
మోదీని కలిసిన టయోట చైర్మన్, ఎరిక్సన్ సీఈవో
టయోట మోటార్ కార్పొరేషన్ చైర్మన్ టకేశి ఉచియమద, స్వీడన్కు చెందిన టెలికం సంస్థ ఎరిక్సన్ సీఈవో హన్స్ వెస్ట్బర్గ్
న్యూఢిల్లీ : టయోట మోటార్ కార్పొరేషన్ చైర్మన్ టకేశి ఉచియమద, స్వీడన్కు చెందిన టెలికం సంస్థ ఎరిక్సన్ సీఈవో హన్స్ వెస్ట్బర్గ్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్లో కంపెనీ వృద్ధి అంశంతోపాటు ఇండో-జపానీస్ ద్వైపాక్షిక ఒప్పందాల గురించి చర్చించామని ఉచియమద తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమ విజయానికి తమ వంతు కృషి అందిస్తామన్నారు. టయోట భారత్లో 1997 నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఎరిక్సన్ కంపెనీ 15-20 మిలియన్ డాలర్లతో పుణేలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది.