![పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు](/styles/webp/s3/article_images/2017/09/4/41475599271_625x300.jpg.webp?itok=H0RN7IBw)
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: చమురు సంస్థలు పెట్రోల్పై లీటరుకు 14 పైసలు, డీజిల్పై లీటరుకు 10 పైసల ధరలను పెంచాయి. డీలర్ల కమీషన్ను పెంచడమే ఇందుకు కారణం. పెరిగిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పక్ష సమీక్షలో భాగంగా అక్టోబరు 1నే పెట్రోల్పై 37 పైసలు పెంచి, డీజిల్పై 8 పైసలు తగ్గించడం విదితమే. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.64.72, డీజిల్ ధర రూ.52.61కు చేరాయి.