాలు మోహరించాయి. పోలీసుల చర్యపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. రోజు మాదిరే పోలీసులు హైవేపై చేకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తిరుచ్చి రేంజ్ డీఐజీ నేతృత్వంలో విచారణ మొదలెట్టామన్నారు. దీనికి కారణమైన ఇన్స్పెక్టర్ను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి చెప్పారు. -
ఉచిత శిక్షణకు మంచి స్పందన
వికారాబాద్ అర్బన్: పోలీసు ఉద్యోగాల కోసం ఇచ్చే ఉచిత శిక్షణకు మంచి స్పందన వస్తోందని వికారాబాద్ డీఎస్పీ శిరీష తెలిపారు. సోమవారం వికారాబాద్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన అభ్యర్థుల ఎంపికను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ సహకారంతో ఎస్పీ అన్నపూర్ణ ఆదేశంతో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం అన్ని ఠాణాల్లో శిక్షణ తీసుకునే అభ్యర్థుల పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తాము ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన అభ్యర్థుల నుంచి వస్తోందని చెప్పారు. సోమవారం వికారాబాద్ పీఎస్ పరిధిలో 295మంది యువకులు, 51మంది యువతులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 7వ తేదీ వరకు అవకాశం ఉండటంతో దరఖా స్తు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులకు అప్పటికప్పుడు ఎత్తు, సర్టిఫికెట్లను పరిశీలన చేశామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఎంపికైన అభ్యర్థులు 8న తమ తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి రావాలని చెప్పారు. బషీరాబాద్(తాండూరు): కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోవడానికి నిరుద్యోగ యువకులు బారులు తీరారు. సోమవారం జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో యువకులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజు బషీరాబాద్ మండలంలో 30 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి మొదటగా పోలీసులు శరీర కొలతలు తీసుకున్నారు. అర్హులైన యువకుల పేర్లను ఎస్పీ కార్యాలయానికి పంపిస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది రాంచందర్, శ్రీనివాస్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. పరిగి పీఎస్లో 110 దరఖాస్తులు పరిగి: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల ఉచిత శిక్షణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పరిగి పోలీస్ స్టేషన్లో మొదటిరోజు సోమవారం 110 మంది యువకులు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు ముందస్తుగా ఛాతీ, ఎత్తు కొలతలు పరిశీలించిన తర్వాతే దరఖాస్తులు తీసుకున్నారు. ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో దరఖాస్తుల ప్రక్రియ రోజంతా కొనసాగింది. శిక్షణ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ తెలిపారు. శిక్షణ ఇచ్చిన తర్వాత శారీరక కొలతలు సరిపోకపోతో అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉండటంతో పాటు సమయం వృథా అవుతుందని, అందుకే ముందస్తుగానే కొలతలు పరిశీలించి దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. -
డీఎస్పీగా మహిళా టీ20 కెప్టెన్
ఛండీగర్ : భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసుగా కొత్త బాధ్యతలు చేపట్టారు. నేటి(గురువారం) నుంచి ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) సురేష్ అరోరాలు హర్మన్ ప్రీత్ కౌర్ యూనిఫాంకు స్టార్లను పిన్ చేసి నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ''యంగ్ క్రికెటర్ హర్మన్ ప్రీత్కు ఈ బాధ్యతలు అప్పజెప్పడంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం. హర్మన్ ప్రీత్ పంజాబ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. హర్మన్ ప్రీత్ మాకు ఎంతో గర్వకారకంగా నిలిచింది. ఆమె ఇలానే కొనసాగిస్తుందని నేను నమ్ముతున్నా. నా శుభాకాంక్షలు ఆమెతో ఎప్పటికీ ఉంటాయి'' అని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. గతేడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్కు రావడంతో హర్మన్ప్రీత్ కీలక పాత్ర పోషించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు గత జులైలో ప్రకటించింది. పోలీసు ఉద్యోగం అంటే బాగుంటుందని కాబట్టి డీఎస్పీ పోస్టుని తీసుకునేందుకు గాను హర్మన్ ప్రీత్ తాను చేస్తున్న రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే పశ్చిమ రైల్వేతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో రిలీవ్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అయినా వెళ్లాలనుకుంటే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ల వేతనం రూ.27 లక్షలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జోక్యం చేసుకుని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాస్తూ హర్మన్ సమస్యను వేరే కోణంలో చూడాలని, ఆమె రాజీనామాను ఆమోదించాలని కోరారు. ముఖ్యమంత్రి లేఖతో దిగివచ్చిన రైల్వే, హర్మన్ ప్రీత్తో కుదుర్చుకున్న బాండ్ను రద్దు చేసింది. దీంతో పోలీసు ఉద్యోగంలో చేరేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో ఆమె నేడు డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించింది. Proud to join DGP Suresh Arora in pinning the stars on the uniform of this young cricketer @ImHarmanpreet as she takes over as DSP in @PunjabPolice. This lady has done us proud and I’m confident she’ll continue to do so. My best wishes are with her. pic.twitter.com/0yuDOdr6j7 — Capt.Amarinder Singh (@capt_amarinder) March 1, 2018 -
డీఎస్పీగా హర్మన్ప్రీత్
చండీగఢ్: భారత మహిళా టి20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పంజాబ్ పోలీసు శాఖలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 1న ఆమె డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనుంది. రైల్వే ఉద్యోగి అయిన ఆమె ఇదివరకే డీఎస్పీ కావాల్సింది. కానీ తమతో కనీస ఒప్పంద ప్రమాణం (ఐదేళ్ల బాండ్) గడువు పూర్తికాకపోవడంతో భారతీయ రైల్వే సంస్థ... ఆమె గతేడాదే రాజీనామా చేసినప్పటికీ రిలీవ్ చేయలేదు. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్వయంగా రైల్వే మంత్రిత్వశాఖతో మాట్లాడి ఇంతకుముందు కుదుర్చుకున్న నియామక ఒప్పందాన్ని సడలించి రిలీవ్ చేయాలని కోరారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ తాజాగా హర్మన్ప్రీత్ను రిలీవ్ చేయడంతో త్వరలోనే డీఎస్పీ కానుంది. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం అమరీందర్ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ రాష్ట్ర పోలీస్ శాఖలో చేరనున్న హర్మన్కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఆమె దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో పాల్గొంటోంది. -
అబల చెంతకు సబల
వేధింపులపై నోరు మెదిపితే, ఇదేంటని ప్రశ్నిస్తే, నలుగురికీ తెలిస్తే, అమ్మో ఆడపిల్లలం.. హద్దుల కోట దాటకూడదు.. గుండెల్లో వేదన బయటకురాకూడదు. హింసిం చడం మగాళ్ల జన్మహక్కు.. భరించడం ఆడాళ్ల విధి రాత..ఇదీ నేటి సమాజంలో మహిళల దుస్థితి. ఇలాంటి వారి కోసమే నేనున్నా నంటూ వస్తోంది ‘సబల’ . అన్ని వర్గాల మహిళ రక్షణ కొంగై మిమ్మల్ని కాపాడనుంది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సబలను ప్రాజెక్టు నోడల్ అధికారి స్థాయిలో తెనాలి డీఎస్పీ ఎం స్నేహిత ముందుకు నడిపించనున్నారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రాజెక్టు వివరాలను ఆమె వెల్లడించారు. గుంటూరు, తెనాలి: రోడ్డుపై యువతిని ఎవరైనా కామెంట్ చేస్తే తలొంచుకుని వెళుతుంది. ఇంట్లో మహిళలు ‘నా భర్తే కదా కొట్టాడు’ అని ఊరుకుంటారు. దీంతో కొట్టటం తన హక్కు అన్న భావన మగాళ్లలో వస్తుంది. మొదట్లోరనే ప్రశ్నిస్తే, పోలీసులను ఆశ్రయిస్తే సమస్య తెగేదాకా వెళ్లకుండా ఉంటుంది. వీరి కోసమే ‘సబల’ ప్రారంభించామని ప్రాజెక్టు నోడల్ అధికారి, తెనాలి డీఎస్పీ స్నేహిత తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు సాక్షికి ఆమె వెల్లడించారు. ఇలాంటి వారి కోసమే ‘సబల’ ప్రాజెక్టు ఫిర్యాదు చేస్తున్న మహిళల శాతం పెరిగినా చైతన్యస్థాయి మెరుగుపడాలి. ఇంకా నోరువిప్పలేని వారి కోసం జిల్లాలో ‘సబల’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. జిల్లా ఎస్పీ అప్పలనాయుడు ఆలోచనతో రెండు నెలలుగా పైలెట్ ప్రాజెక్టుగా రహస్యంగా అమలు చేస్తున్నాం. మహిళా కానిస్టేబుళ్లు కాలేజీ విద్యార్థులు, పని చేసే కూలీలు, ఉద్యోగినులు, గృహిణులను కలుస్తూ వారి అంతరంగాన్ని తెలుసుకుంటున్నారు. అన్యాయాన్ని పూసగుచ్చితే ఫిర్యాదు తీసుకుని అందుకు పాల్పడినవారి పీచమణుస్తున్నాం. మహిళల నుంచి స్పందన బాగుంది. హాస్టల్లో ఉండే విద్యార్థినిని తన స్నేహితుడు ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. అనుకోకుండా ఆ ఫోను తీసిన రూమ్మేట్కూ ఆ బాధ తప్పలేదు.‘సబల’కు చెప్పటంతో అతడిని అరెస్టు చేశాం. ‘సబల’ను నెలాఖరుకు అధికారికంగా ప్రారంభించబోతున్నాం. ముగ్గురం ఆడపిల్లలమే... తూర్పుగోదావరి జిల్లా మాది. కాకినాడ దగ్గర తాళ్లరేవులో మా నాన్న ప్రధానోపాధ్యాయుడు. అమ్మ గృహిణి. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఇద్దరు చెల్లెళ్లూ ఇంకా చదువుతున్నారు. అంతా ఆడపిల్లలే అని వారెప్పుడూ విచార పడింది లేదు. మరింతగా ఖర్చు పెడుతూ ఎక్కువగా చదివించారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చదువులంటారు...పెళ్లిళ్లు చేయకుండా’ అంటూ బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు ప్రశ్నిస్తున్నా పట్టించుకోలేదు. ఓపికగా చదివించారు. డిగ్రీ తర్వాత నుంచి గ్రూప్స్, సివిల్స్కు ప్రిపేర్ అవుతూ పీజీ, ఎంఫిల్ చేశాను. 2012లో గ్రూప్–1లో సెలక్టయ్యాను. పీహెచ్డీ కూడా చేయబోతున్నా. సమయం సరిపోవటం లేదు. నిశ్వబ్దాన్ని వీడితేనే న్యాయం.. వేధింపులు, హింసకు గురైన మహిళలు నాలుగు గోడల మధ్య కుమిలిపోతే న్యాయం జరగదు. అన్యాయంపై నిశ్శబ్దాన్ని వీడా. గొంతు పెగల్చుకొని ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. దోషులకు దండనతోనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. మరొక మగాడు ఆ నేరానికి పాల్పడేందుకు భయపడతారు. మహిళలపై ఆగడాలకు వారి మౌనం కూడా దారితీస్తోందని చెప్పటానికి నేను సంకోచించను. ఆవారాగా తిరిగే ఓ యువకుడు నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయిదో అమ్మాయి మైనరు. అయినా ధైర్యంగా నోరు విప్పింది. కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. మొదటి బాధితురాలే నిశ్శబ్దాన్ని వీడినట్టయితే ముందు నలుగురూ అతడి బారిన పడేవారు కాదు కదా! ‘షీ టీమ్లోమూడేళ్లలో 2 వేల కేసులు గ్రూప్–1లో నెగ్గి డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక తొలి పోస్టింగ్ సైబరాబాద్లో ఇచ్చారు. అక్కడ షీ టీమ్స్లో పని చేశాను. రోడ్లపై డెకాయ్ ఆపరేషన్లు చేస్తూ ఆడవాళ్లపై వేధింపులు/హింసకు పాల్పడే వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం ‘షీ’ విధి. ఇందులో మూడేళ్లు పని చేసిన నేను రెండు వేల వరకు కేసులు నమోదు చేయగలిగా. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘సబల’కు జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నాను. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో సెన్సిటివ్గా ఉంటారు. వీరి నుంచి జాగ్రత్తగా సమాచారం తీసుకోవాలనే ఉద్దేశంతో సబల రూపకల్పన జరిగింది. -
చోరీలే అతడి పని
కామారెడ్డి క్రైం: జల్సాల కోసం తేలికగా డబ్బు సంపా దించేందుకు చోరీలను ఎంచుకున్నాడు ఓ యువకుడు. ఎన్నిసార్లు జైలుకెళ్లినా అతడిలో మార్పు రాలేదు. బయటకు రాగానే తిరిగి చోరీలు చేస్తూనే ఉంటా డు. తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకుంటాడు. ఇటీవల నాలుగు తాళం వేసిన ఇండ్లలో చోరీలు చేసినన కేసుల్లో నిందితుడైన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన గోత్రాల నాగరాజును రామారెడ్డి, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ ప్రసన్నరాణి తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే 25 చోరీ కేసులు ఉన్నాయి.కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్తో పాటు చాలా ప్రాంతాల్లో ఈజీ మనీ కోసం నాగరాజు చోరీలు చేశాడు. గతేడాది జూలైలో కామారెడ్డి పరిసరా ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి అరెస్టు అయ్యాడు. నవంబర్ 17న జైలు నుంచి విడుదలైన అతడు మళ్లీ చోరీలు మొదలుపెట్టాడు. రామారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉప్పల్వాయిలో రెండు, గిద్ద గ్రామంలో ఒకటి, ఇందల్వాయి మండలం గన్నారంలో ఒక తాళం వేసిన ఇంట్లో చోరీలు చేశాడు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం చోరీ చేసిన సొత్తును కామారెడ్డిలో విక్రయించేందుకు బైక్పై వెళ్తుండగా రామారెడ్డి ఎస్ఐ కే.వినయ్కుమార్, సీసీఎస్ ఎస్ఐ పెంటయ్య ఆధ్వర్యంలో రామారెడ్డికి సమీపంలో వాహనాలు తనిఖీ చేసి పట్టుకున్నారు. అతడి నుంచి 11.5 తులాల బంగారం, 13 తులాల వెండి, ఒక సెల్ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వాటి విలువ రూ.2లక్షల 53 వేలు ఉంటుందన్నారు. కేసులో కీలకంగా వ్యవహరించిన కామారెడ్డి రూరల్ సీఐ భిక్షపతి, సీసీఎస్ సీఐ రాజశేఖర్, రామారెడ్డి, సీసీఎస్ ఎస్ఐలు వినయ్కుమార్, పెంటయ్య, ఏఎస్ఐలు సంతోష్రెడ్డి, ఉస్మాన్, సంజీవరావు, పీసీలు శంకర్, రమేశ్, రాంచందర్, గణేష్, నరేష్ను ఆమె అభినందించారు. -
డీఎస్పీ నెల ఆదాయం రూ.1.50 కోట్లు?
వేలూరు : లంచం కేసులో పట్టుబడి కటకటాల పాలైన ఆంబూరు డీఎస్పీ నెల ఆదాయం రూ.1.50 కోటి అని వదంతులు వ్యాపించాయి. వేలూరు జిల్లా ఆంబూరు డీఎస్పీ ధనరాజ్, ఎస్ఐ లూర్దు జయరాజ్ ఇసుక క్వారీ నడుపుతున్న వ్యక్తి వద్ద రూ.1.45 లక్షలు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంబూరు డీఎస్పీ ఇసుక అక్రమ రవాణా, నాటుసారా, కట్ట పంచాయితీ చేసే ముఠా సభ్యుల నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకోవడం వీటికి ఆయా స్టేషన్లలోని ఎస్ఐలు, కానిస్టేబుళ్ల ద్వారా నగదును తీసుకుంటున్నట్లు వదంతులు వచ్చాయి. విజిలెన్స్ అధికారులు డీఎస్పీ ధనరాజ్, ఎస్ఐలను గురువారం రాత్రి 12 గంటల వరకు రహస్యంగా విచారణ జరిపి న్యాయమూర్తి రాజు ముందు హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించడంతో వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. డీఎస్పీ ధనరాజ్ గతేడాది విరుదనగర్ జిల్లా నుంచి బదిలీపై ఆంబూరుకు వచ్చారు. విరుదునగర్లో పనిచేసిన సమయంలోనే నాటు సారా అక్రమరవాణ దారులు, కిడ్నాపర్ల నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకునే వాడని అనంతరం ఆంబూరులోని ఇసుక అక్రమ రవాణా చేసే మాఫియా వద్ద ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలని వేధింపులకు గురి చేసే వాడని ఇవ్వకుంటే కేసులు నమోదు చేసే వాడని తెలిసింది. ఈ మామూళ్లు ఇవ్వడంతోనే ఇసుక మాఫియా ముఠా సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరించే వారని తెలిసింది. డీఎస్పీ లంచం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న ఆంబూరు వాసులు పోలీస్స్టేషన్ ఎదుట బాణసంచా పేల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. -
ఆ యువకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ
చిన్నశంకరంపేట(మెదక్): ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని దళిత యువతిని వేధిస్తున్న యువకుడిని త్వరలో అరెస్టు చేస్తామని తూప్రాన్ డీఎస్పీ రామ్గోపాల్రావు తెలిపారు. సోమవారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేటకు చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన నిద్రబోయిన స్వామి ఐదు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. యువకుడిని త్వరలో అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాల అదుపు సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తూప్రాన్ డీఎస్పీ రామ్గోపాల్రావు తెలిపారు. తూప్రాన్ సబ్డివిజన్లో ఇప్పటికే 450 సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
సిరిసిల్లక్రైం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోరీ ల్లో నిందితుడిగా ఉన్న అంతర్జిల్లా దొంగను ఆది వారం రాజన్న సిరిసిల్ల సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్బ్రాంచ్ డీఎస్పీ నరహరి వివరాలు వెల్లడించారు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామావత్ శంకర్ గతేడాది జన వరి నుంచి ఇప్పటి వరకు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో ఆరు దొంగతనాలు, గంభీరావుపే ట మండలంలో రెండు దొంగతనాలు చేశాడు. వేములవాడలోని ఒక షాపులో చోరీచేసే ప్రయత్నంలో పోలీస్ జీపు అటువైపుగా వెళ్లడాన్ని గమనించి పరారయ్యాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం సిరిసిల్ల పాతబస్టాండ్లో పట్టుకున్నారు. దొంగను అరెస్టు చేసిన సీసీఎస్ సీఐ బన్సీలాల్, ముస్తాబాద్ ఎస్సై ప్రవీణ్, సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్కుమార్, సీసీఎస్ ఎస్సై ఉపేందర్ను డీఎస్పీ నరహరి అభినందించారు. గల్ఫ్ ఏజెంట్...p సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేటలో గల్ఫ్ పంపిస్తానని మోసం చేసేందుకు ప్రయత్నించిన నకిలీ ఏజెంట్ను సీసీఎస్ పోలీసులు అరెస్టుచేశారు. మాదం కరుణాకర్ ఎలా ంటి అనుమతులు లేకుండా గల్ఫ్ ఏజెంటుగా చలామణి అవుతున్నాడు. అతడివద్ద నుంచి ఏడు పాస్పోర్టులు, నాలు గు చెక్కులు, మెడికల్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
డబ్బుల కోసమే హత్య
తూప్రాన్ : శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గత నెల 28న ఓ గుర్తుతెలియని మహిళ మృతి కేసును పోలీసులు ఛేదించారు. సెల్పోన్ ఆధారంగా మహిళను హత్య చేసిన వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ తన కార్యాలయంలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామానికి చెందిన చంద్రకళ(45) గత నెల 28న శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో హత్యకు గురవగా మృతదేహం లభించిన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గురైన మహిళ వద్ద పడి ఉన్న సెల్ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు డీఎస్పీ తెలిపారు. హత్యకు గురైన చంద్రకళ ఆటోడ్రైవర్లు, తెలిసిన వ్యక్తుల వద్ద విచ్చలవిడిగా తిరిగే మహిళ అని అన్నారు. ఇదే క్రమంలో గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవితో పరిచయం ఉన్న చంద్రకళకు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన రూప్సింగ్(70) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెను మచ్చిక చేసుకొని గతంలో పలుమార్లు చంద్రకళతో సహవాసం చేసినట్లు తెలిపారు. గత నెల 27న చంద్రకళకు ఫోన్ చేసి నర్సాపూర్కు రప్పించారు. అక్కడి నుంచి రవి ఆటోలో చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీ ప్రాంతంలోకి చంద్రకళను తీసుకువచ్చారు. అనంతరం రవి ఆటోలో వెళ్లిపోగా నిందితుడు రూప్సింగ్ చంద్రకళను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తనవెంట తెచ్చుకున్న కర్రతో తలపై బాది చంద్రకళను హత్య చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. హత్య చేసి మృతురాలి వద్ద డబ్బులు, నగల కోసం వెతికగా ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి రూప్సింగ్ వెళ్లిపోయినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన చుట్టుపక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె సెల్ఫోన్ ఆధారంగా హంతకుడు రూప్సింగ్ను గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు పాత నేరస్తుడే చంద్రకళను హత్య చేసిన నిందితుడు పాత నేరస్తుడని డీఎస్పీ చెప్పారు. 1998 సంవత్సరంలో వర్గల్ మండలం నాచారంలో ఓ మహిళ హత్య కేసులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే తన సొంత అత్తను 2010లో హత్య చేసిన కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ లింగేశ్వర్రావు, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డిలను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ లింగేశ్వర్రావు, స్థానిక ఎస్సై శేఖర్రెడ్డి, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డి, సిబ్బంది మంగ్యానాయక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
విషాదం: డీఎస్పీ తలలోంచి దూసుకెళ్లిన బుల్లెట్..
సాక్షి, చంఢీగఢ్: ప్రమాదవశాత్తూ సర్వీస్ రివాల్వర్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ ఓ డీఎస్పీ ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన పంజాబ్లో కలకలం రేపింది. ఐజీ ముఖ్విందర్ సింగ్ కథనం ప్రకారం.. జైతూలోని యూనివర్సిటీ కాలేజీలో నేడు (సోమవారం) విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మోరల్ పోలీసింగ్ మీద విద్యార్థులు ఆందోళన చేస్తూ.. పోలీసుల నుంచి మాకు, సామాన్యులకు స్వాతంత్ర్యం కావాలంటూ విద్యార్థులు గట్టిగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపుతప్పుతుందని సమాచారం అందుకున్న పంజాబ్కు చెందిన డీఎస్పీ బల్జీందర్ సింగ్ సంధు వర్సిటీకి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీఎస్పీ బల్జీందర్ సింగ్ విద్యార్థులను హెచ్చరించారు. కానీ విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ఆందోళనను ఉధృతం చేశారు.ఈ క్రమంలో అక్కడ తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందని, పోలీసులు గమనించేసరికి డీఎస్పీ తలలొంచి దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు.అదే బుల్లెట్ మరో పోలీసును తీవ్రంగా గాయపరించింది. వీరిని చికిత్స నిమిత్తం ఫరీద్కోట్లోని గురు గోవింద్ సింగ్ మెడికల్ హాస్పిటల్కు తరలించారు. డీఎస్పీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందారని నిర్ధారించారు. బుల్లెట్ గాయమైన మరో పోలీసుకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సర్వీస్ రివాల్వర్ను డీఎస్పీ పేల్చారా.. లేక విద్యార్థులు వినియోగించారా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఐజీ ముఖ్విందర్ సింగ్ వివరించారు. -
చిక్కిన సేవా‘చీట్’ ఫండ్ యజమాని ?
కోదాడ : వందల మంది చిట్టీ సభ్యులను నిండా ముంచి బోర్డు తిప్పేసిన కోదాడలోని సేవా చిట్ఫండ్ నిర్వాహకుడు కోటేశ్వరరావును పోలీసులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అతడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సోమవారం కోర్టుకు రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకొని కోదాడ స్టేషన్కు తీసుకొచ్చారనే విషయాన్ని తెలుసుకున్న బాధితులు వందల మంది స్టేషన్కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ చట్ట పరిధిలో అన్ని విషయాలను పరిశీలిస్తున్నామని, బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. అతని వద్ద ఎంత మంది చిట్టీలు కట్టారు, ఎంత మందికి చెల్లించాలనే విషయాన్ని సేకరిస్తున్నామని, బాధితులు కూడా తమ వద్ద ఉన వివరాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ.12 కోట్లు సేవాచిట్ ఫండ్ సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ. 12 కోట్ల వరకు ఉన్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. 524 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ సంఖ్య మరి కొంత పెరిగే అవకాశం ఉంది. ఇది కాక తెలిసిన వారి నుంచి వడ్డీలకు తెచ్చింది ఇంతకు రెట్టింపు ఉన్నట్లు సమాచారం. ఇది సివిల్ వ్యవహారం కాబట్టి వడ్డీ డబ్బుల విషయంలో పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదు. కేవలం చిట్ సభ్యుల డబ్బుల విషయం మీదే ప్రధానంగా దృష్టి సారించనట్లు తెలిసింది. కుటుంబ సభ్యులందరిపై కేసులు? సేవాచిట్ ఫండ్ విషయంలో పోలీసులు ఒక్క నిర్వాహకుడిపై కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇది చూసి మరే ఇతర చిట్టీల నిర్వాహకుడు.. సభ్యులను ఇబ్బంది పెట్టకుండా భయపడే విధంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. అతని పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. చిట్ నిర్వహణలో అతనికి తోడుగా ఉన్న తమ్ముడు రమేష్, సహాయపడిన మరో ఇద్దరితో పాటు కోటేశ్వరరావు భార్య, కుమారుడు, కుమార్తెల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులందరి పేరు మీద ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నట్లు తెలిసింది పలువురు ఏజెంట్లపై కూడా... సేవా చిట్ఫండ్లో సభ్యులను చేర్పించిన ఏజెంట్లపై కూడా పోలీసులు కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. 10 మంది ఏజెంట్లు సభ్యులను చేర్పించడంలో తనకు సహకరించారని చెప్పడంతో పోలీసులు వారిని స్టేషన్కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. చిట్ ఫండ్ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూడ కుండా కేవలం కమీషన్ కోసం అమాయకులను చిట్టీలలో చేర్పించడం నేరం కాబట్టీ వీరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని సమాచారం. కోటేశ్వరరావు పలురకాల వ్యాధులతో బాధపడుతుండడంతో ఆయనను వీలైంత త్వరగా కోర్టుకు రిమాండ్ చేసి ఆ తరువాత కోర్టు అనుమతితో మళ్లీ విచారణ కోసం అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. అన్ని విధాలుగా విచారిస్తున్నాం సేవా చిట్ఫండ్ నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని బాధితులకు న్యాయం చేస్తామని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. కోటేశ్వరరావుతో పాటు అతని కుటుంబ సభ్యులందరి పైన ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు. ప్రజలు కూడా రిజిస్టర్ ఉన్న చిట్ఫండ్ కంపెనీలలో మాత్రమే చేరాలని కోరారు. కోదాడలో ఉన్న ఇతర చిట్ఫండ్ సంస్థల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈ కేసు కొలిక్కి వచ్చిన తరువాత వాటిపై దృష్టి సారిస్తామన్నారు. -
నన్ను రిలీవ్ చేయండి: మహిళా క్రికెటర్
చండీగఢ్:గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్ప్రీత్ కౌర్కు కొత్త ఉద్యోగం కష్టాలు తప్పడం లేదు. ఆ ప్రపంచ కప్ తర్వాత పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హర్మన్కు డీఎస్పీ ఉద్యోగ హోదాను కల్పించినప్పటికీ, ఇప్పటికీ ఆమె కొత్త ఉద్యోగంలో చేరలేకపోయింది. అందుకు కారణం తన పాత ఉద్యోగం చేస్తున్న వెస్ట్రన్ రైల్వే నుంచి ఇంకా రిలీవ్ లెటర్ రాకపోవడమే. మూడు సంవత్సరాల క్రితం హర్మన్ ప్రీత్ కౌర్ వెస్ట్రన్ రైల్వేలో ఆఫీస్ సూపరిండెంట్ ఉద్యోగిగా చేరింది. ఆ సందర్భంగా ఐదేళ్ల బాండ్పై సంతకం చేసింది. మూడేళ్లు మాత్రమే పూర్తవ్వడంతో హర్మన్కు రైల్వే అధికారులు రిలీవింగ్ లెటర్ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో ఆమె తనకు రిలీవ్ చేయాలంటూ మరోసారి విజ్ఞప్తి చేసింది. అప్పుడే డీఎస్పీ గా ఉద్యోగం చేయడానికి వీలువుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే ఆమె డీఎస్పీ ఉద్యోగంలో చేరుతుందని అమరీందర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
చనిపోయిన డీఎస్పీ ట్రాన్స్ఫర్..!
-
అవునా... చనిపోయిన డీఎస్పీ ట్రాన్స్ఫర్..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజా బదిలీలు చాలు. ఓ వైపు ఉన్నవారికి పదోన్నతులు, పదవులు, బదిలీలు లేక ఆపసోపాలు పడుతుంటే ఏపీ పోలీసుశాఖ మాత్రం చనిపోయిన ఓ అధికారికి బదిలీ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. తక్షణమే పోలీస్ హెడ్ క్వార్టర్స్కు వచ్చి జాబ్ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో.. బతికున్న తమను వదిలేసి చనిపోయిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వడమేంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. అనంతపురం జిల్లా కదిరి, గాన్లపెంట గ్రామానికి చెందిన డేరంగుల రామాంజనేయులు ఆరు నెలల కిందట చనిపోయారు. తిరుమల ఎస్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు.. అనారోగ్య సమస్యలతో ఆరు నెలల కిందట మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో 16 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీ ఉత్తర్వులలో కొన్ని నెలల కిందట చనిపోయిన రామాంజనేయులు పేరు ఉంది. ఆయనను తిరుమల నుంచి పోలీస్ హెడ్క్వార్టర్స్ కు బదిలీ చేయడంతో పాటు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చనిపోయిన వ్యక్తిని బదిలీ చేయడం చర్చనీయాంశం కావడంతో నాలుక్కరుచుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ తప్పును కప్పిపుచ్చే యత్నం చేశారు. క్లరికల్ మిస్టేక్ అంటూ వివరణ ఇస్తూ.. బదిలీ జాబితా నుంచి రామాంజనేయులు పేరును తొలగించేశారు. ముందు బతికున్నవారికి పోస్టింగ్స్ ఇవ్వాలని, పద్ధతిలో బదిలీ చేయాలంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
పోలీసుల అదుపులో దళనేత ‘సాగర్’!
మిర్యాలగూడ/హైదరాబాద్: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన దళ నేత, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్ సాగర్ను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సాగర్తో పాటు మరో ఇద్దరు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే.. సాగర్ను అదుపులోకి తీసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ ధ్రువీకరించడం లేదు. కాగా సాగర్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షుడు సుబ్బారావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాగర్ను వెంటనే కోర్టులో హాజరుపరచాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు శుక్రవారం హైదరాబాద్లో అదనపు డీజీపీ అంజనీకుమార్కు వినతిపత్రం సమర్పించారు. సాగర్ ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదని, ప్రాణహాని తలపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. అదనపు డీజీపీని కలసిన వారిలో ఎస్.వెంకటేశ్వర్రావు, కె.గోవర్ధన్, వి.సంధ్య, ఎం.శ్రీనివాస్, అనురాధ, అచ్యుత రామారావు తదితరులు ఉన్నారు. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేటకి చెందిన ఏనుగు చంద్రారెడ్డి అలియాస్ సాగర్ విద్యార్థి దశలోనే పీడీఎస్యూ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత ఖమ్మంలో కార్మికనేతగా పనిచేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
టీ పొడి కల్తీ?
పరిగి: టీ పొడిలో కల్తీ జరుగుతోందని వదంతులు వ్యాపించాయి. తయారైన టీ పొడిని గుట్టుగా తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కల్తీ గుట్టు తేల్చేందుకు పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్, హిందూపురం రూరల్ సీఐ వెంకటేశులు కలిసి పరిగి ఎస్సై రాంభూపాల్, పోలీసు సిబ్బందితో బుధవారం రంగంలోకి దిగారు. హిందూపురం మధుగిరి ప్రధాన రహదారిలో ప్రికాట్ మిల్లు సమీపంలో ఉన్న గొరవనహళ్లి క్రాస్లో చర్మ శుభ్రత కోసం మలేదడెక్ట్ అనే కుటీర పరిశ్రమ నడుస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతానికి చెందిన మాధవన్ దీని నిర్వాహకుడు. గొర్రెలు, మేకల చర్మాలను శుభ్రపరిచేందుకు అవసరమైన పొడి తయారీకి బదులు కల్తీ టీ పొడి తయారు చేసి తమిళనాడుకు అమ్ముతున్నారని ఆరోపణలు రావడంతో డీఎస్పీ, సీఐలు ఫ్యాక్టరీ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బిల్లు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ కాపీలు, రెన్యూవల్స్ రికార్డులు తనిఖీ చేశారు. గోడౌన్లోని తయారీ విధానాన్ని, చర్మం శుభ్రపరిచేందుకు తయారవుతుందంటున్న పౌడరు, తయారీలో వాడే పదార్థాలు, ముడి సరుకు వివరాలను నిశితంగా పరిశీలించారు. పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ల్యాబ్ నివేదిక వచ్చాక ఆరోపణలు రుజువైతే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పోలీసు పోస్టింగులపై పొలిటికల్ నజర్!
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో పోస్టింగుల వ్యవహారం వివాదం రేపుతోంది. పలు జిల్లాల్లో డీఎస్పీల నియామకంపై పలువురు మంత్రులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. తమకు తెలియకుండా తమ ప్రాంతాల్లో డీఎస్పీలకు పోస్టింగులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీనిపై నేరుగా పోలీసు ఉన్నతాధికారులకే ఫిర్యా దులు, సిఫార్సులు చేస్తున్నట్లు తెలిసింది. చందూలాల్ లేఖతో.. ఇటీవలి డీఎస్పీల బదిలీలు రాజకీయ నేతల సిఫార్సులతోనే జరిగాయన్న ప్రచారముంది. అయితే భూపాలపల్లి జిల్లా ములుగు డీఎస్పీ పోస్టింగ్పై మంత్రి చందూలాల్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి రాసిన సిఫార్సు లేఖ సంచలనంగా మారుతోంది. తన నియోజకవర్గ ప్రధాన కేంద్రం (హెడ్ క్వార్టర్స్) ములు గు డీఎస్పీగా రాఘవేందర్రెడ్డిని నియమి స్తూ డీజీపీ అనురాగ్శర్మ ఈ నెల 4న ఉత్తర్వు లు జారీచేశారు. అయితే ములుగు డీఎస్పీగా ఇద్దరి పేర్లను సూచిస్తూ వారిలో ఒకరిని నియమించాలంటూ గురువారం మంత్రి చందూలాల్ తన లెటర్హెడ్పై సిఫార్సు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్న ఎన్.సుభాష్బాబు, వరంగల్ కమిషనరేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఏసీపీగా ఉన్న జి.మదన్లాల్లలో ఒకరిని నియమించాలని కోరారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఇరకాటం లో పడ్డారు. ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో డీఎస్పీల పోస్టింగ్స్పై కసరత్తు చేసిన తర్వాతే డీజీపీ అనురాగ్శర్మ ఉత్తర్వులు వెలువరించారు. కానీ ఇప్పుడు మంత్రి వేరే వారిని నియమించాలంటూ కోరడం వెనుక ఆంతర్యమేమిటన్న దానిపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు మంత్రులు సైతం! ఉత్తర తెలంగాణకు చెందిన ఓ కీలక మంత్రి తన అనుమతి లేకుండా పాత జిల్లాల్లో ఇద్దరు డీఎస్పీలకు కీలకమైన పోస్టింగ్ ఇచ్చారని ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలు స్తోంది. పాత జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లాకు సైతం తానే పెద్ద అని, అలాంటిది తనకు చెప్పకుండా ఇద్దరిని ఎలా నియమిస్తార ని పేర్కొన్నట్లు సమాచారం. ఇక దక్షిణ తెలం గాణలో మరో మంత్రి సైతం ఇదే రీతిలో అ భ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొత్తగా ఏర్పడ్డ ఓ సబ్ డివిజన్కు డీఎస్పీగా నియ మించిన అధికారిని వెంటనే మార్చాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఎన్నికలకు ముందు సమయంలో తమకు పరిచ యం లేని అధికారులను, పైగా తమ మనుషులు కాని వారికి ఎలా పోస్టింగ్ ఇస్తారని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం వద్దే తేల్చుకుంటామని ఓ మంత్రి హెచ్చరించినట్లు ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఆయనపై అన్నీ ఆరోపణలే..
ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆరోపణలు మొదలయ్యాయి. చివరికి ఆ ఆరోపణలే ఆయన్ను సాగనంపేలా చేశాయి. ప్రభుత్వ అధికారులకు బదిలీలనేవి సహజం. కానీ కొద్ది నెలలకే బదిలీ కావడం జిల్లాలో చర్చానీయాంశమైంది. పాలనాపరమైన కార్యక్రమాల్లో చొరవ చూపకుండా, హత్యకు సంబంధించిన కేసులో, ఇసుక, సివిల్ వ్యవహారాల్లో డబ్బులు అడిగినట్లు సమాచారం. వికారాబాద్ : పరిగి డీఎస్పీ అశ్ఫక్ బదిలీ అయ్యాడు. సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్ డీఎస్పీగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అశ్ఫక్ పరిగి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి 10 నెలలకే ఆయన బదిలీ చేసింది. ఆయన గడువులోపే బదిలీ అయిన నేపథ్య ంలో బదిలీపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా పరిగిలో 2016 అక్టోబర్లో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు అయ్యింది. మొదటి డీఎస్పీగా చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తికి పరిగి బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే నెలలోపే చేవెళ్లలో ఏసీపీ కార్యాలయం ప్రారంభమవడంతో అక్కడికే ఆమె ఏసీపీగా వెళ్లింది. దీంతో పరిగిలో డీఎస్పీ పోస్టు నెల తిరక్కుండానే ఖాళీ అయ్యింది. అనంతరం రెండు నెలల పాటు పరిగి సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ కుర్చీ ఖాళీగానే ఉండగా వికారాబాద్ పోలీస్ శిక్షణా కేంద్రం డీఎస్పీలు ఇన్చార్జిలుగా కొనసాగారు. కాగా డిసెంబర్లో అశ్ఫక్కు పరిగి డీఎస్పీగా పోస్టు ఇవ్వడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. తొలి నుంచి ఆరోపణల పర్వం పరిగి డీఎస్పీగా అశ్ఫక్ బాధ్యతలు చేపట్టిన మొదలు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. డబ్బుల కోసం ఎస్ఐలను పీడించారని, సీఐలతో పొసగడం లేదని.. ఐనాపూర్ హత్య కేసులో సంబంధం లేని దోమ, పరిగి ఎస్ఐలపై వేటు వేయించేందుకు లోపాయికారిగా వ్యవహరించారని, ఇసుక, సివిల్ విషయాల్లో డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. ఇదే సమయంలో బాధ్యతలు నిర్వహించిన 10 నెలల్లో ఏ రోజు కూడా ఆయన లా అండ్ ఆర్డర్ విషయంలో దృష్టి సారించినట్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పదవీ కాలం పూర్తి కాకుండానే బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోనే బదిలీ అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన పనితీరుపై ఉన్నతాధికారుల్లో ఉన్న అసంతృప్తి కూడా బదిలీకి కారణమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. పరిగి నూతన డీఎస్పీగా శ్రీనివాస్ అతడి బదిలీతో గొల్ల శ్రీనివాస్కు పరిగి డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఇన్స్పెక్టర్ ర్యాంకులో విధులు నిర్వహించిన శ్రీనివాస్ పదోన్నతిపై పరిగి రానున్నారు. ఆయనకు డీఎస్పీగా పరిగి మొదటి పోస్టింగ్ కావడం గమనార్హం. పరిగికి పదోన్నతిపై రానున్న డీఎస్పీ శ్రీనివాస్ స్వస్థలం కూడా వికారాబాద్లోని గంగారం కాలనీ. 1991లో ఆర్ఎస్ఐగా శాఖలో చేరిన ఆయన 2000లో సివిల్లోకి మారారు. కాగా 2006 నుంచి ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. -
చచ్చేకన్నా.. వాడినే చంపేస్తే పోలా..!
సాక్షి, కదిరి: గత నెల 29న హత్యకు గురైన భార్గవ్ నాయుడు హత్యకేసును కదిరి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తల్లిదండ్రులు లక్ష్మిదేవి, భాస్కర్నాయుడులే వారి కొడుకును హత్య చేశారని తేల్చారు. వారిని ఆదివారం కుటాగుళ్ల వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టి, అనంతరం కోర్టుకు హాజరు పరిచారు. హత్యకు సంబంధించిన వివరాలను కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి పట్టణ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విలేకరులకు వివరించారు. జల్సాలకు అలవాటు పడి.. ‘మృతుడు భార్గవ్ గత కొంత కాలంగా తాగుడు, క్రికెట్ బెట్టింగ్, జూదం వంటి చెడు వ్యసనాలతో పాటు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం సుమారు రూ. 15 లక్షలకు పైగా అప్పులు చేశాడు. అప్పులను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో తాత పేరు మీద ఉన్న 20 సెంట్ల భూమిని తల్లిదండ్రులకు తెలియకుండా అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్గవ్ తల్లిదండ్రులు ఆ రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలపై తాము సంతకాలు చేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన భార్గవ్ సంతకం చేయకపోతే మీ ఇద్దరినీ చంపడం ఖాయమని బెదిరించి బయటకు వెళ్లిపోయాడు. చంపేస్తే పోలా.. కొడుకు అన్నంతపని చేస్తాడని భయపడి ఆ తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం వాడి చేతిలో చచ్చేకన్నా.. వాడినే చంపేస్తా పోలా.. అని నిర్ణయించుకున్నారు. భార్గవ్ గత నెల 29న అర్దరాత్రి సమయంలో బాగా మద్యం సేవించి ఇంటికి తిరిగి వచ్చాడు. తాగిన మైకంలో తల్లిదండ్రులతో మళ్లీ గొడవ పడటంతోపాటు వారిని బాగా కొట్టాడు. తదనంతరం పడక గదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోయాడని నిర్దారించుకుని ఆ సమయంలో తల్లి కొడుకు కాళ్లు గట్టిగా పట్టుకోగా తండ్రి గొంతును తాడుతో గట్టిగా బిగించి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని దగ్గరలో ఉన్న వాటర్ ప్లాంట్ దగ్గరకు తీసుకెళ్లి పడేశారు’ అని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును సీఐ శ్రీధర్తో పాటు పట్టణ ఎస్ఐ హేమంత్కుమార్లు విచారించినట్లు డీఎస్పీ తెలియజేశారు. -
122 మంది సీఐలకు ప్రమోషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో పదోన్నతుల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న122 మంది సీఐలను డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎస్పీలుగా పని చేస్తున్న 55 మందిని వివిధ పోస్టుల్లోకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
జూనియర్లకు సీనియర్ల సెల్యూట్!
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీస్, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పోలీసుశాఖలో రెండు రోజుల క్రితం కల్పించిన పదోన్నతులు, పోస్టింగ్ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. జూనియర్లకు సీనియర్లు సెల్యూట్ కొట్టడంతోపాటు వారి కిందే పని చేసే పరిస్థితి తలెత్తుతోంది. అగ్జిలేటరీ ప్రమోషన్ల పేరుతో ఇష్టారాజ్యంగా కల్పించిన పదోన్నతులు పోలీసుశాఖను కుదిపేస్తోంది. జూనియర్ల కింద సీనియర్లు.. సీనియర్ అధికారులు డీఎస్పీలుగా పనిచేస్తుంటే జూనియర్ అధికారులు అదనపు ఎస్పీలుగా, నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు, పోస్టిం గ్లు పొందడం కలకలం రేపుతోంది. 1989 బ్యాచ్కు చెందిన 27 మంది అధికారులు డీఎస్పీలుగా పనిచేస్తుండగా వారిపైన సూపర్ విజన్గా 1985 లేదా డైరెక్ట్ రిక్రూటీస్ అధికారులను నియమిస్తే సమస్య ఉండేది కాదు. కానీ వారిపై ఇన్చార్జిలుగా 1991, 1995 బ్యాచ్లకు చెందిన అధికారులను నియమించడం వివాదాస్పదమవుతోంది. ఇలా 12 మందికి పదోన్నతులు, పోస్టింగులు కల్పించి పోలీసుశాఖ వివాదంలో ఇరుక్కుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదోన్నతులకు ఓకే.. పోస్టింగ్స్పై వివాదం... మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి పనిచేసినందుకు అగ్జిలేటరీ పదోన్నతులు కల్పించారు. ఇక్కడ తప్పు లేదనుకున్నా కనీసం పోస్టింగులు కల్పించే క్రమంలో సంబంధిత ప్రాంతాల్లో సీనియర్లున్నారా లేక జూనియర్లున్నారా, అక్కడ నియమిస్తే వివాదం ఏర్పడే అవకాశం ఉందా అనే అంశాలను ఉన్నతాధికారులు కసరత్తు చేయాల్సి ఉంటుంది. వారం పది రోజులుగా పదోన్నతులు, పోస్టింగ్లపై కసరత్తు చేసినా అధికారులు ఇలాంటి వివాదాస్పదమయ్యే అంశాలపై దృష్టి సారించకపోవడం ఆందోళనకు గురిచేసిందని 1989 బ్యాచ్కు చెందిన 27 మంది అధికారులు అభిప్రాయపడ్డారు. సీనియర్లమైన తాము ఏళ్ల పాటు తమ కింద పనిచేసిన వారికి సెల్యూట్ చేయాల్సి రావడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఐదేళ్ల పేరుతో... పదోన్నతులను సీనియారిటీ, బ్యాచ్నుబట్టి కల్పిస్తారు. పోలీసుశాఖలో మాత్రం ఐదేళ్ల సర్వీసు పేరుతో అడ్హాక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించారు. ఇందులోనూ అగ్జిలేటరీ పేరుతో జూనియర్ బ్యాచ్లకు అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీలను అంటగట్టారు. రాష్ట్ర పోలీసుశాఖలో బ్యాచ్ల సీనియారిటీ కాకుండా రేంజ్ల సీనియా రిటీ పేరుతో పదోన్నతులు కల్పించడం, అగ్జిలేటరీ పేరుతో కావాల్సిన వాళ్లని అందలం ఎక్కించ డం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని సీనియర్ ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడ్డారు. మార్పుచేర్పులు చేస్తాం ‘‘గతంలో అగ్జిలేటరీ పద్ధతి ద్వారా కొందరు అధికారులు సీనియర్లకన్నా ముందు పదోన్నతులు పొందారు. దీంతో తదుపరి పదోన్నతికి కావాల్సిన అర్హత ముందుగానే పొందడంతో వారికి పదోన్నతి కల్పించాం. ఐదేళ్ల కనీస సర్వీసుపెట్టి అడ్హాక్ పద్ధతిలో పదోన్నతులు ఇచ్చాం. అయితే పోస్టింగ్ల విషయంలో సీనియర్లు ఉన్న చోట జూనియర్ బ్యాచ్ల అధికారులను నియమించడం ఇబ్బందికరమే. దీనిపై ఉన్నతాధికారులతో పునఃసమీక్షించి మార్పుచేర్పులు చేస్తాం.’’ – అనురాగ్శర్మ, డీజీపీ -
డామిట్...భూపతి అడ్డం తిరిగాడే?
గేదెలరాజు హత్య కేసే కాదు.. విచారణా కలకలం రేపుతోంది.. ఆ కేసులో డీఎస్పీ రవిబాబు అరెస్టు.. అతన్ని ఏ1గా చూపించడం తదితర పరిణామాలు ఈ కేసు మిస్టరీ వీడిపోయిందని పోలీసులతో అంతా భావించారు.ఇక ఏ2గా ఉన్న భూపతిరాజు దొరికితే కేసు పూర్తిగా క్లియర్ అయిపోయినట్లేనన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ.. ఊహించని ట్విస్ట్ దర్యాప్తు అధికారులకు సవాల్ విసరుతోంది.భూపతిరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మంగళవారం సాయంత్రం మీడియాకు ఉప్పందింది...అంతలోనే విచారణలో ఆయన పోలీసులకు ఎదురుతిరిగాడని తెలుస్తోంది.. గేదెలరాజు హత్యోదంతంతో డీఎస్పీకి సంబంధం ఉందనేలా ఆయనతో చెప్పించాక.. అరెస్టు చూపించాలన్న పోలీసులు ప్రణాళికను భూపతి విచ్ఛిన్నం చేశాడని సమాచారం. ఇప్పటికే ఏ1 డీఎస్పీ రవిబాబు విచారణ జరుగుతున్న తరుణంలో భూపతి వైఖరి రవిబాబుకు అనుకూలంగా ఉండటంతో విచారణాధికారులు అవాక్కయ్యారు..కేసు తేలిపోతుందనుకుంటున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో ‘డామిట్.. భూపతి అడ్డం తిరిగాడు’.. కేసు మళ్లీ మొదటికొస్తోందని నిట్టూరుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసు విచారణ ఊహించని మలుపులు తిరుగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు.. ఏ1 డీఎస్పీ దాసరి రవిబాబు విచారణ సవ్యంగా సాగుతోందనుకుంటున్న దశలో ఏ2, క్షత్రియభేరి పత్రిక యజమాని భూపతిరాజు పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆ హత్య కేసులో భూపతిరాజును ఇప్పటికీ అరెస్టు చూపించలేదు. అయితే రెండు వారాల కిందటి నుంచే అతను పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం విస్తృతంగా సాగింది. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో కొన్నాళ్లు.. ఆ తర్వాత న్యూపోర్టు.. అటు తర్వాత హార్బర్ పోలీస్స్టేషన్లలో తమదైన శైలిలో భూపతిని విచారిస్తున్నారన్న వాదనలు కొనసాగాయి. ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగానే భూపతి భార్య, కుటుంబసభ్యులు.. అతని ఆచూకీ విషయంలో ఏమాత్రం ఆందోళన చెందిన దాఖలాలే కనిపించలేదు. ఆ వాదనలకు బలం చేకూర్చే విధంగా పోలీసులు మంగళవారం వ్యూహాత్మకంగా ఓ ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భూపతిని మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో దువ్వాడ బ్రిడ్జి సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు మీడియాకు ఉప్పందించారు. రవిబాబును జుడీషియల్ కస్టడీ నుంచి నాలుగురోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో మంగళవారం నాటికి రెండురోజులు పూర్తిఅయ్యింది. ఈ నేపథ్యంలో కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని భావించిన పోలీసులు అందులో భాగంగానే భూపతిని తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. నేడో రేపో అధికారికంగా అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయి. న్యూపోర్ట్ స్టేషన్లో ఆ ఇద్దరి విచారణ? ఏ1 రవిబాబు, ఏ2 భూపతిరాజులను న్యూపోర్ట్ పోలీస్స్టేషన్లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. రవిబాబు వివిధ హోదాల్లో నగరంలోనే పోలీసు అధికారిగా పనిచేసిన పరిస్థితుల్లో అతనికి పరిచయం లేని పోలీసులతోనే విచారణ పర్వం కొనసాగిస్తున్నట్టు సమాచారం. కాగా, విచారణలో భూపతిరాజు పోలీసు అధికారుల వాదనలకు పూర్తిగా విరుద్ధమైన సమాధానాలు ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. డీఎస్పీ రవిబాబు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని వాదనలు వినవస్తున్న నేపథ్యంలో భూపతిరాజు ఆ హత్య కేసులో డీఎస్పీ ప్రమేయం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. గేదెలరాజును హత్య చేసిన తర్వాత భూపతిరాజు.. డీఎస్పీ రవిబాబుకు ఫోన్ చేసి.. మీ ప్రత్యర్థిని చంపేశాం.. అని మాట్లాడినట్టు పోలీసుల వద్దా పక్కా సమాచారం ఉందని అంటున్నారు. ఈ ఫోన్ కాల్ ఆధారంగానే పోలీసులు డీఎస్పీ పాత్రను నిర్థారించి.. ఆ మేరకు దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా భూపతిరాజు ‘తాను ఫోన్ చేసిన మాట వాస్తవమేనని,.. కానీ ఆ హత్య డీల్తో డీఎస్పీకి సంబంధం లేదని’ చెప్పినట్టు తెలుస్తోంది. మరి అదే నిజమైతే.. ‘మీ ఇద్దరి మధ్య ఆర్ధిక లావాదేవీలు ఎందుకు నడిచాయి.. రవిబాబు కుమారుడి పేరిట పది లక్షల మేర బ్యాంక్ చెక్లు నీకెందుకు ఇచ్చారు’ అని పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించగా.. ఈ హత్య కేసుతో ఆ డబ్బుకు ఎటువంటి సంబంధం లేదని, రియల్ ఎస్టేట్ సంబంధాల నేపథ్యంలోనే తమ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు భూపతి చెప్పినట్టు తెలుస్తోంది. గేదెలరాజు తనతో పైకి సన్నిహితంగా ఉంటూనే భూ లావాదేవీల్లో తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపథ్యంలోనే అతన్ని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నామని భూపతి చెప్పుకొస్తున్నట్టు సమాచారం. భూపతి ఇలా అడ్డం తిరగడంతో విచారణ ఎలా ముగించాలన్నది పోలీసులకు ఇప్పుడు సవాల్గా మారిందని అంటున్నారు. పద్మలత మృతి కేసు దర్యాప్తు వేగవంతం ఇప్పటికే పోలీసులకు లొంగిపోయిన ఓ రియల్టర్, భూపతిరాజు కారు డ్రైవర్ కేశవ్ను హార్పర్ పోలీస్స్టేషన్లో విచారిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, మాజీ ఎంపీపీ కాకర పద్మలత అనుమానాస్పద మృతి కేసు విచారణను కూడా గాజువాక పోలీసులు వేగవంతం చేశారు. రవిబాబు ప్రోద్బలంతోనే పద్మలతను గేదెల రాజు విషప్రయోగంతో మట్టుబెట్టాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆమె చనిపోయే ముందు చికిత్స చేసిన గాజువాకకు చెందిన ఓ వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఆహా.. ఓహో!
రాజులను ఎంత పొగిడితే అంత లబ్ధి చేకూరేది. ఈ సత్యం గ్రహించిన డీఎస్పీ కూడా.. మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. అది కూడా ఖాకీ డ్రెస్లో ఉండగానే. ఏందబ్బా.. ఈయన ఇంతలా పల్లకీ మోస్తున్నాడని ఆలోచిస్తే అసలు విషయం ఆలస్యంగా అవగతమైన ప్రజలు కూడా ఆయన తీరు పట్ల ఆహా.. ఓహో అంటూ నవ్వుకున్నారు. రాయదుర్గం: స్థానిక కేటీఎస్ డిగ్రీ కళాశాలలో హెరిటేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈజే నరేష్కుమార్(జయసుమన్) రచించిన రాయదుర్గం చరిత్ర–సంస్కృతి అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటయింది. మంత్రి కాలవతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి చంద్రశేఖర్, ఆర్డీఓ రామక్రిష్ణారెడ్డి, డీఎస్పీ టీఎస్ వెంకటరమణ పాల్గొన్నారు. కార్యక్రమంలో వక్తలందరూ రాయదుర్గం చరిత్ర, రచయిత శైలిపై మాట్లాడితే.. డీఎస్పీ మాత్రం మంత్రి కాలవను పొగడ్తలతో ముంచెత్తారు. ఉప ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు అత్యధిక ఓట్లతో గెలుపొందడం ఓ చరిత్ర అంటూ ప్రారంభించారు. అనంతరం మంత్రి పదవి, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇదే నియోజకవర్గాన్ని వరించడం ఓ చరిత్ర అన్నారు. మంత్రి కాలవ శ్రీనివాసులు నీరు చెట్టు, వరుణయాగం, శ్రీనివాస కల్యాణం, జానపద జాతర, మెగాహెల్త్ క్యాంప్ తదితర కార్యక్రమాలను నిర్వహించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. రాయదుర్గం ప్రాంతాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలే కాలవ శ్రీనివాసులు రూపంలో రాయదుర్గం ప్రాంతానికి వచ్చారని కితాబిచ్చారు. డివిజనల్ స్థాయి అధికారి హోదాలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా నిలవాల్సిన ఆయన తీరు సమావేశంలో చర్చనీయాంశమైంది. త్వరలో డీఎస్పీల బదిలీలు ఉండటంతోనే ఈ పల్లకీ మోతకు కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. -
ఒప్పందానికి తలొగ్గలేదని..కేసులు.. రౌడీషీట్లు
సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు..కానీ ఏకంగా సివిల్ తాగాదాలే సృష్టించడం..కేసులు పెట్టించడం..ఆనక చర్చల పేరుతో బెదిరింపులకు,ఒత్తిళ్లకు పాల్పడటం.. వినకపోతే రౌడీషీట్లుతెరవడం.. జైలు పాల్జేయడం..ఇదీ ఆ పోలీసు అధికారి స్టైల్.. ఇటువంటి దందాలతో కోట్లు దండుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య..ఆ అధికారి మరెవరో కాదు.. రాష్ట్రవ్యాప్తంగాసంచలనం సృష్టించిన రౌడీషీటర్ గేదెలరాజుహత్య కేసులో ఏ1 నిందితుడిగా జైలుపాలైనఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబు!..మధురవాడ, గాజువాకల్లో ఏసీపీగా పని చేస్తున్నసమయంలో ఆయన చేసిన సెటిల్మెంట్లు, దందాలు.. ఆయన అరెస్టు అనంతరం వెలుగులోకి వస్తున్నాయి.మధురవాడ పరిధి రేవళ్లపాలేనికి చెందినపిళ్లా కుటుంబీకులను ఓ సివిల్ వివాదంలోరౌడీషీట్లతో వేధింపులకు గురిచేసిన రవిబాబు దురాగతం వెలుగులోకి వచ్చింది. వారసత్వహక్కుగా వారికి సంక్రమించిన రూ.4.5 కోట్ల విలువైన భూమిని ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అప్పగించేందుకు ఒప్పందం చేసుకొని పిళ్లా కుటుంబీకులపై ఆయన పోలీస్ పవర్ ప్రయోగించారు. సాక్షి, విశాఖపట్నం: మధురవాడ శివారు రేవళ్లపాలెం గ్రామానికి చెందిన పిళ్లా అప్పారావుకు అదే గ్రామ పరిధిలో జాతీయ రహదారికి కూతవేటు దూరంలోని సర్వే నెం.211/1,2లలో 23.5 సెంట్ల భూమి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ విలువ గజం రూ.40 వేలు పలుకుతోంది. ఈ లెక్కన ఆ భూమి విలువ నాలుగున్నర కోట్ల పైమాటే. అప్పారావు తదనంతరం ఆ భూమి ఆయన సంతానమైన ఈశ్వరరావు, హిమాలయ, కనకరాజు, శ్రీనివాసరావు, రమేష్, భారతిలకు వారసత్వ హక్కుగా సంక్రమిచింది. వీరిలో శ్రీనివాసరావు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య వెంకటలక్ష్మికు హక్కు లభించింది. అప్పారావు భూమిని ఆనుకొని నాగోతి అప్పలసూరి అనే వ్యక్తికి 24 సెంట్ల భూమి ఉండేది. దాన్ని ఎప్పుడో ఆయన వేరొకరికి అమ్మేశాడు. అయితే అదే గ్రామానికి అతని వారసుడిగా చెప్పుకొంటున్న నాగోతి లక్ష్మణరావు అనే వ్యక్తి విజయవాడకు చెందిన నాగోతి మొగ్గయ్య సత్యనారాయణ, చలపతిరావు, తొత్తడి కనకలక్ష్మిలతో కలిసి ఈ భూమిని దస్తావేజు నెం.5053/2007తో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా రిజిస్ట్రీ చేయించుకున్నట్టు రికార్డులు సృష్టించారు. పనిలో పనిగా అదే సర్వే నెంబరులో ఉన్న పిళ్లా కుటుంబీకుల భూమిని కాజేయాలనుకున్నారు. ఆ భూమి వారసుల్లో ఒకడైన పిళ్లా రమేష్ను లోబర్చుకొని తప్పుడు దృవపత్రాలతో మధురవాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నెం.609/2009తో జనరల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ పత్రాల ఆధారంతో ఆ భూమిని హైదరాబాద్కు చెందిన ఎస్పి సాప్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన సాగిరెడ్డి పుల్లారెడ్డి పేరిట అమ్మేసి దస్తావేజు నెం.716/2011గా రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. పిళ్లా కుటుంబీకుల అభ్యంతరం : ఆ భూమిని సొంతం చేసుకున్న సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు.. వెంటనే రంగంలోకి దిగారు. భూమిలో ఉన్న షెడ్లను తొలగించి చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. అప్పుటికి గానీ పిళ్లా వారసులకు విషయం తెలియలేదు. తమ ప్రమేయం లేకుండా తమ సోదరుడు రమేష్ ఉమ్మడి ఆస్తిని అమ్మేసినట్లు గుర్తించారు. తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆస్తిని ఎలా కొనుగోలు చేస్తారని నిలయదీయడంతో వీరితో ఇబ్బంది తప్పదని గుర్తించిన సాప్ట్వేర్ కంపెనీ యజమాని ఆ భూమిని తనకు అమ్మిన వ్యక్తులను ఆశ్రయించారు. పిళ్లా వారసులతో కూడా హక్కు విడుదల పత్రాలపై సంతకాలు చేయించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పట్లో మధురవాడ ఏసీపీగా పని చేస్తున్న దాసరి రవిబాబుకు ఈ వివాదం గురించి తెలిసింది. రవిబాబు రంగప్రవేశం : వెంటనే రంగంలోకి దిగిన రవిబాబు వివాదాన్ని సెటిల్ చేస్తానని సాప్ట్వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి పీఎంపాలెం సీఐ అప్పలరాజు, ఎస్సై దివాకర్లపై ఒత్తిడి తెచ్చి.. పిళ్లా వారసులపై వేధింపులు ప్రారంభించాడు. అంతేకాకుండా ఏసీపీ తరఫున దళారులుగా వ్యవహరించిన పట్నాయక్, శ్రీనులు కూడా రెచ్చిపోయారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏజెంట్లలో ఒకరైన కాటుపల్లి అప్పారావుతో పీఎంపాలెంలో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసులు బనాయించారు. పిళ్లా వారసులైన ఈశ్వరరావు, హిమాలయ, కనకరాజుల ఇళ్లకు చీటికిమాటికి వెళ్లి బెదిరించడం.. స్టేషన్కు పిలిపించి చితకబాదడం చేసేవారు. అయినా సరే సంతకాలు పెట్టేందుకు వారు అంగీకరించలేదు. లొంగకపోవడంతో కొత్త స్కెచ్ : వారసులు లొంగకపోవడం.. సాప్ట్వేర్ కంపెనీ నుంచి ఒత్తిడి పెరగడంతో రవిబాబు మరో స్కెచ్ వేశాడు. నాగోతి లక్ష్మణరావు చేయించుకున్న మొదటి రిజిస్ట్రేషన్ (దస్తావేజు. 5053 / 2007)ను 2015 ఏప్రిల్ 9న రద్దు చేయించి, మళ్లీ అదే వ్యక్తులతో విశాఖకు చెందిన కొల్లి కృష్ణచౌదరికి దస్తావేజు నెం.2487/ 2015తో జనరల్ పవర్ రిజిస్ట్రీ చేయించాడు. ఆయన ద్వారా సాప్ట్వేర్ కంపెనీకి కట్టబెట్టాలన్నది ఆయన ప్లాన్. ఈ దస్తావేజులో కనీసం సాక్షులుగానైనా సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. చివరికి భర్తలేని పిళ్లా వెంకటలక్ష్మిపై మూడు కేసులు బనాయించి జైలు పాల్జేశారు. పోతిన భారతిపై రెండు, పిళ్లా హిమాలయపై మూడు కేసులు నమోదు చేశారు. అయినా వారు బెదరలేదు. తన మాట చెల్లలేదన్న అక్కసుతో హిమాలయ, కనకరాజులపై రవిబాబు ఏకంగా రౌడీషీట్ తెరిచాడు. బదిలీ అయినా ఆగని వేధింపులు : రవిబాబు బదిలీ అయిన తర్వాత కూడా వీరిపై వేధింపులు ఆగలేదు. తన అనుచరులైన పట్నాయక్, శ్రీనుల ద్వారా రవిబాబు వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రహరీ నిర్మించిన సాప్ట్వేర్ కంపెనీ కానీ, ఆ తర్వాత రవిబాబు ప్రోద్భలంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొల్లి కృష్ణచౌదరి గానీ ఏనాడు ఈ స్థలంలో అడుగు పెట్టలేదు. కానీ పట్నాయక్ మాత్రం ఈ స్థలంలోకి చొరబడి ఏకంగా తన పేరిట విద్యుత్ మీటర్ కూడా వేయించేసేకున్నాడు. స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా మామూళ్లు ముట్టజెప్పి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ క నెక్షన్ వేయించుకున్నాడు. ఎప్పటికైనా ఈ స్థలం తమదేనన్న భావనతో తరచూ వీర్ని వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. హత్య కేసులో రవి బాబు అరెస్ట్ కావడంతో ఇప్పటికైనా తమకు విముక్తి క ల్పించాలని, తమ భూమి తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించాం హక్కు విడుదల పత్రాలపై సంతకాలు పెట్టలేదన్న అక్కసుతో నాపైన, నా సోదరుడిపైన రౌడీషీట్ తెరిచారు. చిత్రహింసలకు గురి చేశారు. ఎన్నోసార్లు రవిబాబే నేరుగా మమ్మల్ని పిలిపించి వార్నింగ్లు ఇచ్చేవారు. సంతకాలు చేయకపోతే అంతు చూస్తానని బెదిరించేవారు. దాంతో ఏసీపీ, సీఐ, ఎస్సైలపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు కూడా చేశాం.– పిళ్లా హిమాలయ నిద్రలేని రాత్రులెన్నో గడిపాం కోట్ల విలువైన మా స్థలాన్ని కొట్టేయాలని రవిబాబు యత్నించాడు. సాప్ట్వేర్ కంపెనీ నుంచి రూ.కోటి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు తెలిసింది. ఎలాగైనా కాజేసి సాప్ట్వేర్ కంపెనీకి కాకపోతే మరో కంపెనీకి అమ్మేయాలని ప్రయత్నించాడు. ఆ ఒత్తిళ్లతో నిద్రలేని రాత్రులెన్నో గడిపాం. నిత్యం మానసిక క్షోభకు గురవుతున్నాం. – పిళ్లా కనకరాజు -
గుట్టు విప్పిన భూపతిరాజు?
-
గుట్టు విప్పిన భూపతిరాజు?
♦ కుటుంబానికి సన్నిహితుడినంటూ ఇంటివాళ్లకు దగ్గరైన వ్యక్తి కల్లబొల్లి మాటలు చెప్పి వాళ్ల విశ్వాసాన్ని సంపాదిస్తాడు. అదను చూసుకుని అన్నంలో విషం కలిపేసి విలన్ గ్యాంగ్కు ఇబ్బందిగా మారిన ఆ కుటుంబంలో ఒకరిని చంపేస్తాడు.. ♦ విలన్ గ్యాంగ్కు చెందిన కీలక సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకుని పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తున్న గూండాను, మరో అనుచరుడు నమ్మించి ఓ చోటుకు పిలిచి దారుణంగా అంతం చేస్తాడు. మన సినిమాలు చాలా వాటిలో తరచూ కనిపించే ఘట్టాలివి. నిత్య జీవితంలో అసాధ్యమనిపించే పరిణామాలివి. ♦ కానీ డీఎస్పీ రవిబాబు ఘాతుకాల్లో ఈ రెండూ వాస్తవంగా జరిగాయి. కల్పన కన్నా వాస్తవాలు విభ్రాంతికరంగా ఉంటాయనడానికి ఇవి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : నమ్మించి వంచించి హతమార్చడం, తడిగుడ్డతో గొంతు కోయడం వంటి చాలా ఘాతుకాలు సినిమాల్లో చూసినప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. అదంతా కల్పన అని తెలిసికూడా ఇంత ఘోరమా.. అని శరీరం జలదరిస్తుంది. అయితే వాస్తవ జీవితంలోనూ ఇలాటి కల్పనలకు మించిన దిగ్భ్రాంతికర పరిణామాలు చోటుచేసుకుంటాయని గేదెల రాజు, పద్మలతల హత్యోదంతాలను గమనిస్తే అర్థమై నివ్వెరపోవడం మనవంతవుతుంది. సుపారీలిచ్చి కిరాయి మనుషులతో హత్యలు చేయించే సంస్కృతి మన చుట్టూ ఇంతగా అభివృద్ధి చెందినందుకు గుండెల్లో అలజడి సుడులు తిరుగుతుంది. నమ్మకం, స్నేహం ముసుగులో అంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గేదెల రాజు, కాకర్ల పద్మలత హత్యోదంతాలు నమ్మకం, స్నేహం ముసుగులో చోటు చేసుకున్నాయి. అవస్థలు పడుతున్న వేళ అండగా ఉంటాడని నమ్మిన మాజీ ఎంపీపీ కాకర్ల పద్మలతను మరింతగా నమ్మించి, వంచించి.. ఆమెకు కాస్తయినా అనుమానం రాకుండా మట్టుపెట్టాడు కొప్పెర్ల సత్యనారాయణ రాజు అలియాస్ గేదెల రాజు. అక్రమాలలోనైనా స్నేహంగా ఉండే గేదెల రాజును నమ్మించి తన కార్యాలయానికి రప్పించి కిరాయి గూండాలో క్రూరంగా హతమార్పించాడు భూపతిరాజు శ్రీనివాసరాజు. ఈ రెండు హత్యలకు మూల కారణం ఎ–1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు నేర స్వభావమేనని పోలీసులకు లభించిన సమాచారం బట్టి స్పష్టమవుతోంది. ఆయన వివాహేతర సంబంధం ఈ ఘాతుకాలకు తెర తీయించింది. ఇద్దరి ప్రాణాలను బలికోరింది. విషమే సాధనం యలమంచిలి సీఐగా పనిచేసిన సమయంలో మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుమార్తె పద్మలతతో రవిబాబుకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆరేళ్ల పాటు సహజీవనం సాగించాక పద్మలత పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో వివాదం మొదలైంది. పెళ్లికి రవిబాబు ముఖం చాటేశారని 2016 మార్చిలో డీజీపీకి పద్మలత ఫిర్యాదు చేయడంతో ఆమెను వదిలించుకునే దుర్మార్గానికి రవిబాబు పథక రచన చేశారు. గాజువాకకు చెందిన రౌడీషీటర్ గేదెల రాజు, క్షత్రియ భేరి పత్రిక ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజుతో మంతనాలు జరిపారు. తోడల్లుడి స్థలాన్ని అమ్మి పద్మలతకు కొంత మొత్తం ముట్టజెప్పినా ఆమె పెళ్లికి పట్టుబట్టడంతో ఇక అడ్డు తొలగించుకోవడాలన్న నిర్ణయానికి రవిబాబు వచ్చారు. ఇందుకు గేదెల రాజుతో రూ.కోటి మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. భూపతిరాజు ద్వారా రూ.50 లక్షలు ఇప్పించారు. రంగంలోకి దిగిన గేదెల రాజు మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్నాడు. రవిబాబుతో వివాదాన్ని పరిష్కరిస్తానని నమ్మించి ఆమెను గాజువాకలో ఓహŸటల్కు తీసుకొచ్చాడు. మాట్లాడుకున్నాక అక్కడే ఉన్న రవిబాబు బిర్యానీలో విషం కలిపి పెట్టగా, అది తిన్న పద్మలత వెంటనే వాంతులతో అపస్మారక స్థితికి చేరుకోగా ఆమెను కేజీహెచ్కు తరలించారు. చనిపోతుందనుకున్న ఆమె కోలుకోవడంతో, గేదెల రాజు మరో స్కెచ్ వేశాడు. పూర్తిగా నయమయ్యేవరకు తన ఇంట్లోనే ఉండాలంటూ ఒత్తిడి తీసుకొచ్చి పద్మలతను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నెమ్మదిగా విష ప్రయోగంచేసి మంచాన పడేటట్టు చేశాడు. రేకపల్లిలో మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్తే నయం అవుతుందని పద్మలత తండ్రిని నమ్మించి, వేరే వాహనంలో పద్మలత కుమారుడు మురళి, అతని మిత్రుడు కృష్ణ ఉండగా, గ్రామానికి కూత వేటు దూరంలో ఉండగా హతమార్చాడు. గుండెపోటువచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించి దగ్గరుండి అంత్యక్రియలు చేయించాడు. స్నేహమే ఆయుధం తర్వాత గేదెల రాజు హత్య విషయంలో మళ్లీ అదే నమ్మక ద్రోహం కీలకమైంది. స్నేహం ఆ రౌడీ షీటర్ అంతానికి కారణమైంది. గేదెల రాజు, భూపతిరాజు శ్రీనివాసరాజు సుమారు పదిహేనేళ్లుగా స్నేహం పేరుతో మెలిసి తిరిగారు. సెటిల్మెంట్లు..దందాలు చేశారు. విశాఖ లోనే కాక రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆర్థికపరమైన సెటిల్మెంట్లు చేసేవారు. ఈ ఆర్థిక లావాదేవీలే పొరపొచ్చాలకు మూలమయ్యాయి. కొన్ని సెటిల్మెంట్లలో తనకు నష్టం కలిగించాడన్న అక్కసుతో గేదెలరాజుపై భూపతిరాజు కక్ష పెంచుకున్నా, గేదెల రాజు మాత్రం అతడిని ఎక్కువగానే విశ్వసించాడు. ఆ నమ్మకమే అతని పాలిట మృత్యువైంది. పద్మలత హత్య కోసం సెటిల్మెంట్ చేసుకున్న రూ.కోటి మొత్తంలో ఇంకా తనకు రావాల్సిన రూ. 50 లక్షల కోసం అతడు డీఎస్పీ రవిబాబుపై ఒత్తిడి తీసుకురావడం.. తన వద్ద రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందంటూ బెదిరించడంతో గేదెల రాజును కూడా అడ్డు తొలగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన రవిబాబు ఆ విషయాన్ని భూపతిరాజుకు చెప్పారు. తన కక్ష తీరడానికి ఇదే అవకాశంగా భావించిన భూపతిరాజు హత్యకు పథక రచన చేశాడు. అప్పటివరకు సఖ్యతను తగ్గించిన భూపతిరాజు, రవిబాబు నుంచి రూ.10 లక్షల సుపారీ తీసు కున్న తర్వాత గేదెల రాజుతో ముందెన్నడూ లేని సాన్నిహిత్యాన్ని ప్రదర్శించారు. తన కార్యాలయానికి వస్తే రవిబాబు చెల్లించాల్సిన సొమ్ము కోసం మాట్లాడదామని నమ్మబలికాడు. దీంతో గేదెల రాజు అక్కడికి వెళ్లగా, అతడిని మాటల్లో పెట్టి భూపతిరాజు కిరాయి మనుషులతో హత్య చేయించాడు. శవాన్ని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పు పెట్టి తగలబెట్టాడు. మొత్తం మీద చూస్తే రెండు హత్యలూ నయవంచనకు, నమ్మక ద్రోహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రవిబాబు అకృత్యంతో పద్మలత జీవితం, అతడి క్రూరత్వంతో గేదెల రాజు వ్యూహం ముగిసిపోయాయి. సుపారీ తీసుకుని నిస్సహాయురాలిని మట్టుపెట్టిన గేదెల రాజుకూ చివరికి అదే సుపారీ మృత్యుపాశం కావడం ఈ ఉదంతంలో విస్మరించలేని వాస్తవం. -
నిన్న దొర నేడు చెర
నిన్న మొన్నటి వరకు ఆయనో దొర.. పోలీస్ దొర.. కానీ నేడు ఆయనకు తప్పలేదు చెర.. ఎన్నో కేసులను ఛేదించారు.. ఎందరో నిందితులను తన వెనుక నిలబెట్టించి మీడియాకు చూపించారు.. కానీ నేడాయనే తన సహచరుల వెనుక నిందితుడిలా తలదించుకొని, చేతులు కట్టుకొని నిలబడాల్సిన దుస్థితి.. అధికారం అడ్డదారులు తొక్కితే.. ఎంతటివారైనా అదఃపాతాళానికి దిగజారిపోతారనడానికి నిలువెత్తు సాక్ష్యమే డీఎస్పీ దాసరి రవిబాబు.. మాజీ ఎంపీపీ కాకర పద్మలత, రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న ఆయన్ను శనివారం పోలీసు అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య దీనవదనంతో చేతులు కట్టుకొని నిలబడిన దృశ్యం అక్కడ గంభీర వాతావరణాన్నే సృష్టించింది. చోడవరంలో లొంగిపోయే ముందు తానేం నేరం చేయలేదని.. కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని రవిబాబు చెప్పగా.. గేదెలరాజును తానే హత్య చేయించానని అంగీకరించారని.. డీసీపీ రవికుమార్మూర్తి తాజాగా ప్రకటించడం విశేషం.. ఈ హత్యకు ముందు జరిగిన సెటిల్మెంట్లో పాల్గొన్న భూపతిరాజు సహా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని.. హత్యకు బ్యాంకాక్లో కుట్ర పన్నారన్న అంశంపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించడంతో రవిబాబు పూర్తిగా ఇరుక్కుపోయినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు ఎన్నో కేసుల్లో ఎంతో మంది ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ రవిబాబు శనివారం తానే ముద్దాయిగా మారి తన సహచర అధికారుల వెనుక చేతులు కట్టుకొని నిలబడ్డారు. గేదెల రాజు హత్య కేసులో మీడియా ముందు తనను ప్రవేశపెట్టినప్పుడు డీసీపీ రవికుమార్మూర్తి తనను ఉద్దేశించి చెప్పిన వివరాలను, చేసిన వ్యాఖ్యలను మౌనంగా విన్నారు. ఏసీపీగా పనిచేసినప్పుడు ఇదే సీపీ కార్యాలయంలో తాను ఎదురుపడితే హోంగార్డ్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు శాల్యూట్ చేసేవారే.. ఇప్పుడు ఆయన్ను చూసి ముఖం తిప్పుకున్న దయనీయ స్థితి. తాను పోస్టింగ్లు వేయించిన వారు.. తన కింద పని చేసిన వారు సైతం నోరు విప్పి పలకరించలేని పరిస్థితి కల్పించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు స్మరించుకుంటున్న వేళ.. అదే పోలీసు వ్యవస్థకు కళంకం ఓ పోలీస్ అధికారినే సమాజం ముందు నిల్చోబెట్టాల్సి రావడం పోలీసువర్గాలను కూడా ఇబ్బందికరంగా మారింది. నిన్న రెవెన్యూ..నేడు పోలీస్..బజారున పడ్డ పరువు ఇప్పటికే రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాలతో విశాఖ జిల్లా రెవెన్యూ శాఖ పరువు రాష్ట్ర స్థాయిలో మంటగలిసింది. ఇప్పుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని దందాలు, సెటిల్మెంట్లు చేయడమే కాకుండా అడ్డువచ్చిన వారిని హత్యలు చేయించిన డీఎస్పీ రవిబాబు ఉదంతంతో పోలీసు శాఖ పరువు కూడా బజారుపడింది. ప్రజల రక్షణ కోసం ప్రాణాలిచ్చిన పోలీసులున్నట్టే.. ప్రజల మానప్రాణాలను తమ స్వార్థానికి బలిచేసే వారూ ఉన్నారని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. కాగా నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం చోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన రవిబాబును శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో లా అండ్ ఆర్డర్ డీసీపీ–2 రవికుమార్ మూర్తి మీడియా ఎదుట హాజరుపర్చారు. అతన్ని నేరుగా కోర్టులోనే ప్రవేశపెట్టాలని మొదట పోలీసులు భావించారు. అయితే ప్రధాన ముద్దాయిని మీడియా ఎదుట ప్రవేశపెడతారా.. లేదా అంటూ విస్తృత చర్చ జరిగిన నేపథ్యంలో విమర్శలకు తావు లేకుండా డీఎస్పీని మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మీడియా ముందుకు తీసుకొచ్చారు. మీడియాలో మాట్లాడనివ్వలేదు ఎలాంటి ముసుగు లేకుండానే రవిబాబును మీడియా ముందు హాజరుపర్చారు. చోడవరంలో లొంగిపోయినప్పుడు ధరించిన దుస్తులతోనే రవిబాబును తీసుకురాగా.. మీడియాతో మాట్లాడనీయకుండానే ఫోటోలు మాత్రమే తీయించి ఆ వెంటనే పంపించేయడం విమర్శలకు తావిచ్చింది. సాధారణంగా మీడియా ఎదుట హాజరుపర్చిన నిందితులను ప్రెస్మీట్ పూర్తయ్యే వరకు పోలీస్ అధికారుల వెనుకే నిల్చోబెడతారు. మీడియా అడిగిన ప్రశ్నలకు వారితో సమాధానాలు కూడా చెప్పిస్తా రు. ఇక్కడ డీసీపీ రవికుమార్ మూర్తే అన్నీ తానై సమాధానాలు చెప్పేశారు. కాకర పద్మలత, గేదలరాజు హత్య కేసుల్లో రవిబాబు పాత్రకు సంబంధించి పక్కా సాక్ష్యాధారాలు సేకరించినట్టు డీసీపీ ప్రకటించారు. ఈ కేసుల్లో ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకునే చాన్స్ లేదంటూ డీసీపీ స్పష్టంగా చెప్పడం విశేషం. గేదెల రాజును తానే హత్య చేయించానని రవిబాబు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడని డీసీపీ వెల్లడించడం ఈ కేసులో కీలకంగా మారింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని..అన్నీ కోర్టులో తేల్చుకుంటానని లొంగిపోయే ముందు చోడవరంలో మీడియాకు చెప్పిన రవిబాబు.. పోలీసులకు మాత్రం తానే హత్య చేయించానని ఒప్పుకోవడం గమనార్హం. పాస్పోర్టు స్వాధీనం ఏసీపీగా పనిచేసినప్పుడు రవిబాబుతో కలిసి పనిచేసిన రంగరాజు ఆధ్వర్యంలో డీఎస్పీ రవిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మురళీనగర్లోని ఆయన ఇంటిలో అణువణువు సోదా చేశారు. పాస్పోర్టు సీజ్ చేశారు. అలాగే చెక్బుక్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కీలక పత్రాలను పక్కదారి పట్టించినట్టుగా చెబుతున్నారు.సెటిల్మెంట్ల కోసం గాజువాకలోని రఘు, రోహిత్ నిర్వహణలో ఉన్న హోటల్స్లో పలు కీలక సమావేశాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకొని ఇప్పటికే తమదైన శైలిలో విచారణ జరిపి కొంత సమాచారాన్ని రాబట్టినట్టు చెబుతున్నారు. అలాగే ల్యాండ్ సెటిల్మెంట్ల విషయంలో కూడా రవిబాబు పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపించాం డీసీపీ–2 రవికుమార్మూర్తి అల్లిపురం: గేదెల రాజు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబుపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించామని, ఏ నిర్ణయమైనా పై స్థాయిలో తీసుకోవల్సి ఉందని నగర శాంతిభద్రతల డీసీపీ–2 టి.రవికుమార్మూర్తి తెలిపారు. శనివారం పోలీస్ కమిసనరేట్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. గేదెల రాజు హత్య కేసుతో పాటు, కేసుకు ప్రధాన కారణంగా భావిస్తున్న మాజీ ఎంపీపీ కాకర పద్మలత మరణంపై అనుమానాలు వస్తుండటంతో ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్నామన్నారు. కేసులో రెండో నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు దొరికితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలిపారు. కాకర పద్మ మృతి విషయంలో కాకక పద్మలత తమ్ముడుని విచారించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షాలన్నీ సేకరిస్తున్నామని, అవన్నీ ఈ కేసులో కీలకంగా ఉంటాయని తెలిపారు. పద్మలత హత్య కేసు కూడా.. గాజువాక : రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ఎ–1 నిందితుడిగా ఉన్న ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబుపై గాజువాక పోలీసులు మరో హత్య కేసు నమోదు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న తన కుమార్తె పద్మలతను రవిబాబే హత్య చేయించాడని ఆమె తండ్రి కాకర నూకరాజు శనివారం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రవిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో కూడా పద్మలతను తానే హత్య చేయించినట్టు విచారణ సమయంలో పోలీసు అధికారుల వద్ద రవిబాబు ఒప్పుకున్నట్టు సమాచారం. ఆ నలుగురు ఎవరు? పద్మలతను అడ్డు తొలగించుకునేందుకు రూ.కోటితో గేదెల రాజుతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకోసం రూ.50 లక్షలు అడ్వాన్స్ కింద ముట్టజెప్పగా, మిగిలిన రూ.50 లక్షల కోసం ఒత్తిడి తేవడంతోనే ఈ హత్యోదంతం చోటు చేసుకుంది. గేదెల రాజు బెదిరింపులకు తలొగ్గి ఫైనల్ సెటిల్మెంట్గా రూ.25 లక్షలు చెల్లించేందుకు రవిబాబు అంగీకరించారు. ఈ మేరకు ఆగస్టు 13న బీచ్రోడ్లోని సుధీర్కు చెందిన గెస్ట్హౌస్లో సెటిల్మెంట్ జరిగినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ భేటీలో రవిబాబు, గేదెల రాజు, భూపతిరాజు శ్రీనివాసరాజులతో పాటు ఏడుగురు పాల్గొన్నారు. వారిలో గేదెలరాజు హతమయ్యాడు, రవిబాబు దొరికిపోయారు. దాంతో భూపతిరాజు కాకుండా మిగిలిన నలుగురు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా తన వద్ద రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయని గేదెల రాజు బెదిరించడంతో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆయనతో ముప్పు తప్పదన్న భయంతోనే అతడ్ని వదిలించుకోవాలన్న నిర్ణయానికొచ్చిన డీఎస్పీ రవిబాబు భూపతిరాజు శ్రీనివాసరాజుతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని డీసీపీ వెల్లడించారు. నాటీ భేటీలో వీరితో పాటు సెటిల్మెంట్లో పాల్గొన్న మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. కాగా హత్యోదంతంలో పాల్గొన్న 10 మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని.. భూపతిరాజుతో పాటు అతడిì డ్రైవర్ను అరెస్ట్ చేయాల్సి ఉందని వివరించారు. భూపతిరాజు చిక్కితే ఈ హత్య కేసుకు సంబంధించిన మరింత కీలక సమాచారం లభిస్తుందని సీపీ అన్నారు. 27 వరకు రిమాండ్ గాజువాక : రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు డీఎస్పీ రవిబాబుకు గాజువాక 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఈనెల 27 వరకు రిమాండ్ విధించారు. న్యూపోర్టు పోలీసులు అంతకుముందే ఆయన పాస్పోర్టుతోపాటు బ్యాంకు చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక కోర్టులో హాజరుపరిచారు. సెక్షన్ 302, 201 ప్రకారం రవిబాబుపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కోర్టు ఆవరణలో రవిబాబు ఫోన్ సంభాషణ విచారణ నిమిత్తం రవిబాబును పోలీసులు గాజువాక కోర్టుకు తీసుకొచ్చిన అనంతరం ఆయన ఫోన్లో మాట్లాడటం చర్చనీయాంశమైంది. గేదెలరాజు హత్య జరిగిన తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ అతడి మొబైల్ ఫోన్ స్విచాఫ్లో ఉంది. కోర్టుకు వచ్చిన తరువాత పోలీసుల పర్యవేక్షణ ఉండగానే ఆయన సెల్ఫోన్లో మాట్లాడారు. ఆయన ఎవరి ఫోన్తో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. సెంట్రల్ జైలుకు ఆరిలోవ(విశాఖ తూర్పు): రౌడీ షీటరు గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు డీఎస్పీ దాసరి రవిబాబును శనివారం పోలీసులు విశాఖ కేంద్ర కారాగారానికి రిమాండ్కు తరలించారు. ఆయన్ని కారాగారం అధికారులు మొదటి రోజు అడ్మిషన్ బ్లాక్లో ఉంచారు. ఆదివారం సెలవు కావడంతో అడ్మిషన్ బ్లాక్కే ఆయన పరిమితమవుతారు. సోమవారం ఆయనకు ప్రత్యేక బ్లాక్ కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకరు షెల్టర్.. మరొకరు బ్యాంకాక్కు టికెట్లు రవిబాబును కాపాడేందుకు ఓ మంత్రి చివరి నిమిషం వరకు విఫలయత్నం చేశారు. గేదెల రాజు హత్యలో తన పాత్ర గురించి వెలుగులోకి వచ్చిన మర్నాడే రవిబాబు ఆ మంత్రిని ఆశ్రయించినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆ మంత్రి సంరక్షణలోనే అతనికి చెందిన ఓ గెస్ట్హౌస్లో ఉన్నట్లు తెలిసింది. ఎలాగైనా కేసు తీవ్రతను తగ్గించి తనను బయటపడేయాలని ఆ మంత్రిని వేడుకున్నా ఫలితం దక్కలేదు. సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉండడంతో.. లొంగిపోమని సలహా ఇచ్చింది కూడా సదరు మంత్రేనని చెబుతున్నారు. లొంగిబాటుకు చోడవరం పోలీస్స్టేషన్ను ఎంచుకోమని చెప్పింది కూడా ఆయనేనని అంటున్నారు. మరోవైపు గేదెల రాజు హత్యకు బ్యాంకాక్లోనే స్కెచ్ వేశారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా బ్యాంకాక్ వెళ్లేందుకు మరో మంత్రి తనయుడు వీరికి టికెట్లు తీసిచ్చినట్లు తెలియవచ్చింది. సరదాగా ఎంజాయ్ చేసే వంకతోనే బ్యాంకాక్ వెళ్లినప్పటికీ అక్కడే గేదెల రాజును హత్యకు పథక రచన చేసినట్టుగా వినికిడి. దీంతో రవిబాబు వెనుక ఉన్న ప్రజాప్రతినిధులెవరు..అతడిని కాపాడాలని వారు ఎందుకంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న చర్చ సర్వత్రా సాగుతోంది. -
హైదరాబాద్లో ప్రధాన నిందితులు?
గాజువాక: విశాఖలో రౌడీషీటర్ కె.సత్యనారాయణరాజు అలియాస్ గేదెలరాజు హత్య కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న డీఎస్పీ దాసరి రవిబాబు, క్షత్రియభేరి ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు శ్రీనివాసరాజు హైదరాబాద్లో తిష్ట వేసినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి వీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈనెల 6న చోటు చేసుకున్న గేదెలరాజు హత్య కేసులో దర్యాప్తును దాదాపు పూర్తిచేసిన పోలీసు బృందాలు మొత్తం 12 మందిని నిందితులుగా నిర్ధారించడం తెలిసిందే. హత్య జరిగి పదిరోజులైనా ప్రధాన నిందితులైన రవిబాబు, భూపతిరాజు వివరాలు తెలియరాలేదు. తన ప్రియురాలు పద్మలత హత్యకు సంబంధించిన కిరాయి విషయంలో వివాదాలు తలెత్తడంతో గేదెలరాజును డీఎస్పీయే హత్య చేయించినట్టుగా తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలపడం విదితమే. క్షత్రియభేరి పత్రికా కార్యాలయంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానించడంతో రవిబాబు, భూపతిరాజు ఒకేసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్లో ఉన్నట్టు పోలీసువర్గాల సమాచారం. తమను అరెస్టు చేయకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి అక్కడే తిష్టవేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. -
అక్రమ సంబంధం నుంచి హత్యల వరకు..
-
రౌడీ హత్యలో ఖాకీ
అల్లిపురం(విశాఖ దక్షిణ): అక్టోబర్–7.. తన భర్త కొప్పర్ల సత్యనారాయణరాజు ఈ నెల ఆరో తేదీన పెదగంట్యాడ భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి తి రిగి రాలేదని కొప్పర్ల కుమారి గాజువాక న్యూపోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు క్రైం నంబ రు 123/2017తో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అంతకు ముందు... అక్టోబర్ 6.. అర్ధరాత్రి సబ్బ వరం పోలీస్స్టేషన్ పరిధిలోని మారుమూల గాలి భీమవరం ప్రాంతంలో నైట్ బీట్ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా దూరంగా మంటలు కనిపించాయి. అనుమానంతో దగ్గరికి వెళ్లిచూడగా కాలిపోతున్న మృతదేహం కనిపించింది. వెంటనే మంటలు అర్పారు. కానీ అప్పటి కే మృతదేహం సగం కాలిపోయింది. గుర్తుతెలియని మృతదేహం లభిం చినట్లు కేసు నమోదు చేశారు. హత్య కేసుగా మారిన మిస్సింగ్ కేసు గుర్తు తెలియని మృతదేహం లభించిన సమాచారం న్యూపో ర్టు పోలీసులకు అందింది. అ ప్పటికే మిస్సింగ్ కేసు నమోదు చేసిన వారు అనుమానంతో కొప్పర్ల కుమారి, ఆమె కుటుంబ సభ్యులను తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించారు. మెడలో ఉన్న వస్తువులు, మృతుని ఆనవాళ్లను బట్టి అతను తన భర్త సత్యనారాయణరాజుగా ఆమె నిర్థారించారు. అలా సత్యనా రాయణరాజు ఎలియాస్ రౌడీషీటర్ గేదెలరాజు హత్యోదంతం వెలుగులోకివచ్చింది. దాంతో మిస్సింగ్ కేసును హత్యకేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. ఉప్పందించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఈ నెల ఆరో తేదీ రాత్రి పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రవి అనే వ్యక్తి తాగిన మత్తులో యాక్టివా వాహనంఏపీ 31 డీహెచ్ 3761 నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన గేదెలరాజు మరణానికి ముందు అదే వాహనాన్ని వినియోగించాడని తెలుసుకొని మరుసటి రోజు రవిని మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన నిందితుల వివరాలు బయటకొచ్చాయి. ఏ1 ముద్దాయి డీఎస్పీయే: జేసీపీ రౌడీ షీటర్ కొప్పెర్ల సత్యనారాయణరాజు ఎలియాస్ గేదెల రాజు హత్య కేసులో ఏ1 ముద్దాయి డీఎస్పీ దాసరి రవిబాబేనని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ దాడి నాగేంద్రకుమార్ స్పష్టం చేశారు. పోలీస్ కమిషనరేట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయనతోపాటు ఏ–2 ముద్దాయి అయిన క్షత్రియబేరి ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు శ్రీనివాసరాజు, ఏ–6గా ఉన్న భూపతిరాజు కారు డ్రైవర్ కేశవ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. హత్య కేసుతో సంబంధం ఉన్న పెదగంట్యాడ, వియ్యపువాపువానిపాలేనికి చెందిన గుమ్మడి రవి, ఆదర్శనగర్కు చెందిన సువ్వాడ మహేష్, ఎంవీపీ కాలనీకి చెందిన ఎర్ని శ్రీనివాసరావు, మద్దిలపాలేనికి చెందిన ఆటోడ్రైవర్ ఆల్ల గోపి, కురుపాం మార్కెట్కు చెందిన మైలపల్లి విజయకుమార్ ఎలియాస్ బిల్లా, శివాజీపాలేనికి చెందిన బొంగ మురళీ, ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన కన్నం ఆనంద్కుమార్, సీతంపేటకు చెందిన పిల్లా త్రినాథ్ ఎలియాస్ తెల్లోడు, హెచ్బీ కాలనీ దుర్గానగర్కు చెందిన బెహరా కనకరాజు.. మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల డీసీపీ–2, టి.రవికుమార్మూర్తి, హార్బర్ ఏసీపీ రంగరాజు, సౌత్ ఏసీపీ రామమోహనరావు, ఎస్.సి, ఎస్టీ సెల్ ఏసీపీ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. పత్రికల పాత్ర అభినందనీయం గేదెల రాజు హత్య కేసులో పత్రికల్లో పరిశోధనాత్మక కథనాలు రాయడం అభినందనీయమని సంయుక్త పోలీస్ కమిషనర్ దాడి నాగేంద్రకుమార్ అన్నారు. ఈ కథనాలు ఆధారంగా తాము కేసులో పురోగతి సాధించామన్నారు. నగర పరిధిలో జరుగుతున్న అనేక నేరాల్లో పత్రికల ద్వారానే వాస్తవాలు బట్టబయలవుతున్నాయన్నారు. సమాజంలో పోలీసులకు ఒక గౌరవం ఉంది. అలాంటి హోదా, అధికారంలో ఉన్న పోలీస్ అధికారి ఇంతటి ఘోరానికి పాల్పడటం అవమానకరంగా ఉందన్నారు. అయిన్పటికీ తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీపై ఉన్న పాత కేసుల్లోనూ పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఆయన తెలిపారు. క్షత్రియభేరి కేంద్రంగా.. పెదగంట్యాడలో శుభకార్యంలో పాల్గొన్న అనంతరం ఎక్కడికి వెళ్లాడని ఆరా తీసిన పోలీసులకు అతను అక్కడి నుంచి గాజువాకలోని క్షత్రియభేరి కార్యాలయానికి వెళ్లాడని తెలిసింది. దాంతో ఆ కార్యాలయం కేంద్రంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహం వద్ద లభించిన కార్పెట్ ముక్క, గోనె సంచి మరికొన్ని ఆధారాలు హత్యాస్థలం ఆ కార్యాలయమేనని నిర్థారించాయి. అయితే అప్పటికే ఆ పత్రిక నిర్వాహకుడు భూపతిరాజు శ్రీనివాసరాజు పరారయ్యాడు. అతని కుటుంబ సభ్యులు, డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారించడంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన కిరాయి ముఠాలోని సభ్యుడు రవి అందజేసిన వివరాలతో మొత్తం హత్య కుట్ర బట్టబయలైంది. ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబే శ్రీనివాసరాజు ద్వారా గేదెలరాజు హత్యకు కుట్రపన్ని కిరాయి ముఠా ద్వారా అమలు చేయించారని రూఢీ అయ్యింది. హత్య జరిగిన విధం.. హత్యకు ఆరో తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఒక వ్యవహారం సెటిల్ చేయడానికి గాజువాకలోని క్షత్రియభేరి కార్యాలయానికి రావాలని శ్రీనివాసరాజు గేదెలరాజును కోరాడు. ఆ సమయంలో పెదగంట్యాడ ఫంక్షన్ హాల్లో ఉన్న గేదెలరాజు అటు నుంచి అటే తన యాక్టివా వాహనంపై క్షత్రియభేరి కార్యాలయానికి వెళ్లాడు. 3.50 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన శ్రీనివాసరాజు అతన్ని పలకరించి లోపలికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన రౌడీషీటర్ మహేష్ బృందం రాడ్లు, కత్తులతో గేదెలపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అతను మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు కార్యాలయంలో గల కార్పెట్తో చుట్టివేసి గోనె సంచిలో ప్యాక్ చేశారు. రాత్రి 7 గంటల సమయంలో శ్రీనివాసరాజు మారుతీ ఈకో వ్యాన్లో వెళ్లి మృతదేహాన్ని ఎక్కడ కాల్చేయోలో నిర్ణయించాడు. తిరిగి వచ్చి తన డ్రైవర్ కేశవ్ ఆధ్వరంలో ఏపీ 31 డీకే 2314 వ్యానులో తాను పైలెట్గా ముందు వెళ్తూ మృతదేహాన్ని సబ్బవరం మండలం గాలి భీమవరం సమీపంలోని మూరుమూల ప్రాంతానికి తరలించారు. అక్కడ మృతదేహాన్ని పెట్రోలు పోసి తగుల బెట్టారు. అక్రమ సంబంధం నుంచి హత్యల వరకు.. ప్రస్తుత ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీగా ఉన్న దాసరి రవిబాబుకు గతంలో పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె, మాజీ ఎంపీపీ కాకర పద్మలతతో సంబంధం ఉండేది. ఆ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తేగా తిరస్కరించాడు. దాంతో అతను మదురవాడ ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో అప్పటి పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేశాడని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరింది. మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేసింది. హైదరాబాద్ వెళ్లి పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్లో ఆమె గాజువాక శ్రీనగర్లోని తన బంధువైన గేదెల రాజు ఇంటికి వచ్చి పదిరోజులు అక్కడే గడిపింది. ఆ సమయంలో గాజువాక ఏసీపీగా పనిచేస్తున్న రవిబాబు అప్పటికే సెటిల్మెంట్ల వ్యవహారంలో తనకు పరిచయమైన గేదెల రాజును పిలిపించి ఆమె అడ్డు తొలగించేలా కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్సుగా రూ.50 లక్షలు ఇచ్చాడు. కాగా ఒప్పందం కుదిరిన సమయంలో రవిబాబుతో జరిగిన సంభాషణను గేదెల రాజు ముందు జాగ్రత్తగా తన మొబైల్లో రికార్డు చేశాడు. పద్మలతను అంతమొందించిన తర్వాత మిగిలిన రూ.50లక్షల కోసం రవిబాబుపై ఒత్తిడి తెచ్చాడు. ఇవ్వకపోతే తన దగ్గర సంభాషణలను బయటపెడతానని బెదిరించేవాడు. దీంతో గేదెలరాజును కూడా తప్పించాలని నిర్ణయించుకున్న రవిబాబు.. అతనికి స్నేహితుడైన క్షత్రియభేరి నిర్వాహకుడు భూపతిరాజు శ్రీనివాసరాజుతో మంతనాలు జరిపాడు. భూ సెటిల్మెంట్లు, పంచాయితీలు నిర్వహించడంలో దిట్ట అయిన శ్రీనివాసరాజు గేదెల రాజు హత్యకు పెదవాల్తేరు ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ సువ్వాడ మహేష్(సువ్వాడ మహేష్పై ఫోర్తు టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. మూడు హత్యకేసుల్లో ముద్వాయి)తో రూ. 4 లక్షల కిరాయికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.20వేలు అడ్వాన్సు ఇచ్చాడు. -
ఇద్దరు డీఎస్పీల బదిలీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో పనిచేస్తున్న ఏలూరు, నరసాపురం డీఎస్పీలను బదిలీ చేసి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ అడిషనల్ డీజీ హరీష్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు డీఎస్పీగా పనిచేస్తున్న గోగుల వెంకటేశ్వరరావును బదిలీ చేసి ఆయన స్థానంలో సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న కె.ఈశ్వరరావును నియమించారు. నరసాపురం డీఎస్పీగా ఉన్న జి.పూర్ణచంద్రరావును బదిలీ చేసి ఆయన స్థానంలో ఇంటిలిజెన్స్ విభాగం సీఐగా పనిచేస్తున్న టి. ప్రభాకర్బాబును నియమించారు. ఏలూరు, నరసాపురం డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా పోలీస్ హెడ్క్వార్టర్స్లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. నరసాపురం డీఎస్పీగా పూర్ణచంద్రరావు సుమారు రెండు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అయితే ఇటీవల గరగపర్రులోని దళితులను వెలివేత రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడానికి అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు కారణమని ఉన్నతాధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఆయనను బదిలీ చేస్తారంటూ చర్చ జరుగుతూ వచ్చింది. అలానే ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు గడిచింది. గతం నుంచి జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న వెంకటేశ్వరరావు ఏలూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత సబ్ డివిజన్ పరిధిలో ఎప్పుడూ జరగని విధంగా హత్యలు జరగడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. ఇద్దరు ఎస్సై స్థాయి అధికారులతో ఆయన ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్టు, క్రికెట్ బుకీల దగ్గర నుంచి డీఎస్పీ పేరు చెప్పి ఓ హెడ్ కానిస్టేబుల్ నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులు డీజీపీకి అందినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బదిలీ జరిగినట్టు సమాచారం. బాధ్యతలు స్వీకరించిన ఈశ్వరరావు ఏలూరు (సెంట్రల్) : ఏలూరు డీఎస్పీగా కె.ఈశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నంకు చెందిన ఆయన 2010లో డీఎస్పీగా ఎంపికయ్యారు. కొంతకాలంగా సీఐడీ విభాగంలో పనిచేస్తున్నారు. -
ఏసీబీ వలలో మరో తిమింగలం..
సాక్షి, అనంతపురం: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నారాయణరెడ్డి ఇంట్లో ఏసీబీ బుధవారం దాడులు జరిపింది. ఆయన మహిళా, సంక్షేమశాఖ పెనుగొండ ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అవినీతి నిరోదకశాఖ జిల్లా ఇన్చార్జ్ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో కొంతమంది సీఐలు ఎనిమిది బృందాలుగా విడిపోయి ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు నిర్వహించారు. నారాయణరెడ్డి ఆస్తులు, అతని బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. జిల్లాతోపాటు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పాకాల మండలం రామచేర్ల గ్రామంలో కూడా సోదాలు జరిపారు. ఈ దాడుల్లో దాదాపు రూ. 50 కోట్లు విలువైన స్థిర, చరాస్తులను గుర్తించిట్లు అధికారులు వివరించారు. మహిళా, శిశుసంక్షేమశాఖలో నారాయణరెడ్డి సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. అటెండర్ నుంచి పదోన్నతులపై సీనియర్ అసిస్టెంట్ స్థాయికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో కీలక విభాగాల సూపరింటెండెంట్గా దాదాపుగా ఎనిమిదేళ్ళపాటు పని చేశారు. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే కోడిగుడ్లు, పౌష్టికాహారానికి సంబంధించిన సెక్షన్ సూపరింటెండెంట్గా చేశారు. ఈ సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో బుధవారం దాడులు జరిగాయి. అనంతపురంలోని కోవూర్నగర్లో ఆయన నివాసంలోనూ, నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన గృహాల్లోనూ, బందువుల ఇళ్ళలో, నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామంలో అత్త, మామల ఇంటిలో, పాకాల మండలంఓని రామచేర్ల గ్రామంలోని తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిలో దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ జయరామరాజు తెలిపారు. ఈ దాడుల్లో కేజిన్నర బంగారు, భారీ మొత్తంలో వెండీ, వ్యవసాయ భూములకు సంబంధించిన విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. విచారణ అనంతరం నిందితున్ని కస్టడీలోకి తీసుకొని కర్నూల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. -
ఆరుసామి రెండో వేట మొదలెట్టాడు
తమిళసినిమా: సామి చిత్రంలో విక్రమ్ పోషించిన ఆరుసామి పాత్రను ఆయన అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు.అంతే కాదు నటుడు విక్రమ్ను పక్కా మాస్ హీరో గా నిలబెట్టిన చిత్రం సామి. 2003లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అందులో పోలీస్అధికారిగా విక్రమ్ అవినీతిపరులు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారనే చెప్పాలి. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ తరువాత తెలుగులోనూ రీమేక్ అయ్యి పెద్ద విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల తరువాత సామి చిత్ర సీక్వెల్ శ్రీకారం చు ట్టారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఇందులో సామి చిత్ర నాయకి త్రిష ఒక నాయకి, కీర్తీసురేశ్ మరో నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బాబీసింహా, ప్రభు, వివేక్, సూరి నటిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ కథా చిత్రాన్ని తమీన్ ఫిలింస్ ఇంతకు ముందు ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సామి–2 చిత్రం విజయదశమి సందర్భంగా శనివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. విక్రమ్, కీర్తీసురేశ్, దేవీశ్రీప్రసాద్, దర్శకుడు హరి, చిత్ర నిర్మాత శిబు తమీన్ పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు చిత్ర తొలి భాగాన్ని తిరునెల్వేలి పరిసర ప్రాంతాల్లో, రెండోభాగాన్ని రాజస్థాన్, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. -
దళపతి ఎక్కడ?
అవినీతి నిరోధకశాఖకు డీఎస్పీ లేరు కింది స్థాయి అధికారులకు చిక్కని పెద్ద చేపలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు అనంతపురం సెంట్రల్: జిల్లాలో కీలకమైన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయంలో డీఎస్పీ సీటు ఖాళీగా ఉంది. ఇదివరకు ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ భాస్కర్రెడ్డి తొమ్మిది నెలల క్రితం డిపార్ట్మెంట్కు సరెండర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నారు. ఆయన తర్వాత జిల్లాకు ఏసీబీ డీఎస్పీగా ఎవరొస్తారనే దానిపై చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఎవరి పేర్లూ వినిపించడం లేదు. దీంతో అక్రమార్కులు, అవినీతిపరులు ఇదే అదనుగా తమ పని కానిచ్చేస్తున్నారు. దాడులు తగ్గుముఖం జిల్లాలో సంక్షేమ పథకాల అమలులో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఆమ్యామ్యాలు తీసుకొని అనర్హులకు కట్టబెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రభుత్వశాఖల్లో పైసలు ఇవ్వందే ఫైలు ముందుకు కదలదు. ముఖ్యంగా రోడ్డు, రవాణా శాఖ, రిజిస్ట్రేషన్, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో ఎక్కువగా ఈ పరిస్థితి నెలకొంది. కొన్ని శాఖలపై మాత్రమే ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇంత వరకూ పోలీసుశాఖపై దాడులు జరిపిన చరిత్ర ఏసీబీలో లేదు. అక్కడ పనిచేస్తున్న అధికారుల మాతృసంస్థ కావడంతోనే దాడులు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా ఏసీబీ విధుల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన విభాగానికి అధికారి లేకపోవడంతో అవినీతి చేపలు బయటపడడం లేదు. చిన్న తిమింగళాలపైనే దృష్టి జిల్లాలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఎక్కువశాతం చిన్న తిమింగళాలే పట్టుబడ్డాయి. రైతు నుంచి ట్రాన్స్ఫార్మర్ కోసం లంచం తీసుకుంటూ లైన్మెన్లు, ఏఈలు, పాసుపుస్తకాల కోసం లంచం తీసుకుంటూ వీఆర్వోలు, తహసీల్దార్లు పట్టుబడుతున్నారు. కానీ పెద్ద తిమింగళాలు మాత్రం ఏసీబీ అధికారుల కళ్లుగప్పి తప్పించుకుతిరుగుతున్నారు. భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వారు కూడా లేకపోలేదు. అయితే అత్యంత తెలివిగా వారి ఆస్తులను బినామీల పేరుతో రిజిష్టర్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారు ఏసీబీ గాలానికి చిక్కడం లేదు. ఇదిలా ఉంటే పట్టుబడిన చిన్న చేపలకూ శిక్షలు పడడం లేదు. విచారణ పేరుతో సంవత్సరాలు గడుస్తోంది. చివరినిమిషంలో సాక్షులు రాజీ అవుతుండడంతో కేసులు వీగిపోతున్నాయి. ఇలా జిల్లాలో అవినీతి నిరోధకశాఖ తన కొరడా ఝుళిపించలేకపోతోంది. ఇది అక్రమార్కులకు వరంగా మారుతోంది. మూడేళ్లలో ఏసీబీ దాడులు.. ఏడాది లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులు ఆకస్మిక దాడులు 2015 6 3 2016 5 4 2017 4 2 -
పట్టుకోండి.. చూద్దాం!
‘గస్తీ’మే సవాల్ – వరుస చోరీలతో వణికిపోతున్న నగరం - పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు - తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం - వయో వృద్ధులు నివసిస్తున్న ఇళ్లలోనే - అడ్డుకట్ట వేయలేని టెక్నాలజీ వరుస చోరీలు.. చైన్ స్నాచింగ్లతో నగరం వణికిపోతోంది. జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు పోలీసులకు సవాల్గా నిలుస్తున్నాయి. గంటల వ్యవధిలో మూడు చోట్ల మహిళల మెడల్లోని గొలుసులు దొంగిలించిన తీరు భయాందోళనకు గురి చేస్తోంది. 16న - భైరవ నగర్లో రామిరెడ్డి అనే వృద్ధుడు ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయన చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి 20 తులాలకు పైగా బంగారం దోచుకెళ్లారు. 18న - మల్లేశ్వర రోడ్డులో ఒంటరిగా నివాసం ఉంటున్న హనుమంతమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. 11న - అనంతపురం సెంట్రల్: ఇంటికి తాళం వేయాలన్నా.. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాలన్నా జంకే పరిస్థితి. ఉద్యోగం.. ఉపాధి వేటలో పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఇళ్ల వద్ద ఒంటరిగా ఉండే వయో వృద్ధులు దినదిన గండంగా బతుకీడ్చాల్సి వస్తోంది. నగరంలో ఇప్పుడు దొంగల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నా నేరాల నియంత్రణలో విఫలమవుతుండటం గమనార్హం. నిత్యం ఏదో ఒక చోట వెలుగు చూస్తున్న చోరీలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు కరువయ్యాయి. గస్తీ పోలీసుల విధులు నామమాత్రంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది కొరత.. పని భారం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా బందోబస్తులు అధికం కావడంతోనే నగరంపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నట్లు సమాచారం. కారణం ఏదైయినా.. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖ దొంగల చేతివాటాన్ని చేష్టలుడిగి చూస్తోంది. అడ్డుకట్ట వేయలేకపోతున్న టెక్నాలజీ నేరాలను అదుపు చేసేందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలు అదుపు చేస్తామని చెబుతున్నారు. అయితే సీసీ కెమెరాలు కేవలం సామాన్య ప్రజలు కాస్త రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు వేసేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని.. నేరాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయనే విమర్శలకు కారణమవుతున్నాయి. ఇటీవల త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో కొంతమంది యువకులు తెల్లవార్లు కార్లు, ఆటోల అద్దాలను ధ్వంసం చేశారు. పోకిరీల చేష్టలను సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి అడ్డుకోలేకపోయారు. నగరంలో ద్విచక్రవాహనాల చోరీలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. దొంగ టార్గెట్ చేశాడా.. వాహనం క్షణాల్లో మాయమైపోతుంది. టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో కొద్దిరోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో ఒకటి, రెండురోజుల క్రితం గుల్జార్పేటలో ట్రాన్స్కో ఏఈ వాహనాన్ని చోరీకి గురయ్యాయి. దొంగ ఎవరన్నది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఇక చోరీలను అరికట్టేందుకు ప్రతిష్టాత్మకంగా లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్ను తయారుచేశారు. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు యాప్ ద్వారా పోలీసుల సాయం కోరితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సదరు ఇంటికి బందోబస్తు కల్పిస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెల్లడం లేదు. ఈ యాప్ వచ్చి ఏడాది కావస్తున్నా 17,173 మంది మాత్రమే రిజస్టర్ చేసుకున్నారు. కేవలం 2,277 మంది మాత్రమే వినియోగించుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2.50 లక్షల జనాభా కలిగిన నగరంలో కేవలం 2వేల మంది మాత్రమే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో పోలీసు శాఖ నమ్మకం కలిగించలేకపోతుందనే అభిప్రాయానికి బలం చేకూరుతోంది. రంగంలోకి ప్రత్యేక బృందాలు జిల్లా క్రేందలో చైన్స్నాచింగ్ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టాం. ఇటీవల జరిగిన చైన్స్నాచింగ్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం. సోమవారం నగరంలో మూడు చోట్ల జరిగిన చైన్ స్నాచింగ్ల వెనుక ఒకే ముఠా ఉన్నట్లు సీసీ ఫుటేజీల ద్వారా తేలింది. చైన్స్నాచర్ల ఫొటోలు గుర్తించాం. ఆచూకీ తెలిసిన వారు డయల్ 100, 9989819191 నెంబర్లకు సమాచారం అందించాలి. ఇదే సమయలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. - మల్లికార్జునవర్మ, డీఎస్పీ అనంతపురం -
దొంగనోట్ల తయారీ ప్రింటర్ స్వాధీనం
డీఎస్పీ శ్రీనివాసులు మైదుకూరు టౌన్ : దొంగనోట్ల తయారీకి వినియోగించే ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల బద్వేలు రోడ్డులో దొంగనోట్లు చలామనీ చేసే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు దొంగనోట్ల తయారీ కోసం ఉపయోగించే ప్రింటర్ను, కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలానికి చెందిన పి.చంద్రశేఖర్ హైదరాబాద్కు వెళ్లి ఆయిల్ ప్రింటింగ్ మిషన్లను తీసుకొచ్చి దొంగనోట్లను ముద్రించేవాడు. వాటిని అక్కడక్కడా ఎవ్వరికీ అనుమానం రాకుండా మార్పిడి చేసేవాడు. దొంగనోట్లకోసం ఉపయోగించే కాగితాలను, ప్రింటర్ను, రూ.23,500 దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ హనుమంతనాయక్, హెడ్కానిస్టేబుల్ భాగ్యంరెడ్డి, గుర్రప్పలు పాల్గొన్నారు. -
డీఎస్పీ గణపతి కేసులో కర్ణాటకకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: మడికెర డీఎస్పీ ఎంకే గణపతి ఆత్మహత్య కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్ వేసిన పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం తోసిపుచ్చింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా తన సూసైడ్ నోటులో మాజీ హోంమంత్రి జార్జి పేరును డీఎస్పీ గణపతి పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా గత ఏడాది (2016 జూన్7) కొడగు జిల్లా మడికెరి నగరంలోని ఓ లాడ్జ్లో డీఎస్పీ గణపతి ఉరివేసుకుని మరణించిన స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ముందు గణపతి ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఏదేని విపరీత నిర్ణయం తీసుకున్నా, లేదా తనకు ఏమైనా జరిగినా అందుకు అప్పటి హోంశాఖ మంత్రి కే.జే జార్జ్, సీనియర్ ఐపీఎస్ అధికారులైన ప్రణవ్ మొహంతి, ఎ.ఎం ప్రసాద్లు కారణమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడైన నేహాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఇదే సందర్భంలో విమర్శలు వెల్లువెత్తడంతో కే.జే జార్జ్తో రాజీనామ చేయించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేసును సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే గణపతి మరణానికి– జార్జ్, ఇతర అధికారులకు సంబంధం లేదని తేలిందని సీఐడీ రిపోర్టును అందజేయడంతో జార్జ్కి మళ్లీ నగరాభివృద్ధి మంత్రి పదవి దక్కింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిలిపివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వం విజ్ఞప్తిని తిరస్కరించింది. -
డీఎస్పీ హుకుం!
అన్నదమ్ముల మధ్య అప్పు చిచ్చు - చిట్ఫండ్ కంపెనీలో తమ్ముడి అప్పు తీర్చిన అన్న - తిరిగి డబ్బులు ఇవ్వని తమ్ముడు.. కోర్టును ఆశ్రయించిన అన్న - తమ్ముడి తరఫున అన్నను పిలిచి మందలించిన డీఎస్పీ - పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న అన్న సాక్షి, మహబూబాబాద్: అన్నదమ్ముల మధ్య అప్పు చిచ్చు పెట్టింది. అప్పు కట్టలేనంటూ తమ్ముడు డీఎస్పీని ఆశ్రయించడంతో పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుకొమ్మని చెప్పారు. లేదంటే, అనేక ఇబ్బందులు పడతావంటూ డీఎస్పీ దూషించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పెద్దమనుషుల్లో పంచాయితీ ఉండగా, చేతి నుంచి డబ్బులు పోయే.. పోలీసులతో వేధింపులాయే.. అని మనస్తాపం చెందిన అన్న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలకేంద్రానికి చెందిన బొల్లం సాంబశివయ్య(52), విశ్వేశ్వరయ్య అన్నదమ్ములు. సాంబశివయ్య ఎరువులు, పురుగు మందుల దుకాణం, మెడికల్ షాపు, విశ్వేశ్వరయ్య కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వేశ్వరయ్య ఓ చిట్ఫండ్ కంపెనీలో అప్పు తీసు కోగా సాంబశివయ్య జమానతుగా సంతకం పెట్టాడు. విశ్వేశ్వరయ్య చిట్ ఫండ్ కంపెనీలో అప్పుకట్టకపోవడంతో, జమానతుగా ఉన్న సాంబశివయ్య రూ.4.50 లక్షలు చెల్లించాడు. విశ్వేశ్వరయ్య ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆ అప్పు మొత్తా న్ని విశ్వేశ్వరయ్య చెల్లించాల్సిందేనని సాంబశివయ్యకు అనుకూలంగా డిక్రీ ఇచ్చింది. విశ్వేశ్వరయ్య తనకున్న ‘పరిచయం’తో.. విశ్వేశ్వరయ్య గుట్టుగా గుట్కాల దందా కూడా నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నెల్లికుదురు పోలీసు అధికారులతో ఎంతోకాలంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టు స్థానికంగా చెబుతున్నారు. గతంలో తొర్రూరులో సీఐగా పనిచేసిన ప్రస్తుత డీఎస్పీతోనూ మంచి పరిచయమే ఉన్నట్టు భోగట్టా. దీంతో విశ్వేశ్వరయ్య తనకున్న చనువుమేరకు అప్పు చెల్లించలేనంటూ 15రోజుల క్రితం తొర్రూరు డీఎస్పీ రాజారత్నంను ఆశ్రయించాడు. సదరు డీఎస్పీ అన్న సాంబశివయ్యను పిలిపించి, అంత డబ్బు ఇవ్వలేడని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొమ్మని గట్టిగానే చెప్పి, అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. తెల్లవారుజామున సాంబశివయ్య ఇంట్లోనే క్రిమిసంహారక మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి, మహబూబాబాద్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రి వద్ద హైడ్రామా మహబూబాబాద్ ప్రభుత్వాసుప్రతిలో శుక్రవారం రోజంతా హైడ్రామా నడిచింది. డీఎస్పీ వేధింపుల వల్లే విశ్వేశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ దావానలంలా వ్యాపించి, జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ వేధింపులవల్లే అంటూ మీడియాలోనూ వార్తలొచ్చాయి. అంతసేపూ డీఎస్పీ వేధింపుల వల్లే విశ్వేశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన కుటుంబసభ్యులు, ఆ తర్వాత మాటమార్చారు. డీఎస్పీ తరఫున కొంతమంది పెద్ద మనుషులు వచ్చి అక్కడున్నవారితో, కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ డబ్బులు ఇప్పిస్తామని, డీఎస్పీతో ఎలాంటి ఇబ్బంది ఉండవని నమ్మబలికారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని వివరణ కోరగా విచారణ జరిపిస్తున్నామన్నారు. డీఎస్పీ వేధింపుల వల్లే... మాకు, మా బాబాయికి డబ్బుల విషయమై గొడవ నడుస్తోంది. మా బాబాయి రూ.4.5 లక్షలు ఇవ్వాలె. ఇవ్వకుండా తొర్రూరు డీఎస్పీని ఆశ్రయించగా 15 రోజుల క్రితం డీఎస్పీ మా నాన్నను రెండుసార్లు పిలిపించిండు. నేను కూడా వెంట వెళ్లా. ఒక్క తల్లికి పుట్టలేదా?’అంటూ పరుష పదజాలం తో మాట్లాడిండు. అంత డబ్బు కట్టలేడు. లేకుంటే దుకాణాలపై నిఘా పెడితే ఇబ్బందులు పడతామంటూ భయభ్రాంతులకు గురిచేసిండు. అప్పటి నుంచే ముభావంగా ఉండు. –బొల్లం ప్రవీణ్, మృతుడి కొడుకు నెల రోజుల క్రితం వచ్చారు ఈ విషయమై తొర్రూరు డీఎస్పీ కె. రాజారత్నంని వివరణ కోరగా, నెల క్రితం అన్నదమ్ములిద్దరూ పెద్ద మనుషులతో కలిసి తన వద్దకు వచ్చారని తెలిపారు. పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకొమ్మని చెప్పానే తప్పా తానేమీ అనలేదన్నారు. ‘నేను చెప్పిన రెండు రోజులకో, మూడు రోజులకో ఆత్మహత్య చేసుకుంటే నన్ను అనాలి. నెల తర్వాత ఆత్మహత్య చేసుకుంటే నాకేం సంబంధం. అతడి కొడుకు నాపై ఆరోపణలు ఎందుకు చేస్తుండో అర్థం కావడం లేదు’ అని చెప్పారు. -
డీఎస్పీ మృతిపై సీబీఐ విచారణ జరపాలి
∙ సీఎం సిద్ధు, మంత్రి జార్జి దిగిపోవాలి: యడ్యూరప్ప సాక్షి, బెంగళూరు: ‘డీఎస్పీ గణపతి ఆత్మహత్మ కేసు విషయంలో సాక్ష్యాలు నాశనమయినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలో బయటపడింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామ చేయాలి.’ అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్పీ గణపతి చావుకు అప్పటి హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ ప్రధాన కారణమని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కేసును పక్కదోవ పట్టించడానికే సాక్ష్యాలను నాశనం చేశారన్నారు. ఈ విషయాలన్నీ ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బయటికి వచ్చాయన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రితో పాటు మంత్రి కే.జే జార్జ్ వెంటనే పదవులకు రాజీనామ చేయాలన్నారు. లేదంటే ఈనెల 26న బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరతామన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర హోంశాఖ సలహాదారు కెంపయ్య వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొత్తం నాశనమవుతోందన్నారు. వెంటనే ఆయన్ను ఆ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్గౌడ పేరు కూడా వినిపిస్తోంది కదా అన్న ప్రశ్నకు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందేనన్నారు. మొత్తంగా డీఎస్పీ గణపతి కుటుంబానికి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని యడ్యూరప్ప పేర్కొన్నారు. -
డీఎస్పీ కేసులో మిస్టరీ
►గణపతి మొబైల్, కంప్యూటర్, ►పెన్డ్రైవ్లలోని సాక్ష్యాలను చెరిపేశారు ►లీకైన ఫోరెన్సిక్ నివేదిక ►రాజకీయ, పోలీసు వర్గాల్లో కలకలం బెంగళూరు: సుమారు ఏడాది కిందట మడికెరిలో డీఎస్పీ గణపతి అనుమానాస్పద మృతి కేసు తాజాగా మలుపు తిరిగింది. సీల్డ్ కవర్లో ఉండాల్సిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక (ఎఫ్ఎస్ఎల్) గురువారం వెలుగు చూడటంతో విచారణపై అనుమానాలు పెల్లుబుకుతున్నాయి. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్కు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీఎస్పీ గణపతి ఉరివేసుకున్న ఘటన జాతీయ స్థాయిలో సంచలనమైంది. ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగలేదని గణపతి కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కేసు విచారణ దశలో ఉండగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక బయటికి రావడం విశేషం. కేసు దర్యాప్తు సమయంలో గణపతికి చెందిన ఒక పెన్డ్రైవ్, ఫోన్, ల్యాప్టాప్, సర్వీస్ రివాల్వర్, తూటాలను సీఐడీ ఫోరెన్సిక్ విభాగానికి అందజేసింది. వీటిని పరిశీలించిన సీఎఫ్ఎల్... అందులో కొంత సమాచారం చెరిగిపోయిందని తన నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పంచనామా వీడియో రికార్డింగ్ నిబంధనల ప్రకారం జరగకపోవడం వల్ల కూడా కొన్ని సాక్ష్యాలు నాశనమయ్యాయని నివేదికలో పేర్కొంది. ఏమిటీ కేసు? 2016 జూన్7న కొడగు జిల్లా మడికెరి నగరంలోని ఓ లాడ్జ్లో డీఎస్పీ గణపతి ఉరివేసుకుని మరణించిన స్థితిలో కనిపించారు. ఈ ఘటనకు ముందు గణపతి ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఏదేని విపరీత నిర్ణయం తీసుకున్నా, లేదా తనకు ఏమైనా జరిగినా అందుకు అప్పటి హోంశాఖ మంత్రి కే.జే జార్జ్, సీనియర్ ఐపీఎస్ అధికారులైన ప్రణవ్ మొహంతి, ఎ.ఎం ప్రసాద్లు కారణమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడైన నేహాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఇదే సందర్భంలో విమర్శలు వెల్లువెత్తడంతో కే.జే జార్జ్తో రాజీనామ చేయించిన సీఎం సిద్ధరామయ్య కేసును సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే గణపతి మరణానికి– జార్జ్, ఇతర అధికారులకు సంబంధం లేదని తేలిందని సీఐడీ రిపోర్టును అందజేయడంతో జార్జ్కి మళ్లీ నగరాభివృద్ధి మంత్రి పదవి దక్కింది. జవాబు లేని ప్రశ్నలు ►ఈ కేసులో ఒక సాక్షితో కొందరు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. వారెవరు? ►గది సీలింగ్కు ఉరి వేసుకున్న స్థితిలో గణపతి కనిపించారు. అయితే మూడు రౌండ్ల కాల్పులు ఆ గదిలో ఎందుకు జరిగాయి. ఈ దిశగా సీఐడీ ఎందుకు దర్యాప్తు చేయలేదు. ►గణపతి యూనిఫామ్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో ఆయన పోలీస్లు ధరించే బెల్ట్ ఎందుకు ధరించలేదు? ►గణపతి ఉన్న గది తలుపులు లోపల బోల్టు వేసి ఉండలేదు. ఆత్మహత్యే చేసుకునే వ్యక్తి ఎవరైనా గడియ పెట్టి ఆ పనికి పాల్పడుతారు. ఏయే విషయాలు చెరిగిపోయాయంటే... ►31 ఫోన్ కాల్స్ రికార్డ్స్ ►52 ఎస్ఎమ్మెస్లు ►352 మొబైల్ నంబర్లు ►కంప్యూటర్లో ఉన్న 100 ఈమెయిల్స్ ►185 ఫైల్స్ ఉన్న 8 జీబీ ఫోల్డర్ ►ఒక పెన్డ్రైవ్లోని మ్తొతం 145 ఫీడీఎఫ్ ఫైల్స్, 2500 ఫొటోలు, 910 ఎక్స్ఎల్ ఫైల్స్, 31 పవర్ పాయింట్ ఫైల్స్, 791 టెక్స్ట్ ఫైళ్లు. -
ఒక్కొక్కటిగా వెలుగులోకి..
♦ బయటకొస్తున్న ఎస్సై అవినీతి లీలలు ♦ డీఎస్పీ వద్దకు క్యూ కడుతున్న బాధితులు సాక్షిప్రతినిధి, ఏలూరు : జంగారెడ్డిగూడెం ఎస్సై కేశవరావు అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎస్సై బాధితులు జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ ఎదుట క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు బాధితులు భయపడి ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం. అవినీతి బాగోతం బయటపడటంతో ధైర్యంగా బాధితులు డీఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, తమ వద్ద ఎంతెంత సొమ్ము తీసుకుంది, సొమ్ము తీసుకుని తమను ఏ విధంగా మోసం చేశారో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. బుధవారం పెద్ద సంఖ్యలో డీఎస్పీ కార్యాలయానికి బాధితులు వచ్చారు. ఇప్పటికే డీఎస్పీ మురళీకృష్ణ ఎస్సై వ్యవహార శైలి, అవినీతిపై విచారణ ప్రారంభించి, చాలా వరకు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. స్థానిక మార్కెట్ సమీపంలో ఒక కాంప్లెక్స్లో షాపును ఖాళీ చేయించేందుకు భారీ మొత్తం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏకంగా డ్రైవర్నే మార్చివేసి రూ.40 వేలు వసూలు చేయగా, ఆటో ప్రమాదంలో ఆటో డ్రైవర్ను మార్చి రూ.20 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఇక తాడువాయి గ్రామంలో ఒక భూ వివాదానానికి సంబంధించి కూడా భారీగా వసూలు చేసినట్లు తెలిసింది. ఒక వ్యభిచార గృహంపై దాడిచేసి బెదిరించి నామమాత్రంగా కేసు నమోదు చేసి ఆ తరువాత నెలవారీ మామూళ్లు ఏర్పాటు చేసుకున్నట్లు తాజాగా బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల జంగారెడ్డిగూడెంలో పశువుల అక్రమ రవాణా వాహనాన్ని సీజ్ చేశారు. దీనిలో కొన్ని పశువులను గోశాలకు తరలించి మరికొన్ని పశువులను అమ్మేసి వాటిని అనారోగ్యంతో ఉన్నాయనే నెపంతో మార్కెట్యార్డులో ఉంచినట్లు రికార్డులో చూపించారు. అయితే ఈ రికార్డులను తారుమారు చేసేందుకు మంగళవారం రాత్రి విశ్వప్రయత్నం చేసినట్లు తెలిసింది. అలాగే పేకాట కేసుల్లో దాడిచేయడం, మీపై కేసులు లేకుండా ఉండాలంటే మీ దగ్గర ఉన్న సొమ్మంతా ఇచ్చేయండి అని బెదిరించి సొమ్మును కాజేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఒక మహిళ హత్యకు గురికాగా, నిందితులను అరెస్టు చేయడం మానివేసి బాధిత కుటుంబ సభ్యులనే బెదిరించి సొమ్ములు గుంజినట్లు తెలిసింది. ఒక సాప్ట్వేర్ కంపెనీకి సంబంధించి వచ్చిన ఫిర్యాదులో నిందితుల నుంచే కాకుండా బాధితులపై కేసు నమోదు చేసి ఇరు వర్గాల నుంచి లక్షలాది రూపాయలు దండుకున్న వైనం కూడా వెలుగులోకి వచ్చింది. స్టేషన్కు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వారిపైనే కేసు కడతానని బెదిరించడం, కేసు లేకుండా ఉండాలంటే సొమ్ములు ఇవ్వాలని వారి వద్దే వసూలు చేయడం లాంటి ఘటనలు డీఎస్పీ వద్దకు వచ్చినట్లు సమాచారం. తనకు నచ్చని సిబ్బందిని కూడా ఈ అధికారి వేధించినట్లు సమాచారం. వీరికి వేరే డ్యూటీలు వేసి బయటకు పంపించి నానా అవస్థలకు గురిచేసే వారని సిబ్బంది చెబుతున్నారు. స్టేషన్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునేవారని, అలాగే తనకు ఇష్టమైన సిబ్బందికి అసలు డ్యూటీలే ఉండేవి కాదని సిబ్బంది చెబుతున్నారు. తన వ్యవహారాలను చక్కబెట్టడం కోసం ఒక ప్రైవేట్ డ్రైవర్నే కాకుండా, తాజాగా ప్రభుత్వం నియమించిన కమ్యూనిటీ పోలీసింగ్ ఆఫీసర్స్ (సీపీవో)లను కూడా ఉపయోగించుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
టీడీపీ ఎమ్మెల్యే, డీఎస్పీ రహస్య మంతనాలు
నంద్యాల: ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ జరుగుతుండటంతో తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికి పోలీసు అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. తెలుగుదేశం నేతలు పిలిచిన వెంటనే వారివద్ద వాలిపోయి, రహస్య సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలను పరిశీలించాల్సిన పోలీసులు తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారు. పోలింగ్ సమయం ముగుస్తుండటంతో తెలుగుదేశం నేతలు పోలీసులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఉపఎన్నికలో భాగంగా గోస్పాడు మండలం ఆంజనేయ స్వామి గుడి వద్ద బనగానిపల్లె ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి, డీఎస్పీలు ఇలా చెట్టు చాటుకు వెళ్లి రహస్య మంతనాలు జరుపుతున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే, డీఎస్పీ రహస్య మంతనాలు
-
గూడూరు డిఎస్పీ గిరిపై తప్పిన గురి
గతంలో గూడూరులో డీఎస్పీ పోస్టింగ్ కోసం పోలీసు సిబ్బంది పోటీ పడే వారు. ఇక్కడ పోస్టింగ్ కోసం ఉన్నత స్థాయిలో పైరవీలు సైతం చేసేవారు. కానీ తాజాగా క్రికెట్ బెట్టింగ్ వంటి అవినీతి ఆరోపణలతో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ను ఎస్పీ రామకృష్ణ వీఆర్కు పంపడంతో ఇక్కడకు వచ్చేందుకు డీఎస్పీలు జంకుతున్నారు. గూడూరు: గూడూరు పోలీసు సబ్డివిజన్ 16 మండలాలు ఉన్నాయి. డివి జన్ పరిధిలో శాంతి భద్రతల సమస్య తక్కువగా ఉంటుంది. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కాడంతో ఇసుక, సిలికా, ఎర్రచందనం స్మగ్లర్ల ద్వారా పెద్ద ఎత్తున మామూళ్లు వస్తుం టాయి. దీంతో గూడూరు డీఎస్పీగా వచ్చేందుకు పోలీసు సిబ్బంది ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ పోస్టింగ్ కోసం ఉన్నత స్థాయిలో పైరవీలు సైతం చేస్తుంటారు. గూడూ రు డీఎస్పీగా ఒకరు బదిలీపై వెళ్లిన రోజే మరొకరు బాధ్యతలు చేపడుతుం టారు. అలాంటి గూడూరు డీఎస్పీ కుర్చీ 20 రోజులుగా ఖాళీగా ఉండడం విశేషం. క్రికెట్ బెట్టింగ్ వంటి అవినీతి ఆరోపణలతో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ను ఎస్పీ రామకృష్ణ వీఆర్కు పంపడంతో ఇక్కడకు వచ్చేందుకు డీఎస్పీలు వెనుకడుగు వేస్తున్నారు. డీఎస్పీ నుంచి ఎస్పీ స్థాయికి గూడూరు పోలీస్ సబ్డివిజన్ 1953లో ఏర్పాటైంది. ఇక్కడ డీఎస్పీలుగా పనిచేసిన వీఎస్ వ్యాస్, అశోక్ దళవాయ్, ఎం గోపీకృష్ణ వంటి వారు గొప్ప ఐపీఎస్ అధికారులుగా పేరు గడించారు. గ్రూప్–1 అధికారులైన బీవీ రమణకుమార్, వీవీఎస్ రామకృష్ణ గూ డూరులో డీఎస్పీలుగా పనిచేశారు. అనంతరం జిల్లా ఎస్పీలుగా బా ధ్యతలు చేపట్టారు. అప్పట్లో వీరు నిబద్ధతతో పని చేసి ప్రజల ఆదరాభిమానాలను పొందారు. ఆ తరువాత బాధ్యతలు స్వీకరించిన పలువురు డీఎస్పీలు సైతం ప్రజల మన్ననలను కొంత మేర పొం దారు. 2011 తరువాత డీఎస్పీ కుర్చీకి ఉన్న గౌరవం క్రమంగా మసకబారుతూ వస్తోంది. 2011 నవంబరు నుంచి 2013 జనవరి వరకు గూడూరు డీఎస్పీగా పనిచేసిన సురేష్కుమార్ అప్పట్లో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2013 జనవరి 23న డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు కేవలం 3నెలలు మాత్రమే పనిచేశారు. అనంతరం తొలి మహిళా డీఎస్పీగా చౌడేశ్వరి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన తనను అన్యాయంగా బదిలీ చేశారని ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అనంతరం డీఎస్పీ చౌడేశ్వరి 2014 అక్టోబరు 11న పలు ఆరోపణలతో బదిలీ అయ్యారు. ఆ మరుసటి రోజే గూడూ రు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బాదిపల్లి శ్రీనివాస్ను ఈ ఏడాది జూలై 31న క్రికెట్ బెట్టింగ్తో పాటు సిలికా, ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించి మామూళ్ల మారాజుగా పేరు తెచ్చుకుని వీఆర్కు బదిలీ అయ్యారు. నివాసాన్ని సైతం మార్చుకుని మున్సిపల్ కార్యాలయం పక్కనే డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసినప్పట్నుంచి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వారంతా వెనుకగా ఉండే గదుల్లో నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. కానీ శ్రీనివాస్ అందుకు భిన్నంగా సొసైటీ ప్రాంతంలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఆయన ఇంటికెళ్లి తమ బాధలు చెప్పుకునేందుకు భయపడుతూ, ఆయన కార్యాలయానికి ఎప్పుడు వస్తారో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో తనను కలిసే వారి వివరాలు తెలియకుండా ఉండేందుకు డీఎస్పీ అద్దె భవనం తీసుకున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. డివిజన్ పరిధిలో ఎర్రచందనం, ఇసుక, సిలికా అక్రమ రవాణాకు స్మగ్లర్ల నుంచి భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ నెలకు రూ.కోటి అడుగుతున్నారని, గతంలో సూళ్లూరుపేట ఎస్సై జగన్మోహన్రావు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం కూడా పెద్ద చర్చనీయాంశమైంది. డీఎస్పీల వెనకడుగు గతంలో గూడూరు డీఎస్పీగా రావా లంటే ఉన్నత స్థాయి సిఫార్సుతో పాటు భారీగా ముడుపులు చెల్లించాలనే పుకార్లు షికార్లు చేసేవి. ఇక్కడకు వచ్చిన డీఎస్పీలు అయిష్టంగా తిరిగి వెళుతుండడంతో అది నిజమన్న నానుడి క్రమంగా ప్రజల్లో నెలకొంది. జిల్లా ఎస్పీగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించినప్పట్నుంచి పోలీసు యంత్రాంగాన్ని గాడిన పెడుతున్నారు. బెట్టింగ్రాయులు, స్మగ్లర్లకు అండగా నిలుస్తున్న పోలీసు సిబ్బందిపై నిఘా ఉంచి వీఆర్కు పంపుతున్నారు. ఈ క్రమంలోనే గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ను వీఆర్కు పంపారు. గతంలో పోస్టింగ్ కో సం పోటీపడే డీఎస్పీలు ఎవరూ ప్రస్తుతం బా« ద్యతలు స్వీకరించేందుకు ముం దుకు రాకపోవడం విశేషం. -
ప్రొద్దుటూరు డీఎస్పీ బదిలీ
►అధికార పార్టీ నాయకుల ఆధిపత్య పోరే కారణం ►సీనియర్ టీడీపీ నేతను కలవలేదనే బదిలీ ►నాడు సీఐ.. నేడు డీఎస్పీ ప్రొద్దుటూరు క్రైం : విధుల్లో చేరి పట్టుమని వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే అధికార పార్టీ ఆధిపత్య పోరులో పోలీసు అధికారి బలిపశువు అయ్యారు. ప్రొద్దుటూరు డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులుపై బదిలీ వేటు పడింది. ఆదివారం సాయంత్రం కడప ఎస్పీ అట్టాడ బాబూజీని కలసిన డీఎస్పీ సాయంత్రం రిలీవ్ అయి వెళ్లిపోయారు. అనంతపురం పీటీసీలో పని చేస్తున్న ఆయన ఈ నెల 14న ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. వారం రోజులు కాకముందే బదిలీ కావడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నాయకుల జోక్యంతోనే ఆయన బదిలీ అయినట్లు సమాచారం. టీడీపీ నాయకుడ్ని కలవలేదనే.. స్థానికంగా ఉన్న అధికార పార్టీ సీనియర్ నేతను కలవనందుకే డీఎస్పీపై బదిలీ వేటు పడినట్లు వార్తలు వస్తున్నాయి. డీఎస్పీ బా«ధ్యతలు స్వీకరించిన తర్వాత అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడిని కలిశారు. స్థానికంగా ఉన్న బంగారు వ్యాపారి ఇంటికి రాజ్యసభ సభ్యుడు రాగా డీఎస్పీ అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం సీనియర్ నేతకు తెలిసింది. వారం రోజులు కావస్తున్నా తనకు ఫోన్ చేయడం గానీ, కలవడం గానీ జరగకపోవడం సీనియర్ నేతకు ఆగ్రహాన్ని తెప్పించింది. కేవలం తనను కలవలేదనే కారణంతోనే డీఎస్పీని బదిలీ చేయించారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఉన్న సీనియర్ నేత ఆదివారం అక్కడే ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడి ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెప్పించి బదిలీ చేయించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి ఫోన్ రావడంతో డీఎస్పీ కడపకు వెళ్లారు. ఉన్నతాధికారులకు వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు రిలీవ్ అయ్యారు. ప్రభుత్వ సిమ్ కార్డును స్థానిక పోలీసు అధికారులకు అప్పగించి, తాను తెచ్చుకున్న ఛైర్ను తీసుకొని వెళ్లారు. ఆరు నెలల నుంచి ప్రొద్దుటూరు డీఎస్పీ కుర్చీ ఖాళీగా ఉండగా, ఎట్టకేలకు ఉన్నతాధికారులు డీఎస్పీని నియమించారని పట్టణ వాసులు భావించారు. అయితే అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరుతో డీఎస్పీ బదిలీ కావడాన్ని పోలీసు అధికారులు జీర్ణించుకోలేక పోతున్నారు. సీఐల విషయంలోనూ అంతే.. గతంలో ప్రొద్దుటూరు అర్బన్ సీఐగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన సీఐ శ్రీనివాసులు విషయంలో కూడా ఇలాగే జరిగింది. సీఐ కడప ఎస్పీని కలవడానికి వెళ్తుండగా దారిలో ఉండగానే వెనక్కి వెళ్లాలని ఉన్నతాధికారి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో తిరిగి ప్రొద్దుటూరుకు రాకుండానే సీఐ వెళ్లిపోయారు. కడపలో పని చేస్తున్న సీఐ సదాశివయ్యను ఎర్రగుంట్లకు బదిలీ చేశారు. అయితే ఆ ప్రాంత టీడీపీ నాయకుడికి తెలియకుండా బదిలీ చేశారనే కారణంతో సీఐని విధుల్లో చేరనివ్వలేదు. ఇలా మితి మీరిన రాజకీయ జోక్యంతో పోలీసు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. అధికార పార్టీ వర్గ పోరులో ప్రొద్దుటూరుకు రావాలంటేనే పోలీసు అధికారులు భయపడే పరిస్థితి వస్తోంది. -
ప్రత్యర్థులంతా ఏకమై మట్టుబెట్టారు..
► ఏడుగురు నిందితుల అరెస్టు కర్నూలు: బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన పేరపోగు రాజు (42) హత్య కేసు మిస్టరీ వీడింది. రాజు ప్రత్యుర్థులంతా ఏకమై అతడిని మట్టుబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో ఇద్దరు హతుడికి స్వయానా సోదరులుండడం గమనార్హం. నిందితులు పేరపోగు బుజ్జన్న, పేరపోగు బాబురావు, అదే గ్రామానికి చెందిన ఆకెపోగు ఇసాక్, సందెపోగు కృష్ణ, ఆకెపోగు రవి, పేరపోగు ప్రేమ్కుమార్, తేనెల రాజు అలియాస్ మున్నా రాజు (నందనపల్లె)పడిదెంపాడు సమీపంలోని కేసీ కెనాల్ కట్ట వద్ద ఉండగా పోలీసులు వారిని అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన పట్టుడు కట్టెలు, పిడిబాకులను స్వాధీనం చేసుకున్నారు. తాలూకా పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. గ్రామానికి చెందిన మారెన్న, వెంకటరమణ దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా హతుడు రాజు రెండవ కుమారుడు. తల్లి వెంకటమ్మ పేరుతో ఉన్న రెండు ఎకరాల పొలం విషయంలో తమ్ముళ్లు బాబురావు, బుజ్జన్నలతో విభేదాలు ఉన్నాయి. ఆస్తి కోసం హతుడితో గొడవ పడి సోదరులిద్దరూ ఊరు వదిలారు. ఎమ్మార్పీఎస్ మాజీ నేత పెద్ద లక్ష్మన్నకు వ్యతిరేకంగా ఉన్న వర్గంతో పేరపోగు రాజు సన్నిహితంగా ఉంటూ పెత్తనం చలాయించేవాడు. ఈ క్రమంలో ప్రత్యర్థులంతా ఏకమై గత నెల 29 రాత్రి గ్రామ శివారులోని బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీకి వెళ్లే దారిలో పొలంలో మద్యం తాపించి హత్య చేశారు. ఎమ్మార్పీఎస్ మాజీ నేత పెద్ద లక్ష్మన్న ఇందులో ప్రధాన సూత్రధారి, అతడితో పాటు బాబు, మహేష్ పరారీలో ఉన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి వారి కోసం గాలిస్తున్నారు. మద్యంలో విష ప్రయోగం చేసినట్లుగా అనుమానం ఉండడంతో నిర్ధారణ కోసం వైద్య పరీక్షలకు పంపారు. స్వల్ప వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించిన తాలూకా పోలీసులను డీఎస్పీ అభినందించారు. సీఐ మహేశ్వరరెడ్డి ఎస్ఐ గిరిబాబు పాల్గొన్నారు. -
అత్యాచార ఘటనపై డీఎస్పీ విచారణ
కంబదూరు: మండల కేంద్రం కంబదూరులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ మంగళవారం విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న రక్తపు మరకలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. బాలిక చదువుతున్న కేజీబీవీకి కూడా వెళ్లి అక్కడి సిబ్బందితో కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ వెంట ఎస్ఐ నరసింహుడు, సిబ్బంది ఉన్నారు. -
ఇసుక తోడే వారిపై నిఘా పెట్టండి
సాక్షి ఎఫెక్ట్.. కళ్యాణదుర్గం: పెన్నానది, వేదావతి నగరి పరివాహాక ప్రాంతాలతో పాటు వంక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తోడే వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోండని ఎస్ఐలను డీఎస్పీ టీఎస్ వెంకటరమణ ఆదేశించారు. ఇసుక తోడేళ్లతో రైతులకు శాపం’ శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. కళ్యాణదుర్గం సర్కిల్ పరిధిలోని ఎస్ఐలకు ఫోన్లో డీఎస్పీ మాట్లాడారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిఘా ఉంచి దాడులు చేసి ఇసుక అక్రమార్కులను పట్టుకోవాలన్నారు. దీంతో కంబదూరు ఎస్ఐ నరసింహుడు మండల పరిధిలోని పెన్నానది పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమ రవాణా దారులను పట్టుకునేందుకు పర్యటించారు. సాక్షిలో వచ్చిన కథనం కారణంగా ఇసుక రవాణాను చేయడానికి ఎవరూ పూనుకోకపోవడంతో పోలీసులకు పట్టుబడలేదు. ఇదే తరహాలోని బ్రహ్మసముద్రం మండలం వేదావతి, కళ్యాణదుర్గం మండలంలో పెన్నానది పరివాహక ప్రాంతాల్లో సంబంధిత ఎస్ఐలు ఇసుక అక్రమార్కులను పట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
నలుగురు దొంగల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను టూటౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం టూటౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీలు మల్లికార్జునవర్మ, నాగసుబ్బన్న వెల్లడించారు. నగరంలో అశోక్నగర్కు చెందిన షేక్ రషీద్, షేక్ సాధిక్ హుస్సేన్ కనగానపల్లి మండలం మద్దలచెర్వుకు చెందిన ప్రభంజన్రెడ్డి, రామగిరి మండలం పేరూరుకు చెందిన బెస్త ప్రసాద్ ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవారు. వీరంతా పాత నేరస్తులు. 2008లో సంవత్సరంలో పేరూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో దొంగతనానికి విఫలయత్నం చేశారు. ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు దొంగలపై నిఘా ఉంచిన సీసీఎస్ పోలీసులు, టూటౌన్ పోలీసులు సంయుక్తంగా కలిసి నిందితులను సాయినగర్లో అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.5 లక్షలు విలువజేసే 15 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీలు వివరించారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ యల్లమరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు
హిందూపురం అర్బన్: మట్కా నిర్వాహకులతో సన్నిహితంగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదివారం తెలిపారు. హిందూపురం కేంద్రంగా బహిరంగంగా సాగుతున్న మట్కాపై ‘బతుకులు క్లోజ్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ స్పందించారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించవద్దని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేయడంతో డీఎస్పీ రెండు రోజులుగా హిందూపురంలో మకాం వేశారు. మట్కా నిర్మూలన కంటే ముందు సొంత ఇంటి (పోలీసు శాఖ)ని చక్కదిద్దాలని నిర్ణయించుకున్నారు. మట్కా నిర్వాహకులతో సన్నిహితంగా ఉంటున్న ఇద్దరిలో ఒకరిని సబ్జైలు, మరొకరిని అమరాపురం స్టేషన్కు బదిలీ చేశారు. ఇంకో నలుగురిని ఇతర విధులకు అప్పగించారు. మరింత లోతుగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే తదుపరి చర్యలు ఉంటాయని డీఎస్పీ చెప్పారు. అసాంఘిక శక్తులతో సంబంధాలు కల్గిన వారు ఎంతటివారైనా ఊపేక్షించేది లేదన్నారు. మట్కా బీటర్లకు కౌన్సిలింగ్: పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మట్కారాస్తున్న 14 మంది బీటర్లకు ఆదివారం రాత్రి వన్టౌన్ పోలీసుస్టేషన్లో డీఎస్పీ కరీముల్లా షరీఫ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మట్కా రాయడం మానుకోవాలన్నారు. మట్కా నిర్వహకులనూ వదిలేది లేదన్నారు. పద్ధతి మార్చుకోకపోతే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
మా విధేయుడే అధికారిగా రావాలి..
- కాకినాడ డీఎస్పీ పోస్టుపై - టీడీపీ ఎమ్మెల్యేల పరస్పర పంతం - ఒక్కో వర్గానికీ ఒక్కో మంత్రి వత్తాసు - రాష్ట్రంలో రెండు విడతల బదిలీల్లో భర్తీకాని స్థానం - నేతలు వెనక్కి తగ్గకపోతే విషయం సీఎం ముందుకే.. సాక్షి ప్రతినిధి, కాకినాడ : విధ్యుక్తధర్మ నిర్వహణలో ఎలా ఉన్నా.. తమకు విధేయంగా పని చేసే పోలీస్ అధికారి ఉంటే తిమ్మిని బమ్మిని చేయవచ్చు. తప్పులు చేసే తమ వారిని కాపాడుకోవచ్చు. ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు ఓ అస్త్రంగా ప్రయోగించొచ్చు. కానివారిపై ఇష్టారీతిన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టొచ్చు. ఇప్పుడలా చెప్పుచేతల్లో ఉండే పోలీసు అధికారిని కాకినాడ డీఎస్పీగా తీసుకొచ్చేందుకు టీడీపీ నేతలు తెగపాట్లు పడుతున్నారు. అయితే.. ఇందులోనూ అంతర్గత పోరుకు తలపడుతున్న ఆ పార్టీ నేతలు.. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు తమకు కావలసిన అధికారినే ఆ స్థానంలోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఒక్కో వర్గానికి ఒక్కో మంత్రి వత్తాసు పలుకుతున్నారు. కాకినాడ డీఎస్పీగా పనిచేసిన ఎస్.వెంకటేశ్వరరావు ఇక్కడ సుదీర్ఘ కాలం పనిచేయడంతో బదిలీ తప్పనిసరైంది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన బదిలీల్లో ఆయనకు కొవ్వూరు బదిలీ కాగా ఆ స్థానంలో ఇంకా ఎవర్నీ నియమించలేదు. దీనికి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే కారణం. కాకినాడ డీఎస్పీగా తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకునేందుకు ఒక మంత్రి అండతో జిల్లా కేంద్రానికి సమీప నియోజకవర్గ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, తనకు అనుకూల అధికారిని తీసుకొచ్చేందుకు మరో మంత్రి అండదండలతో స్థానిక ఎమ్మెల్యే అంతే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఓ పోలీసు విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీలలో అస్మదీయులను ఇక్కడికి రప్పించేందుకు రెండు వర్గాలూ తమ తమ స్థాయిలలో ప్రయత్నిస్తున్నాయి. ఇరువర్గాల నుంచీ పోటీ తీవ్రంగా ఉండటంతో కాకినాడ డీఎస్పీ పోస్టుపై సందిగ్ధత చోటు చేసుకుంది. మరో రెండు పోస్టులు భర్తీ జిల్లాలో తాజాగా మరో రెండు పోలీసు అధికారుల పోస్టులు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీగా వై.వి.రమణకుమార్ను నియమించారు. అలాగే, రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ సెల్ –డీఎస్పీగా పి.సోమశేఖర్ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిస్సహాయస్థితిలో ఉన్నతాధికారులు ఇద్దరు ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకపోవడం, ఇద్దరు మంత్రులు జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ ఖాళీ భర్తీపై నిర్ణయం తీసుకోలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 4న 17 మందిని బదిలీలు చేసి, పోస్టింగ్స్ ఇచ్చినా కాకినాడలో మాత్రం ఎవర్నీ నియమించలేదు. అలాగే, ఈనెల 11న మరో 12 మందిని బదిలీ చేసి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇందులోనూ కాకినాడ పోస్టు భర్తీ కాలేదు. ఇరువర్గాల ఒత్తిడితో అధికారులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఎవరో ఒకరిని మాత్రమే సంతృప్తి పరచగలమని, ఈ క్రమంలో ఇంకొకర్ని నుంచి ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుందన్న భయంతోనే పోలీసు ఉన్నతాధికారులు ఈ పోస్టు భర్తీ జోలికి పోలేదు. ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోతే సీఎం స్థాయిలోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలిసింది. మొత్తానికి అధికార పార్టీ నేతల స్వప్రయోజనాల కోసం డిఎస్పీ పోస్టు పెండింగ్లో పడిపోయింది. -
11 మంది డీఎస్పీలకు పోస్టింగులు
అమరావతి: ఏపీలో కొన్ని నెలలుగా పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తోన్న డీఎస్పీలకు ఎట్టకేలకు లైన్క్లియర్ అయింది. వెయిటింగ్లో ఉన్న11 మంది డీఎస్పీలకు పోస్టింగ్లు ఇస్తూ డీజీపీ సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఒక డీఎస్పీని బదిలీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన అధికారులను తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. పోస్టింగ్ ఇచ్చిన డీఎస్పీలు ఎమ్. మహబూబ్ బాషా, వైవీ రమణ కుమార్, ఎమ్ . కృష్ణ మూర్తి నాయుడు, ఎ. దేవదానం, కె. తిరుమల రావు, జి. సోమేశ్వర రావు, జి. ఆంజనేయులు, సీహెచ్. పాపారావు, బి. మల్లేశ్వరరావు, టి. మధుసూదన్ చారి, పి. సోమశేఖర్ లకు కొత్తగా పోస్టింగులు ఇచ్చారు. శ్రీకాకుళంలో డీఎస్పీగా పనిచేస్తున్న టీ. మోహన్ రావును విజయవాడలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నంద్యాల డీఎస్పీగా వేణుగోపాల్కృష్ణ
కర్నూలు : పోలీసు శాఖలో డీఎస్పీల బదిలీలు ప్రారంభమయ్యాయి. మొదటి విడత రాష్ట్రంలో 17 మందికి స్థానచలనం కల్పిస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలంలో అసిస్టెంట్ కమాండెంట్గా (డీఎస్పీ) పనిచేస్తున్న ఎస్.వేణుగోపాలకృష్ణను నంద్యాలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన ఈయన 1989లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. జిల్లాలోని చాగలమర్రి, ఉయ్యాలవాడ, మహానంది, గడివేముల, కోవెలకుంట్ల, శిరివెళ్ల, మిడుతూరు, ఎమ్మిగనూరు రూరల్, కొలిమిగుండ్ల డీసీఆర్బీలో సేవలు అందించారు. 2003లో సీఐగా పదోన్నతి పొంది శ్రీశైలం, ఎమ్మిగనూరు, ఎమ్మిగనూరు రూరల్, జమ్మలమడుగు అర్బన్, బనగానపల్లె, డీసీఆర్బీ కర్నూలులో పనిచేశారు. 2012లో డీఎస్పీగా పదోన్నతి పొంది తిరుపతి రైల్వే, చిత్తూరు సీసీఎస్లో పనిచేసి ఏడాదిన్నర క్రితం కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలానికి వచ్చారు. హరినాథరెడ్డిని విజయవాడ చీఫ్ ఆఫీస్లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొన్నారు. -
ఏపీలో పెద్ద ఎత్తున డీఎస్పీల బదిలీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున్న డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న ఒక డీఎస్పీతో సహా మొత్తం 17 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగించారు. బదిలీ అయిన డీఎస్పీలు ఎస్.వి.శ్రీధర్ రావు, ఎన్ సుబ్బారావు, వి రామరావు, ఎ.వి.ఎల్ ప్రసన్నకుమార్, కే. శ్రీనివాసులు, పి. మహేశ్, ఎస్.వి.గోపాల్ కృష్ణ, కే.వి.రాఘవ రెడ్డి, ఎన్. వెంకట రామంజనేయులు, ఏ. శ్రీనివాస్ రావు, ఎమ్. మునిరామయ్య, ఎల్. అర్జున్, కె. వెంకటరమణ, ఎస్. వెంకటేశ్వరరావు, సిహెచ్. మురళీకృష్ణలతో పాటు వెయిటింగ్ లో ఉన్న కరీముల్ల శరీఫ్ లు ఉన్నారు. వీరంతా వారికి కేటాయించని ప్రాంతాల్లో వెంటనే రిపోర్టు చేసి చార్జ్ తీసుకోవాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
న్యాయవాది వద్ద లొంగిపోవాలని యత్నిస్తుండగా అరెస్టు
కళ్యాణదుర్గం : మండలం కామక్కపల్లి అటవీ ప్రాంతం వద్ద నిందితులు న్యాయవాది ద్వారా లొంగిపోవాలని ప్రయత్నిస్తుండగా సమాచారం అందడంతో సోమవారం డీఎస్పీ టీఎస్ వెంకటరమణ, సీఐ శివప్రసాద్ల సూచనలతో 15 మంది నిందితులను అరెస్టు చేసి, 9 ద్విచక్రవాహనాలు, 1 ఆటో, ప్లాస్టిక్ గంపలు, గడ్డపారలు, చెలికిపారలు, టార్చ్లైట్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐలు వివరించారు. రామకృష్ణతో పాటు పెనుకొండ మండలం నగరూరు గ్రామానికి చెందిన వినోద్కుమార్, రొద్దం మండలం ఎం.కొత్తపల్లికి చెందిన శివారెడ్డి, నల్లమాడ మండలం కోలంవాండ్లపల్లికి చెందిన రమణారెడ్డి, కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లికి చెందిన చంద్రశేఖర్, పరిగి మండలం సంగమేశనిపల్లికి చెందిన సతీష్కుమార్, పరిగి మండలం శాసనకోట గ్రామానికి చెందిన రామాంజినేయులు, అనంతపురానికి చెందిన దూదేకుల ఖలందర్, బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లికి చెందిన బోయ బసవరాజు, కంబదూరు మండలం మర్రిమాకులపల్లికి చెందిన పూజారి రామచంద్ర, భజంత్రీ సత్యనారాయణ, నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన నరసింహమూర్తి, బ్రహ్మసముద్రం మండలం మామడూరుకు చెందిన పూజారి గోవిందులను అరెస్టు చేశామని వివరించారు. కళ్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లికి చెందిన తిప్పేస్వామి అలియాస్ భవాని, అనంతపురం పట్టణానికి చెందిన రఘ, వడ్డే వెంకటేశ్, అనంతపురం రూరల్ మండలం ఆలమూరుకు చెందిన సుబ్బరాయుడు పరారీలో ఉన్నారన్నారు. ఇదిలా ఉండగా గుప్తనిధుల ముఠా సభ్యుల నుంచి పట్టుబడ్డ ద్విచక్రవాహనాలపై పోలీసు స్టిక్కర్లు ఉన్నాయని, అయితే ఇందులో పోలీసుల పాత్ర ఏమీ లేదని విచారణలో తేలినట్లు చెప్పారు. -
అనుమానంతో అంతమొందించాడు!
⇔ మహిళను చంపి మృతదేహాన్ని తగులబెట్టిన వైనం ⇔ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు ⇔ నలుగురు నిందితుల అరెస్ట్ ⇔ మరొకరి కోసం గాలిపు నందికొట్కూరు: ఓ మహిళ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతున్న వ్యక్తే ఆమెను దారుణంగా చంపేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 39 రోజుల్లో మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని డీఎస్పీ సుప్రజ ఎదుట హాజరు పరిచారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆమె వివరించారు. మల్యాల గ్రామానికి చెందిన వడ్డే పద్మావతి భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. పద్మావతికి అదే గ్రామానికి చెందిన వడ్డె దండుగుల శ్రీనివాసులుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత ఆమె.. శ్రీనివాసులుకు దూరంగా ఉండటంతో అనుమానం వచ్చింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కడతేర్చాలని కుట్ర పన్నాడు. ఈ మేరకు నందికొట్కూరు పట్టణానికి చెందిన కొంగర నాగశేషులు, మల్యాలకు చెందిన దండుగుల బాల నాగన్న, జూపాడుబంగ్లా మండలం తంగెడంచకు చెందిన తెప్పలి రవీంద్రకుమార్, అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డు డీఎస్పీ కుమారుడు.. ఓ పత్రికా విలేకరి ఫణియాదవ్ సహాయం తీసుకున్నాడు. మే 8న పద్మావతిని వెలుగోడు కస్తూర్బా పాఠశాల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని తగుల బెట్టారు. అదే నెల 20న పద్మావతి కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానంతో శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా కేసు మిస్టరీ వీడింది. నాలుగు రోజుల క్రితం ఘటనా స్థలంలో మహిళ పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు సహకరించిన ఫణియాదవ్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీం గాలిస్తున్నట్లు చెప్పారు. జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎలిషా కేసును కూడా త్వరలో చేధిస్తామన్నారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, అశోక్ పాల్గొన్నారు. -
ఎట్టకేలకు తెరదించారు
► 195 మందికి డీఎస్పీలుగా పదోన్నతి! హైదరాబాద్: డీఎస్పీ పదోన్నతుల వ్యవహారం చివరి మజిలీకి చేరింది. మూడే ళ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారానికి ఎట్టకే లకు హోంమంత్రి, ఉన్నతాధికారులు ఆది వారం తెరదించారు. హోంమంత్రి అధ్యక్షతన శనివారం అర్ధరాత్రి వరకు ఈ పదోన్నతులపై సమావేశం జరిగింది. అభ్యంతరాలు తెలుపు తున్న ఇన్స్పెక్టర్లు, పదోన్నతి పొందుతున్న ఇన్స్పెక్టర్ల మధ్య రాజీ కుదిర్చి ఆదివారం డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీ (డీపీసీ) సమావేశానికి తెరదించింది. 195 మందికి గ్రీన్సిగ్నల్.. వరంగల్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్.. ఈ మూ డు ప్రాంతాల్లో అర్హత కలిగిన అధికారుల పదో న్నతి జాబితా రెండు నెలల కిందే డీజీపీ కార్యాలయం విచారణ నిమిత్తం ఏసీబీ తో పాటు అన్ని యూనిట్లకు వెళ్లింది. 1989, 1991, 1995 బ్యాచ్లకు చెందిన 460 మంది ఇన్స్పెక్టర్ల జాబితాపై ఆదివారం డీజీపీ కార్యా లయం లో డీపీసీ కసరత్తు చేసింది. ప్రతి అధికారికి సంబంధించిన ఏసీఆర్ (యాన్యు వల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్), పెండింగ్లో ఉన్న పనిష్మెంట్లు, విచారణలు.. ఇలా అన్నిం టిని సమీక్షించి 195 మంది ఇన్స్పె క్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమా చారం. 1989, 1991 బ్యాచ్ అధికారులు 131 మందితో పాటు 1995 బ్యాచ్కు చెంది న 64 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించే అవకాశం ఉందని సీనియర్ ఐపీఎస్ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. సీఎం వచ్చాకే పోస్టింగ్స్ పదోన్నతుల పొందిన అధికారుల జాబితా సీఎం పరిశీలించాక అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సీఎంకేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారని, ఆయన రాగానే అధికారిక జాబితాతో పాటు పోస్టింగ్స్ ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. -
డీఎస్పీని కొట్టిచంపారు!
శ్రీనగర్లో మసీదు ముందే కిరాతకం - శుక్రవారం ప్రార్థనలకు భద్రతగా వచ్చిన డీఎస్పీ - పరిస్థితులు సమీక్షిస్తుండగా ఒక్కసారిగా దాడి శ్రీనగర్: కశ్మీర్లోని మసీదు ముందే ఓ అల్లరిమూక రెచ్చిపోయింది. శ్రీనగర్లోని చారిత్రక జామియా మసీదు ముందు భద్రతకోసం వచ్చిన ఓ డీఎస్పీ అధికారిని బట్టలూడదీసి మరీ కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపేసింది. రంజాన్లో పవిత్రమైన చివరి శుక్రవారం మసీదు ముందే ఇలాంటి దారుణమైన ఘటన యావద్భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఘాటుగా స్పందించారు. పోలీసులతో ఇలా అమానుషంగా, అవమానకరంగా వ్యవహరిస్తుంటే.. ఇంకెంతకాలం వాళ్లు ఓపికగా ఉంటారన్నారు. పోలీసుల సహనం నశిస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ ఘటన ఇస్లాం మత విశ్వాసాలు, విలువలకు పూర్తి విరుద్ధమని వేర్పాటువాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. అసలేం జరిగింది? రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మసీదు నుంచి ప్రార్థనలు చేసిన వారంతా బయటకు వస్తున్నారు. మసీదు వద్ద శుక్రవారం ప్రశాంతంగా ప్రార్థనలు జరిగేలా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. డీఎస్పీ మహ్మద్ అయూబ్ పండిత్ కూడా ప్రార్థనామందిరం లోపల భద్రతను సమీక్షించి బయటకు వస్తున్నారు. అంతలోనే అక్కడున్న కొందరు యువకులు డీఎస్పీపై ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అయూబ్ బట్టలూడదీసి మరీ చితగ్గొట్టారు. చచ్చిపోతున్నాను వదలమని అర్థించినా వదలకుండా కొట్టి చంపారు. అయితే తనను తాను రక్షించుకునేందుకు అయూబ్ మూడు రౌండ్లు కాల్పులు జరిపారని దీంతో ముగ్గురికి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భద్రతకోసం వచ్చి వారిచేతుల్లోనే! మసీదు లోపలినుంచి వస్తున్నవారి ఫొటోలను తీస్తున్నసమయంలో దాడి జరిగినట్లు తెలిసింది. తమను ఫొటో తీయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు డీఎస్పీపై దాడికి పాల్పడ్డారని.. వీరినుంచి తననుతాను కాపాడుకునేందుకు అయూబ్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తులై డీఎస్పీని కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత రావటంలేదు. ‘మసీదుకు వచ్చే వారి రక్షణ కోసమే అయూబ్ విధులు నిర్వహిస్తున్నారు. కానీ తమ భద్రతకోసం వచ్చిన పోలీసు అధికారినే కొట్టి చంపటం దురదృష్టకరం’ అని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మసీదులో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ప్రాథమిక విచారణ అనంతరంవెల్లడించారు. డీఎస్పీని కొట్టి చంపిన తర్వాత అక్కడున్న పోలీసు ఔట్పోస్టులనూ ధ్వంసం చేశారు. పోలీసు బలగాలు రంగంలోకి దిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పాయి. డీఎస్పీ హత్యకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా.. మరొ వ్యక్తిని గుర్తించినట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. ‘డీఎస్పీ ఆత్మరక్షణ కోసమే మూడురౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. అది అతని హక్కు’ అని డీజీపీ పేర్కొన్నారు. వారి సహనం నశిస్తే అడ్డుకోలేం: ముఫ్తీ హత్యకుగురైన డీఎస్పీ మృతదేహం వద్ద జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు. ‘ఇంతకన్నా మరో అవమానకరమైన విషయం వేరొకటి ఉంటుందా? మా ప్రజలతో వ్యవహరిస్తున్నామన్న ఆలోచనతోనే పోలీసులంతా చాలా ఓపికగా ఉన్నారు. డీఎస్పీ ప్రజలను కాపాడే బాధ్యతలోనే మసీదుకెళ్లారు. సొంతపనిమీద కాదు. కానీ ఇలా వీరు ఓపికగా ఎంతకాలం ఉండాలి? వారి సహనం నశిస్తే పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి’ అని హెచ్చరించారు. డీఎస్పీని కొట్టి చంపిన వారు నరకానికి పోతారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటన దిగజారుడుతనానికి పరాకాష్ట అని కాంగ్రెస్ నేత రాహుల్ పేర్కొన్నారు. -
డీఎస్పీల బదిలీలు షురూ!
– కర్నూలుకు యుగంధర్ బాబు... – నంద్యాలకు రామకృష్ణ... – ఆళ్లగడ్డకు గోపాలకృష్ణ... – ఆత్మకూరుకు రాఘవరెడ్డి పేర్లను సిఫారసు చేసిన ‘నేతలు’ కర్నూలు : పోలీసు శాఖలో సబ్ డివిజన్ పోలీసు అధికారుల బదిలీలకు రంగం సిద్ధమయ్యింది. మూడు రోజుల క్రితం భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని విశాఖపట్నం మినహా మిగతా 12 జిల్లాలకు ప్రభుత్వం నూతన ఎస్పీలను నియమించింది. ఈ బదిలీల్లో భాగంగా కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణకు పోస్టింగ్ ఇవ్వలేదు. తదుపరి పోస్టింగుల నిమిత్తం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని బదిలీ ఉత్తర్వులో పేర్కొనడంతో ఆయన గురువారం రాత్రి నూతన రాజధాని అమరావతి(విజయవాడ)కి తరలివెళ్లారు. విజయవాడ ట్రాఫిక్ లేదా ఒంగోలు పోలీసు శిక్షణా కేంద్రానికి ఆయనను నియమించే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. ఐదుగురు డీఎస్పీలకు స్థాన చలనం... జిల్లాలో ఆరు పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. డోన్ మినహా మిగిలిన ఐదు సబ్ డివిజన్ పోలీసు అధికారులకు స్థాన చలనం కలిగే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. రెండేళ్లు సర్వీసు పూర్తయిన డీఎస్పీలు బదిలీకి అర్హులు. కర్నూలు డీఎస్పీగా రమణమూర్తి దాదాపు 30 నెలలకు పైగా పనిచేశారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్కు చెందిన యుగంధర్ బాబు పేరు ఖరారైనట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం కర్నూలు సీఐడీ విభాగంలో పనిచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్రెడ్డి..యుగంధర్ బాబు పేరును సిఫారసు చేసినట్లు చర్చ జరుగుతోంది. యుగంధర్ బాబు తండ్రి రంగయ్య నాయుడు పోలీసు శాఖలో డీఎస్పీ హోదాలో పదవీ విరమణ పొందారు. సీఐగా జిల్లాలో పనిచేసేటప్పుడు మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉండేది. ఈ నేపథ్యంలో ఆయనను కర్నూలు డీఎస్పీగా నియమించాలని ఎస్.వి.మోహన్రెడ్డి సిఫారసు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తుండగా రమణమూర్తినే మరికొంత కాలం కొనసాగించాలనే నిర్ణయంలో కేఈ ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. నంద్యాల డీఎస్పీగా హరినాథ్ రెడ్డి రెండున్నరేళ్లకు పైగా పనిచేశారు. కాల పరిమితి పూర్తి కావడంతో ఆయన స్థానంలో విజయవాడ రైల్వే విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న రామకృష్ణను నియమించాలని రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ సిఫారసు చేసినట్లు సమాచారం. ఈయన గతంలో కర్నూలు డీఎస్పీగా పనిచేశారు. టి.జి.వెంకటేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఇంటికి వెళ్లాడన్న కారణంపై అప్పట్లో రామకృష్ణపై బదిలీ వేటు పడింది. దీంతో టీజీ ఆశీస్సులు రామకృష్ణకు ఉన్నట్లు అధికారుల్లో చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డ డీఎస్పీగా ఈశ్వర్రెడ్డి చేరి ఏడాదిన్నర కూడా కాలేదు. ఆయనకు ఇంకా ఆరు మాసాలు గడువు ఉన్నప్పటికీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో పనిచేస్తున్న 1989 బ్యాచ్కు చెందిన గోపాలకృష్ణను నియమించాలని అఖిలప్రియ ఆ శాఖ ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. అలాగే ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ స్థానంలో 1989వ బ్యాచ్కు చెందిన రాఘవరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఈయన గతంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు. ఎమ్మిగనూరు సీఐగా కూడా పనిచేశారు. మదనపల్లి డీఎస్పీగా పనిచేస్తూ రెండేళ్ల క్రితం బదిలీపై కర్నూలు సీఐడీకి వచ్చారు. ఆదోని డీఎస్పీగా కొల్లి శ్రీనివాసులు నియమితులై ఏడాదిన్నర పూర్తయ్యింది. ఇంకా ఆయనకు సమయమున్నప్పటికీ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆయన బదిలీకి పట్టుబట్టినట్లు సమాచారం. స్థానిక నాయకుడి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని డీఎస్పీగా నియమించుకునేందుకు ప్రభుత్వ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ఆదోని సబ్ డివిజన్లో అధికార పార్టీ నాయకుని సామాజిక వర్గానికి చెందిన కొంతమంది సీఐలు ప్రస్తుత డీఎస్పీకి వ్యతిరేకంగా పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో స్థానిక నాయకుడు కూడా సీఐల సూచనల మేరకు తన సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీని నియమించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. విజిలెన్స్ విభాగానికి తీవ్ర పోటీ... కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో డీఎస్పీ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. రెండు నెలల క్రితం విల్సన్ బాబు పదవీ విరమణ పొందడంతో పోస్టు ఖాళీగా ఉంది. ఇందుకోసం గతంలో కర్నూలు ఏసీబీ డీఎస్పీగా పనిచేసిన మహబూబ్ బాషా, కర్నూలు పోలీస్ శిక్షణా కేంద్రంలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డీఎస్పీ రాజశేఖర్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రమణమూర్తి బదిలీ తప్పనిసరి అయితే ఆయన కూడా విజిలెన్స్ విభాగానికి వచ్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ కార్యాలయంలో ఎస్ఐ పోస్టు కూడా రెండు మాసాలుగా ఖాళీగా ఉంది. సుబ్బరాయుడు పదోన్నతిపై ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో నంద్యాల మూడోవ పట్టణంలో ఎస్ఐగా పనిచేస్తున్న 2009 బ్యాచ్కు చెందిన జయన్నను నియమించినట్లు సమాచారం. నంద్యాల ఉప ఎన్నిక, వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డీఎస్పీల బదిలీ ప్రక్రియ సాగవచ్చని ఆ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ కూడా విధుల్లో చేరి రెండేళ్లు పూర్తయింది. మలి విడత చేపట్టనున్న ఐపీఎస్ బదిలీల్లో ఈయనకు కూడా స్థాన చలనం కలగనున్నట్లు సమాచారం. అయితే మరో రెండు మాసాల్లో ఆయనకు పదోన్నతి కల్పించాల్సి ఉన్నందున అప్పటివరకు కొనసాగించవచ్చునన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం కర్నూలు ఓఎస్డీగా పనిచేస్తున్న రవిప్రకాష్ కూడా విశాఖపట్టణానికి బదిలీపై వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన భార్య అక్కడ లెక్చరర్గా పనిచేస్తున్నందున స్పౌజ్ కేసు కింద తనను బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రసుత్తం ఈయన సెలవులో ఉన్నారు. బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
వారు నరకంలో కాలిపోతారు!!
శ్రీనగర్: శ్రీనగర్లోని ఓ ప్రముఖ మసీదు ఎదుట డీఎస్పీని కొట్టిచంపిన ఘటనపై రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. జామియ మసీదు ఎదుట డీఎస్పీ ఆయూబ్ పండిత్ను ఓ అల్లరి మూక దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అత్యంత సిగ్గుచేటు అని సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించగా.. ప్రతిపక్ష నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయూబ్ పండిట్ను కొట్టిచంపిన తీరు అధిక్షేపణీయమన్నారు. 'డీఎస్పీ పండిత్ను కొట్టిచంపిన వారు తమ పాపాలకు నరకంలో కాలిపోదురుగాక' అంటూ ఆయన ట్వీట్ చేశారు. వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ కూడా ఈ ఘటనను తప్పుబట్టారు. 'నౌహాట్టాలో చోటుచేసుకున్న అనాగరిక చర్య తీవ్రంగా కలిచివేస్తోంది. మూక హింస, బహిరంగంగా కొట్టిచంపడం మన విలువలకు, మతానికి వ్యతిరేకం. ప్రభుత్వ కూర్రత్వం మన మానవత్వాన్ని, విలువలను హరించకుండా మనం చూడాలి' అని ఆయన అన్నారు. చదవండి: మసీదు ముందు డీఎస్పీని కొట్టిచంపేశారు! -
ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు: సీఎం
శ్రీనగర్: శ్రీనగర్లోని జామియా మసీదు వద్ద డీఎస్పీని ఒక అల్లరి మూక కొట్టిచంపిన ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకన్నా సిగ్గులేని చర్య మరొకటి ఉండదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే జమ్మూకశ్మీర్ పోలీసులు ఉత్తమ సేవలు అందిస్తున్నారని, సొంతవారన్న స్పృహతో ప్రజలను ఎదుర్కోవడంలో ఎంతో నిగ్రహం పాటిస్తున్నారని, అయినా ఇలాంటి దారుణానికి పాల్పడటం బాధాకరమని ఆమె అన్నారు. మూక దాడిలో అమరుడైన డీఎస్పీ మహమ్మద్ ఆయూబ్ పండిట్కు ఆమె నివాళులర్పించారు. చదవండి: మసీదు ముందు డీఎస్పీని కొట్టిచంపేశారు! -
మానసిక స్థితి బాగోలేని మహిళపై దాష్టీకం
జైపూర్: రాజస్థాన్లో కొందరు ఆకతాయిలు వీరంగం సృష్టించారు. మానవత్వం అనే పదానికి అర్థం మరిచిపోయి తమ ఇష్టరీతిగా ప్రవర్తించారు. మానసిక స్థితి బాగాలేని మహిళని ఆకతాయిలు బావబాదిన ఘటన నాగౌర్లో ఆలస్యంగా చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు నాగౌర్ డీఎస్పీ ఓం ప్రకాశ్ గౌతమ్ తెలిపారు. ఆ వివరాలు.. రాజస్థాన్లోని నాగౌర్లో గత మంగళవారం ప్రకాశ్, శ్రావణ్ సహా మరో యువకుడు బైక్పై వెళ్తున్నారు. ఇంతలోనే రోడ్డు పక్కన బైకును నిలిపారు. మానసిక స్థితి సరిగాలేని మహిళ వద్దకు ముగ్గురు యువకులు వెళ్లారు. ఇందులో ఇద్దరు యువకులు 'జై శ్రీరామ్', 'జై హనుమాన్' అని నినాదాలు చేయాలని సూచించగా.. మహిళ త్వరగా స్పందించలేదు. వెంటనే వీరిలో ఇద్దరు యువకులు పైపులతో ఆ అభాగ్యురాలిని చితకబాదారు. మానవత్వం మరిచిన ఆ యువకులు.. వారు చెప్పిన పదాల్ని గట్టిగా నినదించే వరకు మానసిక స్థితి బాగాలేని మహిళను పైపులతో కొట్టడాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఓం ప్రకాశ్ చెప్పారు. జూన్ 13న ఈ ఘటన జరిగిందని, ఈ కేసుకు సంబంధించి నిందితులు ప్రకాశ్, శ్రావణ్ లను అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ వివరించారు. -
క్రమశిక్షణ తప్పుతున్నారు.. కట్టడి చేయండి!
ఇన్స్పెక్టర్లకు కర్నూలు డీఎస్పీ ఆదేశం కర్నూలు: ‘‘కొంతమంది సిబ్బంది నిర్వాకంతో పోలీసు శాఖకే చెడ్డ పేరు వస్తోంది.. క్రమశిక్షణ తప్పుతున్నవారిని కట్టడి చేయండి’’అని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి.. ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఆదివారం కర్నూలు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్లతో తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. సర్కిళ్ల వారీగా నేరాలతో పాటు సిబ్బంది వ్యక్తిగత క్రమశిక్షణపై చర్చించారు. పోలీసు సిబ్బంది వాట్సాప్ల వినియోగంపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న పోలీసు సిబ్బంది నుంచి బయటి వ్యక్తులకు సమాచారం చేరవేయకుండా కట్టడి చేయాలని సూచించారు. సీఐలు మహేశ్వరరెడ్డి, నాగరాజరావు, నాగరాజు యాదవ్, శ్రీనివాసరావు, కృష్ణయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దిద్దుబాటు చర్యలు... కర్నూలులో హోంగార్డుపై స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు మనోజ్ కుమార్, మణికుమార్ల దాడి, అనంతరం సస్పెన్షన్, డో¯ŒSలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ యాగంటయ్య విధుల నుంచి తొలగింపు, శ్రీశైలంలో ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో కానిస్టేబుల్ ఉమ్లానాయక్ వేధింపులు, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు.. కానిస్టేబుల్ సస్పెన్షన్, రాజమండ్రికి చెందిన పెళ్లి బృందంలోని ఓ మహిళ పట్ల ఆకతాయిగా వ్యవహరించిన మిడుతూరు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్పై నంద్యాల వన్టౌన్లో కేసు నమోదు, ఆపై సస్పెన్షన్... ఇలా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహార తీరుపై వరుస సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. సబ్ డివిజన్ స్థాయిలో సిబ్బంది వ్యవహార శైలిపై ఇన్స్పెక్టర్లతో సమీక్షకు ఆదేశించిన నేపథ్యంలో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తన పరిధిలోని ఇన్స్పెక్టర్లతో సమావేశమై చర్చించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్కిళ్ల వారీగా నేరాలతో పాటు సిబ్బంది పనితీరు, వ్యక్తిగత క్రమశిక్షణపై చర్చించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
అత్యాచారం కేసులో అటవీ సిబ్బంది అరెస్ట్
తాడ్వాయి: గొత్తికోయ గూడెం కు చెందిన గొత్తి కోయ గిరిజన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ అటవీ సిబ్బంది విజయ్ కుమార్, సంతోష్లను తాడ్వాయి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ములుగు డీఎస్పీ దక్షిణామూర్తి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అడవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే ఈ గొత్తికోయ మహిళలు రోజుమాదిరి అడవిలోకి ఎర్ర చీమల కోసం వెళ్లారు. వీరిలో ఒకరిపై బేస్ క్యాంపు సిబ్బంది విజయ్ కుమార్, సంతోష్లు అత్యాచారానికి ఒడిగట్టారు. తాడ్వాయి పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి విచారణ చేపట్టగా, నేరం ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. నిందితులపై ఐపీసీ 366, 376 సెక్షన్లపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
ప్రభుత్వ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
కర్నూలు: విద్యుదాఘాతంతో మృతి చెందిన కానిస్టేబుల్ సుల్తాన్(30) మృతదేహానికి స్వగ్రామం ఈ తాండ్రపాడులో శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 2009 బ్యాచ్కు చెందిన ఈయన మిడ్తూరు పోలీస్ స్టేషన్లో ఉంటూ ఆత్మకూరు డీఎస్పీ సుప్రజకు గన్మెన్గా విధులు నిర్వహించేవారు. గురువారం ఉదయం డ్రస్ మార్చుకునేందుకు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంపై ఉన్న రేకుల షెడ్డులోకి వెళ్లి వేలాడదీసిన ఇనుపతీగపై ఆరేసిన టవాల్ను అందుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె.దామోదర్రెడ్డి, కార్యవర్గ సభ్యులు సత్యన్నయాదవ్, ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, నందికొట్కూరు సీఐ వెంకటరమణ, మిడ్తూరు ఎస్ఐ సుబ్రమణ్యం, సబ్ డివిజన్ పరిధిలోని పలువురు ఎస్ఐలు 2009 బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్లు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీసుల తరపున డీఎస్పీ సుప్రజ మృతి చెందిన సుల్తాన్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఈయనకు భార్యతో పాటు ముగ్గురు సంతానం. -
డీఎస్పీ గన్మన్ మృతి
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ గన్మన్ (ఏఆర్ కానిస్టేబుల్) సుల్తాన్ (30) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విధినిర్వహణలో భాగంగా ఉదయమే డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న అతను డ్రస్ మార్చుకునేందుకు కార్యాలయం పైభాగంలో ఉన్న రేకుల షెడ్లోకి వెళ్లాడు. రేకుల షెడ్ నుంచి వేలాడదీసిన ఇనుప తీగపై ఆరేసిన టవల్ను సుల్తాన్ అందుకుంటుడగా అప్పటికే వర్షం కురుస్తుండడం పాత విద్యుత్ తీగల నుంచి విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై నేలపై పడి పోయాడు. పక్కనే ఉన్న మరో గన్మన్ గమనించి అందరిని అప్రమత్తం చేశాడు. సుల్తాన్ను స్థానిక ప్రవేట్ వైద్యుడు గౌరినాథ్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. 2009 బ్యాచ్కు చెందిన ఇతను కర్నూలు మండలం బి. తాండ్రపాడు నివాసి. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మిడుతూరు పోలీసు స్టేషన్ అటాచ్డ్ ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తూ డీఎస్పీ గన్మన్గా ఉన్నారు. పది రోజుల క్రితం ఇతనికి డివిజన్ నుంచి బదిలీ అయినట్టు తెలిసింది. అయితే ఏవో కారణాలతో అతన్ని డివిజన్ నుంచి రిలీవ్ చేయలేదు. సమాచారం అందుకున్న డీఎస్పీ సుప్రజ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద వివరాల తెలుసుకున్నారు. కన్నీరుపెట్టుకుంటు బోరున విలపించారు. సుల్తాన్ మృతదేహాన్ని సందర్శించిన ఎస్పీ: సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఆకె రవి కృష్ణ ఆత్మకూరు చేరుకుని సుల్తాన్ మృతదేహాన్ని సందర్శించారు. శరణ్య క్లినిక్లో ఉన్న సుల్తాన్ మృతదేహానికి ఆయన ఘనంగా నివాళ్లులర్పించారు. అనంతరం డీఎస్పీ సుప్రజతో ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్యులు డాక్టర్ గౌరీ నాథ్తో కూడా ఆయన మాట్లాడారు. సీఐ కృష్ణయ్య, ఎస్ఐ లోకేష్ కుమార్, వెంకట సుబ్బయ్య, సుధాకరరెడ్డి కూడా సుల్తాన్కు నివాళ్లు అర్పించారు. -
రైతులపై ‘థర్డ్ డిగ్రీ’ దుర్మార్గం
అనంతపురం సెంట్రల్ : విచారణ పేరుతో రైతులపై థర్డ్ డిగ్రీ (పోలీస్ మార్క్ కౌన్సెలింగ్)కు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. రాప్తాడు మండలం బోగినేపల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రైతులు నారాయణ, శంకర్, మాదన్న, ముత్యాలప్పలు పొలానికి ఎరువులు తోలడం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం పొలంలోనే మద్యం లేకుండా విందు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికీ ఇబ్బంది కలిగించకపోయినా, ఫిర్యాదు ఇవ్వకపోయినా విచారణ పేరుతో రైతులను ఇటుకులపల్లి స్టేషన్కు తీసుకుపోయిన సీఐ రాజేంద్రనాథ్ తనదైన శైలిలో ‘కౌన్సిలింగ్’ ఇచ్చారు. ఆదివారం బాధితులను తీసుకొని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డితో కలిసి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మను ఆయన కార్యాలయంలో కలిసి సీఐపై ఫిర్యాదు చేశారు. ఇటుకలపల్లి సీఐ కూడా అక్కడే ఉండడంతో కొద్దిసేపు వాగ్వాదం చేటు చేసుకుంది. తప్పుచేయకున్నా కౌన్సిలింగ్ ఇస్తారా అంటూ నిలదీశారు. అనంతరం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డిలు మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రామగిరి, రాప్తాడు మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. అకారణంగా కౌన్సెలింగ్ పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదన్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూసరవీంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ రాప్తాడు మండల కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు సత్యనారాయణ, కేశవరెడ్డి, ఓబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా బైకుల దొంగ అరెస్టు
మార్కాపురం : గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బైకు దొంగతనాలు, గృహాల్లో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను మార్కాపురం శివారు ఎస్టేట్ వద్ద వై.జంక్షన్ సమీపంలో పట్టణ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసినట్లు డీఎస్పీ మాసుంబాషా తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కనిగిరి మండలం చింతలపాలేనికి చెందిన చింతల సిసింద్రీ అలియాస్ సూర్య శనివారం స్థానిక వై.జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సిసింద్రీ నెల్లూరు జిల్లా ముంజమూరులో మోటార్ సైకిల్ను, కావలి టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో అపాచీ మోటార్ సైకిల్ను, గుంటూరు పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంజమూరులో పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించి 20 తులాల విలువ చేసే వెండి వస్తువులను దొంగిలించినట్లు తేలింది. ఇటీవల మార్కాపురం పట్టణ పోలీసుస్టేషన్ పరిధి భగత్సింగ్ కాలనీలో దొంగతనం చేసి రెండు వెండి గిన్నెలు దొంగిలించాడు. వెండి ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సైడ్ లాక్ లేని వాహనాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని సిసింద్రీ దొంగతనాలు చేస్తాడని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వివరించారు. కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ బత్తుల శ్రీనివాస్, ఎస్ఐ బూదాల శ్రీకాంత్, ఏఎస్ఐ అల్లూరిరెడ్డి, రైటర్ మాల్యాద్రిరెడ్డి, కానిస్టేబుల్ వెంకట్, హోంగార్డు రమణలను డీఎస్పీ అభినందించారు. -
ఆధిపత్యం కోసమే జంట హత్యలు
► గోవిందపల్లె కేసులో నిందితుల అరెస్టు ►వివరాలు వెల్లడించిన ఆళ్లగడ్డ డీఎస్పీ ఆళ్లగడ్డ : ఆధిపత్యం కోసమే గోవిందపల్లె గ్రామంలో ఇందూరు ప్రభాకర్రెడ్డి, అతని బావమర్ది మేరువ శ్రీనివాసరెడ్డిలను హత్య చేశారని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్రెడ్డి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్లారు. రాజకీయ ఎదుగులను చూసి ఓర్వలేక ప్రత్యర్ధులు హత్య చేసినట్లు ఆయన తెలిపారు. ఎదుగుదల చూసి ఓర్వలేక ఇందూరు ప్రభాకర్రెడ్డి గతంలో శిరివెళ్ల మండలాధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏ చిన్న పనిపడినా ఇతని దగ్గరకు వచ్చేవారు. స్వతహాగా అందరినీ కలుపుకుని పోయే మనస్థత్వం గల ప్రభాకర్రెడ్డి.. తనదగ్గరకు వచ్చేవారందరికీ పార్టీ, వర్గం తేడా లేకుండా పనులు చేసేవారు. దీంతో గ్రామంలోని ప్రత్యర్థి వర్గాలకు కళ్లుకుట్టేవి. గ్రామం నుంచి మండలం, మండలం నుంచి నియోజవర్గస్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటుండటంతో ప్రత్యర్థులు జీర్ణించుకోలేక పోయారు. ఇతన్ని మట్టుబెట్టిబెడితే గ్రామంలో తమదే ఆధిపత్యం అవుతుందని భావించారు. ఇందుకు రెండు వర్గాలకు చెందిన ప్రత్యర్థులు ఏకమై అదును కోసం ఎదరు చూస్తూ రెక్కీ నిర్వహిస్తూ ఉండేవారు. కుటుంబ కలహాలు తోడు ఇటీవల టీడీపీ నుంచి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డితో పాటు ఇందూరు ప్రభాకర్రెడ్డి వైఎస్ఆర్సీలో చేశారు. ప్రభాకర్రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఆయన సమీప బంధువు శ్రీధర్రెడ్డికి, ప్రభాకర్రెడ్డికి కుటుంబ కలహాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీధర్రెడ్డిని మంచి చేసుకుని ప్రత్యర్థులు రెచ్చగొట్టారు. గోవిందపల్లె గ్రామానికి చెందిన బొబ్బ గోపాల్రెడ్డి, ఇందూరి శ్రీధర్రెడ్డి, గంగ దాసరి రవిచంద్రారెడ్డి, బొబ్బ జ్యోతి కృష్ణ కాంతరెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డిలతోపాటు మరి కొందరు గ్రామస్తులు..సంతజూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్ చాకలి శ్రీను దగ్గరకు వెళ్లి ప్రభాకర్రెడ్డిని చంపాలని రూ. 40 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. హత్యచేశారు ఇలా ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ప్రభాకర్రెడ్డి, బావమరిది శ్రీనివాసరెడ్డి, తమ్ముడు ప్రతాపరెడ్డితో కలిసి సాయంత్రం వాకింగ్కు వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు గ్రామ శివారులోని పంట పొలాల్లో దాక్కుని ఉన్నారు. ప్రభాకర్రెడ్డి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా వేటకొడవళ్లు, పిడిబాకులతో దాడి చేశారు. ప్రతాపరెడ్డి భయంతో పరుగులు తీయగా ప్రభాకర్రెడ్డిపై దాడిని శ్రీనివాసరెడ్డి అడ్డుకోబోయారు. ప్రత్యర్థులు.. ప్రభాకర్రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షి ప్రతాపరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐలు ప్రభాకర్రెడ్డి, దస్తగిరిబాబు తదితరులు పాల్గొన్నారు. వీడిన హత్యకేసు మిస్టరీ శిరివెళ్ల: గోవిందపల్లె జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆధిపత్యం కోసమే హత్య చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడయింది. గ్రామానికి చెందిన ఐదుగురు నిందితులు.. ఓ కిరాయి హంతకున్ని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జంట హత్యల కేసును పక్కదోవ పట్టించేందుకు హతుని జేబులో నక్సలైట్ల పేరిట లేఖ ఉంచారు. హత్యలకు సంబంధించి సాక్ష్యాలు దొరకకుండా చేయటానికే వారు ఇలా చేసినట్లు తేలింది. ఇదిలా ఉండగా శిరివెళ్ల మండలంలో గతంలో బోయలకుంట్ల గ్రామంలో మూడు హత్యలు జరిగాయి. ఇప్పటికీ ఓ వర్గం వారు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. పోలీసుల రికార్డులలో అత్యంత సున్నితమయిన గ్రామంగా ఈ ఊరి పేరు ఎక్కింది. తాజాగా గోవిందపల్లె కూడా అదే కోవలోకి వచ్చింది. -
హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్
సూర్యాపేటరూరల్: హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ తెలిపారు. శనివారం సూర్యాపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపాడులో ఈ నెల 16న గంగదేవమ్మ పండుగను గ్రామస్తులంతా వైభవంగా జరుపుకుంటున్నారు. యాదవ కులస్తులు యాటలు బలిచ్చి ఆల య సమీ పంలోనే వంటలు చేసుకుని బంధుమిత్రులతో భోజ నాలు చేశారు. సాయంత్రం గంగదేవమ్మ ఆ లయం చుట్టూ యాదవ కులస్తులు బేరీలు కొడుతూ ప్రదిక్షణలు చేశారు. ఈ క్రమంలో పాతర్లపహాడ్కు చెందిన బొల్లక బక్కయ్యకు కేశబోయిన అంజయ్యకు వా గ్వాదం జరిగింది. ఒకరి కాలు ఒకరికి తగిలిందం టూ ఘర్షణకు దిగారు. వీరిద్దరూ గొడవ పడుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు సర్ది చెప్పిపంపిం చారు. కాసేపటి తర్వాత బొల్లక బక్కయ్య, అతడి అ న్న లింగయ్య, తమ్ముడు చిన్న లింగయ్య, బావమరిది ఉప్పుల పుట్టయ్య, కుమారుడు గణేష్, భార్య లిం గమ్మ, అక్కబయ్య లింగమ్మ, బంధువులైన బొల్లక దేవలింగం, బొల్లక మల్లయ్యలు గడగొయ్యలను తీసుకుని తంగెళ్ల దామోదర్రెడ్డి వ్యవసాయ బావి వద్ద పం డుగ చేసుకుంటున్న కేశబోయిన అంజయ్యపై దాడి చేశారు. అడ్డువచ్చిన అంజయ్య తండ్రి సౌడ య్య, కొడుకు ర మేష్ను, మరదలు నాగలక్ష్మమ్మపై కూడా దాడి చేశారు. గాయపడిన సౌడయ్యను హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో అదేరోజు మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీ సులు దర్యాప్తు ముమ్మరం చేశా రు. శనివారం ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్లపహాడ్ స్టేజీ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం రాగా సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు. తొమ్మిది మంది నేరస్తుల్లో బొల్లక గణేష్ మైనర్ కావడంతో అతడిని నల్లగొండ జూవైనల్ కోర్టులో హాజరుపరుచనున్నట్లు, మిగతావారిని సూర్యాపేట కోర్టులో రిమాండ్కు పంపించనున్నట్లు తెలిపా రు. సమావేశంలో సూర్యాపేటరూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్ ఎస్ఐ హరికృష్ణ పాల్గొన్నారు. -
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకో ?
► దేశంలో పరిస్థితిపై ఆందోళన ►మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటాద్రి కల్లూరు (రూరల్): దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ అమ్మాయి మిస్సింగ్ జాబితాలో నమోదవుతోందని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటాద్రి అన్నారు. సూరజ్ గ్రాండ్ హోటల్లో గురువారం గల్స్ అడ్వకెసి ప్రోగ్రామ్ (అమ్మాయిల అక్రమ రవాణా)పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్య వివాహాలు, అమ్మాయిల అక్రమ రవాణా, చిన్నవయసులో గర్భం దాల్చడం తదితర పరిస్థితులపై హైదరాబాద్ మహిత ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ ఆఫీసర్ అమోఘ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో పేద అమ్మాయిలను నమ్మించి మధ్యవర్తులు అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఊహ తెలియని చిన్నపిల్లలు సైతం అపహరణకు గురవుతున్నారన్నారు. పేదరికంలో నలుగుతున్న చెంచులు ఎక్కువగా మోసపోతున్నారని, వీరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గల్స్ అడ్వకెసి ప్రోగ్రాం స్టేట్ కో ఆర్డినేటర్ గోడె ప్రసాద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ మద్దిలేటి, పరమేశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధి మోహన్రాజు పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్.. 14 మంది నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని టోలీచౌకీ ఏరియా ఐఏఎస్ నగర్, బృందావన్ నగర్, ఫాతిమానగర్ కాలనీలలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 14 మంది నైజీరియన్లు ఉన్నారని వీరిని విచారించి పత్రాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విదేశీయులు నివాసం ఉండే ఇంటి ఓనర్లను అడిగి వారి వివరాలు తెలుసుకుంటామన్నారు. గోల్కొండ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 300 మంది పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వయించాయి. 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ఎలాంటి పత్రాలు లేనివిగా గుర్తించిన 103 బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముఖ్యంగా విదేశీయుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టినట్లు సమాచారం. -
రాసలీలలపై రహస్య విచారణ
డీఎస్పీ సర్కారుపై బిగుసుకుంటున్న ఉచ్చు రంగంలోనికి దిగిన నిఘా బృదం జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్ రాసలీలలపై రహస్య విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులు ప్రత్యేక నిఘా బృందాన్ని జమ్మలమడుగుకు పంపించి విచారణ జరిపిస్తుండటంతో డీఎస్పీకి సహకరించిన సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్ కాలేజి అమ్మాయిలతో తన కార్యాలయంలో రాసలీలు సాగిస్తూ వచ్చిన వికృత చేష్టలను సాక్షి దినపత్రిక వెలుగులోనికి తెచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపిస్తున్నట్లు సమాచారం. దాదాపు పది మంది అమ్మాయిలను డీఎస్పీ వలలో వేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఏ ఒక్క అమ్మాయి ఫిర్యాదు చేసినా సదరు అధికారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో డీఎస్పీకి సహకరించిన వారిలో సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం. వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. -
మహిళా ఎమ్మెల్యేపై డీఎస్పీ అసభ్య వ్యాఖ్యలు
అసోంకు చెందిన బీజేపీ మహిళ ఎమ్మెల్యేపై ఆ రాష్ట్ర డీఎస్పీ ఒకరు ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. వివాదాస్పద డీఎస్పీ అంజన్ బోరా ఇటీవల అధికార బీజేపీకి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో అసభ్య పోస్టు చేశారు. ఆయన పోస్టుపై దుమారం రేగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ ఆయనపై శాఖపరమైన చర్యలు ప్రారంభించింది. ఆయనపై డిపార్టమెంట్ పరిధిలో విచారణ ప్రారంభించడమే కాకుండా.. నేరపూరిత అభియోగాల కింద ఆయనను సీఐడీ శనివారం అరెస్టు చేసింది. అసోంలో అధికార బీజేపీకి ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక మహిళ ఎమ్మెల్యేను ఇంటిపేరుతో సంబోధిస్తూ ఆయన ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ ఇలాగే మహిళా ప్రజాప్రతినిధులపై దుర్భాషలు ఆడిన అంజన్ బొరా సస్పెన్షన్కు గురయ్యారు. -
బోధన్ స్కామ్.. కర్నూల్ డీఎస్పీ డీల్
- కర్నూల్ డీఎస్పీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - ఏపీ డీజీపీకి లేఖ రాయనున్న సీఐడీ అదనపు డీజీపీ సాక్షి, హైదరాబాద్: ఆయన అవినీతి రాష్ట్రాలు దాటింది. తెలంగాణలో స్కాం విచారణ జరుగుతూ ఉంటే, ఆ కుంభకోణంలో నిందితులకు, దర్యాప్తు అధికారికి మధ్య బేరసారాలు సాగించడంలో కీలక పాత్ర పోషించారు. బోధన్ కమర్షియల్ స్కాంలో సస్పెండ్ అయిన డీఎస్పీ విజయ్కుమార్ వ్యవహారంలో కర్నూలు డీఎస్పీ పాత్రపై పూర్తి ఆధారాలు బయటపడ్డాయి. రూ.65 లక్షలు డీల్ సెట్ చేసిన డీఎస్పీ కర్నూల్లోని ఓ విభాగంలో పని చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు బోధన్ స్కాంలో ఏ2గా ఉన్న సునీల్, అతడి అసిస్టెంట్ రామలింగంతో ఆయన సంప్రదింపులు సాగించినట్టు తేల్చారు. సునీల్, రామలింగంలను విచారించగా.. విజయ్కుమార్, కర్నూల్ డీఎస్పీల వ్యవహారంపై వాంగ్మూలం ఇచ్చినట్టు సీఐడీ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి స్పష్టంచేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు సమాచారం అందించి.. చర్యలకు ఆదేశించేలా సీఐడీ అదనపు డీజీపీ లేఖ రాయనున్నట్టు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. 1989 బ్యాచ్లో విజయ్కుమార్, కర్నూల్ డీఎస్పీ ఎస్ఐలుగా నియామకం అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయాలున్నాయి. అయితే కేసు దర్యాప్తును క్యాష్ చేసుకునేందుకు కర్నూల్ డీఎస్పీని విజయ్కుమార్ వాడుకున్నారా? లేక బోధన్ నిందితుల తరఫు వకాల్తా తీసుకొని కర్నూలు డీఎస్పీ స్కాం సెట్ చేసే ప్రయత్నం చేశారా అన్నది తేల్చాల్సి ఉందని సీఐడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
బోధన్ స్కాంలో దర్యాప్తు అధికారి ఔట్
డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసిన సీఐడీ అదనపు డీజీపీ - దర్యాప్తును క్యాష్ చేసుకున్న వైనంపై ‘సాక్షి’ కథనం - విచారణకు ఆదేశించిన సీఎస్ - కర్నూలు జిల్లాకు చెందిన డీఎస్పీతో కలసి రూ.65 లక్షల డీల్ కుదుర్చుకున్నట్టు వెల్లడి - సీఐడీకి చేరిన డీఎస్పీ బేరసారాల ఆడియో క్లిప్ సాక్షి, హైదరాబాద్: బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాం కేసును నీరుగార్చేందుకు యత్నించిన సీఐడీ డీఎస్పీపై వేటు పడింది. దర్యాప్తును క్యాష్ చేసుకుంటున్నారని ‘సాక్షి’ ఇటీవల ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కథనంపై రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేసు దర్యా ప్తును అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ అదనపు డీజీపీ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారులు బోధన్ కమర్షియల్ స్కాంలో నిందితులతో కుమ్మౖకన అధికారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈ విచారణలో భాగంగా కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ విజయ్కుమార్ అక్రమాలకు పాల్పడ్డట్టు ఆధారాలతో సహా బయటపడింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ‘సాక్షి’ తెలిపారు. బ్యాచ్మేట్ డీఎస్పీని రంగంలోకి దింపి.. సీఐడీలో పనిచేస్తున్న డీఎస్పీ విజయ్కుమార్, బోధన్ స్కాంలో ఏ–2గా ఉన్న సునీల్తో సంప్రదింపులు జరిపినట్టు విచారణలో తేలింది. అంతేకాదు కేసును నీరుగార్చేందుకు ఇద్దరు ఒకేచోట కూర్కొని డీల్ సెట్ చేసుకున్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. ఇందులో భాగంగా సునీల్ దగ్గర పనిచేసిన రామలింగం అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకొని డీల్ నడిపినట్టు బయటపడింది. నేరుగా డీల్లో పాల్గొంటే దొరికిపోతానని భావించిన విజయ్కుమార్ తన బ్యాచ్మేట్ అయిన కర్నూల్ జిల్లాల్లోని ఓ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అతడి ద్వారా సునీల్, రామలింగం, సునీల్ భార్యతో సెటిల్మెంట్ కు యత్నించారు. ఇందులో భాగంగా రూ.65 లక్షలు డిమాండ్ చేసినట్టు విచారణలో బయటపడింది. దీంతో విజయ్కుమార్ను కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించి సస్పెండ్ చేస్తున్నట్టు అదనపు డీజీపీ గోవింద్ సింగ్ తెలిపారు. త్వరలో అధికారుల బండారం.. బోధన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు నిందితులతో కలసి పోలీస్ విచారణను నీరుగార్చే యత్నం చేస్తున్నారని విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం తీవ్రంగా పరిగణించి నట్టు సమాచారం. పోలీస్, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మధ్య సాగిన వ్యవహారా లను కూడా బయటపెట్టనున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. త్వరలో ఆ విభాగం అధికారుల బండారం కూడా బయటపడుతుందని, వారిని సైతం సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు తేల్చిచెప్పారు. మరో డీఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు బోధన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో డీఎస్పీపైనా విచారణ సాగుతోందని సీఐడీ వర్గాలు తెలిపాయి. ఈ డీఎస్పీతోపాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, ఒకట్రెండు రోజుల్లో వారి సంగతి కూడా తేలుతుందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అడ్డంగా పట్టించిన ఆడియో క్లిప్... కేసును సెట్ చేయడంతోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు డీల్ కుదుర్చుకున్నపుడు జరిగిన సంభాషణల ఆడియో క్లిప్ ఒకటి అదనపు డీజీపీకి చేరింది. దీని ఆధారంగా మరింత లోతుగా విచారణ చేస్తున్నామని, డీల్లో ఎవరెవరున్నారు? వారికి కేసుకు సంబంధమేంటి? అధికారులూ ఉన్నా రా? అని విచారణ చేస్తున్నట్లు సీఐడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
మృతదేహానికి రీపోస్టుమార్టం
చందంపేట (దేవరకొండ): ఓ మృతదేహానికి 42 రోజుల తర్వాత నల్లగొండ డీఎస్పీ సుధాకర్, రూరల్ సీఐ వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ దైద యాకూబ్, ఉస్మానియా వైద్యుల సమక్షంలో శనివారం రీపోస్టుమార్టం నిర్వహించారు. నల్లగొండలోని ఓ ప్రైవేట్ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని నల్లగొండ వన్టౌన్లో పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత నెల 12వ తేదీన అనీష్(12) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం అనీష్ కాలికి గడ్డ కావడంతో నల్లగొండలోని సుశృత హాస్పెటల్ వైద్యుడు డాక్టర్ అరుణ్కుమార్ వద్దకు తీసుకెళ్లారు. సదరు వైద్యుడు వైద్యం నిమిత్తం వైద్య పరీక్షలు నిర్వహించి డాప్సన్ హైప్రెన్సెన్సిటివిటీ సిండ్రోమ్ ఇంజక్షన్ వాడడం వల్లే అనీష్ మృతి చెందాడని అనీష్ తల్లిదండ్రులు కేతావత్ రవి, సుశీల ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ మేరకు 15 రోజుల క్రితం అనీష్ స్వగ్రామమైన చందంపేట మండలం సండ్రగడ్డ గ్రామపంచాయతీ హంక్యాతండాలో విచారణ నిర్వహించామని పేర్కొన్నారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించామని, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరాలు అందితే కేసు విచారణ పురోగతి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, వీఆర్వో రాజవర్ధన్రెడ్డి, వీఆ ర్ఏ, గ్రామస్తులు తదితరులున్నారు. డాక్టర్పై చర్య తీసుకోవాలి గిరిజన బాలుడు అనీష్ మృతికి కారణమైన నల్లగొండలోని సుశృత ఆస్పత్రి డాక్టర్ అరుణ్కుమార్పై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజార సేవా సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంగోతు బాలాజీనాయక్ డిమాండ్ చేశారు. శనివారం చందంపేట మండలంలోని హంక్యాతండాలో అనీష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన స్థలానికి వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. వైద్యుడి, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అనీష్ మృతి చెందాడని ఆరోపించారు. తక్షణమే డాక్టర్ అరుణ్కుమార్ను పోలీసులు కస్టడికి తీసుకుని రిమాండ్కు తరలించాలని కోరారు. ఆయన వెంట ధరావత్ సంపత్నాయక్, గట్ల అనంతరెడ్డి, వెంకట్, రవి తదితరులున్నారు. -
రాజ్యాంగ చైతన్యాన్ని నింపే ‘శరణం గచ్ఛామి’
విజయవాడ రైల్వే డీఎస్పీ సత్తిబాబు అమలాపురం టౌ¯ŒS : రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రిజర్వేషన్ల కోసం కల్పించిన హక్కులు, నిర్దేశించిన సూత్రాలను ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు విధిగా అమలు చేయాలో తెలుపుతూ తెరకెక్కించిన ‘శరణం గచ్ఛామి’ చిత్రం ప్రజల్లో రాజ్యాంగ చైతన్యాన్ని నింపుతుందని విజయవాడ రైల్వే డీఎస్పీ మోకా సత్తిబాబు అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు దేశానికి ఎంత అవసరమో చాటుతూ నిర్మించిన ‘శరణం గచ్ఛామి’ చిత్ర ప్రదర్శనను స్థానిక శేఖర్ స్క్రీ¯ŒS–2 థియేటర్లో ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు. అంతకు ముందు థియేటర్కు సమీపంలోని బుద్ధవిహార్ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంబేడ్కర్వాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి చిత్ర సందేశాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థపై అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ఈ చిత్రం ఓ సమగ్రమైన, శాస్త్రీయమైన ఆధారపూరిత వివరణ ఇచ్చిందన్నారు. అమలాపురంలో చిత్ర ప్రదర్శనకు సహకరించిన మున్సిపల్ మాజీ చైర్మన్, కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విçష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ కో కన్వీనర్ నల్లా పవ¯ŒSకుమార్లను అభినందించారు. విషు్టమూర్తి, పవ¯ŒSకుమార్లు కూడా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ చెప్పారు. చిత్రాన్ని వీక్షించేందుకువచి్చన వందలాది మంది అంబేడ్కర్వాదులను డీఎస్పీ సత్తిబాబు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం డీఎస్పీ సహా కోనసీమ దళిత నేతలు చిత్రాన్ని వీక్షించారు. థియేటర్ వద్ద అంబేడ్కర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పూలమాలలు వేశారు. ‘జోహార్ అంబేడ్కర్’ నినాదాలతో థియేటర్ మారుమోగింది. అంబేడ్కర్ వాదులు పెనుమాల చిట్టిబాబు, పెయ్యల పరశురాముడు, మట్టా వెంకట్రావు, పోతుల సుభాష్ చంద్రబోస్, జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అసోసియేష¯ŒS అధ్యక్షుడు రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శీలానికి వెల కట్టిన పోలీసు
-డీఎస్పీ ఎదుట బెడిసికొట్టిన పంచాయితీ చిత్తూరు: ప్రేమించి.. పెళ్ళాడతానని మాట ఇచ్చిన ఓ కానిస్టేబుల్ మరో మహిళా కానిస్టేబుల్కు అన్యాయం చేసిన సంఘటన పలమనేరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. పలమనేరు మండలం ముసలిమొడుగుకు చెందిన మోహన్ అనే కానిస్టేబుల్ గత కొన్నాళ్ళుగా కుప్పం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్నాడు. ఇదే పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా కేవీ భార్గవి పని చేస్తుంది. ఇరువురూ గత కొన్నాళ్ళుగా ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం పెళ్ళిదాకా వచ్చింది. ఈ నేపధ్యంలో భార్గవి ప్రవర్తన నచ్చని మోహన్ ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్గవి డీఎస్పీ శంకర్ను కోరింది. ఇరువురిని ఒక్కటి చేసేందుకు డీఎస్పీ ప్రయత్నించగా.. మోహన్ అందుకు నిరాకరించాడు. తనను వదిలేయాలంటే ఆమెకు ఏం కావాలో అడగాలంటూ.. భార్గవి శీలానికి వెలకట్టేందుకు యత్నించాడు. మోహన్ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మోహన్ పెళ్ళికి అంగీకరించకపోవడంతో భార్గవి శుక్రవారం రాత్రి నిద్ర మాత్రలను మింగేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు మోహన్పై కేసును నమోదు చేసి విచారిస్తున్నారు. -
మొగుడు కాదు యముడు
వరకట్నం కోసం భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త ఫ్యాన్కు ఉరేసుకుందని పూడ్చిపెట్టే ప్రయత్నం మృతురాలి తండ్రి వెళ్లడంతో పరార్ నాన్నే కర్రతో కొట్టాడని చెబుతున్న మూడేళ్ల కుమార్తె పోలీసుల అదుపులో అత్త దొరవారిసత్రం (సూళ్లూరుపేట): అగ్ని సాక్షిగా మూడు ముళ్లు వేసి జీవితాంతం నీ వెంట ఉంటానని ప్రమాణం చేసిన భర్తే వరకట్నం కోసం యముడిగా మారాడు. మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి హతమార్చాడు. అనంతరం భార్య ఫ్యాన్కు ఉరేసుకుందని గోప్యంగా పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించాడు. మండలంలోని మొదుగులపాళెంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు...తడ మండలం పెదమాంబట్టు గ్రామానికి చెందిన సమ్మన మునిరాజ, శ్యామల దంపతుల కుమార్తె హరిత(25)కు మొదుగుళపాళేనికి చెందిన కాటూరు వెంకటయ్య, బుజమ్మ పెద్దకుమారుడు బాబుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి మూడేళ్ల కుమార్తె హర్షిత ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం చందనముడిలోని సమీప బంధువుల ఇంట్లో జరిగిన పుట్టిరోజు వేడుకలకు హరితను అత్త బుజ్జమ్మ వదిలిపెట్టి ఇంటికి వచ్చింది. సాయంత్రం భర్త బాబు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లిందని గొడవ పెట్టుకోవడంతో హరిత బంధువులు ఆమెను తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న బాబు భార్యపై కర్రతో దాడి చేయడంతో మృతి చెందింది. అనంతరం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుందని మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండానే కుటుంబ సభ్యుల సహాయంతో పూడ్చిపెట్టేందుకు ట్రాక్టర్లో తరలించేందుకు సన్నాహాలు చేశాడు. ఈ క్రమంలోనే రాత్రి వేళ హరిత తండ్రి మునిరాజ వెళ్లడంతో శవాన్ని వదిలిపెట్టి పరారయ్యాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నాయుడుపేట సీఐ రత్తయ్య, దొరవారిసత్రం ఎస్సై కోటిరెడ్డి శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని మృతిపై ఆరా తీశారు. మృతురాలి కుడి చెప్ప, గొంతుపై బలమైన గాయాలు ఉండడంతో శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అత్త బుజ్జమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలు తండ్రి మునిరాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదనపు కట్నం కోసమే బలితీసుకున్నాడు హరిత, బాబులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో బాబుకు 10 సవర్లు, హరితకు 40 సవర్ల బంగారంతో పాటు కట్నం కింద రూ.5లక్షలు అందజేసినట్లు మృతురాలి తండ్రి మునిరాజా తెలిపాడు. పెళ్లైన ఆరు నెలల నుంచి బాబు అదనపు కట్నం కోసం భార్యను హింసిస్తూ పలుమార్లు పుట్టింటికి పంపేవాడు. ఆ సమయంలో పెద్దల సమక్షంలో కొంత నగదు ఇచ్చి మధ్యస్తం చేసి పంపేవాళ్లమని, అయినా తన బిడ్డను బలితీసుకున్నాడని మృతురాలి తండ్రి బోరున విలపించాడు. చివరికి అభంశుభం తెలియని హరిత మూడేళ్ల కుమార్తె హర్షిత కూడా నాన్న అమ్మను కర్రతో కొట్టాడని వచ్చి రాని మాటల్లో చెబుతుండడం చూసి బంధువులు ఎంత ఘోరమని కన్నీటి పర్యంతమయ్యారు. డీఎస్పీ విచారణ గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు మొదుగుళపాళేనికి చేరుకుని హరిత మృతదేహాన్ని పరిశీలించి మృతిపై విచారించారు. అనంతరం నిందితుడ్ని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
కూతురు మృతిపై తల్లి ఫిర్యాదు
► 44 రోజుల తరువాత మృతదేహం వెలికితీత తిరువళ్లూరు: కూతురు మృతిలో మిస్టరీ ఉందని ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్కు తల్లి చేసిన ఫిర్యాదు మేరకు దాదాపు 44 రోజుల తరువాత మృతదేహాన్ని వెలికితీసి శవరీక్ష నిర్వహించిన సంఘటన తిరువళ్లూరు జిల్లా వేపంబట్టులో సోమవారం సాయంత్రం కలకలం సృస్టించింది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానికి చెందిన యాయుద్దీన్ కుమారుడు కార్తికేయన్(35) ఆరోగ్యశాఖలో పని చేస్తున్నాడు. ఇతనికి పళ్లికారనై ప్రాంతానికి చెందిన మహాలక్ష్మీ(32)కి 2014 మేలో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో గత జనవరి 21న మహాలక్ష్మీ మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులకు కార్తికేయన్ సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే తన కుమార్తె మృతిలో మిస్టరీ ఉన్నట్టు ఆమె తల్లి అంజలదేవి ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్కు ఫిబ్రవరి20న పిర్యాదు చేసింది. తన కుమార్తె మృతిలో ఉన్న మిస్టరీ కోసం పోస్టుమార్టం నిర్వహించాలని కోరగా, సంబంధిత ఫిర్యాదును సెవ్వాపేట పోలీసులకు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందుకున్న సమాచారంతో మహాలక్ష్మి మృతిని అనుమానంగా భావించి కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే సోమవారం ఆర్డీవో దివ్యశ్రీ,, డీఎస్పీ ఈశ్వరన్ నేతృత్వంలో శవాన్ని వెలికి తీశారు. అనంతరం డాక్టర్ శోభన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ మృతదేహాన్ని దాదాపు 44 రోజుల తరువాత వెలికి తీయడంతో పాటు పోస్టుమార్టం నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శవపరీక్ష వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడంతో పాటు తప్పు జరిగినట్టు నిర్ధారణ జరిగితే సంబంధం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో దివ్యశ్రీ, డీఎస్పీ ఈశ్వరన్ స్పష్టం చేశారు. -
అట్రాసిటీ కేసుపై విచారణ
అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం మద్దనకుంట గ్రామానికి చెందిన రఘు తనపై దాడి చేశాడని నిద్రగట్ట గ్రామానికి చెందిన రాజమ్మ గత ఏడాది డిసెంబర్లో ఎస్సీ, ఎస్టీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన అట్రాసిటీ కేసుపై శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వెంకటరమణ విచారణ చేపట్టారు. అమరాపురంలో రాజమ్మను, రఘు, ఇతర సాక్షిదారుల నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేసిన నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
కొవ్వూరు డీఎస్పీపై వేటు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు, కొవ్వూరు : కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావుపై వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయనకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో బదిలీ అవకాశం లేకపోవడంతో డీఎస్పీని డీజీపి కార్యాలయానికి రిపోర్టు చేయాలని సూచనలు అందినట్టుగా చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో డీఎస్పీని మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు, డీఎస్పీ ఉంటే తమ అరాచకాలు సాగవని భావించిన ఇసుక మాఫియా కలిసి డీఎస్పీని సాగనంపినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్యకు గురైన సమయంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ జవహర్ డీఎస్పీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసు వైఫల్యం కారణం గానే కౌన్సిలర్ హత్యకు గురైనట్టు వ్యాఖ్యానించారు. ప్రాణహాని ఉందని చెప్పినా కౌన్సిలర్కు రక్షణ కల్పించలేకపోయారని ఎమ్మెల్యే అప్పట్లో ఆరోపించారు. దీనిపై డీఎస్పీ సమాధానం ఇస్తూ కౌన్సిలర్ ప్రాణహాని ఉందని తనను ఎప్పుడు కలవలేదని, కనీసం ఫిర్యాదు చేయలేదని, అలా తప్పుగా మాట్లాడవద్దని డీఎస్పీ గట్టిగానే బదులిచ్చారు. అవసరమైతే తన కార్యాలయంలో సీసీ పుటేజ్లు చూపిస్తానని ఎమ్మెల్యేకు బదులిచ్చారు. ఈ విషయాన్ని అప్పట్లో తెలుగుదేశం నాయకులు రాద్ధాంతం చేయడంతో పాటు డీఎస్పీ వాహనానికి అడ్డువెళ్లి ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో టీడీపీ పేకాట క్లబ్కు అనుమతి ఇవ్వాలని కోరితే డీఎస్పీ నిరాకరించినట్టు చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి డీఎస్పీపై గురిపెట్టారు. మునిసిపల్ స్ధలంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయం విషయంలో కూడా డీఎస్పీని టార్గెట్ చేసినట్టు సమాచారం. ఏడాది కాలం నుంచి దాతల సహాకారంతో ఈ భవన నిర్మాణం పూర్తి చేశారు. ఏడాది కాలం నుంచి పురపాలక సంఘం నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారన్న వాదనను తెరపైకి తెచ్చినట్టు సమాచారం. ఇసుక మాఫియాకు సహకరించనందుకే..! ఇసుక మాఫియాకు సహకరించడంలేదన్న అక్కసుతో కొందరు టీడీపీ నేతలు డీఎస్పీపై కక్ష పెంచుకున్నారు. ఎమ్మెల్యేలపై స్థానిక నాయకుల వత్తిళ్లు పెరగడంతో డీఎస్పీని టార్గెట్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు ఇసుక మాఫియా వ్యవహారం ఆదాయవనరుగా మారడంతో డీఎస్పీ బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే గతంలో నదీతీరంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు డీఎస్పీని బదిలీ చేయించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రిని, పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం. ఇటీవలకాలంలో మళ్లీ గోదావరి డైరెక్ట్ ర్యాంపుల ఏర్పాటు రంగం చేసుకుంటున్నారు. ర్యాంపుల ఏర్పాటుకు నాయకులు వత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఇసుక మాఫియా అగడాలకు అడ్డుగా ఉన్న డీఎస్పీ బదిలీకి చినబాబుపై తెచ్చిన వత్తిడితో ఈ ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు నోరుమెదపడం లేదు.