Petrol
-
అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన అత్తా మామ..
టేకులపల్లి: భార్యాపిల్లలను చూసేందుకు అత్తారింటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపుపెట్టుకున్నారు. మంటలకు తాళలేక ఎంతగా మెత్తుకున్నా వారు తలుపు తీయకపోవడంతో పక్కనే ఉన్న నీటితొట్టిలో దూకాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం దంతెలబోరు ఎస్సీకాలనీకి చెందిన బల్లెం చినవెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు బల్లెం గౌతమ్ (23).. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు కుమార్తె కావ్యను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సుజాతనగర్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నెల కావ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రామచంద్రునిపేటలోని పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న రాత్రి గౌతమ్ తన పిల్లలు, భార్యను చూసేందుకు రామచంద్రునిపేటకు వచ్చాడు. గౌతమ్ని లోపలికి వెళ్లనీయకుండా అత్తా మామ, బావమరుదులు అడ్డుకున్నారు. దుర్భాషలాడి, దాడి చేయడంతో పాటు గౌతమ్పై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం అందరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తున్నా రక్షించలేదు. పక్కనే ఉన్న నీటి తొట్టిలో దూకిన గౌతమ్ని చుట్టు పక్కల వారు బయటకు తీసి, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన గౌతమ్ ఆదివారం మృతి చెందాడు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ను వివరణ కోరగా ఈ నెల 2న రామచంద్రునిపేటలో ఘటన జరిగిందని, 11న మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ఘటన జరిగి, 11న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
యువతిపై పెట్రోల్ చల్లిన యువకుడిపై కేసు నమోదు
హుజూర్నగర్: తనను ప్రేమించడం లేదని యువతితో గొడవపడి ఆమెపై పెట్రోల్ చల్లిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. మంగళవారం ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన యువతి మూడు నెలల నుంచి హుజూర్నగర్ పట్టణంలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటోంది. స్థానికంగా కోదాడ రోడ్డులో గల ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. సదరు యువతికి మోటమర్రి గ్రామానికే చెందిన సుందర్ ప్రమోద్కుమార్తో పరిచయం ఉంది. సోమవారం ప్రమోద్కుమార్ యువతికి ఫోన్ చేసి మాట్లాడాలి బటయకు రమ్మని కోరగా.. ఆమె బయటకు వచ్చింది. ఈ క్రమంలో తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో యువకుడు గొడవపడ్డాడు. తన వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను యువతిపై చల్లాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’
మోదీ ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ(బ్లెండెడ్) పెట్రోల్ను తీసుకొచ్చిన నేపథ్యంలో పెట్రోల్ ధరను తగ్గించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకెత్ గోఖలే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తున్నప్పటికీ వినియోగదారు నుంచి పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును లాగేసుకుంటుందని విమర్శించారు. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణమవుతుందని దుయ్యబట్టారు.‘మోదీ ప్రభుత్వం పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని గతంలోనే ఆదేశించింది. ఇథనాల్ చౌకైనది మాత్రమే కాదు.. వాహన మైలేజీని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది బీఎస్-IV, పాత ఇంజిన్లను నాశనం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తోంది. కానీ ప్రజలు ఈ రాయితీ పొందడం లేదు. వాస్తవ ధరకే పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం నిస్సందేహంగా ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటోంది. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణం అవతుంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ను తప్పనిసరి చేస్తే మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించాలి’ అని ఎంపీ తెలిపారు.𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐛𝐞𝐢𝐧𝐠 𝐎𝐕𝐄𝐑𝐂𝐇𝐀𝐑𝐆𝐄𝐃 𝐛𝐲 𝐚𝐭 𝐥𝐞𝐚𝐬𝐭 ₹𝟗 𝐩𝐞𝐫 𝐥𝐢𝐭𝐞𝐫 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐩𝐞𝐭𝐫𝐨𝐥 𝐩𝐮𝐦𝐩. Modi Govt has mandated 20% blending of ethanol with petrol. Ethanol is not only cheaper but also significantly reduces your car… pic.twitter.com/iEBjgp9SX9— Saket Gokhale MP (@SaketGokhale) February 5, 2025ఇథనాల్ పెట్రోల్పై భిన్నాభిప్రాయాలుముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గ్రీన్ ఎన్విరాన్మెంట్ను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపాలని నిర్ణయించింది. ఇథనాల్ పెట్రోల్ కంటే తక్కువ శక్తి కంటెంట్ కలిగి ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ఇది వాహనం మైలేజ్ను 3-4% తగ్గిస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. పాత వాహనాలకు ముఖ్యంగా బీఎస్-4 ఇంజిన్లు ఉన్న వాహనాలకు అధిక ఇథనాల్ కంటెంట్ ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం భాగాలకు హాని కలిగిస్తుందని తెలియజేస్తున్నారు. ఇది ఇంజిన్ పనిచేయకపోవడం, మన్నిక తగ్గడానికి దారితీస్తుందంటున్నారు.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర! తులం ఎంతంటే..పెట్రోల్లో ఇథనాల్ను కలపడం వల్ల ముడి చమురు దిగుమతులపై తక్కువ ఆధారపడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలుపుతుంది. ఇది ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. ఇథనాల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. -
పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 70 మంది మృతి
అబుజా : నైజీరియా ( Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు.నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) అధికారిక ప్రకటన మేరకు.. శనివారం నార్త్ సెంట్రల్ నైజీరియా నైజర్ రాష్ట్రం (Niger state)లో అక్రమంగా ఇంధనాన్ని తరలించే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ఎన్ఈఎంఏ అధికారులు నిర్ధారించారు.అగంతకులు జనరేటర్ సాయంతో ఒక పెట్రోల్ ట్యాంకర్ (petrol tanker explosion) నుంచి మరో పెట్రల్ ట్యాంకర్లోకి పెట్రోల్ను నింపి ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో ఒక్కసారి జనరేటర్ పేలడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. పేలుడు ధాటికి మంటలు చెలరేగి భారీ శబ్దాలు రావడం.. స్థానికుల ఆర్తనాదాలతో భయంకరంగా పరిస్థితి మారిపోయింది. అక్కడికక్కడే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా కాలిన గాయాలతో మరికొందరు విలవిల్లాడారు.పేలుడు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయితే, భారీ స్థాయిలో ఎగిసి పడిన మంటల కారణంగా బాధితుల్ని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న పలువురు రెస్క్యూ సిబ్బంది సైతం అగ్నికి ఆహుతైనట్లు ఎన్ఈఎంఏ అధికార ప్రతినిధి హుస్సేన్ ఇసా తెలిపారు. ప్రమాదాలు సర్వసాధారణంనైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియాలో అస్థవ్యస్థంగా ఉన్న రైల్వే వ్యవస్థ కారణంగా ఎక్కువ శాతం మంది ప్రజలు రోడ్డు రవాణాను వినియోగించుకుంటున్నారు. పలుమార్లు అక్రమ ఇంధన రవాణా కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. గతేడాది ఇదే రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో ఇదే తరహా దుర్ఘటన జరిగింది. నైజర్ రాష్ట్రంలో పశువులను తరలిస్తున్న ట్రక్కును పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 48 మందికి పైగా మరణించారు.నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. 2020లోనే 1,531 పెట్రోల్ ట్యాంకర్లు పేలాయి. ఫలితంగా 535 మరణించగా, 1,100 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇలాంటి ఘటనల వల్ల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ పలువురు అక్రమంగా ఇంధనాన్ని తరలిస్తూ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. -
అన్న కూతురిని ప్రేమిస్తున్నాడని..
అల్వాల్: అన్న కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువతి చిన్నాన్న ప్రేమించిన యువకుడి ఇంటిపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాచ బొల్లారం గోపాల్నగర్ ఎరుకల బస్తీలో ప్రకాష్ హేమలత దంపతులు తమ కుమారుడు ప్రదీప్తో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రదీప్ అదే ప్రాంతంలోని వివేకానందకు చెందిన బైక్ షోరూమ్లో పనిచేస్తున్నాడు. వివేకానంద అన్న కుమార్తెతో ప్రదీప్కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పలుమార్లు వివేకానంద ప్రదీప్ను హెచ్చరించాడు. అయినా ప్రదీప్ వైఖరి మార్చుకోకపోవడంతో ఆగ్రహానికి లోనైన వివేకానంద ప్రదీప్, అతడి కుటుంబసభ్యులను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పెట్రోల్ తీసుకుని ప్రదీప్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్న అతడి తల్లిదండ్రులు ప్రకాష్, హేమలతలతో పాటు ఇంటి తలుపులపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ ఘటనలో ప్రకా‹Ùకు తీవ్ర గాయాలు కాగా, పక్కింట్లో ఉండే దిలీప్ అనే వ్యక్తి కుమార్తె చిన్నారి చాందిని (4) రెండు కాళ్లకు మంటలంటున్నాయి. చిన్నారి చాందినిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రకాష్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు వివేకానంద పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుపై బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్
-
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
పండుగల సందర్భంగా పెట్రోల్, డీజిల్కు డిమాండ్ ఏర్పడింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణించిన అమ్మకాలు నవంబర్లో తిరిగి పుంజుకున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల (ఐవోసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్) గణాంకాల ప్రకారం పెట్రోల్ విక్రయాలు నవంబర్లో 8.3 శాతం పెరిగి 3.1 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.86 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 5.9 శాతం పెరిగి 7.2 మిలియన్ టన్నులకు చేరాయి.వర్షాల సీజన్లో వాహనాల కదలికలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ క్షీణిస్తుంటుంది. అదే కాలంలో వ్యవసాయ రంగం నుంచి డీజిల్ డిమాండ్ తగ్గుతుంది. ఇక అక్టోబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే.. నవంబర్లో 4.7 శాతం అధికంగా 2.96 మిలియన్ టన్నులు మేర పెట్రోల్ విక్రయాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. పెట్రోలియం ఇంధన విక్రయాల్లో 40 శాతం వాటా డీజిల్ రూపంలోనే ఉంటుంది. వాణిజ్య వాహనాలు, వ్యవసాయ రంగంలో వినియోగించే పనిముట్లకు డీజిల్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా రవాణా రంగమే 70 శాతం డీజిల్ను వినియోగిస్తుంటుంది.ఇదీ చదవండి: ఇక ఉబర్లో ‘శికారా’ల బుకింగ్!విమానాల ఇంధనంజెట్ ఫ్యూయల్ (విమానాల ఇంధనం/ఏటీఎఫ్) అమ్మకాలు 3.6 శాతం పెరిగి 6,50,900 టన్నులుగా ఉన్నాయి. ఏటీఎఫ్ డిమాండ్ కరోనా పూర్వపు స్థాయిని దాటిపోయింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.3 శాతం పెరిగాయి. 2.76 మిలియన్ టన్నులుగా నమోదైంది. అంతకుముందు నెల అక్టోబర్లో 2.76 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
ధరల తగ్గుదలపై వరల్డ్ బ్యాంక్ క్లారిటీ
అంతర్జాతీయ మార్కెట్లలో వస్తువుల ధరలకు సంబంధించిన విషయాలను వరల్డ్ బ్యాంక్ తన అక్టోబర్ ఎడిషన్ కమోడిటీ మార్కెట్ ఔట్లుక్లో వెల్లడించింది. వస్తువుల ధరలు 2025లో 5 శాతం, 2026లో 2శాతం.. ఈ ఏడాది 3 శాతం క్షీణతను పొందుతాయని పేర్కొంది.క్రూడ్ ఆయిల్ ధరల విషయానికి వస్తే.. 2024లో బ్యారెల్ ధర 80 డాలర్లు కాగా, ఇది 2025లో 73 డాలర్లకు చేరుతుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2026 నాటికి ఈ ధరలు 72 డాలర్లకు పడిపోతుందని కూడా స్పష్టం చేసింది. చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్దాలు ప్రమాదం అని హెచ్చరించింది.ఇంధన మార్కెట్లు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. 2023 అక్టోబర్ - 2024 ఏప్రిల్ మధ్య ప్రాంతీయ వైరుధ్యాల కారణంగా చమురు ధరలు 90 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఈ ధరలు కొంత శాంతించినప్పటికీ.. రాబోయే రోజుల్లో భౌగోళిక ఉద్రిక్తతలు దీనిపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.చమురు ధరల విషయం పక్కన పెడితే.. లోహాల ధరలు 2025 - 26లలో తగ్గే సూచనలున్నాయి. బేస్ మెటల్ ధరలు 2026లో 3 శాతం మేర తగ్గుతాయి. అయితే వచ్చే ఏడాది ఈ ధరలు స్థిరంగా ఉంటాయని సమాచారం.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..బంగారం ధరల విషయానికి వస్తే.. 2024లో మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీనికి కారణం పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు అని తెలుస్తోంది. అంతే కాకుండా సెంట్రల్ బ్యాంకుల నుంచి బలమైన డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. -
పుంజుకున్న పెట్రోల్ విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మద్దతుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు అక్టోబర్ నెలలో 7.3 శాతం పెరిగాయి. కానీ, డీజిల్ అమ్మకాలు మాత్రం 3.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇంధన మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన మూడు ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) అక్టోబర్లో 3.1 మిలియన్ టన్నుల పెట్రోల్ను విక్రయించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.87 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు మాత్రం 3.3 శాతం తక్కువగా 6.7 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. పండుగల సందర్భంగా వ్యక్తిగత వాహనాల (టూవీలర్లు, ప్యాసింజర్ కార్లు) వినియోగం సాధారణంగా పెరుగుతుంది. ఇది పెట్రోల్ విక్రయాల వృద్ధికి దారితీసినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సాగు రంగం నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని తెలిపాయి. గడిచిన కొన్ని నెలల నుంచి డీజిల్, పెట్రోల్ అమ్మకాలు స్తబ్దుగానే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అధిక వర్షాలకుతోడు, సాగు రంగం నుంచి డిమాండ్ తగ్గడం వాహనాల వినియోగాన్ని పరిమితం చేసింది. ఇక సెపె్టంబర్ నెల గణాంకాలతో పోల్చి చూసినా అక్టోబర్లో పెట్రోల్ విక్రయాలు 7.8 శాతం పెరిగాయి. డీజిల్ అమ్మకాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి. సెపె్టంబర్ నెలలో పెట్రోల్ వినియోగం 2.86 మిలియన్ టన్నులు, డీజిల్ వినియోగం 5.59 మిలియన్ టన్నుల చొప్పున ఉంది. 40 శాతం వాటాతో డీజిల్ అధిక వినియోగ ఇంధనంగా ఉంటోంది. 70 శాతం డీజిల్ను రవాణా రంగమే వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాల కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. 2.5 శాతం అధికంగా ఏటీఎఫ్ అమ్మకాలు ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు అక్టోబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 2.5 శాతం పెరిగి 6,47,700 టన్నులుగా ఉన్నాయి. సెపె్టంబర్ నెలలో వినియోగం 6,31,100 టన్నుల కంటే 2.6 శాతం తగ్గింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.5 శాతం పెరిగి 2.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
ప్రీమియం వాహనాల వైపు మొగ్గు
న్యూఢిల్లీ: వాహనాల కొనుగోలుదార్లు విలాసవంతమైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే హైబ్రిడ్ వాహనాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దేశీ ఆటోమోటివ్ పరిశ్రమపై గ్రాంట్ థార్న్టన్ భారత్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో పాల్గొన్న వారిలో 85 శాతం మంది ప్రీమియం మోడల్స్ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 40 శాతం మంది హైబ్రిడ్ వాహనాలను ఇష్టపడుతుండగా, 17 శాతం మంది మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపారు. 34 శాతం మంది పెట్రోల్ వాహనాలకు ప్రాధాన్యమిస్తున్నారు.వినియోగదారులు మరింత భారీ ఈవీ మౌలిక సదుపాయాలు... ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తూనే పర్యావరణ అనుకూల ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారనే ధోరణి వల్లే హైబ్రిడ్ వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో మారుతున్న వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా రాణించేలా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ సొల్యూషన్స్పై వాహనాల తయారీ సంస్థలు దృష్టి పెట్టాల్సిన ఉంటుందని పేర్కొంది. కీలకంగా పండుగ సీజన్... వార్షిక అమ్మకాల్లో దాదాపు 30–40 శాతం వాటా పండుగ సీజన్ విక్రయాలే ఉంటాయి కాబట్టి దేశీ ఆటోమోటివ్ పరిశ్రమకు ఇది కీలకమైన సీజన్ అని సర్వే తెలిపింది. అయితే, నిల్వలు భారీగా పేరుకుపోవడం, వాతావరణ మార్పులపరమైన అవాంతరాలు, ఎన్నికలు మొదలైనవి ఈసారి అమ్మకాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా చెప్పారు. యుటిలిటీ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు నెలకొన్న డిమాండే.. మార్కెట్ను ముందుకు నడిపిస్తోందన్నారు.‘‘ఈ సెగ్మెంట్స్ వార్షికంగా 13 శాతం వృద్ధి నమోదు చేశాయి. ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో వీటి వాటా 65 శాతంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీ విక్రయాలు కేవలం 0.5 శాతం పెరిగి ఒక మోస్తరు వృద్ధిని మాత్రమే నమోదు చేసినప్పటికీ ఎస్యూవీలు, యూవీలకు డిమాండ్ నిలకడగా కొనసాగడం ప్రత్యేకమైన వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండటాన్ని తెలియజేస్తోంది’’ అని మెహ్రా వివరించారు. సవాలుగా నిల్వలు.. వాహన నిల్వలు గణనీయంగా పేరుకుపోవడం పరిశ్రమకు సవాలుగా మారింది. రూ.79,000 కోట్ల విలువ చేసే 7.9 లక్షల యూనిట్ల స్థాయిలో నిల్వలు పేరుకుపోయినట్లు మెహ్రా వివరించారు. భారీగా పండుగ డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంపై ఆటోతయారీ సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు. దాదాపు 90 శాతం మంది ఈ తరహా ఆఫర్లు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, కంపెనీలు ప్రకటిస్తున్న సబ్్రస్కిప్షన్ విధానాలకు, అలాగే వివిధ కార్ మోడల్స్లో మరిన్ని భద్రతా ఫీచర్లకు కూడా డిమాండ్ పెరుగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఇక కొనుగోలుదారులు డిజైన్ లేదా పనితీరు వంటి అంశాలకు మించి అధునాతన భద్రతా ఫీచర్ల వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. -
పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..
రాజు మూడు నెలల కిందట షోరూమ్లో బైక్ కొనుగోలు చేశాడు. కానీ కంపెనీ ఇచ్చిన హామీ మేరకు బైక్ మైలేజీ రావడంలేదు. కనీసం అందులో సగమైన మైలేజీ రాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే బైక్ కొన్నప్పటి నుంచి తాను ఒకే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించేవాడు. అనుకోకుండా ఇటీవల వేరే పంపులోని పెట్రోల్ వాడాడు. అప్పటివరకు సరిగా మైలేజీ రాని తన బైక్ ఈసారి మెరుగైన మైలేజీ నమోదు చేసింది. దాంతో తాను గతంలో వాడిన పెట్రోల్ కల్తీ అయిందని గుర్తించాడు.మీకూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు కొన్ని ఏజెన్సీలు పెట్రోల్ను కల్తీ చేయడమే కారణం. భారత్ భారీగా పెట్రోల్ను దిగుమతి చేసుకుంటోంది. అందుకు పెద్దమొత్తంలో డాలర్లు ఖర్చు చేస్తోంది. దీని ప్రభావం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలపై పడుతుంది. వీటికి అనుబంధంగా ఉన్న కొన్ని ఏజెన్సీలు అక్రమంగా డబ్బు పోగు చేసుకోవాలనే దురుద్దేశంతో పెట్రోల్ను కల్తీ చేస్తున్నాయి. అయితే మనం వాహనాల్లో వాడే పెట్రోల్ కల్తీ అయిందా..లేదా..అనే విషయాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..రెండు నిమిషాల్లో కల్తీ గుర్తించండిలా..నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి. మనం వాహనాల్లో పెట్రోల్ కొట్టించాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్ గన్ ద్వారా 2-3 డ్రాప్స్ పెట్రోల్ వేయాలి. 2-3 నిమిషాలు ఆ ఫిల్టర్ పేపర్ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్ పోసినచోట పేపర్పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్గా పరిగణించవచ్చు. అలాకాకుండా ఏదైనా మచ్చలు ఏర్పడితే కల్తీ జరిగినట్లు భావించాలి. -
పెట్రోల్పై రూ.15, డీజిల్పై రూ.12 లాభం..!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భారీగా లాభాలు పొందుతున్నాయి. కానీ చమురు వినియోగదారులకు మాత్రం ఆ మేరకు వెసులుబాటు ఇవ్వడంలేదు. ఇప్పటికే ఆహార ధరలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినమేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్పై లీటరుకు దాదాపు రూ.15, డీజిల్పై రూ.12 చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాయని ఇటీవల ఇక్రా నివేదికలో తెలిపింది. ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. మార్చి 15, 2024లో పెట్రోల్, డీజిల్ లీటర్పై రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి క్రూడాయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ అందుకు అనుగుణంగా చమురు ధరలు మాత్రం తగ్గించడంలేదు. దేశంలో ఇప్పటికీ పెట్రోలు లీటరుకు రూ.100, డీజిల్ రూ.90 పైనే ఉంది. ఈ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. రవాణా నుంచి విమానయానం వరకు, పరిశ్రమలు నుంచి సరుకుల వరకు రోజువారీ అవసరాలను ప్రభావితం చేస్తున్నాయి.ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎంసీల లాభాలు రూ.86,000 కోట్ల మేర నమోదైనట్లు ఇటీవల పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. గత సంవత్సరం కంటే ఇది 25 రెట్లు ఎక్కువగా ఉంది. హెచ్పీసీఎల్కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,980 కోట్ల నష్టం వాటిల్లింది. అందుకు పూర్తి భిన్నంగా 2023-24లో సంస్థ రూ.16,014 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పన్ను చెల్లింపు తర్వాత బీపీసీఎల్ లాభం రూ.26,673 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలుఅంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ, భారతీయ వినియోగదారులకు ఇంధన ధరల్లో వెసులుబాటు కల్పించడంలేదు. మహారాష్ట్ర, హరియాణాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేలా ఓఎంసీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా చమురు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!.. ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో మనదేశంలో లీటరు ధర రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గే అవకాశం ఉంది.ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ 'గిరీష్ కుమార్ కదమ్' ఇంధన ధరల గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటర్కు వరుసగా రూ.15, రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు.2024 మార్చి15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 2 తగ్గింది. ఆ తరువాత ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల తగ్గుదల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు కారణమవుతాయని తెలుస్తోంది. అయితే ధరలు ఎప్పుడు తగ్గుతాయనేది తెలియాల్సి ఉంది. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశంలో కూడా ఇంధన (పెట్రోల్, డీజిల్) తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి 'పంకజ్ జైన్' వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. చాలా దేశాల్లో ఏర్పడ్డ ఆర్థిక మందగమనమే. అయితే తగ్గుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని OPEC+ (పెట్రోలియం ఎగుమతి దేశాలు) దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే భారత్ మాత్రం ఉత్పత్తిని పెంచాలని కోరుకుంటోంది.ఇదీ చదవండి: ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. భారత ప్రభుత్వం హెచ్చరికఇండియా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. రష్యా తరువాత ఇరాక్, సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. దేశంలోని మొత్తం చమురులో 80% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. -
కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెట్రోల్ ధరలు పైపైకి
భారతదేశంలో ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలను తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం షాకిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజులకు ముందు కర్ణాటక, గోవా రాష్ట్రాలు కూడా పెట్రోల్పై పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే బాటలో పంజాబ్ ప్రభుత్వం కూడా అడుగులు వేసింది.పెట్రోల్, డీజిల్పై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్ (వ్యాట్) పెంచుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి పంజాబ్ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలుక్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా.. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెట్రోల్పై వ్యాట్ను లీటర్కు 61 పైసలు, డీజిల్పై 92 పైసలు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాట్ని పెంచడం వల్ల డీజిల్పై రూ. 395 కోట్లు, పెట్రోల్పై రూ.150 కోట్ల ఆదాయం పెరుగుతుందని చీమా స్పష్టం చేశారు. -
పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురు
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. చమురు ధరలు జనవరి కంటే కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన పదేళ్లలో గరిష్ఠంగా జూన్ 2022లో బ్యారెల్ ధర 115 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర దాదాపు 70 డాలర్లకు చేరింది.అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల గతంలో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉంది. క్రూడ్ ధరలు గరిష్ఠంగా ఉన్నపుడు చమురుశుద్ధి కంపెనీలకు నష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రేట్లను కొద్దిగా తగ్గించినా దిగివస్తున్న క్రూడ్ ధరలకు అనుగుణంగా మాత్రం రేట్లను తగ్గించలేదు. దాంతో కంపెనీలకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి.త్వరలో జరగబోయే హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అధికారపక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. లీటర్కు నాలుగు నుంచి ఆరు రూపాయలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?చమురు ధరలు తగ్గుముఖం పట్టడానికి పలు అంశాలు కారణమవుతున్నాయి. లిబియా తన ముడిచమురు సరఫరాలు పెంచింది. అక్టోబర్ నుంచి ఒపెక్ + దేశాలు ఉత్పత్తి కోతలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఒపెక్ దేశాల కాకుండా ముడిచమురు వెలికితీసే ఇతర దేశాలు వాటి ఉత్పత్తిని పెంచుతున్నాయి. దాంతో సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. -
మరింత చెరకుతోనే అనుకున్న లక్ష్యం
ముంబై: పెట్రోల్లో 20% మేర ఇథనాల్ మిశ్రం లక్ష్యాన్ని 2025 సరఫరా సంవత్సరంలోనే సాధించాలంటే అందుకు మరింత చెరకు వినియోగించాల్సి ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల మిల్లర్లకు నగదు ప్రవాహాలు మెరుగవుతాయని పేర్కొంది. నవంబర్ నుంచి అక్టోబర్ వరకు ఇథనాల్ సరఫరా సంవత్సరంగా (ఈఎస్వై) పరిగణిస్తుంటారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు.. ఈఎస్వై 2025 సీజన్ పరిధిలోకి వస్తుంది. ఈఎస్వై 2025 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ‘‘ఇందుకు ఏటా 990 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. ఇందుకు చెరకుతోపాటు, గ్రెయిన్(ధాన్యాలు)ను సైతం వినియోగించుకోవడం ద్వారానే సరఫరా మెరుగుపడుతుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో వివరించింది. ధాన్యం ద్వారా వార్షిక ఇథనాల్ ఉత్పత్తి గణనీయంగా పెరిగి వచ్చే సీజన్ నాటికి 600 కోట్ల లీటర్లకు చేరుకుంటుందని క్రిసిల్ తెలిపింది. ప్రస్తుత సీజన్లో ఇది 380 కోట్ల లీటర్లుగా ఉంటుందని అంచనా. మిగిలిన మేర చెర కు వినియోగం ద్వారా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మిల్లుల్లో గణనీయమైన త యారీ సామర్థ్యం కారణంగా అది సాధ్యమేనని అభిప్రాయపడింది. చక్కెర నిల్వలను ఇథనాల్ త యారీకి మళ్లించకుండా, ఎగుమతులు చేయకుండా కేంద్రం నిషేధం విధించడంతో నిల్వలు పెరగడా న్ని క్రిసిల్ నివేదిక ప్రస్తావించింది. ఈ నిల్వలను ఇథనాల్ తయారీకి అనుమతించాలని సూచించింది. పెట్రోల్ దిగుమతులు తగ్గించుకోవచ్చు.. 20 శాతం ఇథనాల్ను కలపడం ద్వారా పెట్రోల్ దిగమతులపై ఆధారపడడాన్ని భారత్ తగ్గించుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఈఎస్వై 2021 నుంచి ఏటా పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 2–3 శాతం మేర పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇథనాల్ తయారీకి ఆహార ధాన్యాల వినియోగంపై కేంద్రం ఎలాంటి నియంత్రణలు విధించలేదు. కాకపోతే డిమాండ్–సరఫరా అంచనాల ఆధారంగా ఎంత మేర చెరకును ఇథనాల్ కోసం వినియోగించుకోవాలన్నది సీజన్కు ముందు నిర్ణయిస్తుంది. గతేడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ఏడాది సీజన్లో చెరకు ఉత్పత్తిపై ప్రభావం పడింది’’అని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీంతో ఈ సీజన్లో చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి 250 కోట్ల లీటర్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది. ధాన్యాల ద్వారా ఇథనాల్ తయారీ 40 శాతం పెరగడంతో ఈఎస్వై 2024 సీజన్లో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 14 శాతానికి చేరినట్టు వివరించింది. చెరకు నుంచి ఇథనాల్ తయారీ తగ్గడాన్ని ఇది భర్తీ చేసినట్టు తెలిపింది.భారీ స్థాయిలో చెరకు అవసరంఈఎస్వై 2025 సీజన్లోనే పెట్రోల్లో 20 % ఇథనాల్ లక్ష్యాన్ని సాధించాలంటే 4 మి లియ న్ టన్నుల చక్కెర తయారీకి సరిపడా చెరకును ఇథనాల్ కోసం కేటాయించాల్సి ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. ఈఎస్వై 2025 సీజన్లో స్థూల చక్కెర ఉత్పత్తి 33.5 మిలియన్ టన్నులుగా ఉంటుందని, చక్కెర వినియోగం 29.5 మిలియన్ టన్నుల స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ సీజన్ చివరికి చక్కెర నిల్వలు మెరుగైన స్థాయి లో ఉంటాయంటూ.. ఇథనాల్ తయారీకి సరిపడా చెరకును అనుమతించాలని సూచించింది. దీంతో చక్కెర నిల్వలనూ తగిన స్థాయిలో వినియోగించుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. -
2025-26 నాటికి ఇదే లక్ష్యం: అమిత్ షా
ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాడకాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు ఉత్పత్తిని ప్రోత్సహించడం చేస్తోంది. కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' హైడ్రోజన్ వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీలకు చెబుతున్నారు. అంతే కాకుండా ఇథనాల్ వాడకాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి 'అమిత్ షా' కూడా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని కోరుతున్నారు.మోదీ ప్రభుత్వం 2025-26 నాటికి 20 శాతం ఇథనాల్ను కలపాలనే లక్ష్యాన్ని సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే ముడిచమురు దిగుమతి తగ్గుతుందని అమిత్ షా చెప్పారు. దీనికోసం చక్కెర మిల్లులు ఇథనాల్ను ఉత్పత్తి చేయాలని కోరారు.పెట్రోల్ వినియోగం తగ్గితే.. పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అమిత్ షా అన్నారు. దాదాపు 5000 కోట్ల లీటర్ల పెట్రోలుకు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం ఉంటుందని కూడా ఆయన చెప్పారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనాఇథనాల్ను కలపడం వల్ల పర్యావరణం మెరుగుపడటమే కాకుండా.. చక్కెర మిల్లుల లాభాలు పెరగడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అమిత్ షా అన్నారు. ఇథనాల్ ఉత్పత్తిపైన ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని, మంత్రుల బృందం ద్వారా ఇథనాల్ మిశ్రమాన్ని ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తారని షా అన్నారు. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. కారణం..
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గతేడాది జులై నెలతో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 10%, డీజిల్ అమ్మకాలు 4.3% పెరిగాయని చమురు మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. జులైలో వంటగ్యాస్ అమ్మకాలు 11%, జెట్ ఇంధన వినియోగం 9% పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పెట్రోల్ డిమాండ్ 7.1%, డీజిల్ డిమాండ్ 1.6 శాతం పెరిగింది. మొదటి త్రైమాసికంలో జెట్ ఇంధన విక్రయాలు 11.4%, వంట గ్యాస్ విక్రయాలు 5% పెరిగాయి. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం ఇంధన వినియోగం పెరిగడానికి కారణమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణదేశీయంగా దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో డీజిల్ 40% వాటా కలిగి ఉంది. సుదూర రవాణా, మైనింగ్, వ్యవసాయం..వంటి అవసరాలకు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం పెరగడం పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. విమాన ట్రాఫిక్ అధికమవడంతో జులైలో జెట్ ఇంధన డిమాండ్ పెరిగింది. కస్టమర్ల సంఖ్య విస్తరించడం వల్ల వంట గ్యాస్ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని కంపెనీలు రాన్నున్న త్రైమాసిక ఫలితాల్లో మంచి ఫలితాలు పోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. -
పాక్లో అమాంతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇస్లామాబాద్: అధిక ధరలతో అల్లాడిపోతున్న పాక్ ప్రజలపై అక్కడి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. పాక్ కేంద్ర ప్రభుత్వం దేశంలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పాక్ ఆర్థిక మంత్రిత్వశాఖ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తక్షణమే పెంచుతున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ఈ ధరలు జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది.పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన పాక్ ప్రభుత్వం రాబోయే 15 రోజుల పాటు ఇవే ధరలు కొనసాగుతాయని ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాక్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 7.45 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.258.16 నుంచి రూ. 265.61కి చేరింది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 9.60 పెరిగింది. దీంతో దేశంలో లీటరు డిజిల్ ధర రూ.267.89 నుంచి 277.49కి చేరింది. ఈ నెల 12న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ విడుదల చేసిన అనంతరం తొలిసారిగా చమురు ధరలలో పెరుగుదల చోటుచేసుకుంది. -
రెడుబుక్ ఉన్మాదమిది
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ శ్రేణుల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా గ్రామాల్లో, ఎస్సీ, ఎస్టీ వాడల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలదోస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా చితకబాదుతుండటం ఊరూరా కనిపిస్తోంది. శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలను తొలగిస్తున్నారు.. పగలగొడుతున్నారు.బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇదేం కక్ష సాధింపు? గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎవరైనా ఇలా చేశారా? అధికారం చేజిక్కించుకుంటే ఇలా దాడులు చేయడానికి, ఆస్తులు ధ్వంసం చేయడానికి లైసెన్స్ వచ్చినట్లా? లేక అధికారంతోపాటు హిస్టీరియా ఏమైనా వచ్చిందా? రెడ్ బుక్.. రెడ్ బుక్.. అంటూ లోకేశ్కు వచి్చన పూనకం తాలూకు ఉన్మాదమే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులకూ నరనరాన ఎక్కినట్లుంది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడమే మీ ఉన్మాద లక్ష్యం అయితే.. ప్రజాగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగిసి పడటం ఖాయం. ఆ సెగలో మాడి మసి అవుతారో.. లేక పద్ధతి మార్చుకుని బుద్ధిగా పాలన సాగిస్తారో చూడాలి.అద్దేపల్లి (భట్టిప్రోలు)/సాక్షి ప్రతినిధి బాపట్ల: టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. భట్టిప్రోలు పంచాయతీ పరిధి అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అందరూ చూస్తుండగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్రహం ముప్పావు భాగానికి పైగా దగ్ధమైంది. దీంతో దళితవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే, వైఎస్సార్ విగ్రహానికి సమీపంలో ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైఎస్సార్సీపీ వారు పగులగొట్టారని, అందుకు ప్రతీకారంగా వైఎస్ విగ్రహాన్ని తగులబెట్టినట్లు టీడీపీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. కానీ, టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొట్టేందుకు జెండా దిమ్మెను కొద్దిగా పగులగొట్టుకుని ఆ సాకుతో వైఎస్ విగ్రహాన్ని కాల్చివేశారని వైఎస్సార్సీపీ నేతలు వాదిస్తున్నారు. ఇరువర్గాలూ పరస్పర ఫిర్యాదులుబాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు అనంతరం టీడీపీ అరాచకపర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా టీడీపీ నేతలు దాడులు చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో చాలామంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గ్రామాలు వదలి వెళ్లిపోయారు.ఈ పరిస్థితిలో టీడీపీ జెండా దిమ్మెలను పగులగొట్టే పరిస్థితి వైఎస్సార్సీపీ నేతలకు లేదన్నది టీడీపీ నేతలకూ తెలుసు. కాకపోతే ఏదో ఒక సాకుచూపి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఏడు మందిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు ప్రతిగా 14 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు : ఎస్ఐఈ ఘటన గురించి తెలుసుకున్న వేమూరు సీఐ పి.రామకృష్ణ, ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు, సిబ్బందితో çఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కూడా భట్టిప్రోలు పోలీస్స్టేషన్కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కాగా, వైఎస్సార్ విగ్రహం దగ్ధం చేసిన ఏడుగురిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులపై 435, 427, 507 ఆర్/34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు టీడీపీ జెండా దిమ్మను ధ్వంసం చేసినట్లు ఆ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. దళితవాడలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. విగ్రహాలు ధ్వంసం హేయం : మేరుగుస్ఫూర్తిని నింపిన మహనీయుల విగ్రహాల ధ్వంసం, దహనం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అని మాజీమంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విగ్రహం దహనం విషయం తెలుసుకున్న ఆయన అద్దేపల్లిని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. టీడీపీ దురాగతాన్ని ఖండించారు.హుటాహుటిన మరొక విగ్రహం ఏర్పాటుకు యత్నంవైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్ మరో విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌనదీక్ష చేశారు. దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తరలించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. మహిళలు, చిన్నారులు అని చూడకుండా పోలీసులు నిర్ధాక్షిణ్యంగా లాఠీచార్జి చేశారు. విగ్రహాన్ని దగ్ధం చేయడం గ్రామ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిందని.. చంద్రబాబు రాక్షస పాలనకు ఇది పరాకాష్టని అశోక్బాబు మండిపడ్డారు. -
గోవాలో ఒక్కసారిగా పెరిగిన ఇంధన ధరలు
గోవా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) పెంపును ప్రకటించింది. పెట్రోల్ ధర రూ.1, డీజిల్ ధరను 60 పైసలు పెంచుతూ.. స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్రటరీ (ఆర్థిక) ప్రణబ్ జి భట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ధరల పెరుగుదల ఈ రోజు (జూన్ 22) నుంచే అమలులోకి వస్తాని పేర్కొన్నారు.ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ గత వారంలో కీలక ప్రకటన వెల్లడించింది.ధరల పెరుగుదల సమంజసం కాదని, ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యూరి అలెమావో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద పెను భారం మోపాలని ఇలాంటి ప్రకటనలు చేస్తుందని అన్నారు. ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచారు, ఇప్పుడు ఇంధన ధరలు పెంచారని అలెమావో పేర్కొన్నారు.విద్యుత్ చార్జీలను పెంచిన తరువాత, అవినీతికి ఆజ్యం పోయడానికి ఇప్పుడు ఇంధన ధరలను పెంచిందని, సామాన్యులను ఇంకెంత బాధపెడతారు అంటూ.. గోవా ఆమ్ ఆద్మీ ప్యారీ చీఫ్ అమిత్ పాలేకర్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. -
ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరత
పర్యావరణ పరిరక్షణకు అవసరమైన పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కొత్త టెక్నాలజీల వినియోగం ద్వారా పరిశుభ్రమైన ఇంధనాలతో ప్రపంచంలో కాలుష్యాన్ని, వాతావరణ విధ్వంసాన్ని అదుపు చేయగలుగుతున్నాం. అయితే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ఖనిజ లోహాల కొరత ప్రపంచానికి పొంచి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బయిన్లు, సోలార్ ప్యానెల్స్ తదితర నూతన సాధనాలకు కీలకమైన ఖనిజ లోహాలు తగినంత స్థాయిలో ఇక ముందు లభ్యం కాకపోవచ్చని తాజా సమాచారం చెబుతోంది.శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గాలంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ప్రత్యామ్నాయాలకు రాగి, లిథియం లోహాలు అవసరం. రాగి విద్యుత్ ఉత్పత్తికి, లిథియం బ్యాటరీలు పనిచేయడానికి కీలకమనే విషయం తెలిసిందే. 2035 నాటికి ప్రపంచానికి అవసరమైన రాగి డిమాండును 70 శాతం, లిథియం డిమాండును 50 శాతం మేరకే తీర్చగలిగే పరిస్థితులున్నాయని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తన తాజా నివేదికలో హెచ్చరించింది. కిందటేడాది లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ ధరలు తగ్గడం మంచి పరిణామామమేగాని, దీంతో ఈ లోహాల ఉత్పత్తిలో నిమగ్నమైన రంగాల్లో పెట్టుబడులు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఈ ఖనిజ లోహాల కొరత ప్రపంచదేశాల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బిరోల్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు వంటి నూతన సాంకేతిక సాధనాలకు ప్రపంచంలో డిమాండు విపరీతంగా పెరుగుతోంది. వాటి తయారీకి అత్యంత కీలకమైన ఖనిజ లోహాల సరఫరా తగినంత స్థాయిలో లేకపోతే ఈ డిమాండును తట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఐఈఏ వివరించింది.2040 వరకు 80వేల కోట్ల డాలర్లుమైనింగ్ ప్రాజెక్టుల్లో 2040 వరకు ఇన్వెస్టర్లు 80వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితేనే ప్రపంచంలో ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం మునుపటి స్థాయికి అంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడం సాధ్యమౌతుందని అంచనా. మైనింగ్ రంగంలో పెట్టుబడులు మందగిస్తే ఖనిజ లోహాల సరఫరా గణనీయంగా పడిపోతుందని ఐఈఏ హెచ్చరించింది. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపకరించే సాధనాల తయారీకి కీలకమైన గ్రాఫైట్ వినియోగం 2040 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. పైన పేర్కొన్న కీలకమైన కొన్ని ఖనిజ లోహాల ధరలు కొవిడ్ ముందునాటి స్థాయిలకు పడిపోయాయి. బ్యాటరీల తయారీకి అవసరమైన లోహాల ధరలు బాగా తగ్గిపోయాయి. అయినా భవిష్యత్తులో వాటి కొరత తప్పదని నిపుణులు భావిస్తున్నారు.ఇండియాలో బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిక్షేపాలు పెద్ద మొత్తాల్లో ఉన్నట్టు గతేడాది కనుగొన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి, ప్రపంచ ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి అవసరమైన ఖనిజ లోహాల ఉత్పత్తి కేవలం కొన్ని దేశాకే పరిమితం కావడం మంచిది కాదు. దానివల్ల వాటి సరఫరా సాఫీగా సాగదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కీలక స్థానానికి చేరిన ఇండియా వంటి పెద్ద దేశాల్లో ఈ ఖనిజ లోహాల లభ్యత, విస్తృత స్థాయిలో ఉత్పత్తి ఎంతో అవసరమని అంతర్జాతీయ ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ముందస్తు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ను కంటైనర్లు, సీసాల్లో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్షిప్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పెట్రో డీలర్లకు తాజాగా మార్గదర్శకాలను ఎన్నికల సంఘం జారీ చేసింది. పెట్రోల్ బంకులపై నిరంతరం ఫ్లైయింగ్ స్క్వాడ్ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. బంకుల్లో ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రదర్శించడమే కాకుండా గొడవలు చేసే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈసీ సూచించింది. ఈ ఆదేశాల మేరకు ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రావి గోపాలకృష్ణ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డీలర్లకు సూచించారు. -
పెట్రోల్, డీజిల్ @ రూ.125
-
శిలాజ ఇంధనాలకు రాయితీలు తగ్గితేనే...
శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరుగుతున్నందు వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు ఆ ఇంధనాలపై ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని వివిధ అంతర్జాతీయ సంస్థలూ, సదస్సులూ దశాబ్దాలుగా పిలుపునిచ్చాయి. ఉదాహరణకు కాప్– 21 సదస్సులో 40 కంటే ఎక్కువ దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడానికి ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. అయినా కూడా పారిశ్రామిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వినియో గానికి బడ్జెట్ బదిలీలు, పన్ను మినహాయింపులు, ఆర్థిక హామీలు అందజేస్తూనే ఉన్నాయి. ఈ సబ్సిడీల వలన వాతావరణానికి ప్రాథమికంగా హాని చేస్తున్న శిలాజ ఇంధనాల ఉపయోగం పెరుగుతూనే ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి తగిన చర్యలు లేకపోవడంతో వర్ధమాన దేశాలు కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా లేవు. 2023లో భారతదేశంలో మొత్తం ఇంధన సబ్సిడీలు రూ. 3.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’ చేసిన కొత్త పరిశోధన ప్రకారం ఇవి గత తొమ్మిదేళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశంలో ఇంధన వనరుల డిమాండ్ పెరగడంతో పాటు, 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో, ప్రభుత్వం 2023లో అన్ని రకాల ఇంధన వనరుల లభ్యతను విస్తరిస్తూ హైబ్రిడ్ విధా నాన్ని అవలంభించింది. పెరుగుతున్న ఇంధన వినియోగం, ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తరువాత అంతర్జాతీయ ఇంధన ధరల సంక్షోభం ప్రభావం, అనేక దేశాలు అనుకున్న లక్ష్యాలకు వ్యతిరేకంగా శిలాజ ఇంధనాలకు మద్దతును గణనీయంగా పెంచాయి. భారతదేశం కూడా ఈ దిశ గానే అనేక చర్యలు అమలులోకి తెచ్చింది. 2022– 2023లో గరిష్ఠ స్థాయికి చేరుకున్న శిలాజ ఇంధన ధరల ప్రభావం నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రిటైల్ ధరలను పరిమితం చేసింది. పన్నులను తగ్గించింది. వ్యాపారులు, వినియోగ దారులకు ప్రత్యక్ష నగదు బదిలీలు చేసింది. ఆయా చర్యల ఫలితంగా చమురు, గ్యాస్ సబ్సిడీలు 2022తో పోలిస్తే 2023లో 63 శాతం పెరిగాయి. అయితే, 2023లో మొత్తం ఇంధన సబ్సిడీలలో బొగ్గు, చమురు, గ్యాస్ సబ్సిడీలు దాదాపు 40 శాతం కాగా, కాలుష్య రహిత ఇంధన వనరుల (క్లీన్ ఎనర్జీ)కు సబ్సిడీలు 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. మిగిలిన సబ్సిడీలలో ఎక్కువ భాగం విద్యుత్ వినియోగానికీ, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవీ ఉన్నాయి. ఇదే కాలంలో బొగ్గు సబ్సిడీలు కూడా 17 శాతం పెరిగాయి. మొత్తంగా క్లీన్ ఎనర్జీ సబ్సిడీల కంటే శిలాజ ఇంధన సబ్సిడీలు ఐదు రెట్లు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రత్యక్ష బడ్జెట్ బదిలీల ద్వారా చమురు, గ్యాస్ రంగానికి గణనీయమైన మద్దతును అందించింది. ఈ కాలంలో, మొత్తం చమురు – గ్యాస్ సబ్సిడీలు కనీసం రూ.70,692 కోట్లకు పెరి గాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా వరి, గోధుమలు, మక్కలు, చెరుకు వంటి ఆహార సంబంధిత ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయ డానికి చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఒకవైపు ఆహార భద్రత సాధించటానికీ, ఆకలి తగ్గించడానికీ వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... ఇంకొక వైపు సబ్సిడీలు ఇచ్చి అదే ఆహార పంటలను ఇతరత్రా ఉపయోగాలకు మళ్ళిస్తోంది. ఇందువల్ల కలిగే దీర్ఘకాలిక దుష్ప్రభావం ఊహించలేని విధంగా ఉండవచ్చు. 2020 ఆర్థిక సంవత్సరంలో, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం ఇంధన ఆదాయం రూ. 6,99,565 కోట్లుగా అంచనా. ఇది మొత్తం ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 17 శాతం. ఇంధన వనరుల నుంచి వచ్చే ఆదా యంలో ఎక్కువ భాగం (83శాతం) చమురు, గ్యాస్ నుండి వస్తోంది. పునరుత్పాదక ఇంధనం నుంచి 1 శాతం కంటే తక్కువే వస్తోంది. ఈ ఆదాయం కూడా ఎక్కువగా కేవలం రెండు పన్నుల నుండి వస్తోంది: కేంద్ర ఇంధన ఎక్సైజ్, రాష్ట్ర స్థాయి వ్యాట్. శిలాజ ఇంధన శక్తి వనరుల వల్ల ఆదాయం 2030 నాటికి అదనంగా రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 3,40,000 కోట్లకు పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కోల్పోవటానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. క్రమంగా ఈ ఆదాయం మీద ఆధార పడటం తగ్గించడానికి కూడా సుముఖంగా లేవు. అయితే శిలాజ ఇంధనాల వల్ల ఆదాయం మాత్రమే కాదు భారం కూడా ఉంటుంది. ఇంధనాల ధరలో ప్రతిబింబించని ఖర్చుల భారం చాల ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఈ భారం ప్రభుత్వ ఆదాయానికి ఐదు రెట్లు ఎక్కువ. ఈ భారం రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా నీరు, గాలి, ఇతర ప్రకృతి వనరుల కాలుష్యం వల్ల కలిగే మరణాలు, అనారోగ్య సమస్యలు, వాటిని అధిగమించడానికి కల్పించవలసిన మౌలిక సదుపాయాల రూపంలో ఈ భారాన్ని చూడవచ్చు. అందుకే కాలుష్య రహిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) ఉత్పత్తులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. ప్రపంచ వాతా వరణ సదస్సులలో కాలుష్య రహిత ఇంధనాల వైపు ఉత్పత్తి, వినియోగ రంగాలు మారాలని ఎప్పటి నుంచో ఒత్తిడి ఉంది. ‘గ్లాస్గో కాప్ 26’ సదస్సులో బొగ్గు ఆధా రిత విద్యుత్, ఇతర ఇంధన ఉపయోగాలను క్రమంగా తగ్గించాలని పెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. కేవలం బొగ్గు కాకుండా అన్ని రకాల శిలాజ ఇంధనాల ఉపయోగం క్రమంగా తగ్గించాలని వాదించింది. దుబాయి కాప్ 28 సదస్సులో ఈ దిశగా అన్ని రకాల శిలాజ ఇంధనాలను దశల వారీగా తగ్గించాలనే తీర్మానం దాదాపు ఖరారు అయినా సర్వామోదం పొందలేదు. పెరుగుతున్న కర్బన కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకర శిలాజ ఇంధ నాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా వాటికి రాయితీలు తగ్గించాలి. అది సాధ్యం కావాలంటే సమూల ఆర్థిక పరివర్తనం అవసరం. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తే ఆర్థిక వృద్ధి సుస్థిరం అవుతుంది. శిలాజ ఇంధన దిగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక అభివృద్ధి సుస్థిరం ఎప్పటికీ కాలేదు. ప్రకృతిని కలుషితం చేస్తూ అభివృద్ధి దిశగా పయనించడం దుర్భరంగా ఉంటుంది. అందుకే కర్బన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా అవసరమైన వాతా వరణ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఒక ఆచరణాత్మక దృష్టి అవసరం. ప్రభుత్వం శిలాజ ఇంధన పన్ను ఆదా యంలో కొంత భాగాన్ని కొత్త కాలుష్య రహిత శక్తి వనరుల వైపు మళ్ళించాలి. సుస్థిర అభివృద్ధికీ, సమాన ఫలాలు అందరికీ అందించే ఆర్థిక వ్యవస్థకూ ఇంధనాల కూర్పు చాల కీలకం. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
పెట్రోల్, డీజిల్పై రూ.2 తగ్గింపు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయని కేంద్ర చమురు శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.96.72 నుంచి రూ.94.72కు, డీజిల్ ధర రూ.89.62 నుంచి 87.62కు రానుంది. వారం క్రితమే కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇలా.. స్థానిక, అమ్మకం పన్నులు కలిపి రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.70, డీజిల్ ధర రూ. 2.54 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.109.66గా ఉన్న పెట్రోల్ ధర రూ.106.96కు తగ్గనుండగా, డీజిల్ ధర రూ.97.82 నుంచి రూ. 95.28కు తగ్గనుంది. -
వాహనదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
లోక్సభ 2024 ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ఏకంగా రూ. 2 తగ్గింపు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. కొత్త ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని మంత్రి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గింపు నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 89.62 రూపాయలున్న లీటరు డీజిల్ రేపటి నుంచి రూ. 87.62లకు విక్రయిస్తారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధానిలో 96.72 రూపాయలుగా ఉన్న లీటరు పెట్రోల్ రేపటి నుంచి రూ. 94.72 కి లభిస్తుంది. पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है। वसुधा का नेता कौन हुआ? भूखण्ड-विजेता कौन हुआ? अतुलित यश क्रेता कौन हुआ? नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C — Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024 -
కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే తగ్గిన పెట్రో ధరలు
ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నేడు(సోమవారం)బీహార్, యూపీలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 84 డాలర్లను దాటేసింది. సోమవారం ఉదయం దేశీయ ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు యూపీ, బీహార్లలో చమురు చౌకగా మారింది. ప్రభుత్వ చమురు సంస్థలు అందించిన వివరాల ప్రకారం నోయిడాలో పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి లీటరు రూ. 96.59కు చేరింది. డీజిల్ కూడా 17 పైసలు తగ్గి రూ. 89.76కి చేరుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ ధర తగ్గింది. ఇక్కడ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి, లీటరు రూ. 107.48కి విక్రయిస్తున్నారు. డీజిల్ కూడా లీటరుకు 10 పైసలు తగ్గి రూ.94.26కి చేరుకుంది. హర్యానా రాజధాని గురుగ్రామ్లో ఈరోజు పెట్రోలు ధర 29 పైసలు పెరిగి లీటరుకు రూ. 97.10కి చేరగా, డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ. 89.96కి చేరింది. గ్లోబల్ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 84.18 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యుటిఐ రేటు బ్యారెల్కు 78.60 డాలర్లకు చేరింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ మొదలైనవి జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా మారడానికి ఇదే కారణంగా నిలుస్తోంది. కాగా బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే చమురు ధరలు తగ్గడం శుభపరిణామంగా ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. -
Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్పై పుకార్లు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్లు బంద్ అంటూ మళ్లీ పుకార్లు వ్యాపించడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జనం పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు సైతం వెలిశాయి. అయితే, పెట్రోల్ బంక్లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని ఇవి పుకార్లేనని బంక్ల యాజమాన్యం స్పష్టం చేశారు. ఇక.. ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో.. కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన కఠిన నిబంధనలను నిరసిస్తూ అయిల్ ట్రాక్కుల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చదవండి: Banjara Hills: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య.. -
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్పై ఇస్తున్న డిస్కౌంట్ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్పై బ్యారెల్కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్డాడ్ పూర్డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
తెలంగాణలో ప్రజలకు చుక్కలు చూపిన పెట్రోల్, డీజిల్ కొరత
-
ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సాయంత్రానికి పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బంకుల వద్ద ట్రాఫిక్ స్తంభన ప్రభావం ప్రధాన కూడళ్లు, రహదారులపై పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పనుల మీద బయటకొచ్చిన వారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ అయిపోయిన వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో.. వాస్తవానికి రెండురోజుల క్రితమే వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఫలితంగా ప్రెటోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. ఇక బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వేలాదిగా వాహనాలు బారులు తీరాయి. సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్న ఆందోళనతో ఎక్కువమంది ట్యాంకులు ఫుల్ చేయించడం కన్పించింది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద క్యాన్లలో ఆయిల్ నింపుకొని తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నానికల్లా చాలా వరకు బంకుల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. ఆయా బంకుల యాజమానులు బంకులు మూసేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకులు ఉండగా 3 వేల వరకు బంకులు మూతపడటంతో సాయంత్రానికి పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యింది. హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకులన్నింటిలో నిల్వలు ఖాళీ అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నిల్వలు ఖాళీ కావడంతో డీలర్ల సొంత ట్యాంకర్లను రంగంలోకి దింపారు. వారు ఆందోళన విరమించి ఇంధన సరఫరాకు సిద్ధమయ్యారు. మరోవైపు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు నిరసనగా డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేసి ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల అసోసియేషన్లు కూడా సమ్మె విరమించే అవకాశాలు ఉండటం, చమురు సంస్ధల డిపోల వద్దకు డీలర్ల ట్యాంకర్లు లోడింగ్కు చేరుకోవడంతో బుధవారం ఆయిల్ సరఫరాకు అంతరాయం ఉండబోదని డీలర్ల వర్గాలు ప్రకటించాయి. ఇంధన సరఫరాలో కొరత ఉండదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఇంధన ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్లో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చించాలని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ట్యాంకర్ల డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పా జంక్షన్ వద్ద ఎస్ఐకి గాయాలు! రాజేంద్రనగర్: బండ్లగూడ అప్పా జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం వచ్చిన సందర్భంగా వాగ్వావాదం జరగడంతో పరస్పరం దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెట్రోల్ బంకును పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. విధుల్లో ఉన్న ఒక ఎస్ఐ ర్యాంకు అధికారితో పాటు సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు చెప్పారు. -
HYD Long Queues At Petrol Pumps:హైదరాబాద్లో వాహనదారులకు పెట్రో ట్రబుల్స్ (ఫొటోలు)
-
హైవేను దిగ్భంధించిన ఆందోళనకారులు..!
-
‘పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయం’.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో పిల్లల శ్వాస, నాడీ వ్యవస్థలను వాయు కాలుష్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. దాంతో పిల్లల్లో న్యుమోనియా కేసులు అధికమవుతున్నాయి. పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం వాతావరణంలోనూ అనూహ్య మార్పులు తీసుకొస్తోంది. మొత్తంగా ఇది కంటికి కనిపించని శత్రువుగా పరిణమించింది. భారత్లోనూ ఈ సమస్య పోనుపోను తీవ్రతరమవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయంగా పెట్రోల్, డీజిల్లతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ కూడా 2024 జనవరి ఒకటో తేదీ (సోమవారం) నుంచి డీజిల్, పెట్రోల్లతో నడిచే వాహనాలను కొనుగోలు చేయవద్దని ఆదేశించారు. ఈ నిర్ణయం ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంతోపాటు ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ శాఖలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనాలంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 185, ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలు 2733గా ఉందని సీఎం తెలిపారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఏటా వాయు ప్రమాణాలను అధ్యయనం చేస్తోంది. దాని ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రూపొందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన నివేదికలో ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే..
డీజిల్ అమ్మకాలు నవంబర్లో 7.5 శాతం మేర క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 7.33 మిలియన్ టన్నుల నుంచి 6.78 మిలియన్ టన్నుల విక్రయాలకు పరిమితమయ్యాయి. దీపావళి సందర్భంగా కొందరు ట్రక్ డ్రైవర్లు విరామం తీసుకుని, ఇళ్లకు వెళ్లిపోవడం వల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నెలలో విక్రయాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని పేర్కొన్నారు. పెట్రోల్ ఇంధన అమ్మకాల్లో డీజిల్ వాటా 40 శాతం మేర ఉంటుంది. 70 శాతం మేర డీజిల్ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. మూడు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థల ద్వారా పెట్రోల్ అమ్మకాలు నవంబర్ నెలలో 7.5 శాతం పెరిగి 2.86 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. పండుగల సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం ఇందుకు మద్దతుగా నిలిచింది. డీజిల్ డిమాండ్ నవంబర్ మొదటి 15 రోజుల్లో 12.1 శాతం క్షీణించగా, ఆ తర్వాత తిరిగి కోలుకుంది. అక్టోబర్లో మొదటి అర్ధభాగంలో పెట్రోల్ డిమాండ్ 9 శాతం తగ్గగా, అదే కాలంలో డీజిల్ అమ్మకాలు 3.2 శాతం క్షీణించాయి. ఆ తర్వాత దుర్గా పూజ, దసరా నవరాత్రుల సమయంలో డిమాండ్ మళ్లీ పుంజుకోవడం గమనార్హం. ఇక నెలవారీగా చూస్తే, అక్టోబర్ కంటే నవంబర్లో డీజిల్ అమ్మకాలు 3.6 శాతం అధికంగా నమోదయ్యాయి. ఏటా వర్షాకాలంలో మూడు నెలల పాటు డీజిల్ అమ్మకాలు క్షీణించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత అమ్మకాలు తిరిగి పుంజుకోవడాన్ని గమనించొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం మేర డీజిల్ అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఏటీఎఫ్ అమ్మకాల్లోనూ సానుకూలత ఇక విమానయాన ఇంధన అమ్మకాలు (ఏటీఎఫ్) నవంబర్ నెలలో 6,20,000 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలతో పోలిస్తే 6.1 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2021 నవంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే 31.6 శాతం పెరిగాయి. కరోనా ముందు సంవత్సరం 2019 నవంబర్ నెలలో అమ్మకాలు 6,70,000 టన్నులతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో ఏటీఎఫ్ అమ్మకాలు 6,11,300 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ (వంటగ్యాస్) విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 0.9 శాతం తక్కువగా 2.57 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. అక్టోబర్లో నమోదైన 2.52 మిలియన్ టన్నులతో పోలిస్తే 2 శాతం పెరిగాయి. -
విద్యుత్ శాఖ అటెండర్ యాదమ్మ దారుణ హత్య
రంగారెడ్డి: పెట్రోల్ పోసి తగులబెట్టి ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రామాంజనేయులు తెలిపిన వివరాలు.. మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంథని కృష్ణ విద్యుత్ శాఖలో హెల్పర్గా పని చేస్తూ నాలుగేళ్ల క్రితం గ్రామంలోనే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామస్తుల ఆందోళనతో ప్రభుత్వం కృష్ణ భార్య యాదమ్మ(38)కు తుర్కయంజాల్లో ఉన్న విద్యుత్ శాఖ డీఈఈ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగం కల్పించింది. ఆమె నిత్యం జాపాల నుంచి తుర్కయంజాల్కు వెళ్లి వస్తుండేది. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై మంచాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ముచ్చర్ల శివారులోని చాకలోనికుంట సమీపంలో కాలిపోయిన ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యాదమ్మ కుటుంబ సభ్యులను పిలిపించగా మృతదేహం ఆమెదేనని గుర్తించారు. పోలీసులు క్లూస్టీం, డాగ్స్క్వాడ్తో వివరాలు సేకరించారు. సంఘటనా స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాస్రావు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, జాపాల గ్రామం నుంచి మంగళవారం ఉద యం తుర్కయంజాల్లోని విద్యుత్ శాఖ డీఈఈ కార్యాలయంలో విధులకు వెళ్లిన యాదమ్మ సా యంత్రం కార్యాలయం ముందున్న సాగర్రోడ్డు వద్దకు వచ్చి ఓ కారులో వెళ్లినట్లు సీసీ పుటేజీలో రికార్డయింది. ఆమె ఎవరి కారులో వెళ్లింది.. కారు లో ఉన్నదెవరు.. స్వగ్రామంలో ఏమైనా తగాదాలున్నాయా.. ఎక్కడో చంపి మృతదేహన్ని ఇక్కడి కి తీసుకొచ్చి పడేశారా.. అత్యాచారం చేసి, ఆనవాళ్లు దొరక్కకుండా తగులబెట్టడానికి యత్నించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాద మ్మ వెళ్లిన కారు నంబర్ను సీసీ పుటేజీలో గుర్తించిన పోలీసులు ఆ దిశలో వివరాలు సేకరిస్తున్నారు. జాపాలలో విషాదఛాయలు మంచాల: యాదమ్మ మృతితో ఆమె స్వగ్రామం జాపాలలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలికి కూతుళ్లు అర్చన, విమల, కుమారుడు వీరేందర్ యాదవ్ ఉన్నాడు. తల్లిదండ్రుల మృతితో వారి కుటుంబం రోడ్డున పడింది. తల్లి మృతదేహాన్ని చూసి పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. -
పండుగల జోష్.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది. అక్టోబర్ మొదటి 15 రోజుల్లో అమ్మకాలు తగ్గగా.. తర్వాతి 15 రోజుల్లో గణనీయంగా పెరిగాయి. దీంతో విక్రయాల్లో నికర వృద్ధి నమోదైంది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ అక్టోబర్లో 3 శాతం అధికంగా 2.87 మిలియన్ టన్నుల పెట్రోల్ను విక్రయించాయి. డీజిల్ అమ్మకాలు 5 శాతం పెరిగి 6.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అక్టోబర్ మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు 9 శాతం తగ్గగా, డీజిల్ విక్రయాలు 3.2 శాతం క్షీణతను చూడడం గమనార్హం. తిరిగి దసరా నవరాత్రుల సమయాల్లో వీటి విక్రయాలు బలంగా పుంజుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ తొలి 15 రోజుల్లో పెట్రోల్ విక్రయాలు 1.17 మిలియన్ టన్నులుగా ఉంటే, తర్వాతి 15 రోజుల్లో దీనికంటే 44 శాతం అధికంగా 1.70 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు అక్టోబర్ మొదటి భాగంలో 2.99 మిలియన్ టన్నులుగా నమోదు కాగా, ద్వితీయ భాగంలో 3.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్లో డీజిల్ అమ్మకాలు 5.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు అక్టోబర్ నెలకు 6,21,200 టన్నులుగా ఉన్నాయి. 2021 అక్టోబర్ విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 6.9 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో అమ్మకాలు 6,03,600 టన్నులతో పోల్చి చూసినా 3 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఎల్పీజీ విక్రయాలు 5 శాతం వృద్ధితో 2.49 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ విక్రయాలు - కారణం ఏంటంటే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1–15తో పోలిస్తే ఈ నెల తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది. డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్ టన్నులకు వచ్చి చేరింది. 2022 అక్టోబర్లో దుర్గా పూజ/దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా ఉంది. 2023 సెప్టెంబర్ 1–15తో పోలిస్తే ఈ నెల 1–15 మధ్య పెట్రోల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు మాత్రం 9.6 శాతం ఎగశాయి. 2022 అక్టోబర్తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నులు నమోదైంది. నెలవారీగా పెరుగుతూ.. నీటి పారుదల, సాగు, రవాణా కోసం ఇంధనాన్ని ఉపయోగించే వ్యవసాయ రంగంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డీజిల్ అమ్మకాలు సాధారణంగా రుతుపవన నెలలలో క్షీణిస్తాయి. అలాగే వర్షం కురిస్తే వాహనాల రాకపోకలు మందగిస్తాయి. దీంతో గత మూడు నెలల్లో డీజిల్ వినియోగం తగ్గింది. రుతుపవనాలు ముగిసిన తర్వాత వినియోగం నెలవారీగా పెరిగింది. 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్ వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. అలాగే డీజిల్ వాడకం 2021 అక్టోబర్తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 36.5 శాతం అధికంగా, 2019 అక్టోబర్తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. వంటకు ఉపయోగించే ఎల్పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్ టన్నులుగా ఉంది. -
ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్!
ఆధునిక కాలంలో ఫుడ్, కూరగాయలు వంటి వస్తువులను డోర్ డెలివరీ పొందుతున్నారు. వీటి కోసం ప్రస్తుతం అనేక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ (పెట్రోల్ అండ్ డీజిల్) కూడా డోర్ డెలివరీ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కల్చర్ పెరిగిపోతోంది. కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. స్విగ్గి, జొమాటో తరహాలోనే వాహన వినియోగదారులకు అవసరమైన పెట్రోల్ డోర్ డెలివరీ చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఒక భార్యాభర్తల జంట (చేతన్ వాలుంజ్ & అదితి భోసలే) రెపోస్ ఎనర్జీ (Repos Energy) ప్రారంభించారు. రెపోస్ ఎనర్జీ పెళ్లి తరువాత ఎలాగైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో అదితి, చేతన్ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అనుకున్నట్లుగానే సంస్థను పూణేలో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది భారతదేశం మొత్తం మీదే సుమారు 65 నగరాల్లో విస్తరించి ఉంది. డోర్ టు డోర్ పెట్రోల్ డెలివరీ చేసి బాగా ఆర్జిస్తున్నారు. రెపోస్ ఎనర్జీ ద్వారా వినియోగదారులకు, కంపెనీలకు పెట్రోల్ సరఫరా చేసి నెలకు రూ. 2.2 కోట్లు వరకు సంపాదిస్తున్నారు. ప్రారంభంలో వీరి ఆదాయం నెలకు రూ. 70,000 మాత్రమే. ఈ జంట చేస్తున్న బిజినెస్ చాలామంది పెద్ద పారిశ్రామిక వేత్తలను కూడా ఆకర్శించింది. వీరి కొత్త ఆలోచనకు ముగ్దుడైన రతన్ టాటా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. దీంతో వారి బిజినెస్ మరింత వేగంగా ముందుకు వెళ్లడం ప్రారంభించింది. గతేడాది వీరి ఆదాయం రూ. 65 కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 200 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. రెపోస్ ఎనర్జీ ప్రస్తుతం టాటా గ్రూప్తో మాత్రమే కాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ ఎలక్ట్రికల్, లార్సెన్ & టబ్రో, షిండ్లర్, జేడబ్ల్యు మారియట్ హోటల్, ఫీనిక్స్ మాల్, ది వెస్టిన్ హోటల్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలను కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి.. మరింత లాభాలు పొందటానికి సంస్థ సన్నద్ధమవుతోంది. -
తల్లిని సజీవదహనం చేసిన తనయుడు
కంబదూరు: నవమాసాలు మోసి.. జన్మనిచ్చి.. కంటికి రెప్పలా కాపాడి.. పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే ఓ కుమారుడు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంబదూరులోని ఓబయ్య కాలనీకి చెందిన ఈడిగ గోపీనాథ్, సుజాతమ్మ(59) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లిళ్లు కావడంతోపాటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటర్ చదివిన కుమారుడు ప్రణీత్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తాగుడుకు బానిసైన అతను ఉద్యోగం మానేసి స్వగ్రామం చేరుకున్నాడు. రోజూ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను హింసించేవాడు. సోమవారం కూడా మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని అనారోగ్యంతో మంచంలో పడుకుని ఉన్న తల్లి సుజాతమ్మను అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి సుజాతమ్మ భర్త గోపీనాథ్కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చేలోపే పూర్తిగా కాలిపోయిన సుజాతమ్మ మృతి చెందింది. ఘటనాస్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడు ప్రణీత్ను అరెస్ట్ చేశారు. -
ఊపందుకున్న పెట్రోల్ వినియోగం.. నీరసించిన డీజిల్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఈ నెల తొలి పక్షం రోజుల్లో పెట్రోల్ వినియోగం ఊపందుకోగా.. డీజిల్ అమ్మకాలు నీరసించాయి. వర్షాలు డిమాండును దెబ్బతీయడంతో వరుసగా రెండో నెలలోనూ డీజిల్ విక్రయాలు మందగించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పారిశ్రామిక కార్యక్రమాలు మందగించడం సైతం ప్రభావం చూపింది. గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు నామమాత్రంగా పుంజుకున్నాయి. ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వివరాల ప్రకారం ఈ నెల 1–15 మధ్య డీజిల్ అమ్మకాలు 5.8 శాతం క్షీణించి 2.72 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. అయితే ఈ ఆగస్ట్ తొలి 15 రోజులతో పోలిస్తే 1 శాతం పుంజుకున్నాయి. కాగా.. పెట్రోల్ అమ్మకాలు 1.2 శాతం పెరిగి 1.3 మిలియన్ టన్నులను తాకాయి. ఆగస్ట్ తొలి పక్షంతో పోలిస్తే 8.8 శాతం ఎగశాయి. -
ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు?
ప్రపంచంలో లెక్కలేనన్ని వింతలు విడ్డూరాలు కనిపిస్తాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఇలాంటి వింత ఉదంతం వైరల్ అవుతోంది. భవనంలోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం విస్మయం గొలుపుతోంది. ఈ భవనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @TansuYegen అనే వినియోగదారు ట్విట్టర్లో షేర్ చేశారు. కోట్లాది మంది యూజర్స్ ఈ వీడియో చూశారు. ఈ భవనంలోని ఐదవ అంతస్తులో గల పెట్రోల్ బంక్ దగ్గరకు వాహనదారులు ఎలా వెళతారనే ప్రశ్న అందరిమదిలోనూ మెదులుతోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెట్రోల్ బంక్ చైనాలోని చాంగ్కింగ్లో నిర్మితమయ్యింది. పెట్రోలు బంక్కు వచ్చిన కొన్ని వాహనాల్లో ఇంధనం నింపుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. నిజానికి ఈ భవనం తక్కువ ఎత్తులోనే ఉంది. ఇది కొండ ప్రాంతం కావడంతో భవనం దిగువ భాగంలో నిర్మించబడింది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ భవనం ఐదవ అంతస్తుకు వెనుక నుంచి మరో మార్గం ఉంది. ఆ దారిగుండా వాహనదారులు సులభంగా పెట్రోల్ బంక్కు చేరుకోగలుగుతారు. చైనావాసుల ప్రతిభకు ఈ పెట్రోల్ బంక్ అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు? Refueling on the rooftop of a parking lot and subway passing through a residential building in the city of Chongqing, China. pic.twitter.com/gKZpbUA9wn — Tansu YEĞEN (@TansuYegen) September 2, 2023 -
పెట్రో బాంబు బాబు పుణ్యమే!
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా అమలు చేస్తుంటే ఈనాడు రామోజీ కడుపు మంటను భరించలేకపోతున్నారు! సొంత కార్లున్న చంద్రబాబు, లోకేశ్కు సైతం వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని అందించాల్సిందే అన్నట్లుగా ఉంది ఆయన కథనాల తీరు! ఆటోలు, ట్యాక్సీలు, మేక్సి క్యాబ్లను కొనుగోలు చేసి సొంతంగా నడుపుకునే వారి కోసం ఆ పథకాన్ని రూపొందించారన్న విషయాన్ని రామోజీ గుర్తుంచుకోవాలి! దీన్ని విస్మరిస్తూ ‘వాహన మిత్రకు మిగిలింది వాతే’ అంటూ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. నాలుగేళ్లలో 2.74 లక్షల మందికి రూ.1,041.03 కోట్లు సొంతంగా ఆటోలు, ట్యాక్సీలను కొనుగోలు చేసి జీవనోపాధి కోసం నడుపుకొనే వారికి చేయూతనిచ్చేందుకు వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వాహనానికి బీమా, ఫిట్నెస్, మరమ్మతుల కోసం ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తామన్న హామీని సీఎం జగన్ అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో నాలుగు విడతలుగా 2,74,015 మందికి రూ.1,041.03 కోట్ల సాయాన్ని అందచేశారు. అత్యంత పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తూ సామాజిక తనిఖీల కోసం సచివాలయాల్లో జాబితాలను ప్రకటిస్తున్నారు. కారణాలు ఏవైనప్పటికీ అర్హులు ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా ఏటా రెండు దఫాలు పరిశీలన అనంతరం పథకాన్ని వర్తింప చేస్తున్నారు. పెట్రోల్పై బాదుడు పాపం బాబుదే అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తారన్నది తెలిసిందే. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ ఈనాడు పత్రిక రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నించింది. పెరిగిన ఇంధన ధరలతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారంటూ కాకి లెక్కలు ప్రచురించింది. వాస్తవానికి పెట్రోల్, డీజిల్పై అదనపు భారాన్ని వేసింది చంద్రబాబు ప్రభుత్వమే అన్నది రామోజీ ఉద్దేశపూర్వకంగానే మరిచిపోయినట్లుంది. 2015 ఫిబ్రవరి 5కు ముందు రాష్ట్రంలో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ ఉండగా ఆ పన్నులను టీడీపీ ప్రభుత్వం అమాంతం మార్చేసింది. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.4 చొప్పున ధరలను పెంచింది. ఆ వాస్తవాన్ని చెప్పకుండా ఈనాడు బురద చల్లుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కోవిడ్ మహమ్మారితో రెండేళ్లు ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక టీడీపీ హయాంలో రోడ్ల మరమ్మతులను గాలికి వదిలేయడంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వీటి పునరుద్ధరణ కోసం లీటరుకు ఒక్క రూపాయి మాత్రమే రోడ్ సెస్ విధించాల్సి వచ్చింది. టీడీపీ హయాంలో భగ్గుమన్న ఇంధన ధరలతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లపై పడిన ఆర్థిక భారం లెక్కలను ప్రచురించే సాహసాన్ని రామోజీ చేయగలరా?. -
సౌర పడవలతో చేపలవేట
సాక్షి, హైదరాబాద్: చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయత్నాలను ఆరంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తెప్పలతో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులకు సౌరశక్తితో నడిచే పడవలు అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు వందకుపైగా జలాశయాల్లో.. దాదాపు లక్ష మందికి పైగా మత్య్సకారులకు తెప్పలతో చేపల వేట జీవనాధారంగా ఉంది. లోతైన నీటిలో తెప్పలపై అనేక మంది మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు మృతి చెందుతున్నారు. తెప్పపై నుంచి వల వేయడం, తెడ్డు సాయంతో పడవ ముందుకు నడపడంలో అనేక ఇబ్బందులొస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిన్నింటిని గుర్తించి మత్స్యకారుల మేలు కోసం ఇకపై సౌరశక్తి పడవలు సమకూర్చాలని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య నిర్ణయించింది. మరబోట్లతో అధిక వ్యయం: చేపల వేటకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మరబోట్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ చెప్పారు. ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను పరిశీలించినట్టు తెలిపారు. కేరళలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీతో తెలంగాణకు సౌరశక్తి పడవులను తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్లోని ‘బిట్స్ పిలాని’సంస్థ నిపుణులతో శనివారం చర్చలు జరిపామని పేర్కొన్నారు. సహకారం అందించేందుకు బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోరపాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారని రవీందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జలాశయాలన్నింటిలోనూ సౌరశక్తితో నడిచే పడవులను ప్రవేశపెడతామని రవీందర్ వెల్లడించారు. -
తాతకు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు
-
పెట్రోల్కు పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా డీజిల్ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు. ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది. 2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్పీజీ అమ్మకాలు పెరిగాయి. -
పెట్రోల్కు బదులు నీళ్లు.. కొంత దూరం వెళ్లగానే..
మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్కు బదులు నీళ్లు రావడంతో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... వాహనదారులు శనివారం హెచ్పీ పెట్రోల్ బంక్లో తమ వాహనాల్లో పెట్రోల్ పోసుకొని కొంత దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోయాయి. దీంతో మెకానిక్లను సంప్రదించగా ఇంజన్లోకి పెట్రోల్కు బదులుగా నీళ్లు చేరాయని తెలిపారు. వాహనంలోని పెట్రోల్ను తీసి పరిశీలించగా నీరు ఉండడంతో కల్తీ జరిగినట్లు గుర్తించారు. పెట్రోల్ను బాటిల్లో తీసుకుని వాహనదారులు వందల సంఖ్యలో బంక్కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో బ్లూ కోర్ట్ సిబ్బంది జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమనిగించారు. పెట్రోల్ బంక్ సిబ్బంది మా తప్పిదం ఏమి లేదని ట్యాంకర్ వచ్చి బంక్ల్లో పెట్రోల్ పోసి వెళ్లిపోయిందని తెలుపడం గమనార్హం. మరి పెట్రోల్ కల్తీ ఎక్కడ జరిగిందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. జరిగిన పొరపాటుకు వాహనదారుల బండి నంబర్లు ఫోన్ నంబర్ రాసుకుని మళ్లీ ఎంత పెట్రోల్ పోయించుకున్నారో అంత పోసేందుకు ఒప్పందం చేసుకోవడంతో ఆందోళన సద్దుమనిగింది. -
పెట్రోల్, డీజిల్కు తగ్గిన డిమాండ్
న్యూఢిల్లీ: భారీ వర్షాల అంచనాలతో ప్రయాణ ప్రణాళికలు, వ్యవసాయ రంగంలో ఇంధన వినియోగ ధోరణులు మారిపోవడంతో జూలై ప్రథమార్ధంలో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ పడిపోయింది. పరిశ్రమ ప్రాథమిక డేటా ప్రకారం .. గతేడాది జూలై 1–15 తేదీల మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో డీజిల్కు డిమాండ్ 15 శాతం క్షీణించి 2.96 మిలియన్ టన్నులకు పరిమితమైంది. నెలవారీగా దాదాపు 20 శాతం క్షీణించింది. పెట్రోల్ అమ్మకాలు 10.5 శాతం తగ్గి 1.25 మిలియన్ టన్నులకు దిగి వచ్చాయి. నెలవారీగా 10.8 శాతం తగ్గాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ సంస్థలు గణనీయంగా కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో దాదాపు ఏడాది కాలంగా ఇంధనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇదీ చదవండి ➤ IT Dept Clarification On PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ మార్చి ద్వితీయర్ధం నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలు మరింతగా పుంజుకున్నాయి. అయితే, రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, ఇతరత్రా వ్యవసాయ అవసరాలకు జనరేటర్ల వినియోగం తగ్గడం తదితర అంశాలు ఇంధనాల డిమాండ్ తగ్గుదలకు కారణమయ్యాయి. -
ఆయిల్ కంపెనీలకు ఇక మీదట లాభాలే.. మరి డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గేనా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జిస్తాయని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. గతేడాది ఇవి భారీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చము రు ధరలు బ్యారెల్కు 78.8 డాలర్లకు క్షీణించడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నష్టాలను.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోగలవని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ ధరలను ఒకే స్థాయిలో కొసాగిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సవరించకపోవడంతో అవి నష్టాల పాలయ్యాయి. చమురు ధరలు గణనీయంగా తగ్గిన తర్వాత నుంచి తిరిగి అవి లాభాలను చూస్తున్నాయి. 5 శాతం పెరగొచ్చు గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం డిమాండ్ 10 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం మేర పెరగొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు మధ్య కాలానికి సైతం దేశంలో పెట్రోల్ డిమాండ్ 5–6 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. భారత్ జీడీపీ వచ్చే కొన్నేళ్లపాటు 6–7 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలను పెంచుతూ ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం పెట్రోల్ వినియోగానికి సానుకూలంగా పేర్కొంది. ‘‘స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 2023–24లో మోస్తరు స్థాయికి దిగొస్తాయి. అయినప్పటికీ స్థూల మార్జిన్లు సగటు స్థాయిలకు ఎగువనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. మోస్తరు స్థాయిలో ధరలు చమురు ధరలు 2022–23 గరిష్టాల నుంచి చూసుకుంటే మోస్తరు స్థాయిలో, ఎగువవైపే కొనసాగొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు మంచి నగదు ప్రవాహాలు సమకూరతాయని పేర్కొంది. భారత నూతన గ్యాస్ ధరల విధానం వల్ల ఈ సంస్థలకు నగదు ప్రవాహాల్లో ఉన్న అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థలకు అధిక మూలధన నిధులు అవసరం కొనసాగుతుందని అంచనా వేసింది. దేశ చమురు ఉత్పత్తి 2022–23లో 1.7 శాతం తగ్గినట్టు వివరించింది. ఓఎన్జీసీ ఉత్పత్తి 1 శాతం తగ్గగా, ఆయిల్ ఇండియా ఉత్పత్తి 5 శాతం పెరిగినట్టు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉండడం, దేశీయంగా ఉత్పత్తి స్థిరంగా ఉండడంతో 2023–24లోనూ చమురు దిగుమతులు అధికంగానే ఉంటాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. -
రెండు ఇంధనాలతో మహీంద్రా వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహన విభాగంలోకి ప్రవేశించింది. సుప్రో సీఎన్జీ డువో పేరుతో మోడల్ను విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్షోరూంలో రూ.6.32 లక్షలు. ఈ తేలికపాటి వాణిజ్య వాహనం సీఎన్జీ, పెట్రోల్తో నడుస్తుంది. 750 కిలోల బరువు మోయగలదు. 75 లీటర్ల సీఎన్జీ ట్యాంక్, 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో 325 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మైలేజీ కిలోకు 23.35 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ‘సీఎన్జీ వాహనాల డిమాండ్ నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. సీఎన్జీ అవసరాన్ని ఇది సూచిస్తుంది. దేశవ్యాప్తంగా 2 టన్నులలోపు సామర్థ్యం గల తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు నెలకు 16,000 యూనిట్లు. ఇందులో సీఎన్జీ వాటా సుమారు 5,000 యూనిట్లు’ అని మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ బానేశ్వర్ బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. సుప్రో సీఎన్జీ డువో రాకతో నెలవారీ అమ్మకాలు రెండింతలు అవుతాయని సంస్థ భావిస్తోంది. 1.5తోపాటు 2 టన్నుల విభాగంలోనూ రెండు రకాల ఇంధనాలతో నడిచే మోడళ్లను తేనున్నట్టు వెల్లడించింది. -
పెట్రోల్, డీజిల్పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) బంకుల కన్నా చౌకగా ప్రైవేట్ కంపెనీలు ఇంధనాలను విక్రయిస్తున్నాయి. జియో–బీపీ తర్వాత తాజాగా నయారా ఎనర్జీ ఈ జాబితాలోకి చేరింది. పీఎస్యూ బంకులతో పోలిస్తే రూ. 1 తక్కువకే తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్ను విక్రయిస్తున్నట్లు వివరించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లో డిస్కౌంటు రేట్లకు విక్రయాలను జూన్ ఆఖరు వరకు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా మొత్తం 86,925 పైచిలుకు పెట్రోల్ బంకులు ఉండగా.. నయారా ఎనర్జీకి 6,376 బంకులు (7 శాతం పైగా వాటా) ఉంది. జియో–బీపీ (రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ) తమ బంకుల్లో ప్రస్తుతం డీజిల్ను మాత్రమే పీఎస్యూ బంకుల కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినప్పటికీ పీఎస్యూలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం రేట్లను సవరించకుండా యథాప్రకారం కొనసాగిస్తున్నాయి. అయితే, జియో–బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు మాత్రం ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకే డిస్కౌంటుకు విక్రయిస్తున్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?..
పెట్రోల్, డీజిల్ వినియోగానికి సంబంధించి వినియోగదారులలో చాలా అపోహలు తలెత్తుతుంటాయి. కారు మైలేజీ పెంచుకునే ఉపాయాలు మొదలుకొని పెట్రోల్ ధర వరకూ చాలామందిలో నిత్యం చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో కొందరు వాహనంలో పెట్రోల్ పోయించేందుకు ప్రత్యేక సమయం ఉందని చెబుతూ, ఆ సమయంలోనే ఇంధనం పోయించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పెట్రోల్ పోయించేందుకు ఉదయం తగిన సమయం అని చాలామంది చెబుతుంటారు. కొందరు దీనిని ఖండిస్తూ, రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించడం ఉత్తమం అని అంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో పెట్రోల్ పోయించేందుకు తగిన సమయం ఏదనే ప్రశ్న మనలో తలెత్తుతుంటుంది. నిజానికి ఇటువంటి వాదనలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతుంటాయి. పైగా ఈ అంశానికి సంబంధించి ఇంటర్నెట్లో పలు ఆర్టికల్స్ కూడా కనిపిస్తుంటాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! వీటిలో రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించకూడదని, తెల్లవారుజామునే పెట్రోల్ పోయిస్తే డబ్బులు ఆదా అవుతాయని, వాహనంలో అధికంగా పెట్రోల్ పడుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో నిజం ఏమేరకు ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వేడి కారణంగా ఇంధనం విస్తరిస్తుంది. అందుకే ఉదయం తెల్లవారుతున్న సమయంలో వాహనంలో పెట్రోల్ పోయిస్తే, అధికంగా నిండుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో వాస్తవం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ప్రపంచంలోని అత్యధిక ఇంధన స్టేషన్లలో భూమిలోపల ట్యాంకులలో పెట్రోల్ లేదా డీజిల్ రిజర్వ్ చేస్తుంటారు. ఫలితంగా ఇంధన ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. పైగా ట్యాంకులకు అత్యధిక దళసరితో కూడిన మూతలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే వాహనంలో ఏ సమయంలో పెట్రోల్ పోయించినా దానిపై ఉష్ణోగ్రత ప్రభావం పడదు. ఇందన సంకోచ, వ్యాకోచాలలో తేడా ఏర్పడదు. అందుకే ఉదయం వేళలో వాహనంలో పెట్రోల్ పోయించినప్పటికీ ఎటువంటి తేడా రాదు. తెల్లవారుజామున పెట్రోల్ పోయించడం వలన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
రూ.2 వేల నోటు ఎఫెక్ట్.. స్కూటీ నుంచి పెట్రోల్ తిరిగి తీసుకున్నాడు!
లక్నో: దేశ ప్రజలకి షాక్కిస్తూ రూ. 2 వేల నోటు రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 30వ వరకు ఈ నోట్లు చలామణిలో ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయలు నోట్ల మార్పిడికి తెగ ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో మార్చుకోవాలంటే క్యూలైన్, కేవైసీ అంటూ గంటల సమయం పడుతున్న తరుణంలో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు బంగారం కొనుగోలు, షాపులో వస్తువుల కొనుగోలు ద్వారా 2 వేల నోటు మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ప్రజల నుంచి రూ. 2 వేల నోటును స్వీకరించేందుకు ససేమిరా అంటున్నారు. ఇంకొందరైతే రెండు వేల రూపాయల నోటును తిరిగి ఇచ్చేసి తమ వస్తువులను మళ్లీ వెనక్కి కూడా తీసుకుంటున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వాహనదారుడు పెట్రోల్ బంక్కు వెళ్లి తన స్కూటీలో పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం బంకులోని సిబ్బందికి తన వద్ద ఉన్న రూ. 2 వేల నోటు ఇచ్చాడు. ఆ సిబ్బంది రెండు వేల రూపాయల నోటు వద్దని వేరే నోటు ఇవ్వాలంటూ కోరాడు. వాహనదారుడు తన వద్ద ఈ నోటు మాత్రమే ఉందని చెప్పాడు. దీంతో ఆ సిబ్బంది స్కూటీలో నింపిన పెట్రోల్ను పైపు సహాయంతో బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాదు పలు రాష్ట్రాల్లో కొందరు వ్యాపారులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. మరికొందరు బహిరంగంగానే రూ. 2 వేల నోటును స్వీకరించబోమని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. A petrol pump of Maharaja Chowk, Durg chattisgarh is denying acceptance of Rs 2000 Notes. Have 2000 notes lost their legal tender status? @RBI @FinMinIndia @nsitharaman pic.twitter.com/57FdunTURo — Tejas 🇮🇳 (@railmintejas) May 20, 2023 @DirMktg_iocl @DirMktg_iocl @IOCRetail @FinMinIndia @RBI @nsitharaman @PMOIndia This sign at an Indian Oil Petrol Pump says all about how and panic can be created with wrong understanding of simple withdrawal process for ₹2000 currency. Pl take care and inform your pumps. pic.twitter.com/Fe6DPWMVVr — nipunsheth (@nipunsheth2) May 21, 2023 చదవండి: కామన్వెల్త్, కర్రీ, క్రికెట్.. మన రెండు దేశాలను కలుపుతున్నాయి: మోదీ -
క్యాన్లో పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా ఒక్కసారిగా మంటలు
-
వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ చేసిన పని షాక్కు గురిచేస్తోంది. ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్ వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ఆమె.. అందులోనుంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబుడిదైపోయింది. మంటలు రాగానే సదరు మహిళ అక్కడి నుంచి పరారైంది. కాసేపటికే మరో బైక్లో నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు ప్రయత్నించింది. అయితే స్థానికులు గమనించి ఆమెను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి వాళ్లు వచ్చాక అప్పగించారు. #WATCH | A woman was found taking out petrol from a bike and setting it on fire in Jaitpur police station area of Delhi's South East District last night. She was later trying to put another bike on fire during which locals caught her and handed her over to police: Delhi Police… pic.twitter.com/EXqSZ1f8nQ — ANI (@ANI) May 12, 2023 అయితే ఈ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత లేదు. వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. మహిళ బైక్కు నిప్పంటించిన దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. అర్ధరాత్రి సమయంలో ఈమె ఇలా ఎందుకు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అత్తింటి వేధింపులకు యువ డాక్టర్ బలి.. కారు ఇస్తామన్నా.. -
బిల్లులు ఇవ్వకుంటే పెట్రోల్ పోసుకుంటాం.. సర్పంచులు
-
ఆటో ఎల్పీజీ కథ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ మార్కెట్ క్రమంగా పర్యావరణ అనుకూల పరిష్కారాల వైపు అడుగులు వేస్తోంది. ఎక్కువ మంది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ కార్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో.. ఆటోమొబైల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తర్వాత సీఎన్జీ వాహనాలకే ఎక్కువ డిమాండ్ నెలకొంది. దీంతో ఎల్పీజీ కార్ల విక్రయాలు ఐదేళ్ల కాలంలో (2018–19 నుంచి చూస్తే) 82 శాతం తగ్గిపోయాయి. 2022–23లో కేవలం 23,618 ఎల్పీజీ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ, 2018–19లో 1,28,144 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. కేంద్ర రవాణా శాఖ పరిధిలోని వాహన్ పోర్టల్ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద 2,22,24,702 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోతే, ఇందులో ఎల్పీజీ వాహనాలు కేవలం 0.11 శాతంగా ఉండడం వినియోగదారులు వీటి పట్ల ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అదే సమయంలో సీఎన్జీ వాహన విక్రయాలు ఇందులో 3 శాతంగా ఉంటే, ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతంగా ఉండడం, కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్టు తెలియజేస్తోంది. ఎగసి పడిన డిమాండ్ ఎల్పీజీ పుష్కలంగా అందుబాటులో ఉండడమే కాదు, ఎక్కువ ఆక్టేన్ కలిగి, చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఇంధనం కావడంతో.. ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రత్యామ్నాయ ఇంధనంగా లోగడ భావించారు. దీంతో ఎల్పీజీ కార్లు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు 2019లో ఎక్కువగా అమ్ముడుపోయాయి. కానీ, దేశంలో ఎల్పీజీ వాహనాల వినియోగం చట్టబద్ధంగా అమల్లోకి వచ్చిం ది మాత్రం 2020 ఏప్రిల్ నుంచి కావడం గమనార్హం. నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలకుతోడు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు (80 శాతానికి పైగా) 2019లో రికార్డు స్థాయి ఎల్పీజీ వాహన అమ్మకాలకు దోహదపడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కానీ, 2022–23 సంవత్సరంలో ఎల్పీజీ వాహనాల డిమాండ్ 14 శాతానికి పరిమితమైంది. 2018–19లో ఇది 18 శాతంగా ఉంది. 2022–23లో కేవలం 3,495 ఎల్పీజీ నాలుగు చక్రాల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2018–19లో ఇలా రిజిస్టర్ అయిన నాలుగు చక్రాల వాహనాలు 23,965 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ‘‘విక్రయానంతరం ప్యాసింజర్ వాహనాలకు ఉన్న డిమాండ్ ఇది. 2018 నుంచి 2020 వరకు ప్యాసింజర్ వాహన విభాగమే ఎల్పీజీకి పెద్ద మద్దతుగా నిలిచింది. నిబంధనలు అనుకూలంగా లేకపోవడం, కిట్ ఆధారిత అనుమతులకు అధిక వ్యయాలు చేయాల్సి రావడం, ప్రతి మూడేళ్లకోసారి తిరిగి సరి్టఫై చేయించుకోవాల్సి రావడం, ఎల్పీజీ మోడళ్లు పెద్దగా అందుబాటులో లేకపోవడం వినియోగదారుల్లో ఆసక్తి ఆవిరైపోవడానికి కారణం’’అని ఇండియన్ ఆటో ఎల్పీజీ కొయిలిషన్ డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా వివరించారు. వసతులు కూడా తక్కువే.. 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కేవలం 1,177 ఎల్పీజీ స్టేషన్లే ఉన్నాయి. అదే సీఎన్జీ స్టేషన్లు అయితే 4,600 ఉంటే, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు 5,200 ఉన్నాయి. పెట్రోల్ పంపులు 80,000 పైగా ఉన్నాయి. అంటే ఎల్పీజీ విషయంలో సరైన రీఫిల్లింగ్ వసతులు కూడా లేవని తెలుస్తోంది. మరోవైపు ధరలు కూడా అనుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో కిలో ఎల్పీజీ ధర లీటర్కు రూ.68కి చేరుకోగా, 2019లో రూ.40 మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాల్లో దీని ధర ఇంకా ఎక్కువే. ‘‘ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం కొరవడడంతో వాహన తయారీదారులు ఎల్పీజీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేడు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా అయితే ఎల్పీజీ కార్ల తయారీని నిలిపివేసింది. ప్రజలు సీఎన్జీ, ఈవీల పట్ల ఆసక్తి చూపిస్తుండడం దేశంలో ఎల్పీజీ వాహన రంగానికి గొడ్డలి పెట్టుగా మారింది’’అని పరిశ్రమకు చెందిన నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఈవీ, సీఎన్జీ వాహనాలను కేంద్రం సబ్సిడీలతో ప్రోత్సాహిస్తుండడాన్ని పరిశ్రమ ప్రస్తావిస్తోంది. -
ఎండలో బండి నడుపుతున్నారా? జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్టే
రాత్రికి వంద రూపాయల పెట్రోల్ వేయించా... మాములుగా అయితే బండి రోజులు నడుస్తుంది. అలాంటిది ఒక్క రోజుకే పెట్రోల్ నిల్ అని చూపుతోందని సురేష్ ఆందోళన చెందాడు. ఈ సమస్య సురేష్ ఒక్కడిదే కాదు... జిల్లా వ్యాప్తంగా వాహనాలు వినియోగిస్తున్న అందరి అనుభవం. వేయించున్నా పెట్రోల్ ఏంమైంది? పెట్రోల్ బంకులోనే తక్కువగా వేస్తున్నారా? లేదా ఎవరైనా దొంగలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవేవి కాదని నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండల వేడికి వాహనాల్లోని పెట్రోల్ ఆవిరవుతుండడమే కారణంగా విశ్లేషిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి హిందూపురం: అసలే వేసవికాలం... గతంలో ఎన్నడూ లేనంతగా సూరీడు భగభగ మంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి తరుణంలో వాహనాలను ఎక్కడబడితే అక్కడ ఎండలో ఉంచేస్తే పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం. వాహనదారులు వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కొత్త సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నెలాఖరు నుంచి మే మాసం లోపు 43.1 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్క్కు చేరుకోవడంతో ఎండ వేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరైతే ద్విచక్ర వాహనాలు లేదా, కార్లలో అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలను ఎండలో ఎక్కడబడితే అక్కడే ఆపేస్తున్నారు. దీంతో ఎండ వేడిమికి ఆయా వాహనాల్లోని ఇంధనం ఆవిరైపోతోంది. ఇది ఒక్కోసారి అగ్నిప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్కింగ్ జోన్లు లేక అవస్థలు.. జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కదిరి మున్సిపాల్టీలతో పాటు పంచాయతీ కేంద్రాల్లో పార్కింగ్ జోన్లు లేక వాహదారులు అవస్థలు పడుతున్నారు. కాయగూరలకు ఇతర అవసరాలకు వాహనాల్లో వెళ్లినప్పుడు ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధనం ఆవిరై పోతుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల 2,77,235 వాహనాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోని 139 పెట్రోలు బంకుల్లో గతంలో రోజు వారీ 139 వేల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయాలు సాగేవి. వేసవి ఆరంభం నుంచి ఇది పెరుగుతూ వస్తోంది. తాజాగా 210 వేల లీటర్ల మార్క్ను చేరుకుంది.వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎండ వేడిమికి పెట్రోల్ ట్యాంకుల్లో గ్యాస్ ఏర్పడి పేలిపోయే ప్రమాదముంది. రాత్రి పూట బైక్ను నిలిపి ఉంచినప్డుపు ఓ సారి ట్యాంక్ మూత తీసి మళ్లీ మూసి వేయాలి. మందపాటి సీటు కవర్లు వాడడం మంచిది. పెట్రోల్ ట్యాంకులను సైతం కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయడం ఉత్తమం. – షాజహాన్, మెకానిక్, హిందూపురం -
రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ.. ఎక్కడంటే?
దేశ రాజధానిలో ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 నాటికి ఢిల్లీలో ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ కంపెనీలు తప్పని సరిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ను వినియోగించాలని తెలిపింది. పెట్రోల్,డీజిల్ వాహనాల వినియోగాన్ని నిలిపివేస్తున్నామని.. ఇందుకోసం ప్రత్యేకంగా వెహికల్ పాలసీని అమలు చేస్తున్నట్లు సూచించింది. ఈ సందర్భంగా ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ కైలాష్ గెహ్లట్ మాట్లాడుతూ..ఢిల్లీలో క్యాబ్, ఈకామర్స్ కంపెనీలు ఏప్రిల్ 1,2030 నాటికల్లా ఎలక్ట్రిక్ వాహనాల్ని వినియోగించాలి. ఇందకోసం వెహికల్స్ పాలసీ అమలు చేస్తున్నాం. ఈ పాలసినీ ట్రాన్స్పోర్ట్, లెఫ్టినెంట్ గవర్నర్లు ఆమోదించాల్సి ఉంది. అనంతరం కొత్త వెహికల్ రూల్ను అమలు చేస్తామని అన్నారు. కొత్త పాలసీలో అగ్రిగేటర్లు ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్స్లను మాత్రమే నడిపేందుకు అనుమతిస్తారు. తద్వారా రవాణాన్ని రంగాన్ని మరింత ఊతం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. అందుబాటు ధరల్లో నగరం అంతటా ప్రభుత్వం మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఈ విధానం అమలు కోసం దశలవారీ ప్రణాళికను రూపొందించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఉదాహరణకు, నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోపు అగ్రిగేటర్లు 5 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి. తొమ్మిది నెలల్లో 15 శాతానికి, ఒక సంవత్సరం ముగిసే నాటికి 25 శాతానికి, రెండేళ్లు ముగిసే నాటికి 50 శాతానికి, మూడేళ్లు ముగిసే నాటికి 75 శాతానికి, నాలుగు చివరి నాటికి 100 శాతానికి పెంచనున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, ఏప్రిల్ 1, 2030 నాటికి ఢిల్లీలోని మొత్తం వాణిజ్య వాహనాలు ఈవీలుగా మారనున్నాయి. -
ఇథనాల్ కలిపిన పెట్రోలుతో ఎవరికి ప్రయోజనం?
దేశీయ ఇంధన అవసరాలు తీర్చడానికీ, ఇంధన దిగుమతి భారం తగ్గించడానికీ, వాయు, కర్బన కాలుష్యాలను తగ్గించడానికీ ఇథనాల్ కలిపిన పెట్రోలు పరిష్కారమని భారత ప్రభుత్వం ఎన్నో వెసులు బాట్లు కల్పించి ప్రోత్సహిస్తున్నది. ఆహార ధాన్యాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సత్వర పర్యావరణ అనుమతులూ, సబ్సిడీలూ, వడ్డీ రాయితీతో రుణాలూ మంజూరు చేసి 2025 నాటికి 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నది. ఇథనాల్ను పెట్రోలుకు కలపడం కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండీ వాడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఇతర ఐరోపా దేశాలూ; కెనడా, చైనా కూడా మిశ్రమ ఇంధనాన్ని ప్రస్తుతం వాడుతున్నాయి. శాస్త్రీయ అధ్యయనాలు ఇథనాల్ను ఇంధనంగా వాడడం లోని నష్టాలను వెలుగులోకి తెచ్చాయి. 2023 మార్చి13న ఐపీసీసీ విడుదల చేసిన నివేదిక, తాపం పెరుగుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించకుండా నిరోధించడానికి శిలాజ ఇంధనాలకు సత్వర ముగింపు పలకాలని స్పష్టం చేసింది. కొత్తగా నిర్మిస్తున్న ఇథనాల్ ప్లాంట్లు కనీసం 30 ఏళ్లు పని చేస్తాయి. మరి 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలెలా సాధ్యమవుతాయి? అమెరికా ప్రభుత్వ శక్తి (ఎనర్జీ) విభాగం ‘ఇ20... పెట్రోల్ కంటే 7.7 శాతం తక్కువ ఇంధన శక్తి కలిగి ఉంటుందని’ నిర్ధారించింది. ఒక లీటరు పెట్రోల్... 1.073 లీటర్ల మిశ్రమ ఇంధనానికి సమానం. పరిశీలనల్లో పెట్రోలునూ, మిశ్రమ ఇంధనాన్నీ వాడినప్పుడు దాదాపు కర్బన ఉద్గారాలు అదేస్థాయిలో ఉంటాయని తేలింది. ప్రతి ఇథనాల్ ప్లాంట్కీ ఒక బొగ్గుతోకానీ, బయోమాస్తో కానీ నడిచే పవర్ ప్లాంట్కు అనుమతిస్తున్నారు. వాటి ఉద్గారాలు అదనం. ఇంకా ప్రతి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 0.76 కిలోల కార్బన్– డై–ఆక్సైడ్ విడుదలవుతుంది. దానిని పూర్తిగా పట్టి గాలిలో చేరకుండా ఆపే వ్యవస్థ లేదు. అంటే మొత్తం ఉత్పత్తయిన కార్బన్– డై–ఆక్సైడ్ చివరికి గాలిలోకి చేరుతుంది. భూతాపానికి దోహద పడుతుంది. అంటే లక్ష్యం తిరగబడుతుందన్న మాట. చమురు దిగుమతుల ఆర్థిక భారం తగ్గించడానికి ఇథనాల్ ఇంధనం పరిష్కారంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇ10 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. అయినా పెరుగుతున్న డిమాండ్ వల్ల చమురు దిగుమతి భారం తగ్గ లేదన్నది స్పష్టం. విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెరిగింది కాని తగ్గ లేదు. ఇంకా తగిన ఇథనాల్ ఉత్పత్తి లేక ఇథనాల్ దిగుమతి కూడా పెరిగింది. దేశీయ చమురు ఉత్పత్తులు గణనీ యంగా క్షీణిస్తున్నందునా, చమురు వినియోగం పెరుతున్నందునా, ఇథనాల్ కలపడం చమురుపై ఆధారపడడం నుండి విముక్తం చేయదు. కర్బన ఉద్గారాలు పారిస్ ఒప్పందానికి అనుగుణంగా తగ్గవు. చెరకు, బియ్యం, మొక్క జొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి నీటి వనరులపై భారం పెంచుతుంది. ఇథనాల్ ప్లాంట్ల ప్రతిపాదనలు లీటర్ ఇథనాల్కు 8 నుండి 10 లీటర్ల నీరు కావాలంటున్నాయి. చెరకు నుండి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి దాదాపు మూడు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఆహార పంటలను ఇంధన ఉత్పత్తికి తరలించడం వల్ల అదనపు భూమిని సాగులోకి తేవలసి వస్తుంది. దానివల్ల భూవిని యోగం మార్పు వస్తోంది. అందువల్ల ఉద్గారాలు పెరుగుతాయి. భూతాపం వల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గడంతో ఆహార కొరత సమస్య ఉత్పన్నమవుతుంది. రైతులకు ఇథనాల్ ఉత్పత్తితో ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వమే సబ్సిడీ ధరకు కంపెనీలకు బియ్యం సరఫరా చేస్తుంది. కిలో బియ్యం రూ. 20కు ఇస్తున్నది. అంటే కిలోకు రూ.17 సబ్సిడీ ఇస్తున్నది. ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 2.22 కిలోల బియ్యం సబ్సిడీ ధరకు ఇస్తున్నారు. లీటరు ఇథనాల్ ఉత్పత్తికి బియ్యంపై రాయితీ రూ. 37.74. ఎఫ్సీఐ సరఫరా ధర రూ. 37 కు బియ్యం కొంటే లీటరు ఇథనాల్కు కావలసిన బియ్యం ధర రూ. 83.78. ప్రభుత్వం నిర్ణయించిన ఇథనాల్ ధర లీటరుకు 56.87. లీటరు పెట్రోలుకు ఇంధన శక్తిలో సమాన మైన 1.51 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి వాడే బియ్యం ఖరీదు రూ.126.5. ఆ పైన ఉత్పత్తి ఖర్చులు ఎటూ ఉంటాయి. అంటే మిశ్రమ ఇంధనం పెట్రోలు కంటే ప్రియమన్న మాట. ప్రస్తుతం రోడ్డుపైనున్న వాహనాలేవీ ఇ20 ఇంధనాన్ని వాడ డానికి పనికిరావు. కొత్తగా వచ్చే వాహనాలను అందుకు అను వుగా రూపొందించినా ఇ20 అవసరం తక్కువే ఉంటుంది. అనువుగా మార్చని వాహనాలలో ఇ20 వాడితే ఇంజన్కు జరిగే నష్టం గణనీయం. ఇథనాల్ ఇంధనంతో జాతికీ, వాతావరణానికీ ప్రయోజనమేమిటో చర్చ జరగాలి. – డా‘‘ కలపాల బాబూరావు, విశ్రాంత శాస్త్రవేత్త -
పెట్రోల్ కార్లదే హవా
సాక్షి, అమరావతి: దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఐదేళ్లలో కార్ల మార్కెట్పై దీని ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దేశంలో కార్ల మార్కెట్ను పెట్రోల్ వెర్షన్ కార్లు శాసిస్తున్నాయనే చెప్పొచ్చు. మార్కెట్లో 70 శాతం అమ్మకాలతో పెట్రోల్ వెర్షన్ కార్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. డీజిల్ కార్లపై వినియోగదారుల ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. దీంతో వీటి అమ్మకాలు 18.50 శాతానికే పరిమితమయ్యాయి. విద్యుత్ కార్ల అమ్మకాలు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్యూవీ మోడల్ వాహనాల వాటా 42 శాతంగా ఉంది. 2018–19 నుంచి 2022–23లో దేశంలో కార్ల అమ్మకాల నివేదికను ప్రముఖ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ ‘జేటో డైనమిక్స్’ వెల్లడించింది. నివేదిక ఏం చెబుతోందంటే.. ఐదేళ్లలో దేశంలో పెట్రోల్ కార్ల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 2018–19లో దేశీయ కార్ల మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ కార్ల అమ్మకాలు 60 శాతంగా ఉండేవి. ఇవి 2022–23లో 70 శాతం మార్కెట్ను సాధించాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాలు కూడా పెట్రోల్ వాహనాల అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయి. డీజిల్ వాహనాలను 10 ఏళ్లకు తుక్కుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. అదే పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్ల వరకూ అవకాశం కల్పించింది. దాంతో డీజిల్ వాహనాల కంటే పెట్రోల్ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండేది. కానీ డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రెండింటి ధరల మధ్య ప్రస్తుతం పెద్ద వ్యత్యాసం లేదు. కొత్త మోడల్స్ లాంచింగ్లోనూ.. కార్ల కొనుగోలుదారుల ఆసక్తి కొత్త మోడళ్ల లాంచింగ్ను ప్రభావితం చేస్తోంది. కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్తగా పెట్రోల్, విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ మార్కెట్లోకి 28 కొత్త మోడల్ కార్లను ప్రవేశపెట్టారు. వాటిలో పెట్రోల్ వెర్షన్ కార్లు 13 ఉండగా.. విద్యుత్ కార్లు 8 ఉన్నాయి. డీజిల్ వెర్షన్ కార్లు ఆరు, సీఎన్జీ వెర్షన్ కారు ఒక మోడల్ భారత్ మార్కెట్లోకి ప్రవేశించాయి. సగానికి తగ్గిన డీజిల్ కార్ల అమ్మకాలు ఐదేళ్లలో దేశంలో డీజిల్ కార్ల అమ్మకాలు దాదాపు సగానికి తగ్గిపోయాయి. పర్యావరణ నియంత్రణ చర్యలు, డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండటమే దీనికి కారణం. ఎస్యూవీ వాహనాల్లోనే డీజిల్ వెర్షన్కు డిమాండ్ ఉంది. సాధారణ కార్ల అమ్మకాల్లో డీజిల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 2018–19లో దేశంలో డీజిల్ వెర్షన్ కార్ల వాటా 36 శాతం ఉండేది. కాగా 2022–23లో అది 18.50 శాతానికి తగ్గిపోయింది. 2018–19తో పోలిస్తే 2022–23నాటికి దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. -
రిజిస్ట్రేషన్ చేయకుంటే పెట్రోల్ పోస్తాం.. తహసీల్దార్కు బెందిరింపులు..
సాక్షి, వరంగల్: ‘భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్పోసి చంపుతాం’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిల్నాయక్తండాకు గుగులోత్ పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని స్లాట్ బుక్ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్ నుంచి నోడ్యూస్ సర్ఠిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్నాయక్తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్ బుక్ చేసుకున్నాం..రిజిస్ట్రేషన్ చేయండి.. నోడ్యూస్ ఎందుకు తీసుకురావాలి’అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, వారి ముందే రిజిస్ట్రేషన్ చేయకపోతే నీపై పెట్రోల్ పోసి చంపేస్తామని తహసీల్దార్ను నానా దుర్భాషలాడారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. చదవండి: రేవంత్కు సిట్ నోటీసులు.. మరోసారి కౌంటర్ -
ఈ20 ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తగు స్థాయిలో ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తిని మరింతగా పెంచడంపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 100 బంకుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఈ20 ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. అంతా సక్రమంగా సాగితే ఈ ఇంధన వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ అదనపు కార్యదర్శి సుబోధ్ కుమార్ తెలిపారు. దీంతో చక్కెర తరహాలోనే 2023–24 ఇథనాల్ సంవత్సరానికి గాను (డిసెంబర్–నవంబర్) ఇథనాల్ నిల్వలను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇథనాల్ ఉత్పత్తి కోసం మరింతగా చక్కెరను మళ్లించే అవకాశం ఉందని వివరించారు. ఫిబ్రవరి ఆఖరు నాటి వరకూ 120 కోట్ల లీటర్ల పెట్రోల్లో ఇథనాల్ను కలిపినట్లు కుమార్ చెప్పారు. ఇథనాల్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యాలు ఈ ఏడాది లక్ష్యాల సాధనకు సరిపడేంత స్థాయిలో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమకు ప్రోత్సాహం.. పెట్రోల్లో ఇథనాల్ను కలిపి వినియోగించడం ద్వారా క్రూడాయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 20 శాతంగా ఉంటే దాన్ని ఈ20 ఇంధనంగా వ్యవహరిస్తారు. 2001ల నుంచి దీనికి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. గతేడాది 10.02 శాతం ఇథనాల్ను కలిపిన పెట్రోల్ను వినియోగంలోకి తెచ్చారు. 2022–23 ఇథనాల్ సంవత్సరంలో (డిసెంబర్–నవంబర్) దీన్ని 12 శాతానికి, వచ్చే ఏడాది 15 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికల్లా దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యం గడువును కుదించుకుని 2025 నాటికే సాధించాలని నిర్దేశించుకుంది. ప్రస్తుత ఏడాదికి గాను 50 లక్షల టన్నుల చక్కెరను ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించనున్నారు. వచ్చే ఏడాది నిర్దేశించుకున్న 15 శాతం మిశ్రమ లక్ష్య సాధన కోసం అదనంగా 150 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. దీనితో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటూ చక్కెర మిల్లులు, డిస్టిలరీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 243 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించగా, బ్యాంకులు రూ. 20,334 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. వచ్చే 9–10 నెలల్లో అదనంగా 250–300 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రాగలదని అంచనా. -
Pakistan crisis: చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ధరలు
పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే, ఇప్పటికే లీటరు పాలు రూ. 210, కేజీ చికెన్ రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉన్నాయి. తాజాగా పెట్రోల్ ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 22.02, రూ. 17.20 పెరిగాయి. ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి అమలులోకి వచ్చాయి. ధరల పెరుగుదల తరువాత పెట్రోల్ ధర రూ. 272, డీజిల్ ధర రూ. 280. వీటితో పాటు కిరోసిన్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో కూడా వీటి ధరలను పెంచింది. భారతదేశం వంటి కొన్ని దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి నిలకడగా ఉన్నాయి. అయినప్పటికీ మన దేశంలో చమురు ధరలు ఎప్పుడో సెంచరీ దాటాయి. పాకిస్థాన్ కరెన్సీలో భారీగా తగ్గుదల, చమురు దిగుమతుల వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల పాకిస్థాన్లో గత కొన్ని రోజులుగా చమురు ధరలు చాపకింద నీరులా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి కొట్టు మిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలు రానున్న రోజుల్లో మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నిత్యావసర ధరలతో పాటు ఇంధన ధరలు కూడా పెరగటం వారికి శాపంగా మారింది. ఇప్పటికీ కొంత మంది ప్రజలు ఆకలి బాధలను భరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంతోమందిని కలచి వేస్తున్నాయి. -
పాక్ ప్రజలకు భారీ పెట్రో వాత
ఇస్లామాబాద్: ఆర్థికసంక్షోభం నుంచి కాస్తయినా తెరిపిన పడేందుకు సిద్ధమైన పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ధరల వాతలు పెడుతోంది. పార్లమెంట్లో పన్నుల వడ్డింపుతో కూడిన మినీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన కొద్ది గంటలకే ప్రజలపై ‘పెట్రో’ బాంబు పడేసింది. పెట్రోల్ లీటర్కు 22 పాక్ రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థికశాఖ విభాగం ఒక ప్రకటన విడుదలచేసింది. బుధవారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం పాక్లో ఒక లీటర్ పెట్రోల్ ధర 272 పాక్ రూపాయలకు ఎగబాకింది. ఇక హైస్పీడ్ డీజిల్(హెచ్ఎస్డీ) ధర లీటర్కు 17.20 పాక్ రూపాయలు పెంచింది. దీంతో హెచ్ఎస్డీ కొత్త ధర రూ.280కి చేరింది. కిరోసిన్పై 12.9 రూపాయలు పెంచింది. పెంపు తర్వాత లీటర్ కిరోసిన్ ధర రూ.202.73కి చేరింది. కొత్తగా ఉద్దీపన ప్యాకేజీ కింద 7 బిలియన్ డాలర్లలో ఒక దఫాగా 1.1 బిలియన్ డాలర్లు విదల్చాలంటే పన్నుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) షరతులు విధించడంతో పాక్ ఈ ధరల మోత మోగించింది. చలికాలంకావడంతో ఇప్పటికే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) స్టేషన్లలో సీఎన్జీ నిల్వలు నిండుకున్నాయి. దీంతో జనం రవాణాకు పెట్రోల్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫిబ్రవరిలో 3 బిలియన్ డాలర్లలోపునకు పడిపోయిన విదేశీ మారకద్రవ్య నిల్వలను కాస్తయినా పెంచుకునేందుకు పాక్ తిప్పలుపడుతోంది. -
వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
-
జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ప్రొవిజన్ ఇప్పటికే ఉందని బుధవారం వివరించారు. పరిశ్రమల సమాఖ్య పీహెచ్డీసీసీఐ సభ్యులతో బడ్జెట్ అనంతర సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం ముడి పెట్రోలియం, పెట్రోల్, హై స్పీడ్ డీజిల్, సహజ వాయువు, విమాన ఇంధనాలను తాత్కాలికంగా జీఎస్టీ నుంచి మినహాయించారు. వాటిని ఎప్పటి నుంచి ఈ పరిధిలోకి తేవాలనేది జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. 2023 ఫిబ్రవరి 18న జీఎస్టీ మండలి 49వ సమావేశం జరగనుంది. ఒకవేళ మొత్తం మండలి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఏ రేటు వర్తింపచేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. రేటును నిర్ధారించి తనకు తెలియజేస్తే పెట్రోలియం ఉత్పత్తులను సత్వరం జీఎస్టీ పరిధిలోకి చేర్చగలమన్నారు. మరోవైపు, వృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్రం గత మూడు–నాలుగేళ్లుగా పెట్టుబడి వ్యయాలను గణనీయంగా పెంచుతూనే ఉందని మంత్రి వివరించారు. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమును, విద్యుత్ తదితర రంగాల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోందన్నారు. (ఇదీ చదవండి: ఈవీ జోరుకు భారత్ రెడీ.. ప్లాంటు యోచనలో వోల్వో!) -
50 లీటర్ల పెట్రోల్ ట్యాంకుకు 57 లీటర్ల బిల్లు! బంకు సీల్..!
జబల్పూర్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ పెట్రోల్ పంపు సిబ్బంది ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే టోకరా ఇచ్చారు! ఆయన కారు ట్యాంక్ సామర్థ్యమే 50 లీటర్లయితే ఏకంగా 57 లీటర్ల పెట్రోల్ కొట్టినట్టు బిల్లు చేతికిచ్చారు. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు అధికారులు పెట్రోల్ బంకును సీల్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర బంకుల నిర్వహణ తీరుపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఆల్టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
జియో–బీపీ బంకుల్లో ఈ20 పెట్రోల్
న్యూఢిల్లీ: జియో–బీపీ పెట్రోల్ బంకుల్లో కొత్తగా ఈ20 పెట్రోల్ లభించనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ ప్రణాళికకు అనుగుణంగా దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ తరహా ఇంధనంలో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ముడిచమురు దిగుమతులను అలాగే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ20 పెట్రోల్కు అనుగుణంగా ఉండే వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడవచ్చని జియో–బీపీ పేర్కొంది. ఇంధనాల విక్రయం కోసం దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ బీపీ కలిసి రిలయన్స్ బీపీ మొబిలిటీ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఇది జియో–బీపీ బ్రాండ్ పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ జేవీకి దేశవ్యాప్తంగా 1,510 ఎనర్జీ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్, రిఫ్రెష్మెంట్లు వంటి సదుపాయాలు కూడా అందిస్తోంది. -
వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్పై రూ.2 సెస్..ఎక్కడంటే?
తిరువనంతపురం: వాహనదారులకు కేరళ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.2 సెస్ విధించనున్నట్లు తెలిపింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ బడ్జెట్ ప్రసంగంలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళలో ఎల్డీఎఫ్ రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. రాష్ట్రంలో ఇకపై సోషల్ సెక్యూరిటీ సెస్ పేరుతో లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.2 అదనంగా వసూలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. తద్వారా సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్కు రూ.750 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అలాగే భారత్లో తయారయ్యే విదేశీ లిక్కర్ బ్రాండ్ మద్యంపై రూ.20, రూ.40 సెస్ విధించనున్నట్లు బాలగోపాల్ వెల్లడించారు. రూ.500-999 ధర గల లిక్కర్ బాటిళ్లపై రూ.20 సెస్, ధర రూ.1000కి ఎక్కువగా ఉండే బాటిళ్లపై రూ.40 సెస్ విధించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కేరళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంధనం, మద్యంపై సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం రాష్ట్రానికి ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదని మంత్రి తెలిపారు. చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..! -
పెట్రోల్ వాసన పీల్చేస్తున్నారు!
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 12 ఏళ్ల విద్యార్థి రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోవటం, తరచూ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఓ రిహాబిలిటేషన్ (పునరావాస) కేంద్రానికి తీసుకెళ్లారు. విద్యార్థిని పరిశీలించిన నిపుణులు.. ఆ అబ్బాయి పెట్రోల్ వాసనకు బానిసయ్యాడని చెప్పారు. దాంతో వారు విస్తుపోయారు. పెట్రోల్ వాసన పీల్చడమేంటని ప్రశ్నించగా.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఆ అబ్బాయి డ్రగ్స్కు ప్రత్యామ్నాయంగా పెట్రోల్ వాసన పీల్చుతున్నట్లు చెప్పారు. రోజూ ఖర్చీఫ్లో ఐదారు చుక్కల పెట్రోల్ను పోసుకొని అవసరమైనప్పుడల్లా పీల్చుతూ.. మత్తులో జోగుతున్నట్లు తేల్చేశారు. సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా 8, ఆపై తరగతి పిల్లల్లో ఈ దురలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు మాదకద్రవ్యాలకు ప్రత్యామ్నాయంగా పెట్రోల్తో పాటు నొప్పి తగ్గించే కొన్ని నూనెలు, మందులు (పెయిన్ కిల్లర్స్), జిగురు, వైట్నర్ వంటివి వాడుతున్నారు. కొందరు ఎడిబుల్ (తినదగిన) డ్రగ్స్ వినియోగిస్తున్నారు. ఈ విధంగా మాదక ద్రవ్యాలకు బానిసలైన వందకు పైగా విద్యార్థులు ప్రస్తుతం రిహాబిలిటేషన్ కేంద్రాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురు బాలికలు కూడా ఉండటం గమనార్హం. తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వటం మాత్రమే కాదు దాన్ని ఎలా వినియోగిస్తున్నారో చూడటం కూడా తల్లిదండ్రుల బాధ్యత. కరోనా తర్వాతి నుంచి స్కూల్ విద్యార్థులలో స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. అయితే వీరు ఇంటర్నెట్లో ఎక్కువగా ఎలాంటి సైట్లను చూస్తున్నారు? ఏ సమాచారాన్ని తెలుసుకుంటున్నారో తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులతో ఏ వస్తువులు కొనుగోలు చేస్తున్నారో పర్యవేక్షించాలని అంటున్నారు. ఆన్లైన్లో గేమ్స్ ఆడితే ఏ తరహా ఆటలాడుతున్నారో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే పిల్లలు చెడిపోయేందుకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చినట్టేనని స్పష్టం చేస్తున్నారు. సొంతంగా ఎడిబుల్ డ్రగ్స్ తయారీ, విక్రయం! గచ్చిబౌలిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన మాజీ విద్యార్థిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ మీద మంచి పట్టున్న ఈ విద్యార్థి.. సొంతంగా హాష్ ఆయిల్, గంజాయితో ఎడిబుల్ (తినదగిన) డ్రగ్స్ను తయారు చేయడం నేర్చుకున్నాడు. చాక్లెట్లు, వేఫర్ల వంటి బేకరీ ఉత్పత్తులను కరిగించి హాష్ ఆయిల్ను కలిపి ఎండబెట్టి తిరిగి చాక్లెట్ల లాగా తయారు చేసి, ప్యాకింగ్ చేస్తున్నాడు. గేటెడ్ కమ్యూనిటీలలోని గ్రూపులు, వివిధ సామాజిక మాధ్యమాల గ్రూప్ల్లో చేరి, అందులోని స్కూల్ విద్యార్థులకు వీటి గురించి ప్రచారం చేస్తూ విక్రయిస్తున్నాడు. ఇల్లు, పాఠశాల ఆవరణలో ఈ చాక్లెట్లను తింటే తల్లిదండ్రులు, టీచర్లు గమనిస్తారని.. బాస్కెట్బాల్, స్కేటింగ్ వంటి క్రీడల శిక్షణ సమయంలో పిల్లలు వీటిని వినియోగిస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ర్యాపిడో, డుంజో వంటి బైక్ సర్వీస్ల ద్వారా బుకింగ్ చేసి తెప్పించుకుంటున్నారని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులైతే పార్టీ మూడ్ను మరింత పెంచేందుకు, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం వినియోగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. ►ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అవుతారు. ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తుంటారు. ►రాత్రివేళ సరిగ్గా నిద్ర పోరు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ►శరీర బరువుగా క్రమంగా తగ్గుతుంటుంది. కళ్లు ఎర్రగా మారతాయి. తరచుగా కంటి చుక్కల మందులు వినియోగిస్తుంటారు. ►ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ►కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తుంటారు. చాక్లెట్లయితే హాని చేయవనుకుంటున్నారు.. ధూమపానం ద్వారా అయితే గాలి లోపలికి పీల్చుకోవాలి. అదే ఎడిబుల్ చాక్లెట్లయితే ఎలాంటి హాని ఉండదని విద్యార్థులు భావిస్తున్నారు. మత్తు పదార్థాలు ఏ రూపంలో అయినాసరే మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం మా దగ్గర 15 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకుంటున్నారు. వీరిలో పలువురు బాలికలు కూడా ఉన్నారు. – డాక్టర్ కె.దేవికారాణి, డైరెక్టర్, అమృత ఫౌండేషన్ -
Ongole: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు సంతపేటలోని జిల్లా జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఖైదీలే నిర్వహిస్తున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపేవారు.. వాహనాలకు గాలి పట్టే వారితోపాటు క్యాష్ కౌంటర్లో ఉండే వ్యక్తి వరకు అందరూ జీవిత ఖైదు అనుభవిస్తున్న వారే కావడం విశేషం. 2018లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బంక్ ఏర్పాటు చేయగా.. ఈ బంక్లో స్రత్పవర్తనతో పని చేయడం ద్వారా ఏడుగురు ఖైదీలు శిక్ష తగ్గి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో నలుగురికి సైతం శిక్షలు తగ్గి ఇళ్లకు వెళ్లేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఇందులో 10 మంది పని చేస్తున్నారు. నిత్యం రూ.5 లక్షల విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ పని చేసినందుకు గాను ప్రతి ఖైదీ రోజుకు రూ.200 ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటున్నారు. ఈ బంక్ ద్వారా జైళ్ల శాఖకు నెలకు సుమారు రూ.2.50 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇక్కడ పనిచేస్తే మంచి మార్కులు జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ మంచి ప్రవర్తనతో మెలుగుతున్న వారిని మాత్రమే ఆరు బయట ఖైదీలుగా ఎంపిక చేసి పెట్రోల్ బంక్లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది జైళ్ల శాఖ. బంక్లో నెల రోజులపాటు ఖైదీలు పనిచేస్తే 8 రోజుల చొప్పున శిక్ష తగ్గుతుంది. ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలపాటు 8 రోజుల చొప్పున తగ్గించుకుంటూ వెళతారు. దీంతోపాటు ప్రత్యేకంగా సంవత్సరంలో మరో 30 రోజుల శిక్ష తగ్గించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ప్రత్యేకంగా మరో 60 రోజులపాటు శిక్షను తగ్గించే వెసులుబాటు ఉంది. పెరోల్పై 14 రోజుల పాటు ఖైదీలు తమ ఇళ్లకు వెళ్లి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఆ కాలాన్ని కూడా శిక్షలో తగ్గించేలా వెసులుబాటు కలి్పస్తారు. మొత్తం మీద శిక్షపడిన మూడేళ్ల నుంచి ఈ తగ్గింపు శిక్ష కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తారు. మొత్తం మీద శిక్షను తగ్గించే వెసులుబాటు విధించిన శిక్ష కంటే మూడో వంతుకు తక్కువగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు గాలి పడుతున్న ఖైదీ సుబ్బయ్య స్రత్పవర్తనతో మెలుగుతున్నా హత్య కేసులో నాకు శిక్ష పడింది. ఇప్పటికే పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాను. మంచి ప్రవర్తనతో మెలుగుతుండటంతో ఇక్కడి అధికారులు పెట్రోల్ బంక్లో పనిచేసే అవకాశం కల్పించారు. – డి.సుధాకర్, చీరాల, జీవిత ఖైదీ పశ్చాత్తాప పడుతున్నా క్షణికావేశంలో తప్పు చేశా. కుటుంబాలకు దూరమై బాధ పడుతున్నాం. జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఖైదీలతోపాటు వారి కుటుంబాలు కూడా ఇళ్ల వద్ద ఉండి శిక్ష అనుభవిస్తున్నాయి. శిక్ష పడి ఏడేళ్లు పూర్తయింది. మంచి ప్రవర్తనతో మెలగడంతో పెట్రోల్ బంక్లో పనిచేసే అవకాశం కలిగింది. – జి.సుబ్బయ్య, అర్ధవీడు, జీవిత ఖైదీ పరివర్తన తీసుకొచ్చే దిశగా.. ఈ బంక్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఖైదీలు పని చేస్తారు. శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకొచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. వారి ప్రవర్తనను బట్టి ఆరుబయట ఖైదీలుగా మెలిగే వెసులుబాటు కల్పిస్తున్నాం. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని మంచి ప్రవర్తనను బట్టి మార్కులు వేస్తాం. తదనుగుణంగా వారి శిక్షాకాలం తగ్గుతుంది. – పి.వరుణారెడ్డి, జైలు సూపరింటెండెంట్ చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
మొదటి సారి ఇంధన రంగంలోకి పీఏసీఎస్.. పెట్రోల్ బంకులు రాబోతున్నాయ్!
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఆర్థిక పరిపుష్టిపై దృష్టి సారించాయి. ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయ ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. మొదటి సారి ఇంధన రంగంలోకి ప్రవేశించాయి. సహకార పెట్రోలు బంకులు ఏర్పాటు చేసి తమ ఆర్థిక పరపతిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒక్కో బంకు రూ.25లక్షలతో ఏర్పాటు ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు అనుబంధంగా 1,992 పీఏసీఎస్లున్నాయి. వాటిలో 1,450 పీఏసీఎస్లు లాభాల్లో ఉన్నాయి. మిగిలిన వాటిని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఆప్కాబ్ చేయూత నిస్తోంది. బహుళ సేవా కేంద్రాలు (ఎంఎస్సీ)గా వీటిని తీర్చిదిద్దేందుకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. స్థలాలు అందుబాటులో ఉండి స్థానికంగా ఫీజుబులిటీ కల్గిన పీఏసీఎస్ల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఒక్కో బంకు రూ.25లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా పీఏసీఎస్లకు డీలర్షిప్లు మంజూరు చేసేందుకు హెచ్పీసీఎల్ ముందు కొచ్చింది. బంకు నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ హెచ్పీసీఎల్ సమకూర్చనుంది. నిర్వహణ బాధ్యతలను పీఏసీఎస్లకు అప్పగిస్తారు. నిర్వహణ ఖర్చులు పోనూ నెలకు రూ.లక్షకు పైగా మిగులుతుందని అంచనా వేసు్తన్నారు. బంకుల ఏర్పాటుకు అనువుగా 96 పీఏసీఎస్లు తొలిదశలో బంకుల ఏర్పాటుకు అనువైన స్థలాలున్న 130 పీఏసీఎస్లను గుర్తించారు. వాటిలో 96 పీఏసీఎస్ల పరిధిలో బంకుల ఏర్పాటుకు ఫీజుబులిటీ ఉందని ఆయిల్ కంపెనీలు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాయి. వాటిలో ఇప్పటికే 77 పీఏసీఎస్లకు ఆయిల్ కంపెనీలు లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ జారీ చేశాయి. కాగా 18 పీఏసీఎస్ల పరిధిలో బంకుల ఏర్పాటుకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)లు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లా పరిధిలోని కె.జగ్గవరం, ముల్లకుంట పీఏసీఎస్ల్లో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేయగా, మిగిలిన 15 పీఏసీఎస్ల్లో జనవరి నెలాఖరులోగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీజుబులిటీ ఆధారంగా మిగిలిన పీఏసీఎస్ల పరిధిలో బంకుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. లాభాల బాట పట్టించడమే లక్ష్యం నష్టాల్లో ఉన్న పీఏసీఎస్లను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశాం. స్థలాలు అందుబాటులో ఉండి, ఫీజు బులిటీ ఉన్న పీఏసీఎస్ పరిధిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనుమతినిస్తాం. బంకులే కాదు..వారు ఏ తరహా వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చినా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆప్కాబ్ సిద్ధంగా ఉంది. –ఆర్.శ్రీనాథ్రెడ్డి, ఎండీ, ఆప్కాబ్ -
అలర్ట్: జనవరి నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే జరిమానా తప్పదు!
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఇదంతా తరచూ జరుగుతుంటాయి. అయితే ప్రతి నెలా మారుతున్న కొన్ని రూల్స్పై మాత్రం సామన్యులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే అవి వారి నగదుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం రానే వచ్చింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రజలు ఇలాంటి విషయాలను ముందస్తుగా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే నిబంధనలు తెలుసుకోకపోతే ఆర్థికపరమైన నష్టాలను చవిచూసే అవకాశం కూడా ఉంది. క్రెడిట్ కార్డ్లు: క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం, కొత్త సంవత్సరంలో అనేక బ్యాంకులు తమ రివార్డ్ పాయింట్ స్కీమ్లలో మార్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి, కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను డిసెంబర్ 31లోపు రిడీమ్ చేసుకోవడం మంచిది. కార్ ధరలు: పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి. వీటిలో టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి దేశీయ కార్ల దిగ్గజాలతో పాటు ఆడి మెర్సిడెస్-బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు: ప్రతి నెల మొదటి రోజున, గ్యాస్ సిలిండర్ ధరలలో ఏవైనా మార్పులు చేసినట్లయితే, వాటిని ప్రకటిస్తారు. డిసెంబర్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత జనవరిలో ధరలు పెరగడమో లేదా తగ్గనున్నాయని చూడాలి ఎన్పీఎస్ పాక్షిక ఉపసంహరణ: ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) కోసం తమ ఉపసంహరణ అభ్యర్థనలను పాక్షిక ఉపసంహరణ కోసం దరఖాస్తులను వారి అనుబంధ నోడల్ కార్యాలయాల ద్వారా సమర్పించాలి. పాక్షిక ఉపసంహరణకు కారణాన్ని ధృవీకరించడానికి, సహాయక పత్రాలు కూడా అవసరమని తెలిపింది. ప్రస్తుతం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) సభ్యులు స్వీయ ప్రకటన ద్వారా ఎన్పీఎస్ కింద పాక్షిక ఉపసంహరణలు చేసేందుకు అనుమతిస్తుంది. బ్యాంక్ లాకర్లు: సవరించిన బ్యాంక్ లాకర్ నిబంధనల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వినియోగదారులకు కొత్త అమల్లోకి వచ్చిన లాకర్ ఒప్పందాలను అందించాలని బ్యాంకులను ఆదేశించింది. హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు: ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు, డిసెంబర్ 31లోపు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP), కలర్-కోడెడ్ స్టిక్కర్లను ఇన్స్టాల్ చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు గానూ ₹5,000 నుంచి ₹10,000 వరకు జరిమానా కూడా విధించనున్నారు. చదవండి: ఫోన్పే, గూగుల్పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి! -
రెండు రోజుల్లో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్
న్యూఢిల్లీ: పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందే కేంద్ర సర్కారు అమల్లో పెట్టనుంది. రెండు రోజుల్లోనే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20 పెట్రోల్) విక్రయాలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023లో భాగంగా ‘డ్యాన్స్ టు డీకార్బనైజ్’ అనే అంశంపై మంత్రి మాట్లాడారు. పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యానికి 2022 నవంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ జూన్ నాటికే సాధించినట్టు మంత్రి తెలిపారు. మరో ఒకటి రెండు రోజుల్లో 20 శాతం కలిసిన పెట్రోల్ అమ్మకాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొదలవుతాయన్నారు. 2023 ఏప్రిల్ 1 నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యం విధించుకోవడం గమనార్హం. కానీ, దీన్ని తాము మరింత ముందుగానే సాధిస్తామని పురి చెప్పారు. దేశవ్యాప్తంగా దీన్ని దశలవారీగా 2025 ఏప్రిల్ నాటికి అమలు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. దీనివల్ల ఇంధన భద్రత పెరగడంతోపాటు, రూ.41,500 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. అలాగే, గ్రీన్హౌస్ గ్యాస్ల విడుదల 27 లక్షల టన్నుల మేర తగ్గుతుందని.. రైతులకు రూ.40,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరుందని వివరించారు. -
వాహనదారులకు షాక్! లీటర్ పెట్రోల్లో ఏకంగా 90 శాతం నీరు?
శాయంపేట: పెట్రోల్లో నీరు చేరడంతో వాహనాలు మోరాయించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వాహనాలు పెట్రోల్ పోసుకున్న అరగంటకే మోరాయించడంతో వాహనదారులు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి యజమానిని ప్రశ్నించారు. దీంతో బంక్ యజమాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు బాటిల్లో పెట్రోల్ పట్టగా నీరే అధిక శాతం కనిపించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గంగిరేణిగూడెంలోని పెట్రోల్ బంక్లో బుధవారం ఉదయం పోతు సునీల్, దొంగరి శ్రావణ్, ముక్కెర సురేష్ తమ ద్విచక్రవాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. కాసేపటికే వాహనాలు మోరాయించడంతో మెకానిక్ వద్దకు వెళ్లారు. కల్తీ పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోయాయని చెప్పడంతో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని యజమాని శ్రీనివాస్ను ప్రశ్నించారు. దీంతో అతడు బుకాయిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సమస్య విని ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ పోయించగా 90శాతం నీరు, 10శాతం మాత్రం పెట్రోల్ రావడంతో కంగుతిన్నారు. దీంతో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని బంక్ యజమానిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ సీజ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ విషయమై బంక్ యజమాని శ్రీనివాస్ను ప్రశ్నించగా మంగళవారం సాయంత్రం కొత్త లోడు వచ్చిందని, ఉదయం నుంచి పెట్రోల్ అమ్మకాలు చేపడుతున్నామని, నీరు ఎలా సింక్ అయిందో తెలియదని తెలిపారు. పెట్రోల్ పోసుకున్న వారి వాహనాలు పాడైతే మర్మమ్మతు చేయించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. -
ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఉంటున్నందున ఫ్లెక్స్ ఫ్యుయల్స్ (ఇంధన వినియోగ సౌలభ్యం ఉన్నవి), ఎలక్ట్రిక్ వాహనాలను (ఈ రవాణా/ఈవీ) ప్రోత్సహించాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సియామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. అధిక ఇంధన ధరలతో ఏవియేషన్ పరిశ్రమ కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ‘‘ఏటా చమురు ధరల్లో తీవ్ర అస్థిరతలు సమస్యలకు కారణమవుతున్నాయి. అందుకే నూరు శాతం ఫ్లెక్స్ ఫ్యూయల్స్కు మారాలి’’అని పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలు అన్నవి ఒకటికి మించిన ఇంధనాలు, ఇంధన మిశ్రమాలతో నడిచేవి. పెట్రోల్లో ఇతర ఇంధనాలను కలిపినప్పుడు ఈ వాహనాలు ఎటువంటి సమస్యల్లేకుండా సులభంగా నడుస్తుంటాయి. ఇందుకు ఇంజన్ టెక్నాలజీ, ఇతర వ్యవస్థల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దేశంలో వాయు కాలుష్యంలో 40 శాతం శిలాజ ఇంధనాల వినియోగం వల్లేనని మంత్రి గడ్కరీ చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించే టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇథనాల్ తయారీని ప్రారంభించేందుకు ఎన్నో పరిశ్రమలను తాము ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఉపాధి కల్పనలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆటోమొబైల్ రంగాన్ని మంత్రి ఈ కార్యక్రమం వేదికగా అభినందించారు. ‘‘ఆటోమొబైల్ దేశంలో 4 కోట్ల మందికి ఉపాధినిస్తోంది. ప్రభుత్వానికి అధిక జీఎస్టీ రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తోంది’’అని చెప్పారు. ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! -
చమురు విషయంలో పాక్కి గట్టి షాక్ ఇచ్చిన రష్యా
రష్యా నుంచి చమురు ధర విషయంలో తగ్గింపు లభించిందని పాక్ గొప్పలు చెప్పుకుంది. గానీ రష్యా మాత్రం భారత్కి చమురు ధర తగ్గింపు ఇచ్చినట్లుగా ఇచ్చేదే లేదని కరాఖండీగా చెప్పేసింది. ఈ మేరకు రష్యా అధికారులు, పాక్ ప్రతినిధులు ముసాద్ మాలిక్, మంత్రి(పెట్రోలియం విభాగం), కెప్టెన్ ముహ్మద్ మహమూద్ పెట్రోలియం కార్యదర్శిలతో ఇటీవల మాస్కోలో జరిగిన సమావేశంలో రష్యా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్కి రష్యా చమురు ఉత్పత్తులు ఎక్కువగా పెరిగాయి. గత నెల అక్టోబర్ నుంచి రెండు నెలలు పాటు భారత్కి అతి పెద్ద చమురు సరఫరాదారుగా మాస్కో ఉంది. ప్రస్తుతం భారత్ రష్యా చమురును బంగ్లాదేశ్కు ఎగుమతి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతేగాదు రష్యా-పాక్ మధ్య ప్రతిపాదిత చమురు పైప్లైన్ ప్రాజెక్ట్పై కూడా రష్యా పెద్దగా ఆసక్తి చూపలేదు. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ పరిణామాల నేపథ్యంలో యురేషియాలో ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడానికి ఇరాన్లోని భారత్ చబహార్ పోర్ట్కు మద్దతు ఇవ్వాలని రష్యా నిర్ణయించింది. ఈపోర్ట్లో రవాణా సామర్థ్యం పెంపొందించడానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా అంగీకరించింది. చబహార్ పోర్ట్లో రష్యా ప్రవేశం భారత్ నిర్మించిన ఓడరేవులో సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదీగాక చబహార్ పోర్టును ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ)తో అనుసంధించేలా ఆయా దేశాలపై భారత్ ఒత్తిడి చేస్తోంది. ఐఎన్ఎస్టీసీ అనేది భారత్, ఇరాన్, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా, ఐరోపా మధ్య రవాణా కోసం దాదాపు 7,200 కిలోమీటర్ల పొడవున్న ఓడలు, రైలు, రోడ్డు మార్గాల బహుళ వాణిజ్య కారిడార్. (చదవండి: నవజాత శిశువు కడుపులో కవల పిండం...షాక్లో తల్లి)