న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను వసూళ్లు ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో నికరంగా 14% పెరిగి రూ.1.42 లక్షల కోట్లకు చేరాయి. అడ్వాన్స్ పన్ను చెల్లింపుల్లో గణనీయ వృద్ధి దీనికి కారణం. అయితే నికర వసూళ్ల మొత్తాల్లో నుంచి రూ.55,520 కోట్లను రిఫండ్గా రెవెన్యూ శాఖ జారీ చేసింది. అయితే గతేడాది రిఫండ్స్తో పోల్చితే ఇది 5.2% తక్కువ. 2017–18లో మొత్తంగా రూ.9.8 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు కేంద్ర బడ్జెట్ లక్ష్యం.