diesel
-
అక్కడ ఒక్కసారిగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
గత ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రూపాయలు తగ్గింది. ఆ తరువాత ధరల తగ్గుదల ఊసేలేదు. అయితే ఇప్పుడు ఇంధన ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశ్యంతో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది.2019-20లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.72.69, రూ.65.78 వద్ద ఉండేవి. 2023-24లో రూ.96.63, రూ. 89.53 వద్దకు చేరాయి. తాజాగా ఈ ధరలను రూ. 94.74, రూ. 87.64 వద్దకు (ఢిల్లీ) తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి 'సురేష్ గోపి' పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంధన ధరలు సుమారు రెండు రూపాయల వరకు తగ్గినట్లు తెలుస్తోంది.ఇంధన ధరలు 2021-22 సమయంలో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తరువాత ప్రభుత్వం నవంబర్ 2021 - మే 2022లో పెట్రోల్ & డీజిల్పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13, రూ.16 తగ్గించింది. దీంతో ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న వివిధ చర్యల ఫలితంగా ఇంధన ధరలు తగ్గాయని సురేష్ గోపి అన్నారు.ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రేట్లను తగ్గించాలని సురేష్ గోపి సూచించారు. అంతర్జాతీయ ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా దిగుమతులను తగ్గించి.. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం వంటివి కూడా చేస్తున్నట్లు సురేష్ గోపి వెల్లడించారు.ప్రస్తుతం తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీకి మాత్రమే పరిమితం. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలలో పెట్రోల్ ధరలు రూ. 100 కంటే ఎక్కువే ఉంది. -
పెట్రోల్, డీజిల్ నిక్షేపాల వెలికితీతకు ట్రయల్ రన్
లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను కనుగొనేందుకు బోరుబావుల తవ్వకాల ద్వారా ట్రయల్ రన్ ప్రారంభించారు. శాటిలైట్ ద్వారా నిర్ధారించిన పాయింట్లలో ఈ తవ్వకాలకు నాలుగు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. సుమారు 80–200 అడుగుల లోతు వరకు ఈ బోరుబావులను తవ్వుతున్నారు. ఆ తర్వాత వాటి అడుగు భాగంలో డైనమైట్లు, జిలెటిన్ స్టిక్స్, మందుగుండు సామాగ్రి పంపి పేలుస్తున్నారు.అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పేలుళ్లవల్ల చుట్టుపక్కల వ్యవసాయ బోరుబావులకు భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. రైతుల అనుమతుల్లేకుండా వారి పంట పొలాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదా.. లింగాల మండల కేంద్రంలోని ఎ.వి. శ్రీనివాసరెడ్డి పొలంలో అనుమతిలేకుండా తొమ్మిది బోరు బావులు తవ్వారు. జిల్లా కలెక్టర్ అనుమతులతో ఓఎన్జీసీ సంస్థ బోరుబావులు తవ్వుతోందని తహసీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు. రెండ్రోజుల క్రితం కలెక్టర్ ఇచ్చిన అనుమతుల కాపీని తనకు అందించారన్నారు. ఇక ముదిగుబ్బ నుంచి జమ్మలమడుగు వరకు బోరుబావుల తవ్వకాల కాంట్రాక్టును బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ పొందినట్లు సమాచారం. -
డీజిల్ బస్సుకు ఎలక్ట్రిక్ రూపు
సాక్షి, హైదరాబాద్: ఖర్చులు తగ్గించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) అన్ని మార్గాలను వెదుకుతోంది. ఇంధన భారం తడిసి మోపెడవుతుండటంతో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గుచూపింది. ఆ బస్సులుఖరీదైనవి కావటంతో అద్దెకు తీసుకొని నడుపుతోంది. అదే సమయంలో సంస్థకు గుదిబండగా మారుతున్న పాత డీజిల్ బస్సులనూ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రెట్రో ఫిట్మెంట్ టెక్నాలజీ ద్వారా పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చటానికి రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరింది. కానీ, ప్రభుత్వం స్పందించకపోవటంతో తాజాగా కేంద్రం తలుపు తట్టింది. రెట్రో ఫిట్మెంట్కు ఆర్థిక సాయం చేయాలని లేఖ రాసింది. ఆ ప్రయోగం సక్సెస్.. డీజిల్ వ్యయాన్ని భరించలేక ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపాలని మూడేళ్ల క్రితం ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం కింద 40 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసింది. వాటిని ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్టుకు నడుపుతోంది. ఆ సమయంలో ఒక్కో బస్సు ధర రూ.2 కోట్ల వరకు ఉండటంతో సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనటం సాధ్యం కాదని చేతులెత్తేసింది. రెట్రో ఫిట్మెంట్ ద్వారా రూ.60 నుంచి రూ..65 లక్షలతోనే డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చవచ్చని గుర్తించి, అందుకోసం టెండర్లు పిలిచింది. ఎలక్ట్రిక్ రైల్ లోకోమోటివ్లు తయారు చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థ రెట్రో ఫిట్మెంట్కు ఆసక్తి చూపింది. శాంపిల్గా ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక బస్సును ఆ సంస్థ రెట్రో ఫిట్మెంట్ చేసి ఇచ్చింది. ప్రస్తుతం అది ఉప్పల్ డిపో పరిధిలో తిరుగుతోంది. ఈ ప్రాజెక్టు భారాన్ని మొత్తం మోయలేనని భావించిన ఆర్టీసీ.. రేండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరింది. ప్రభుత్వం కూడా సాయం చేయలేనని చేతులెత్తేయటంతో ప్రాజెక్టు అంతటితో ఆగిపోయింది. కేంద్రం వైపు ఆర్టీసీ చూపు నగరంలో డీజిల్ బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులే తిప్పాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం ఈ–డ్రైవ్ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాలకు 11 వేల ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయాలని నిర్ణయించింది. వాటిలో తనకు 2,500 బస్సులు కావాలని ఆర్టీసీ దరఖాస్తు చేసుకుంది. పనిలో పనిగా రెట్రో ఫిట్మెంట్ ద్వారా పాత డీజిల్ బస్సులను ఎలక్రి్టక్ బస్సులుగా మార్చేందుకు కూడా ఓ విధానం ప్రకటించాలని లేఖ రాసింది. రెట్రో ఫిట్మెంట్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా తిరుగుతున్న బస్సును ఉదహరించింది. ఈ లేఖపై కేంద్రం ఇంకా స్పందించలేదు. కేంద్రం గనుక రాయితీ పద్ధతిలో రెట్రో ఫిట్మెంట్కు పాలసీ అందుబాటులోకి తెస్తే, ఆర్టీసీ వద్ద ఉన్న పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి నిర్వహించేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంది. కొత్త ఎలక్ట్రిక్బస్సు ఖరీదు రూ.1.50కోట్లు పాత డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చేందుకు అయ్యే వ్యయం రూ.60 లక్షలు డీజిల్ బస్సుఖర్చు కి.మీ.కు రూ.20ఎలక్ట్రిక్ బస్సుకు అయ్యే వ్యయం రూ.6 -
సిటీ డిపోలన్నీ ప్రైవేటుకే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆర్టీసీ డీజిల్ బస్సులను నగరం వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించటం ఆ సంస్థ ఉద్యోగులకు ప్రాణ సంకటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. డీజిల్ బస్సుల స్థానంలో ప్రైవేటు సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని భావిస్తున్నారు. ఈ బస్సుల్లో కండక్టర్ తప్ప ఇతర సిబ్బంది అంతా సదరు సంస్థవారే ఉంటారు. దీంతో ఇప్పుడు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది డీజిల్ బస్సులతోపాటే నగరం బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. సిటీ బయటకు 80 శాతం సిబ్బంది! ప్రస్తుతం నగరంలో 2,500 సిటీ బస్సులు తిరుగుతున్నా యి. విమానాశ్రయం సర్వీసులు, సిటీ సర్వీసులుగా తిరుగుతున్న కొన్ని నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మినహా అన్నీ డీజిల్ బస్సులే. ఇటీవలే ఎలక్ట్రిక్ పాలసీలో మార్పులు తెచి్చన రాష్ట్ర ప్రభుత్వం.. నగరంలో డీజిల్ బస్సులను తిప్పొద్దని నిర్ణయించింది. వీటిని ఔటర్ రింగురోడ్డు అవ తలికి తరలించి, నగరంలో ఎలక్ట్రిక్ బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఆర్టీసీ దరఖాస్తు చేసింది. ఆ పథకం కింద దేశవ్యాప్తంగా 9 నగరాలకు 14 వేల ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అందులో 2,800 బస్సులు తమకు అందజేయాలని టీజీఆర్టీసీ కోరింది. ఈ పథకానికి సంబంధించి ఈ నెలలో లేదా వచ్చే నెలలో కేంద్రం టెండర్లు పిలవనుంది. టెండర్లు దక్కించుకునే సంస్థలు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్థతిలో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో అద్దెకు తిప్పుతాయి. ఈ బస్సుల నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలదే. ఒక్క కండక్టర్ సర్వీసును మాత్రమే ఆర్టీసీ పర్యవేక్షిస్తుంది. డ్రైవర్, మెకానిక్, సెక్యూరిటీ వంటి బాధ్యతలను బస్సుల యజమానులే చూసుకొంటారు. దీంతో నగరంలోని ప్రస్తుత ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేటు బస్సులు నిలిపేందుకు కేటాయిస్తారు. రెండేళ్లలో దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. డిపోలపై అజమాయిషీ మాత్రం ఆర్టీసీదే ఉండనుంది. అంటే, డిపో మేనేజర్, సహాయ మేనేజర్, కండక్టర్లకు టికెట్ యంత్రాలు అందివ్వటం, టికెట్ల ద్వారా వచ్చే నగదును లెక్కించి బ్యాంకుల్లో జమ చేయటం వంటి బాధ్యతలు చూసే కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఆర్టీసీలో ఉంటారు. డ్రైవర్లు, మెకానిక్–శ్రామిక్లు, సెక్యూరిటీ సిబ్బందిని రాష్ట్రంలోని ఇతర డిపోలకు పంపాల్సి ఉంటుంది. దీంతో నగరంలోని 80 శాతం మంది ఆర్టీసీ సిబ్బంది ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాల భర్తీ కూడా ఉండదని చెబుతున్నారు. ఇది ప్రైవేటీకరణే:కార్మిక సంఘాలుఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటి సిబ్బంది ఆధ్వర్యంలో బస్సులను తిప్పటమంటే అంతమేర ఆర్టీసీని ప్రైవేటీకరించినట్టేనని ఆర్టీసీలోని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని సహించేది లేదని, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. మరో వైపు జీసీసీ పద్ధతిలో బస్సుల నిర్వహణ చేపట్టినంత మాత్రాన దాన్ని ప్రైవేటీకరించినట్టు అనటం సరికాద ని ఉన్నతాధికారులు పేర్కొంటున్నా రు. డిపోల్లోని స్థలాలను మాత్రమే ఆయా సంస్థలు బస్సులు నిలుపుకోవటం, చార్జింగ్ చేయటం, నిర్వహణ పనులకు వినియోగించుకుంటాయని చెబుతున్నారు. డిపోల అజమాయిషీ పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటుందని అంటున్నారు. -
పుంజుకున్న పెట్రోల్ విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మద్దతుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు అక్టోబర్ నెలలో 7.3 శాతం పెరిగాయి. కానీ, డీజిల్ అమ్మకాలు మాత్రం 3.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇంధన మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన మూడు ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) అక్టోబర్లో 3.1 మిలియన్ టన్నుల పెట్రోల్ను విక్రయించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.87 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు మాత్రం 3.3 శాతం తక్కువగా 6.7 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. పండుగల సందర్భంగా వ్యక్తిగత వాహనాల (టూవీలర్లు, ప్యాసింజర్ కార్లు) వినియోగం సాధారణంగా పెరుగుతుంది. ఇది పెట్రోల్ విక్రయాల వృద్ధికి దారితీసినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సాగు రంగం నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని తెలిపాయి. గడిచిన కొన్ని నెలల నుంచి డీజిల్, పెట్రోల్ అమ్మకాలు స్తబ్దుగానే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అధిక వర్షాలకుతోడు, సాగు రంగం నుంచి డిమాండ్ తగ్గడం వాహనాల వినియోగాన్ని పరిమితం చేసింది. ఇక సెపె్టంబర్ నెల గణాంకాలతో పోల్చి చూసినా అక్టోబర్లో పెట్రోల్ విక్రయాలు 7.8 శాతం పెరిగాయి. డీజిల్ అమ్మకాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి. సెపె్టంబర్ నెలలో పెట్రోల్ వినియోగం 2.86 మిలియన్ టన్నులు, డీజిల్ వినియోగం 5.59 మిలియన్ టన్నుల చొప్పున ఉంది. 40 శాతం వాటాతో డీజిల్ అధిక వినియోగ ఇంధనంగా ఉంటోంది. 70 శాతం డీజిల్ను రవాణా రంగమే వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాల కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. 2.5 శాతం అధికంగా ఏటీఎఫ్ అమ్మకాలు ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు అక్టోబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 2.5 శాతం పెరిగి 6,47,700 టన్నులుగా ఉన్నాయి. సెపె్టంబర్ నెలలో వినియోగం 6,31,100 టన్నుల కంటే 2.6 శాతం తగ్గింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.5 శాతం పెరిగి 2.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
పెట్రోల్పై రూ.15, డీజిల్పై రూ.12 లాభం..!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భారీగా లాభాలు పొందుతున్నాయి. కానీ చమురు వినియోగదారులకు మాత్రం ఆ మేరకు వెసులుబాటు ఇవ్వడంలేదు. ఇప్పటికే ఆహార ధరలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినమేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్పై లీటరుకు దాదాపు రూ.15, డీజిల్పై రూ.12 చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాయని ఇటీవల ఇక్రా నివేదికలో తెలిపింది. ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. మార్చి 15, 2024లో పెట్రోల్, డీజిల్ లీటర్పై రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి క్రూడాయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ అందుకు అనుగుణంగా చమురు ధరలు మాత్రం తగ్గించడంలేదు. దేశంలో ఇప్పటికీ పెట్రోలు లీటరుకు రూ.100, డీజిల్ రూ.90 పైనే ఉంది. ఈ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. రవాణా నుంచి విమానయానం వరకు, పరిశ్రమలు నుంచి సరుకుల వరకు రోజువారీ అవసరాలను ప్రభావితం చేస్తున్నాయి.ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎంసీల లాభాలు రూ.86,000 కోట్ల మేర నమోదైనట్లు ఇటీవల పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. గత సంవత్సరం కంటే ఇది 25 రెట్లు ఎక్కువగా ఉంది. హెచ్పీసీఎల్కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,980 కోట్ల నష్టం వాటిల్లింది. అందుకు పూర్తి భిన్నంగా 2023-24లో సంస్థ రూ.16,014 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పన్ను చెల్లింపు తర్వాత బీపీసీఎల్ లాభం రూ.26,673 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలుఅంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ, భారతీయ వినియోగదారులకు ఇంధన ధరల్లో వెసులుబాటు కల్పించడంలేదు. మహారాష్ట్ర, హరియాణాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేలా ఓఎంసీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా చమురు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!.. ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో మనదేశంలో లీటరు ధర రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గే అవకాశం ఉంది.ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ 'గిరీష్ కుమార్ కదమ్' ఇంధన ధరల గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటర్కు వరుసగా రూ.15, రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు.2024 మార్చి15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 2 తగ్గింది. ఆ తరువాత ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల తగ్గుదల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు కారణమవుతాయని తెలుస్తోంది. అయితే ధరలు ఎప్పుడు తగ్గుతాయనేది తెలియాల్సి ఉంది. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశంలో కూడా ఇంధన (పెట్రోల్, డీజిల్) తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి 'పంకజ్ జైన్' వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. చాలా దేశాల్లో ఏర్పడ్డ ఆర్థిక మందగమనమే. అయితే తగ్గుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని OPEC+ (పెట్రోలియం ఎగుమతి దేశాలు) దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే భారత్ మాత్రం ఉత్పత్తిని పెంచాలని కోరుకుంటోంది.ఇదీ చదవండి: ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. భారత ప్రభుత్వం హెచ్చరికఇండియా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. రష్యా తరువాత ఇరాక్, సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. దేశంలోని మొత్తం చమురులో 80% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. -
బ్యాటరీ బస్సులే తిప్పండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులకు బదులు అన్నీ బ్యాటరీ బస్సులే తిరగా లని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు చెప్పారు. నగరంలో 2,700 బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెప్పగా.. వాటిల్లో డీజిల్ బస్సులను తొలగించి అన్నింటినీ క్రమంగా బ్యాటరీ సర్వీసుల్లోకి మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఒక సంవత్సరంలో ఎన్ని బస్సులు సమకూర్చుకునే అవకాశం ఉందో తేల్చాలని, దీని సాధ్యాసాధ్యా లను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో సమీక్షించారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ప్రస్తుతం 7,292 బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అమలవుతోందని, ఇప్పటివరకు ఈ పథకాన్ని 83.42 కోట్ల మంది వినియోగించుకుని, రూ.2,840.71 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రులకు వచ్చే మహిళల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో, ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్మెంట్తో సంస్థ లాభాల్లోకి వస్తోందని చెప్పారు.బ్యాటరీల దిగుమతి ఇబ్బందిగా ఉందినగరంలో తిప్పేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇస్తే, ఇప్పటికీ అన్నీ సరఫరా కాలేదని, విదేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి రావటం బస్సు తయారీ సంస్థలకు ఇబ్బందిగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనాలంటే భారీ వ్యయం అవుతుందని, ఒక్కో బస్సు రూ.1.85 కోట్ల వరకు ధర పలుకుతోందని చెప్పారు. సంస్థ ప్రస్తుతం ఆద్దె ప్రాతిపదికన బస్సులు తీసుకుని నిర్వహిస్తోందని వివరించారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులను పిలిపించి చర్చించాలని, కావల్సినన్ని బస్సుల సరఫరాకు ఉన్న సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సీఎం చెప్పారు. ఆ సమావేశంలో ఈ బస్సుల అంశంతో పాటు, బ్యాంకు అప్పులపై వడ్డీని తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చిద్దామని చెప్పారు.అప్పుల రీస్ట్రక్చర్కు మార్గాలు పరిశీలించండిఆర్టీసీకి లాభాలు వస్తున్నా, వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.వేల కోట్ల రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ ఎక్కువగా ఉండటం సంస్థకు ఇబ్బందిగా మారి నందున.. ఆ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునేం దుకు ఉన్న మార్గాలను పరిశీలించాలని ముఖ్య మంత్రి సూచించారు. వడ్డీ తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో పెరు గుతున్న ప్రయాణికుల సంఖ్య దృష్ట్యా కొత్త బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. కాగా వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు, ఉద్యోగుల భవిష్య నిధి నుంచి వాడు కున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సి న బకాయిలు కలిపి రూ.6,322 కోట్లు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వన్టైమ్ సెటిల్మెంట్ కింద సంస్థ అప్పులను ప్రభుత్వం క్లియర్ చేస్తే బాగుంటుందన్నారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, సీఎం కార్యద ర్శులు షానవాజ్ ఖాసిం, చంద్రశేఖరరెడ్డి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలు పాల్గొన్నారు. -
కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెట్రోల్ ధరలు పైపైకి
భారతదేశంలో ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలను తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం షాకిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజులకు ముందు కర్ణాటక, గోవా రాష్ట్రాలు కూడా పెట్రోల్పై పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే బాటలో పంజాబ్ ప్రభుత్వం కూడా అడుగులు వేసింది.పెట్రోల్, డీజిల్పై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్ (వ్యాట్) పెంచుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి పంజాబ్ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలుక్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా.. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెట్రోల్పై వ్యాట్ను లీటర్కు 61 పైసలు, డీజిల్పై 92 పైసలు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాట్ని పెంచడం వల్ల డీజిల్పై రూ. 395 కోట్లు, పెట్రోల్పై రూ.150 కోట్ల ఆదాయం పెరుగుతుందని చీమా స్పష్టం చేశారు. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. కారణం..
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గతేడాది జులై నెలతో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 10%, డీజిల్ అమ్మకాలు 4.3% పెరిగాయని చమురు మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. జులైలో వంటగ్యాస్ అమ్మకాలు 11%, జెట్ ఇంధన వినియోగం 9% పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పెట్రోల్ డిమాండ్ 7.1%, డీజిల్ డిమాండ్ 1.6 శాతం పెరిగింది. మొదటి త్రైమాసికంలో జెట్ ఇంధన విక్రయాలు 11.4%, వంట గ్యాస్ విక్రయాలు 5% పెరిగాయి. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం ఇంధన వినియోగం పెరిగడానికి కారణమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణదేశీయంగా దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో డీజిల్ 40% వాటా కలిగి ఉంది. సుదూర రవాణా, మైనింగ్, వ్యవసాయం..వంటి అవసరాలకు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం పెరగడం పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. విమాన ట్రాఫిక్ అధికమవడంతో జులైలో జెట్ ఇంధన డిమాండ్ పెరిగింది. కస్టమర్ల సంఖ్య విస్తరించడం వల్ల వంట గ్యాస్ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని కంపెనీలు రాన్నున్న త్రైమాసిక ఫలితాల్లో మంచి ఫలితాలు పోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. -
డీజిల్ దందా అదుర్స్
-
పాక్లో అమాంతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇస్లామాబాద్: అధిక ధరలతో అల్లాడిపోతున్న పాక్ ప్రజలపై అక్కడి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. పాక్ కేంద్ర ప్రభుత్వం దేశంలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పాక్ ఆర్థిక మంత్రిత్వశాఖ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తక్షణమే పెంచుతున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ఈ ధరలు జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది.పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన పాక్ ప్రభుత్వం రాబోయే 15 రోజుల పాటు ఇవే ధరలు కొనసాగుతాయని ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాక్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 7.45 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.258.16 నుంచి రూ. 265.61కి చేరింది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 9.60 పెరిగింది. దీంతో దేశంలో లీటరు డిజిల్ ధర రూ.267.89 నుంచి 277.49కి చేరింది. ఈ నెల 12న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ విడుదల చేసిన అనంతరం తొలిసారిగా చమురు ధరలలో పెరుగుదల చోటుచేసుకుంది. -
గోవాలో ఒక్కసారిగా పెరిగిన ఇంధన ధరలు
గోవా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) పెంపును ప్రకటించింది. పెట్రోల్ ధర రూ.1, డీజిల్ ధరను 60 పైసలు పెంచుతూ.. స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్రటరీ (ఆర్థిక) ప్రణబ్ జి భట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ధరల పెరుగుదల ఈ రోజు (జూన్ 22) నుంచే అమలులోకి వస్తాని పేర్కొన్నారు.ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ గత వారంలో కీలక ప్రకటన వెల్లడించింది.ధరల పెరుగుదల సమంజసం కాదని, ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యూరి అలెమావో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద పెను భారం మోపాలని ఇలాంటి ప్రకటనలు చేస్తుందని అన్నారు. ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచారు, ఇప్పుడు ఇంధన ధరలు పెంచారని అలెమావో పేర్కొన్నారు.విద్యుత్ చార్జీలను పెంచిన తరువాత, అవినీతికి ఆజ్యం పోయడానికి ఇప్పుడు ఇంధన ధరలను పెంచిందని, సామాన్యులను ఇంకెంత బాధపెడతారు అంటూ.. గోవా ఆమ్ ఆద్మీ ప్యారీ చీఫ్ అమిత్ పాలేకర్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. -
ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరత
పర్యావరణ పరిరక్షణకు అవసరమైన పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కొత్త టెక్నాలజీల వినియోగం ద్వారా పరిశుభ్రమైన ఇంధనాలతో ప్రపంచంలో కాలుష్యాన్ని, వాతావరణ విధ్వంసాన్ని అదుపు చేయగలుగుతున్నాం. అయితే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ఖనిజ లోహాల కొరత ప్రపంచానికి పొంచి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బయిన్లు, సోలార్ ప్యానెల్స్ తదితర నూతన సాధనాలకు కీలకమైన ఖనిజ లోహాలు తగినంత స్థాయిలో ఇక ముందు లభ్యం కాకపోవచ్చని తాజా సమాచారం చెబుతోంది.శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గాలంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ప్రత్యామ్నాయాలకు రాగి, లిథియం లోహాలు అవసరం. రాగి విద్యుత్ ఉత్పత్తికి, లిథియం బ్యాటరీలు పనిచేయడానికి కీలకమనే విషయం తెలిసిందే. 2035 నాటికి ప్రపంచానికి అవసరమైన రాగి డిమాండును 70 శాతం, లిథియం డిమాండును 50 శాతం మేరకే తీర్చగలిగే పరిస్థితులున్నాయని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తన తాజా నివేదికలో హెచ్చరించింది. కిందటేడాది లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ ధరలు తగ్గడం మంచి పరిణామామమేగాని, దీంతో ఈ లోహాల ఉత్పత్తిలో నిమగ్నమైన రంగాల్లో పెట్టుబడులు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఈ ఖనిజ లోహాల కొరత ప్రపంచదేశాల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బిరోల్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు వంటి నూతన సాంకేతిక సాధనాలకు ప్రపంచంలో డిమాండు విపరీతంగా పెరుగుతోంది. వాటి తయారీకి అత్యంత కీలకమైన ఖనిజ లోహాల సరఫరా తగినంత స్థాయిలో లేకపోతే ఈ డిమాండును తట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఐఈఏ వివరించింది.2040 వరకు 80వేల కోట్ల డాలర్లుమైనింగ్ ప్రాజెక్టుల్లో 2040 వరకు ఇన్వెస్టర్లు 80వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితేనే ప్రపంచంలో ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం మునుపటి స్థాయికి అంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడం సాధ్యమౌతుందని అంచనా. మైనింగ్ రంగంలో పెట్టుబడులు మందగిస్తే ఖనిజ లోహాల సరఫరా గణనీయంగా పడిపోతుందని ఐఈఏ హెచ్చరించింది. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపకరించే సాధనాల తయారీకి కీలకమైన గ్రాఫైట్ వినియోగం 2040 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. పైన పేర్కొన్న కీలకమైన కొన్ని ఖనిజ లోహాల ధరలు కొవిడ్ ముందునాటి స్థాయిలకు పడిపోయాయి. బ్యాటరీల తయారీకి అవసరమైన లోహాల ధరలు బాగా తగ్గిపోయాయి. అయినా భవిష్యత్తులో వాటి కొరత తప్పదని నిపుణులు భావిస్తున్నారు.ఇండియాలో బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిక్షేపాలు పెద్ద మొత్తాల్లో ఉన్నట్టు గతేడాది కనుగొన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి, ప్రపంచ ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి అవసరమైన ఖనిజ లోహాల ఉత్పత్తి కేవలం కొన్ని దేశాకే పరిమితం కావడం మంచిది కాదు. దానివల్ల వాటి సరఫరా సాఫీగా సాగదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కీలక స్థానానికి చేరిన ఇండియా వంటి పెద్ద దేశాల్లో ఈ ఖనిజ లోహాల లభ్యత, విస్తృత స్థాయిలో ఉత్పత్తి ఎంతో అవసరమని అంతర్జాతీయ ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ముందస్తు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ను కంటైనర్లు, సీసాల్లో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్షిప్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పెట్రో డీలర్లకు తాజాగా మార్గదర్శకాలను ఎన్నికల సంఘం జారీ చేసింది. పెట్రోల్ బంకులపై నిరంతరం ఫ్లైయింగ్ స్క్వాడ్ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. బంకుల్లో ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రదర్శించడమే కాకుండా గొడవలు చేసే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈసీ సూచించింది. ఈ ఆదేశాల మేరకు ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రావి గోపాలకృష్ణ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డీలర్లకు సూచించారు. -
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
ఇటీవల కొందరూ సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపనులు మతిపోయేలా ఉంటాయి. అస్సలు అర్థంపర్థం లేని విధంగా రోతగా ఏవేవో రీల్స్ చేసేస్తుంటారు. చూశావాడి కర్మలే అనో లేక ఇలా చేస్తే వ్యూస్ పెరుగతాయన్న భావమో గానీ ఇలాంటి వాటి వల్ల కొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరూ నెగిటివిటీని తెచ్చుకుని చివరికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చండీగఢ్లో ఒకటి చోటు చేసుకుంది. చండీగఢ్లో ఓ ఆహార విక్రేత డీజిల్తో చేసిన పరాఠాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దూమరం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దీనిపై భారత ఫుడ్ కార్పొరేషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు సదరు ఫుడ్ యజమాని చన్నీ సింగ్ దిగొచ్చి తాము డీజిల్ పరాటా వంటవి చేయమని వివరణ ఇచ్చారు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా కస్టమర్లకు అలాంటి పరాటాలను అందించమని తెలిపారు.True recipe for cancer (petrol diesel wala paratha)Where r we heading? 🤦#AlluArjun #Pithapuram #MondayVibes #MorningVibes #MadhaviLatha #ViralVideo #ElectionDay pic.twitter.com/GyxC1xhQeb— K.P.Brinda Reddy (@kpbrindareddy) May 13, 2024 కేవలం వినోదం కోసం సరదాగా చేసిన రీల్ అని చెప్పుకొచ్చారు. మా కంటెంట్ మిమ్మల్ని ఎంతగానో బాధించిందనందుకు తనని క్షమించండని వేడుకున్నాడు. అలాగే తాము ఈ ఆలు పరాటాలను శుద్దమైన నెయ్యి, నూనెలతోనే తయారు చేస్తామని చెప్పారు. అలాగే ఆ వీడియోని తీసిన అమన్ ప్రీత్ సింగ్ కూడా ఇన్స్టామ్ వేదికగా క్షమాపణ తెలిపాడు. View this post on Instagram A post shared by Amanpreet Singh (@oyefoodiesinghఈ మేరకు సదరు వ్యక్తులు ఇన్స్టామ్లో.. చండీగఢ్ పరిపాలనా యంత్రాంగానికి, యావత్తు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక క్షమాపణలు. తాము తీసిని వీడియో కంటెంట్ మిమ్మల్ని ఎంతో భాదించదనందుకు చింతిస్తున్నాం అని అందుకు మమల్ని క్షమించండని వేడుకున్నారు. సరదా కోసి ఇలా ఏదిపడితే అది చేస్తే జనాలు ఊరుకోరు. స్టార్ డమ్, వ్యూస్ మాట పక్కన ఉంచితే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎవరైనా కేసు పెడితే ఊచలు లెక్కించా ల్సిందే. సరదా అనేది అందరికీ సంతోషమే తెప్పించాలి గానీ ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు.(చదవండి: నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!) -
పెట్రోల్, డీజిల్ @ రూ.125
-
శిలాజ ఇంధనాలకు రాయితీలు తగ్గితేనే...
శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరుగుతున్నందు వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు ఆ ఇంధనాలపై ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని వివిధ అంతర్జాతీయ సంస్థలూ, సదస్సులూ దశాబ్దాలుగా పిలుపునిచ్చాయి. ఉదాహరణకు కాప్– 21 సదస్సులో 40 కంటే ఎక్కువ దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడానికి ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. అయినా కూడా పారిశ్రామిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వినియో గానికి బడ్జెట్ బదిలీలు, పన్ను మినహాయింపులు, ఆర్థిక హామీలు అందజేస్తూనే ఉన్నాయి. ఈ సబ్సిడీల వలన వాతావరణానికి ప్రాథమికంగా హాని చేస్తున్న శిలాజ ఇంధనాల ఉపయోగం పెరుగుతూనే ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి తగిన చర్యలు లేకపోవడంతో వర్ధమాన దేశాలు కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా లేవు. 2023లో భారతదేశంలో మొత్తం ఇంధన సబ్సిడీలు రూ. 3.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’ చేసిన కొత్త పరిశోధన ప్రకారం ఇవి గత తొమ్మిదేళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశంలో ఇంధన వనరుల డిమాండ్ పెరగడంతో పాటు, 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో, ప్రభుత్వం 2023లో అన్ని రకాల ఇంధన వనరుల లభ్యతను విస్తరిస్తూ హైబ్రిడ్ విధా నాన్ని అవలంభించింది. పెరుగుతున్న ఇంధన వినియోగం, ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తరువాత అంతర్జాతీయ ఇంధన ధరల సంక్షోభం ప్రభావం, అనేక దేశాలు అనుకున్న లక్ష్యాలకు వ్యతిరేకంగా శిలాజ ఇంధనాలకు మద్దతును గణనీయంగా పెంచాయి. భారతదేశం కూడా ఈ దిశ గానే అనేక చర్యలు అమలులోకి తెచ్చింది. 2022– 2023లో గరిష్ఠ స్థాయికి చేరుకున్న శిలాజ ఇంధన ధరల ప్రభావం నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రిటైల్ ధరలను పరిమితం చేసింది. పన్నులను తగ్గించింది. వ్యాపారులు, వినియోగ దారులకు ప్రత్యక్ష నగదు బదిలీలు చేసింది. ఆయా చర్యల ఫలితంగా చమురు, గ్యాస్ సబ్సిడీలు 2022తో పోలిస్తే 2023లో 63 శాతం పెరిగాయి. అయితే, 2023లో మొత్తం ఇంధన సబ్సిడీలలో బొగ్గు, చమురు, గ్యాస్ సబ్సిడీలు దాదాపు 40 శాతం కాగా, కాలుష్య రహిత ఇంధన వనరుల (క్లీన్ ఎనర్జీ)కు సబ్సిడీలు 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. మిగిలిన సబ్సిడీలలో ఎక్కువ భాగం విద్యుత్ వినియోగానికీ, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవీ ఉన్నాయి. ఇదే కాలంలో బొగ్గు సబ్సిడీలు కూడా 17 శాతం పెరిగాయి. మొత్తంగా క్లీన్ ఎనర్జీ సబ్సిడీల కంటే శిలాజ ఇంధన సబ్సిడీలు ఐదు రెట్లు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రత్యక్ష బడ్జెట్ బదిలీల ద్వారా చమురు, గ్యాస్ రంగానికి గణనీయమైన మద్దతును అందించింది. ఈ కాలంలో, మొత్తం చమురు – గ్యాస్ సబ్సిడీలు కనీసం రూ.70,692 కోట్లకు పెరి గాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా వరి, గోధుమలు, మక్కలు, చెరుకు వంటి ఆహార సంబంధిత ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయ డానికి చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఒకవైపు ఆహార భద్రత సాధించటానికీ, ఆకలి తగ్గించడానికీ వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... ఇంకొక వైపు సబ్సిడీలు ఇచ్చి అదే ఆహార పంటలను ఇతరత్రా ఉపయోగాలకు మళ్ళిస్తోంది. ఇందువల్ల కలిగే దీర్ఘకాలిక దుష్ప్రభావం ఊహించలేని విధంగా ఉండవచ్చు. 2020 ఆర్థిక సంవత్సరంలో, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం ఇంధన ఆదాయం రూ. 6,99,565 కోట్లుగా అంచనా. ఇది మొత్తం ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 17 శాతం. ఇంధన వనరుల నుంచి వచ్చే ఆదా యంలో ఎక్కువ భాగం (83శాతం) చమురు, గ్యాస్ నుండి వస్తోంది. పునరుత్పాదక ఇంధనం నుంచి 1 శాతం కంటే తక్కువే వస్తోంది. ఈ ఆదాయం కూడా ఎక్కువగా కేవలం రెండు పన్నుల నుండి వస్తోంది: కేంద్ర ఇంధన ఎక్సైజ్, రాష్ట్ర స్థాయి వ్యాట్. శిలాజ ఇంధన శక్తి వనరుల వల్ల ఆదాయం 2030 నాటికి అదనంగా రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 3,40,000 కోట్లకు పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కోల్పోవటానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. క్రమంగా ఈ ఆదాయం మీద ఆధార పడటం తగ్గించడానికి కూడా సుముఖంగా లేవు. అయితే శిలాజ ఇంధనాల వల్ల ఆదాయం మాత్రమే కాదు భారం కూడా ఉంటుంది. ఇంధనాల ధరలో ప్రతిబింబించని ఖర్చుల భారం చాల ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఈ భారం ప్రభుత్వ ఆదాయానికి ఐదు రెట్లు ఎక్కువ. ఈ భారం రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా నీరు, గాలి, ఇతర ప్రకృతి వనరుల కాలుష్యం వల్ల కలిగే మరణాలు, అనారోగ్య సమస్యలు, వాటిని అధిగమించడానికి కల్పించవలసిన మౌలిక సదుపాయాల రూపంలో ఈ భారాన్ని చూడవచ్చు. అందుకే కాలుష్య రహిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) ఉత్పత్తులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. ప్రపంచ వాతా వరణ సదస్సులలో కాలుష్య రహిత ఇంధనాల వైపు ఉత్పత్తి, వినియోగ రంగాలు మారాలని ఎప్పటి నుంచో ఒత్తిడి ఉంది. ‘గ్లాస్గో కాప్ 26’ సదస్సులో బొగ్గు ఆధా రిత విద్యుత్, ఇతర ఇంధన ఉపయోగాలను క్రమంగా తగ్గించాలని పెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. కేవలం బొగ్గు కాకుండా అన్ని రకాల శిలాజ ఇంధనాల ఉపయోగం క్రమంగా తగ్గించాలని వాదించింది. దుబాయి కాప్ 28 సదస్సులో ఈ దిశగా అన్ని రకాల శిలాజ ఇంధనాలను దశల వారీగా తగ్గించాలనే తీర్మానం దాదాపు ఖరారు అయినా సర్వామోదం పొందలేదు. పెరుగుతున్న కర్బన కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకర శిలాజ ఇంధ నాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా వాటికి రాయితీలు తగ్గించాలి. అది సాధ్యం కావాలంటే సమూల ఆర్థిక పరివర్తనం అవసరం. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తే ఆర్థిక వృద్ధి సుస్థిరం అవుతుంది. శిలాజ ఇంధన దిగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక అభివృద్ధి సుస్థిరం ఎప్పటికీ కాలేదు. ప్రకృతిని కలుషితం చేస్తూ అభివృద్ధి దిశగా పయనించడం దుర్భరంగా ఉంటుంది. అందుకే కర్బన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా అవసరమైన వాతా వరణ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఒక ఆచరణాత్మక దృష్టి అవసరం. ప్రభుత్వం శిలాజ ఇంధన పన్ను ఆదా యంలో కొంత భాగాన్ని కొత్త కాలుష్య రహిత శక్తి వనరుల వైపు మళ్ళించాలి. సుస్థిర అభివృద్ధికీ, సమాన ఫలాలు అందరికీ అందించే ఆర్థిక వ్యవస్థకూ ఇంధనాల కూర్పు చాల కీలకం. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
వాహనదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
లోక్సభ 2024 ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ఏకంగా రూ. 2 తగ్గింపు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. కొత్త ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని మంత్రి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గింపు నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 89.62 రూపాయలున్న లీటరు డీజిల్ రేపటి నుంచి రూ. 87.62లకు విక్రయిస్తారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధానిలో 96.72 రూపాయలుగా ఉన్న లీటరు పెట్రోల్ రేపటి నుంచి రూ. 94.72 కి లభిస్తుంది. पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है। वसुधा का नेता कौन हुआ? भूखण्ड-विजेता कौन हुआ? अतुलित यश क्रेता कौन हुआ? नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C — Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024 -
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్పై ఇస్తున్న డిస్కౌంట్ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్పై బ్యారెల్కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్డాడ్ పూర్డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
తెలంగాణలో ప్రజలకు చుక్కలు చూపిన పెట్రోల్, డీజిల్ కొరత
-
ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సాయంత్రానికి పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బంకుల వద్ద ట్రాఫిక్ స్తంభన ప్రభావం ప్రధాన కూడళ్లు, రహదారులపై పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పనుల మీద బయటకొచ్చిన వారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ అయిపోయిన వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో.. వాస్తవానికి రెండురోజుల క్రితమే వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఫలితంగా ప్రెటోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. ఇక బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వేలాదిగా వాహనాలు బారులు తీరాయి. సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్న ఆందోళనతో ఎక్కువమంది ట్యాంకులు ఫుల్ చేయించడం కన్పించింది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద క్యాన్లలో ఆయిల్ నింపుకొని తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నానికల్లా చాలా వరకు బంకుల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. ఆయా బంకుల యాజమానులు బంకులు మూసేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకులు ఉండగా 3 వేల వరకు బంకులు మూతపడటంతో సాయంత్రానికి పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యింది. హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకులన్నింటిలో నిల్వలు ఖాళీ అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నిల్వలు ఖాళీ కావడంతో డీలర్ల సొంత ట్యాంకర్లను రంగంలోకి దింపారు. వారు ఆందోళన విరమించి ఇంధన సరఫరాకు సిద్ధమయ్యారు. మరోవైపు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు నిరసనగా డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేసి ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల అసోసియేషన్లు కూడా సమ్మె విరమించే అవకాశాలు ఉండటం, చమురు సంస్ధల డిపోల వద్దకు డీలర్ల ట్యాంకర్లు లోడింగ్కు చేరుకోవడంతో బుధవారం ఆయిల్ సరఫరాకు అంతరాయం ఉండబోదని డీలర్ల వర్గాలు ప్రకటించాయి. ఇంధన సరఫరాలో కొరత ఉండదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఇంధన ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్లో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చించాలని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ట్యాంకర్ల డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పా జంక్షన్ వద్ద ఎస్ఐకి గాయాలు! రాజేంద్రనగర్: బండ్లగూడ అప్పా జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం వచ్చిన సందర్భంగా వాగ్వావాదం జరగడంతో పరస్పరం దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెట్రోల్ బంకును పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. విధుల్లో ఉన్న ఒక ఎస్ఐ ర్యాంకు అధికారితో పాటు సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు చెప్పారు. -
‘పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయం’.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో పిల్లల శ్వాస, నాడీ వ్యవస్థలను వాయు కాలుష్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. దాంతో పిల్లల్లో న్యుమోనియా కేసులు అధికమవుతున్నాయి. పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం వాతావరణంలోనూ అనూహ్య మార్పులు తీసుకొస్తోంది. మొత్తంగా ఇది కంటికి కనిపించని శత్రువుగా పరిణమించింది. భారత్లోనూ ఈ సమస్య పోనుపోను తీవ్రతరమవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయంగా పెట్రోల్, డీజిల్లతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ కూడా 2024 జనవరి ఒకటో తేదీ (సోమవారం) నుంచి డీజిల్, పెట్రోల్లతో నడిచే వాహనాలను కొనుగోలు చేయవద్దని ఆదేశించారు. ఈ నిర్ణయం ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంతోపాటు ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ శాఖలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనాలంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 185, ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలు 2733గా ఉందని సీఎం తెలిపారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఏటా వాయు ప్రమాణాలను అధ్యయనం చేస్తోంది. దాని ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రూపొందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన నివేదికలో ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలు తగ్గవు..!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై పన్నుల్లో కోత విధించే అవకాశం లేదని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఇప్పటికే తగ్గాయని, ఈ నేపథ్యంలో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే పరిస్థితి లేదని చెప్పారు. భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతానికి దిగుమతులపై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ధరలు ఇప్పటికే తగ్గినప్పుడు, ఇక పన్ను తగ్గింపు ప్రశ్న ఉత్పన్నం కాదు. మీరు పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు కోసం అడగవచ్చు, కానీ పన్నుల తగ్గింపు గురించి ఇప్పుడు ప్రశ్నించడం సరికాదు’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని చివరిసారిగా మే 2022లో తగ్గించారు. ఈ నిర్ణయం మేరకు పెట్రోల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు రూ.8 తగ్గింది. డీజిల్పై రూ.6 తగ్గించడం జరిగింది. రూ.33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్లే లక్ష్యం! బడ్జెట్ సవరిత అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రూ. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని శాఖ సీనియర్ అధికారి తెలిపారు. -
తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే..
డీజిల్ అమ్మకాలు నవంబర్లో 7.5 శాతం మేర క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 7.33 మిలియన్ టన్నుల నుంచి 6.78 మిలియన్ టన్నుల విక్రయాలకు పరిమితమయ్యాయి. దీపావళి సందర్భంగా కొందరు ట్రక్ డ్రైవర్లు విరామం తీసుకుని, ఇళ్లకు వెళ్లిపోవడం వల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నెలలో విక్రయాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని పేర్కొన్నారు. పెట్రోల్ ఇంధన అమ్మకాల్లో డీజిల్ వాటా 40 శాతం మేర ఉంటుంది. 70 శాతం మేర డీజిల్ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. మూడు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థల ద్వారా పెట్రోల్ అమ్మకాలు నవంబర్ నెలలో 7.5 శాతం పెరిగి 2.86 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. పండుగల సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం ఇందుకు మద్దతుగా నిలిచింది. డీజిల్ డిమాండ్ నవంబర్ మొదటి 15 రోజుల్లో 12.1 శాతం క్షీణించగా, ఆ తర్వాత తిరిగి కోలుకుంది. అక్టోబర్లో మొదటి అర్ధభాగంలో పెట్రోల్ డిమాండ్ 9 శాతం తగ్గగా, అదే కాలంలో డీజిల్ అమ్మకాలు 3.2 శాతం క్షీణించాయి. ఆ తర్వాత దుర్గా పూజ, దసరా నవరాత్రుల సమయంలో డిమాండ్ మళ్లీ పుంజుకోవడం గమనార్హం. ఇక నెలవారీగా చూస్తే, అక్టోబర్ కంటే నవంబర్లో డీజిల్ అమ్మకాలు 3.6 శాతం అధికంగా నమోదయ్యాయి. ఏటా వర్షాకాలంలో మూడు నెలల పాటు డీజిల్ అమ్మకాలు క్షీణించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత అమ్మకాలు తిరిగి పుంజుకోవడాన్ని గమనించొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం మేర డీజిల్ అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఏటీఎఫ్ అమ్మకాల్లోనూ సానుకూలత ఇక విమానయాన ఇంధన అమ్మకాలు (ఏటీఎఫ్) నవంబర్ నెలలో 6,20,000 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలతో పోలిస్తే 6.1 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2021 నవంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే 31.6 శాతం పెరిగాయి. కరోనా ముందు సంవత్సరం 2019 నవంబర్ నెలలో అమ్మకాలు 6,70,000 టన్నులతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో ఏటీఎఫ్ అమ్మకాలు 6,11,300 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ (వంటగ్యాస్) విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 0.9 శాతం తక్కువగా 2.57 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. అక్టోబర్లో నమోదైన 2.52 మిలియన్ టన్నులతో పోలిస్తే 2 శాతం పెరిగాయి. -
ఇతర సంస్థల నుంచి డీజిల్ కొనుగోళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి కంపెనీల నుంచి డీజిల్ కొనుగోళ్లను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయాలని ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) భావిస్తోంది. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయి, వచ్చే ఆర్థిక సంవత్సరం రాజస్థాన్లో కొత్త రిఫైనరీని నిర్మించిన తర్వాత నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో సంస్థ వెల్లడించింది. వైజాగ్ రిఫైనరీ ప్రస్తుత వార్షిక సామర్ధ్యం 13.7 మిలియన్ టన్నులుగా ఉండగా విస్తరణ పనులు పూర్తయితే 15 మిలియన్ టన్నులకు పెరుగుతుందని కంపెనీ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. రాజస్థాన్ రిఫైనరీ 72 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది దశలవారీగా వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము విక్రయించే పెట్రోల్లో 43 శాతం, డీజిల్లో 47 శాతం ఇంధనాలను ముంబై, వైజాగ్ రిఫైనరీలు సమకూరుస్తున్నాయి. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయ్యాక డీజిల్ విక్రయాల్లో హెచ్పీసీఎల్ సొంత రిఫైనరీల వాటా 61 శాతానికి పెరుగుతుంది. రాజస్థాన్ రిఫైనరీ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం డీజిల్ను హెచ్పీసీఎల్ సొంతంగానే ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. దేశీయంగా మొత్తం పెట్రోల్ బంకుల్లో దాదాపు పావు శాతం బంకులు హెచ్పీసీఎల్వే ఉన్నాయి. అయితే, వాటిలో విక్రయ అవసరాలకు తగినంత స్థాయిలో సొంతంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేసుకోలేకపోతుండటంతో ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. హెచ్పీసీఎల్ ఇప్పటికే తమ ముంబై రిఫైనరీ సామరŠాధ్యన్ని 7.5 మిలియన్ టన్నుల నుంచి 9.5 మిలియన్ టన్నులకు విస్తరించింది. -
పండుగల జోష్.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది. అక్టోబర్ మొదటి 15 రోజుల్లో అమ్మకాలు తగ్గగా.. తర్వాతి 15 రోజుల్లో గణనీయంగా పెరిగాయి. దీంతో విక్రయాల్లో నికర వృద్ధి నమోదైంది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ అక్టోబర్లో 3 శాతం అధికంగా 2.87 మిలియన్ టన్నుల పెట్రోల్ను విక్రయించాయి. డీజిల్ అమ్మకాలు 5 శాతం పెరిగి 6.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అక్టోబర్ మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు 9 శాతం తగ్గగా, డీజిల్ విక్రయాలు 3.2 శాతం క్షీణతను చూడడం గమనార్హం. తిరిగి దసరా నవరాత్రుల సమయాల్లో వీటి విక్రయాలు బలంగా పుంజుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ తొలి 15 రోజుల్లో పెట్రోల్ విక్రయాలు 1.17 మిలియన్ టన్నులుగా ఉంటే, తర్వాతి 15 రోజుల్లో దీనికంటే 44 శాతం అధికంగా 1.70 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు అక్టోబర్ మొదటి భాగంలో 2.99 మిలియన్ టన్నులుగా నమోదు కాగా, ద్వితీయ భాగంలో 3.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్లో డీజిల్ అమ్మకాలు 5.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు అక్టోబర్ నెలకు 6,21,200 టన్నులుగా ఉన్నాయి. 2021 అక్టోబర్ విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 6.9 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో అమ్మకాలు 6,03,600 టన్నులతో పోల్చి చూసినా 3 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఎల్పీజీ విక్రయాలు 5 శాతం వృద్ధితో 2.49 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ విక్రయాలు - కారణం ఏంటంటే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1–15తో పోలిస్తే ఈ నెల తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది. డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్ టన్నులకు వచ్చి చేరింది. 2022 అక్టోబర్లో దుర్గా పూజ/దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా ఉంది. 2023 సెప్టెంబర్ 1–15తో పోలిస్తే ఈ నెల 1–15 మధ్య పెట్రోల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు మాత్రం 9.6 శాతం ఎగశాయి. 2022 అక్టోబర్తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నులు నమోదైంది. నెలవారీగా పెరుగుతూ.. నీటి పారుదల, సాగు, రవాణా కోసం ఇంధనాన్ని ఉపయోగించే వ్యవసాయ రంగంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డీజిల్ అమ్మకాలు సాధారణంగా రుతుపవన నెలలలో క్షీణిస్తాయి. అలాగే వర్షం కురిస్తే వాహనాల రాకపోకలు మందగిస్తాయి. దీంతో గత మూడు నెలల్లో డీజిల్ వినియోగం తగ్గింది. రుతుపవనాలు ముగిసిన తర్వాత వినియోగం నెలవారీగా పెరిగింది. 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్ వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. అలాగే డీజిల్ వాడకం 2021 అక్టోబర్తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 36.5 శాతం అధికంగా, 2019 అక్టోబర్తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. వంటకు ఉపయోగించే ఎల్పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్ టన్నులుగా ఉంది. -
డీజిల్ అమ్మకాల్లో అదే ధోరణి
న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకాల్లో క్షీణత కొనసాగుతూనే ఉంది. సెపె్టంబర్ నెలలోనూ 3% తక్కువగా విక్రయాలు నమోదయ్యాయి. ఆగస్ట్లోనూ డీజిల్ అమ్మకాలు 3.2% తగ్గడం గమనించొచ్చు. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నాలుగు నెలల వర్షాకాల సీజన్లో డీజిల్ అమ్మకాలు తక్కువగా నమోదవుతుంటాయి. ఇక పెట్రోల్ విక్రయాలు 5.4% పెరిగాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కె టింగ్ కంపెనీలు హెచ్పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ ఉమ్మడి గణాంకాలు ప్రతి నెలా విడుదల అవుతుంటాయి. వీటి ప్రకారం సెపె్టంబర్లో డీజిల్ అమ్మకాలు 5.81 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో 5.99 మిలియన్ టన్నుల మేర అమ్మకాలు ఉండడం గమనార్హం. ముఖ్యంగా సెపె్టంబర్ నెలలో మొదటి 15 రోజుల్లో డీజిల్ అమ్మకాలు 5 శాతం తగ్గగా, తర్వాతి 15 రోజుల్లో వర్షాలు లేకపోవడంతో పుంజుకున్నాయి. ఇక ఆగస్ట్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డీజిల్ అమ్మకాలు 2.5 శాతం పెరిగాయి. ఆగస్ట్ నెలలో డీజిల్ విక్రయాలు 5.67 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరిగాయి. జూన్ నుంచి తగ్గుతూ వస్తున్నాయి. పెట్రోల్ విక్రయాలు సెప్టెంబర్ నెలలో 2.8 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 5.4 శాతం వృద్ధి కనిపించింది. ఆగస్ట్ నెలలో మాత్రం పెట్రోల్ విక్రయాలు ఫ్లాట్గా ఉన్నాయి. -
ఊపందుకున్న పెట్రోల్ వినియోగం.. నీరసించిన డీజిల్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఈ నెల తొలి పక్షం రోజుల్లో పెట్రోల్ వినియోగం ఊపందుకోగా.. డీజిల్ అమ్మకాలు నీరసించాయి. వర్షాలు డిమాండును దెబ్బతీయడంతో వరుసగా రెండో నెలలోనూ డీజిల్ విక్రయాలు మందగించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పారిశ్రామిక కార్యక్రమాలు మందగించడం సైతం ప్రభావం చూపింది. గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు నామమాత్రంగా పుంజుకున్నాయి. ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వివరాల ప్రకారం ఈ నెల 1–15 మధ్య డీజిల్ అమ్మకాలు 5.8 శాతం క్షీణించి 2.72 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. అయితే ఈ ఆగస్ట్ తొలి 15 రోజులతో పోలిస్తే 1 శాతం పుంజుకున్నాయి. కాగా.. పెట్రోల్ అమ్మకాలు 1.2 శాతం పెరిగి 1.3 మిలియన్ టన్నులను తాకాయి. ఆగస్ట్ తొలి పక్షంతో పోలిస్తే 8.8 శాతం ఎగశాయి. -
సామాన్యులపై మరో పిడుగు: ముడిచమురుపై భారీగా టాక్స్ పెంపు
Windfall Tax on Crude oil భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్ఫాల్ టాక్స్ను భారీగా పెంచింది. టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. సవరించిన ధరలు నేటి (సెప్టెంబర్ 16)నుంచే అమల్లో ఉంటాయి. తాజా నిర్ణయంతో ఇప్పటికే పెట్రో భారంతో అతలాకుతమవుతున్న సామాన్యులపై మరింత భారం పెరగనుంది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF)పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటర్కు 4 రూపాయల నుండి 3.50 రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది. అలాగే డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ను లీటరుకు రూ.6 నుంచి రూ.5.5కు తగ్గిస్తున్నట్లుకేంద్రం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతిపై SAED సున్నాగా కొనసాగుతుంది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లు సమీక్ష ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న జరిగిన పక్షంవారీ సమీక్షలో ప్రభుత్వం ముడి పెట్రోలియంపై టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించింది. భారతదేశంలోని చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ పన్నును గత ఏడాది జూలైలో మొదటిసారిగా విధించారు. అలాగే సెప్టెంబర్ 1న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ ట్యాక్స్ను టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించిన సంగతి తెలిసిందే.మరోవైపు చమురు ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. -
తగ్గనున్న డీజిల్ వాహన అమ్మకాలు - కారణం ఇదే!
న్యూఢిల్లీ: కఠిన ఉద్గార నిబంధనల కారణంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో డీజిల్ కార్ల శాతం తగ్గుతుందని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. వాహనం ఖరీదు కావడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. ఇప్పటికే డీజిల్ వాహన అమ్మకాలు క్షీణిస్తున్నట్టు తెలిపాయి. నిబంధనలు కఠినతరం అయితే సహజంగానే ధర పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో డీజిల్ వాహనాల విక్రయాల తగ్గుదల శాతం వేగంగా ఉంటుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. డీజిల్ మోడళ్లకు స్వస్తి పలుకుతున్నట్టు ఇప్పటికే చాలా కంపెనీలు స్పష్టం చేశాయన్నారు. ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో 2013–14లో డీజిల్ మోడళ్ల వాటా 53.2 శాతం. ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్లో ఇది 18.2 శాతానికి వచ్చి చేరిందన్నారు. డీజిల్–పెట్రోల్ మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం తగ్గింది. డీజిల్ వాహనాలతో లభించే వ్యయ ప్రయోజనాలు తగ్గాయన్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ మాట్లాడుతూ తమ కంపెనీ అమ్మకాల్లో డీజిల్ విభాగం వాటా 18 శాతానికి వచ్చి చేరిందన్నారు. -
10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ
10% GST on the sale of diesel vehicles: పొల్యూషన్కు చెక్ పెట్టేలా డీజిల్ ఇంజన్ల వాహనాల కొనుగోలుపై 10 శాతం అదనపు జీఎస్టీ బాదుడుకు కేంద్రం సిద్ధమవుతోందన్న వార్తలు కలకలం రేపాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచన మేరకు ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇక డీజిల్ వాహనాలకు కాలం చెల్లినట్టే అన్న ఊహాగానాలు మార్కెట్లో వ్యాపించాయి. దీంతో స్టాక్మార్కెట్లో ఆటో, చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా తీవ్ర నష్టాలను చవి చూశాయి. అయితే దీనిపై తక్షణమే స్పందించిన రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వార్తలు అవాస్తవాలు అంటూ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి 'యాక్టివ్ పరిశీలన'లో లో లేదని స్పష్టం చేశారు. అయితే 2070 నాటికి కార్బన్ ఉద్గరాలను పూర్తిగా నిరోధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా డీజిల్ వంటి ప్రమాదకర ఇంధనాల వల్ల ఏర్పడే వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడంతోపాటు ఆటోమొబైల్ విక్రయాలు వేగంగా పెరుగుతుండటంతో క్లీనర్ , గ్రీన్ ఆల్టర్నేటివ్ ఇంధనాలను చురుకుగా స్వీకరించడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈ ఇంధనాలు దిగుమతి ప్రత్యామ్నాయాలుగా, ఖర్చుతో కూడుకున్నవి కాకుండా దేశీయమైనవి , కాలుష్య రహితంగా ఉండాలని సూచించారు. పర్యావరణహితమైన వాహనాల ఉత్పత్తిపై కంపెనీలు దృష్టి సారించాలన్నారు. There is an urgent need to clarify media reports suggesting an additional 10% GST on the sale of diesel vehicles. It is essential to clarify that there is no such proposal currently under active consideration by the government. In line with our commitments to achieve Carbon Net… — Nitin Gadkari (@nitin_gadkari) September 12, 2023 -
కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్ఫాల్ ట్యాక్స్ కట్
దేశీయంగా క్రూడ్పై విండ్ఫాల్ ట్యాక్స్ను భారీగా తగ్గించింది. అలాగే డీజిల్, ఎటిఎఫ్ ఎగుమతులకు చెక్ పెట్టేలా లెవీనీ కూడా పెంచింది. ముడి చమురు అమ్మకంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ.6,700కి తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఇది సెప్టెంబర్ 2 నుండి అమలుల్లోఉంటుందని తెలిపింది. క్రూడ్ పెట్రోలియంపై సాడ్ టన్నుకు రూ.7100 నుంచి రూ.6700కి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆగస్టు 14న జరిగిన సమీక్షలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.7,100గా విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. ( డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లెవీ పెంపు మరోవైపు డీజిల్ ఎగుమతిపై SAED లేదా సుంకం లీటరుకు రూ.5.50 నుండి రూ.6కి పెంచింది. జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్పై సుంకం లీటరుకు రూ.2 నుంచి రూ.4కు రెట్టింపు అవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలియం ఎగుమతులపై సుంకం ఏమీఉండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్పై దాడి తర్వాత ఉత్పత్తి కంపెనీలు భారీ లాభాల నేపథంయలో జూలై 1, 2022 నుండి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు అమ్మకాలపై కేంద్రం మొదట విండ్ఫాల్ పన్నులను విధించింది. అంతేకాకుండా, దేశీయ మార్కెట్కు బదులుగా, ప్రైవేట్ రిఫైనర్లు మెరుగైన అంతర్జాతీయ ధరల మధ్య విదేశాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నందున పెట్రోల్, డీజిల్ ,జెట్ ఇంధనాల ఎగుమతులపై అదనపు సుంకంవిధించిన సంగతి తెలిసిందే. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) -
సౌర పడవలతో చేపలవేట
సాక్షి, హైదరాబాద్: చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయత్నాలను ఆరంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తెప్పలతో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులకు సౌరశక్తితో నడిచే పడవలు అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు వందకుపైగా జలాశయాల్లో.. దాదాపు లక్ష మందికి పైగా మత్య్సకారులకు తెప్పలతో చేపల వేట జీవనాధారంగా ఉంది. లోతైన నీటిలో తెప్పలపై అనేక మంది మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు మృతి చెందుతున్నారు. తెప్పపై నుంచి వల వేయడం, తెడ్డు సాయంతో పడవ ముందుకు నడపడంలో అనేక ఇబ్బందులొస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిన్నింటిని గుర్తించి మత్స్యకారుల మేలు కోసం ఇకపై సౌరశక్తి పడవలు సమకూర్చాలని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య నిర్ణయించింది. మరబోట్లతో అధిక వ్యయం: చేపల వేటకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మరబోట్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ చెప్పారు. ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను పరిశీలించినట్టు తెలిపారు. కేరళలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీతో తెలంగాణకు సౌరశక్తి పడవులను తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్లోని ‘బిట్స్ పిలాని’సంస్థ నిపుణులతో శనివారం చర్చలు జరిపామని పేర్కొన్నారు. సహకారం అందించేందుకు బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోరపాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారని రవీందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జలాశయాలన్నింటిలోనూ సౌరశక్తితో నడిచే పడవులను ప్రవేశపెడతామని రవీందర్ వెల్లడించారు. -
ముడిచమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపైన, డీజిల్ ఎగుమతులపైన కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ను పెంచింది. దీనితో క్రూడాయిల్పై ట్యాక్స్ టన్నుకు రూ. 7,100 మేర పెరిగింది. అలాగే, డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ) లీటరుకు రూ. 1 చొప్పున కేంద్రం పెంచింది. దీంతో ఇది లీటరుకు రూ. 5.50కి చేరింది. అటు విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై కూడా లీటరుకు రూ. 2 చొప్పున సుంకం విధించింది. ఇప్పటి వరకు ఏటీఎఫ్పై ఎస్ఏఈడీ లేదు. తాజా మార్పులు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. క్రూడ్ రేట్ల కారణంగా చమురు కంపెనీలు అసాధారణంగా ఆర్జిస్తున్న లాభాలపై కేంద్రం 2022 జూలై 1 నుంచి విండ్ఫాల్ ట్యాక్స్ను విధిస్తోంది. -
పెట్రోల్కు పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా డీజిల్ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు. ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది. 2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్పీజీ అమ్మకాలు పెరిగాయి. -
‘అంబులెన్స్లో డీజిల్ లేదు...రూ. 800 ఇస్తేనే తీసుకెళ్తా’.. రోగి మృతి
సాక్షి, నిజామాబాద్: మెరుగైన చికిత్స కోసం ఓ రోగిని బాన్సువాడ నుంచి నిజామాబాద్కు తరలించారు. అయితే డీజిల్కు డబ్బులు ఇవ్వలేదని అంబులెన్స్ డ్రైవర్ రోగిని తీసుకెళ్లలేదు. దీంతో పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందిన ఘటన బాన్సువాడ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన సాయిలు (40) వాంతులు, విరోచనాలతో మూడురోజుల క్రితం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. సోమవారం తెల్లవారుజామున సాయిలుకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న వైద్యుడు పరిస్థితి గమనించి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని సాయిలు కుమారుడికి సూచించారు. వైద్య సిబ్బంది ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ చేసి పిలిపించారు. అయితే డ్రైవర్ అంబులెన్స్లో డీజిల్ లేదని...రూ.800 ఇవ్వాలని సాయిలు కుమారుడికి చెప్పాడు. తన వద్ద రూ.50 ఉన్నాయని, ఎలాగైనా తన తండ్రిని నిజామాబాద్కు తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్ను ప్రాధేయపడ్డాడు. డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా, కొద్దిసేపటి తర్వాత సాయిలు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. సాయిలు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై, అంబులెన్స్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ మహేందర్రెడ్డి వచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో కొత్తకొండ భాస్కర్, కాసుల బాల్రాజ్, గుడుగుట్ల శ్రీనివాస్, ఖలేక్, హన్మాండ్లు, మంత్రి గణేశ్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే -
పెట్రోల్, డీజిల్కు తగ్గిన డిమాండ్
న్యూఢిల్లీ: భారీ వర్షాల అంచనాలతో ప్రయాణ ప్రణాళికలు, వ్యవసాయ రంగంలో ఇంధన వినియోగ ధోరణులు మారిపోవడంతో జూలై ప్రథమార్ధంలో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ పడిపోయింది. పరిశ్రమ ప్రాథమిక డేటా ప్రకారం .. గతేడాది జూలై 1–15 తేదీల మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో డీజిల్కు డిమాండ్ 15 శాతం క్షీణించి 2.96 మిలియన్ టన్నులకు పరిమితమైంది. నెలవారీగా దాదాపు 20 శాతం క్షీణించింది. పెట్రోల్ అమ్మకాలు 10.5 శాతం తగ్గి 1.25 మిలియన్ టన్నులకు దిగి వచ్చాయి. నెలవారీగా 10.8 శాతం తగ్గాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ సంస్థలు గణనీయంగా కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో దాదాపు ఏడాది కాలంగా ఇంధనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇదీ చదవండి ➤ IT Dept Clarification On PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ మార్చి ద్వితీయర్ధం నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలు మరింతగా పుంజుకున్నాయి. అయితే, రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, ఇతరత్రా వ్యవసాయ అవసరాలకు జనరేటర్ల వినియోగం తగ్గడం తదితర అంశాలు ఇంధనాల డిమాండ్ తగ్గుదలకు కారణమయ్యాయి. -
పెట్రోల్, డీజిల్పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) బంకుల కన్నా చౌకగా ప్రైవేట్ కంపెనీలు ఇంధనాలను విక్రయిస్తున్నాయి. జియో–బీపీ తర్వాత తాజాగా నయారా ఎనర్జీ ఈ జాబితాలోకి చేరింది. పీఎస్యూ బంకులతో పోలిస్తే రూ. 1 తక్కువకే తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్ను విక్రయిస్తున్నట్లు వివరించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లో డిస్కౌంటు రేట్లకు విక్రయాలను జూన్ ఆఖరు వరకు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా మొత్తం 86,925 పైచిలుకు పెట్రోల్ బంకులు ఉండగా.. నయారా ఎనర్జీకి 6,376 బంకులు (7 శాతం పైగా వాటా) ఉంది. జియో–బీపీ (రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ) తమ బంకుల్లో ప్రస్తుతం డీజిల్ను మాత్రమే పీఎస్యూ బంకుల కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినప్పటికీ పీఎస్యూలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం రేట్లను సవరించకుండా యథాప్రకారం కొనసాగిస్తున్నాయి. అయితే, జియో–బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు మాత్రం ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకే డిస్కౌంటుకు విక్రయిస్తున్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?..
పెట్రోల్, డీజిల్ వినియోగానికి సంబంధించి వినియోగదారులలో చాలా అపోహలు తలెత్తుతుంటాయి. కారు మైలేజీ పెంచుకునే ఉపాయాలు మొదలుకొని పెట్రోల్ ధర వరకూ చాలామందిలో నిత్యం చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో కొందరు వాహనంలో పెట్రోల్ పోయించేందుకు ప్రత్యేక సమయం ఉందని చెబుతూ, ఆ సమయంలోనే ఇంధనం పోయించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పెట్రోల్ పోయించేందుకు ఉదయం తగిన సమయం అని చాలామంది చెబుతుంటారు. కొందరు దీనిని ఖండిస్తూ, రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించడం ఉత్తమం అని అంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో పెట్రోల్ పోయించేందుకు తగిన సమయం ఏదనే ప్రశ్న మనలో తలెత్తుతుంటుంది. నిజానికి ఇటువంటి వాదనలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతుంటాయి. పైగా ఈ అంశానికి సంబంధించి ఇంటర్నెట్లో పలు ఆర్టికల్స్ కూడా కనిపిస్తుంటాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! వీటిలో రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించకూడదని, తెల్లవారుజామునే పెట్రోల్ పోయిస్తే డబ్బులు ఆదా అవుతాయని, వాహనంలో అధికంగా పెట్రోల్ పడుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో నిజం ఏమేరకు ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వేడి కారణంగా ఇంధనం విస్తరిస్తుంది. అందుకే ఉదయం తెల్లవారుతున్న సమయంలో వాహనంలో పెట్రోల్ పోయిస్తే, అధికంగా నిండుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో వాస్తవం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ప్రపంచంలోని అత్యధిక ఇంధన స్టేషన్లలో భూమిలోపల ట్యాంకులలో పెట్రోల్ లేదా డీజిల్ రిజర్వ్ చేస్తుంటారు. ఫలితంగా ఇంధన ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. పైగా ట్యాంకులకు అత్యధిక దళసరితో కూడిన మూతలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే వాహనంలో ఏ సమయంలో పెట్రోల్ పోయించినా దానిపై ఉష్ణోగ్రత ప్రభావం పడదు. ఇందన సంకోచ, వ్యాకోచాలలో తేడా ఏర్పడదు. అందుకే ఉదయం వేళలో వాహనంలో పెట్రోల్ పోయించినప్పటికీ ఎటువంటి తేడా రాదు. తెల్లవారుజామున పెట్రోల్ పోయించడం వలన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే!
Jio-bp premium diesel: ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ను నడుపుతున్న భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రాష్ట్ర ఇంధన హోల్సేలర్ల కంటే తక్కువ ధరకే డీజిల్ను విక్రయిస్తోంది. ఇదీ చదవండి: SEBI on Adani: అదానీ గ్రూప్పై సెబీ కీలక వివరణ! సుప్రీం కోర్టుకు రిజాయిండర్ అఫిడవిట్ జియో-బీపీ (Jio-bp) ప్రీమియం డీజిల్ను తాజాగా ప్రారంభించింది. జియో-బీపీ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూకేకి చెందిన బీపీ అనే ఇంధన సంస్థల జాయింట్ రిటైలింగ్ వెంచర్. జియో-బీపీ ప్రారంభించిన ఈ ప్రీమియం డీజిల్ ధర ఇతర ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు విక్రయస్తున్న సాధారణ డీజిల్ కంటే తక్కువగా ఉంది. భారతీయ వినియోగదారుల కోసం డీజిల్ ప్రమాణాలను పెంచడానికి యాక్టివ్ టెక్నాలజీతో కూడిన డీజిల్ను విడుదల చేస్తున్నట్లు జియో-బీపీ ప్రకటించింది. భారీగా ఇంధన ఆదా కొత్తగా లాంచ్ చేసిన డీజిల్ కంపెనీ నెట్వర్క్ పరిధిలోని అన్ని అవుట్లెట్లలోనూ అందుబాటులో ఉంటుందని, 4.3 శాతం మెరుగైన ఇంధన వ్యవస్థ కారణంగా ట్రక్కుల యజమానులకు ఒక్కో వాహనంపై సంవత్సరానికి రూ. 1.1 లక్షల వరకు ఆదా అవుతుందని జియో-బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని జియో-బీపీ అవుట్లెట్లో కొత్త ప్రీమియం డీజిల్ను లీటర్కు రూ. 91.30కి విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ ఇతర ప్రభుత్వ రంగ పెట్రోల్ పంపుల వద్ద సాధారణ డీజిల్ ధర రూ. 92.28 ఉంది. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! -
అలెర్ట్ : ఈ వెహికల్స్ను బ్యాన్ చేయండి.. కేంద్రం వద్దకు ప్రతిపాదనలు!
న్యూఢిల్లీ: పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఆధారిత ఫోర్ వీలర్లను 2027 నాటికి నిషేధించాలని చమురు మంత్రిత్వ శాఖ సూచించింది. ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలని చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ విన్నవించింది. ‘ఇంటర్నల్ కంబషన్ ఇంజన్తో తయారైన మోటార్సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాల తయారీని 2035 నాటికి దశలవారీగా నిలిపివేయాలి. సుమారు 10 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో డీజిల్ సిటీ బస్సులను నూతనంగా జోడించకూడదు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఆధారిత ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ సరైన పరిష్కారంగా ప్రచారం చేయాలి. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! మధ్యంతర కాలంలో మిశ్రమ నిష్పత్తిని పెంచుతూ ఇథనాల్తో కూడిన ఇంధనానికి విధాన మద్దతు ఇవ్వాలి. డీజిల్తో నడిచే ఫోర్ వీలర్లను వీలైనంత త్వరగా తొలగించవచ్చు. అందువల్ల 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, అధిక కాలుష్యం ఉన్న అన్ని పట్టణాలలో డీజిల్తో నడిచే నాలుగు చక్రాల వాహనాలపై నిషేధాన్ని ఐదేళ్లలో అమలు చేయాలి. ఫ్లెక్స్ ఫ్యూయల్, హైబ్రిడ్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించేలా స్వల్ప, మధ్యస్థ కాలంలో ప్రచారం చేయాలి. పన్నుల వంటి ఆర్థిక సాధనాల ద్వారా ఇది చేయవచ్చు. ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ఫేమ్ను కొనసాగించాలి. నగరాల్లో సరుకు డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కొత్తగా రిజిస్ట్రేషన్లకు అనుమతించాలి. కార్గో తరలింపు కోసం రైల్వేలు, గ్యాస్తో నడిచే ట్రక్కులను ఎక్కువగా ఉపయోగించాలి. ఈ సూచనలు అమలైతే 2070 నాటికి ఉద్గారాల విషయంలో భారత్ నెట్ జీరో స్థాయికి చేరుకుంటుంది’ అని నివేదిక పేర్కొంది. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
ఏప్రిల్లో ఇంధన అమ్మకాలు పెరగటానికి కారణం ఇదే!
న్యూఢిల్లీ: రబీ పంటల కోత పనులు ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వంటి అంశాల దన్నుతో ఏప్రిల్లో ఇంధనాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే డీజిల్ అమ్మకాలు 6.7% పెరిగి 7.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే మార్చితో పోల్చినప్పుడు 4.8% వృద్ధి నమోదైంది. సోమవారం వెలువడిన గణాంకాల ప్రకారం.. పెట్రోల్ అమ్మకాలు ఏప్రిల్లో వార్షికంగా 2.5% పెరిగి 2.64 మిలియన్ టన్నులకు చేరగా, నెలవారీగా మాత్రం స్వల్పంగా 0.5% మేర తగ్గాయి. రబీ పంటల కోతకు ట్రాక్టర్లను ఉపయోగిస్తుండటం వల్ల డీజిల్ వినియోగం పెరుగుతుంది. -
ఊపందుకున్న పెట్రోల్, డీజిల్ విక్రయాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ పనులు, పరిశ్రమల అవసరాలు, ట్రక్కుల ద్వారా రవాణా పెరగడంతో ఏప్రిల్ ప్రథమార్ధంలో డీజిల్కు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి డీజిల్ విక్రయాలు 15 శాతం పెరిగి 3.45 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలలవారీగా చూసినప్పుడు మార్చి ప్రథమార్ధంలో నమోదైన 3.19 మిలియన్ టన్నులతో పోలిస్తే 8.4 శాతం పెరిగాయి. ఇక పెట్రోల్ విషయానికొస్తే ఏప్రిల్ 1–15 మధ్య కాలంలో అమ్మకాలు 2 శాతం పెరిగి 1.14 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే మాత్రం 6.6 శాతం మేర తగ్గాయి. కోవిడ్ పూర్వంతో (2020) పోలిస్తే ఏప్రిల్ ప్రథమార్ధంలో పెట్రోల్ అమ్మకాలు 128 శాతం, డీజిల్ అమ్మకాలు 127 శాతం పెరిగాయి. వార్షికంగా వంట గ్యాస్ విక్రయాలు 5.7 శాతం పెరిగి 1.1 మిలియన్ టన్నులకు చేరాయి. మరోవైపు, ఏవియేషన్ కార్యకలాపాలు తిరిగి యథాప్రకారం ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే తాజాగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 14 శాతం పెరిగి 2,84,600 టన్నులకు చేరాయి. నెలలవారీగా చూస్తే 3.8% తగ్గినప్పటికీ.. 2020తో పోల్చినప్పుడు 468 శాతం పెరిగాయి. పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకోవడం దేశీయంగా ఆయిల్ డిమాండ్కు ఊతమిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటు సర్వీసులు, అటు పరిశ్రమల నుంచి మద్దతుతో భారత్ స్థిరమైన వృద్ధి సాధించగలుగుతోందని పేర్కొన్నాయి. -
పెట్రోల్ కార్లదే హవా
సాక్షి, అమరావతి: దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఐదేళ్లలో కార్ల మార్కెట్పై దీని ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దేశంలో కార్ల మార్కెట్ను పెట్రోల్ వెర్షన్ కార్లు శాసిస్తున్నాయనే చెప్పొచ్చు. మార్కెట్లో 70 శాతం అమ్మకాలతో పెట్రోల్ వెర్షన్ కార్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. డీజిల్ కార్లపై వినియోగదారుల ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. దీంతో వీటి అమ్మకాలు 18.50 శాతానికే పరిమితమయ్యాయి. విద్యుత్ కార్ల అమ్మకాలు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్యూవీ మోడల్ వాహనాల వాటా 42 శాతంగా ఉంది. 2018–19 నుంచి 2022–23లో దేశంలో కార్ల అమ్మకాల నివేదికను ప్రముఖ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ ‘జేటో డైనమిక్స్’ వెల్లడించింది. నివేదిక ఏం చెబుతోందంటే.. ఐదేళ్లలో దేశంలో పెట్రోల్ కార్ల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 2018–19లో దేశీయ కార్ల మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ కార్ల అమ్మకాలు 60 శాతంగా ఉండేవి. ఇవి 2022–23లో 70 శాతం మార్కెట్ను సాధించాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాలు కూడా పెట్రోల్ వాహనాల అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయి. డీజిల్ వాహనాలను 10 ఏళ్లకు తుక్కుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. అదే పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్ల వరకూ అవకాశం కల్పించింది. దాంతో డీజిల్ వాహనాల కంటే పెట్రోల్ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండేది. కానీ డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రెండింటి ధరల మధ్య ప్రస్తుతం పెద్ద వ్యత్యాసం లేదు. కొత్త మోడల్స్ లాంచింగ్లోనూ.. కార్ల కొనుగోలుదారుల ఆసక్తి కొత్త మోడళ్ల లాంచింగ్ను ప్రభావితం చేస్తోంది. కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్తగా పెట్రోల్, విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ మార్కెట్లోకి 28 కొత్త మోడల్ కార్లను ప్రవేశపెట్టారు. వాటిలో పెట్రోల్ వెర్షన్ కార్లు 13 ఉండగా.. విద్యుత్ కార్లు 8 ఉన్నాయి. డీజిల్ వెర్షన్ కార్లు ఆరు, సీఎన్జీ వెర్షన్ కారు ఒక మోడల్ భారత్ మార్కెట్లోకి ప్రవేశించాయి. సగానికి తగ్గిన డీజిల్ కార్ల అమ్మకాలు ఐదేళ్లలో దేశంలో డీజిల్ కార్ల అమ్మకాలు దాదాపు సగానికి తగ్గిపోయాయి. పర్యావరణ నియంత్రణ చర్యలు, డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండటమే దీనికి కారణం. ఎస్యూవీ వాహనాల్లోనే డీజిల్ వెర్షన్కు డిమాండ్ ఉంది. సాధారణ కార్ల అమ్మకాల్లో డీజిల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 2018–19లో దేశంలో డీజిల్ వెర్షన్ కార్ల వాటా 36 శాతం ఉండేది. కాగా 2022–23లో అది 18.50 శాతానికి తగ్గిపోయింది. 2018–19తో పోలిస్తే 2022–23నాటికి దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. -
డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను లీటరుకు రూపాయి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై పన్నును ఐదో వంతు తగ్గించినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీ టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గింది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు తమ ప్రీ–బడ్జెట్ మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరాయి. -
భారత్ నుంచి బంగ్లాకు పైప్లైన్ ద్వారా డీజిల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి బంగ్లాదేశ్కు డీజిల్ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్లైన్ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్లైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది. -
Pakistan crisis: చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ధరలు
పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే, ఇప్పటికే లీటరు పాలు రూ. 210, కేజీ చికెన్ రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉన్నాయి. తాజాగా పెట్రోల్ ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 22.02, రూ. 17.20 పెరిగాయి. ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి అమలులోకి వచ్చాయి. ధరల పెరుగుదల తరువాత పెట్రోల్ ధర రూ. 272, డీజిల్ ధర రూ. 280. వీటితో పాటు కిరోసిన్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో కూడా వీటి ధరలను పెంచింది. భారతదేశం వంటి కొన్ని దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి నిలకడగా ఉన్నాయి. అయినప్పటికీ మన దేశంలో చమురు ధరలు ఎప్పుడో సెంచరీ దాటాయి. పాకిస్థాన్ కరెన్సీలో భారీగా తగ్గుదల, చమురు దిగుమతుల వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల పాకిస్థాన్లో గత కొన్ని రోజులుగా చమురు ధరలు చాపకింద నీరులా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి కొట్టు మిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలు రానున్న రోజుల్లో మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నిత్యావసర ధరలతో పాటు ఇంధన ధరలు కూడా పెరగటం వారికి శాపంగా మారింది. ఇప్పటికీ కొంత మంది ప్రజలు ఆకలి బాధలను భరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంతోమందిని కలచి వేస్తున్నాయి. -
వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
-
జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ప్రొవిజన్ ఇప్పటికే ఉందని బుధవారం వివరించారు. పరిశ్రమల సమాఖ్య పీహెచ్డీసీసీఐ సభ్యులతో బడ్జెట్ అనంతర సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం ముడి పెట్రోలియం, పెట్రోల్, హై స్పీడ్ డీజిల్, సహజ వాయువు, విమాన ఇంధనాలను తాత్కాలికంగా జీఎస్టీ నుంచి మినహాయించారు. వాటిని ఎప్పటి నుంచి ఈ పరిధిలోకి తేవాలనేది జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. 2023 ఫిబ్రవరి 18న జీఎస్టీ మండలి 49వ సమావేశం జరగనుంది. ఒకవేళ మొత్తం మండలి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఏ రేటు వర్తింపచేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. రేటును నిర్ధారించి తనకు తెలియజేస్తే పెట్రోలియం ఉత్పత్తులను సత్వరం జీఎస్టీ పరిధిలోకి చేర్చగలమన్నారు. మరోవైపు, వృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్రం గత మూడు–నాలుగేళ్లుగా పెట్టుబడి వ్యయాలను గణనీయంగా పెంచుతూనే ఉందని మంత్రి వివరించారు. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమును, విద్యుత్ తదితర రంగాల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోందన్నారు. (ఇదీ చదవండి: ఈవీ జోరుకు భారత్ రెడీ.. ప్లాంటు యోచనలో వోల్వో!) -
వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్పై రూ.2 సెస్..ఎక్కడంటే?
తిరువనంతపురం: వాహనదారులకు కేరళ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.2 సెస్ విధించనున్నట్లు తెలిపింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ బడ్జెట్ ప్రసంగంలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళలో ఎల్డీఎఫ్ రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. రాష్ట్రంలో ఇకపై సోషల్ సెక్యూరిటీ సెస్ పేరుతో లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.2 అదనంగా వసూలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. తద్వారా సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్కు రూ.750 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అలాగే భారత్లో తయారయ్యే విదేశీ లిక్కర్ బ్రాండ్ మద్యంపై రూ.20, రూ.40 సెస్ విధించనున్నట్లు బాలగోపాల్ వెల్లడించారు. రూ.500-999 ధర గల లిక్కర్ బాటిళ్లపై రూ.20 సెస్, ధర రూ.1000కి ఎక్కువగా ఉండే బాటిళ్లపై రూ.40 సెస్ విధించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కేరళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంధనం, మద్యంపై సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం రాష్ట్రానికి ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదని మంత్రి తెలిపారు. చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..! -
ముడిచమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు.. జనవరి 3 నుంచి అమలు
దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురు, ఎగుమతి చేసే డీజిల్, ఏటీఎఫ్లపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం క్రూడాయిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ను టన్నుకు రూ. 1,700 నుంచి రూ. 2,100కి పెంచింది. అలాగే ఎగుమతి చేసే డీజిల్పై లీటరుకు పన్నును రూ. 5 నుంచి రూ. 6.5కి, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు రూ. 1.5 నుంచి రూ. 4.5కి పెంచింది. కొత్త ట్యాక్స్ రేట్లు జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తదితర సంస్థలు దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆయిల్ రేట్ల పెరుగుదలతో చమురు కంపెనీలకు ఆకస్మికంగా వచ్చే భారీ లాభాలపై విధిస్తున్న పన్నును విండ్ఫాల్ ట్యాక్స్గా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల బాటలోనే ఈ ఏడాది జూలై 1 నుంచి భారత్ కూడా దీన్ని అమలు చేయడం ప్రారంభించింది. ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడంతో డిసెంబర్ 16న చివరిసారిగా జరిపిన సమీక్షలో ట్యాక్స్ రేటును కొంత తగ్గించింది. పెట్రోల్ ఎగుమతులకు మాత్రం విండ్ఫాల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటోంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
విండ్ఫాల్ టాక్స్ మూడు రెట్లు కోత: ఇక జాలీగా విమానాల్లో!
న్యూఢిల్లీ: కేంద్రం ఆయిల్ రంగ సంస్థలకు భారీ ఊరట కల్పించింది. పక్షం రోజుల సమీక్షలో భాగంగా దేశీయ రిఫైనరీలు, చమురు ఉత్పత్తి లాభాలపై విండ్ఫాల్ టాక్స్ను భారీగా తగ్గించింది. జెట్ ఇంధనం (ఏటీఎఫ్), డీజిల్ ఎగుమతులపై కూడా విండ్ఫాల్ టాక్స్ను తగ్గించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్ఫాల్ ప్రాఫిట్ సెస్ టన్నుకు రూ. 4,900 నుంచి రూ.1,700కు తగ్గించింది. జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై విధించే విండ్ఫాల్ పన్నును మూడు రెట్లు తగ్గించి లీటరుకు రూ. 5 నుండి రూ. 1.5 కు కోత విధించింది. డీజిల్ ఎగుమతిపై సెస్ లీటర్కు రూ. 8 నుండి రూ. 5 కు తగ్గించింది. కేంద్రం పెట్రోల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని జీరో శాతం వద్దే ఉంచింది. సవరించిన రేట్లు అన్నీ డిసెంబర్ 16, 2022 నుండి అమల్లో ఉంటాయి. (వావ్..ఇంత తక్కువ ధరలో యాపిల్ ఐఫోన్!) భారతదేశంలో విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులో ఇంధన ఖర్చే 30-40 శాతం దాకా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా విండ్ఫాల్ టాక్స్ కోత వాటి లాభాల మార్జిన్లను పెంచుతుంది. దీంతో విమాన టిక్కెట్ ఛార్జీలు దిగి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2022 నవంబరు నుంచి దాదాపు 15 శాతం గ్లోబల్ క్రూడ్ ధరలు క్షీణిస్తున్న సమయంలో ఈ తగ్గింపు వచ్చింది. కాగా జూలై 1, 2022 నుంచి ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగిన కారణంగా చమురు కంపెనీలు పొందిన లాభాలను దృష్టిలో ఉంచుకుని, చమురు ఉత్పత్తిపై, అలాగే గ్యాసోలిన్, డీజిల్ , విమాన ఇంధనాల ఎగుమతులపై విండ్ఫాల్ టాక్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు రెండు వారాలకు ఒకసారి విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం సవరిస్తోంది. -
పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గే అవకాశం
-
బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ!
పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలు ప్రజలపై భారంగా మారుతోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో సామాన్యులు నెలవారీ బడ్జెట్లో పొదుపు మంత్రం పాటించక తప్పట్లేదు. అందుకే పైసలు ఆదా చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కార్డు వాడకం ద్వారా 68 లీటర్ల ఉచిత పెట్రోల్, డీజిల్ పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్తో ఒప్పందం చేసుకొని.. సిటీ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. కాకపోతే ఈ ఉచిత పెట్రోల్, డీజిల్ పొందేందుకు కొన్ని షరతులు కూడా ఉంటాయని పేర్కొంది. 68 లీటర్ల ఇంధనం ఉచితం ఈ రోజుల్లో బైక్లు, కార్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ నెలా ఇంధన బిల్లుకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ పైసలను పొదుపు చేయాలంటే ఇలా చేయండి. ఈ సారి ఇంధన బిల్లులకు ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్తో చెల్లించడం ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 7వేల ఆదా చేయవచ్చు. ఎలా అంటే.. ఈ కార్డ్ని ఉపయోగించి పేమెంట్ చేయడం ద్వారా కస్టమర్లు దీని నుంచి రివార్డ్ పాయింట్లను (టర్బో పాయింట్లు) పొందగలరు. ఈ పాయింట్లను రీడీమ్ చేయడం ద్వారా కార్డుదారులు సంవత్సరానికి 68 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ని కొనుగోలు చేయవచ్చు. పాయింట్లు ఎలా వస్తాయ్ ► ఇండియన్ ఆయిల్ పంపుల వద్ద 1 శాతం ఇంధన సర్చార్జి మినహాయింపు. ► ఇండియన్ ఆయిల్ పంప్లలో ఖర్చు చేసే ప్రతి రూ. 150కి 4 టర్బో పాయింట్లను పొందండి. ► కార్డ్ ద్వారా గ్రోసరీలు, సూపర్ మార్కెట్లలో ఖర్చు చేసే రూ. 150కి 2 టర్బో పాయింట్లను పొందండి. ► కార్డ్ ద్వారా ఇతర కేటగిరీలో రూ.150 ఖర్చు చేస్తే 1 టర్బో పాయింట్ని పొందండి. అయితే ఈ టర్బో పాయింట్లకు.. ఇండియన్ ఆయిల్ బంకుల్లో మాత్రం ఎక్కువ ప్రయోజనాలు లభించనున్నాయి. ఎలా అంటారా.. బంకుల్లో ఒక టర్బో పాయింట్.. ఒక రూపాయితో సమానం కాగా, ఇదే విధంగా ఇండిగో, గోఐబిబో వంటి ఇతర వాటిలో ఒక టర్బో పాయింట్కు రూ. 25 పైసలు మాత్రమే లభిస్తాయి. బుక్మైషో, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, షాపర్స్ స్టాప్ వంటి ప్రదేశాల్లో ఒక టర్బో పాయింట్తో 30 పైసలు వస్తాయి. ఇలా ఏడాది మొత్తంలో ఈ కార్డు ఉపయోగించి జరిపే లావాదేవీలపై వచ్చే రివార్డులు, టర్బో పాయింట్లతో 68 లీటర్ల వరకు ఉచితంగా పెట్రోల్ లేదా డిజిల్ కానీ పొందవచ్చని సిటీ బ్యాంక్ వెల్లడించింది. చదవండి: హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు! -
‘పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తెచ్చేందుకు మేము సిద్ధం.. కానీ’
శ్రీనగర్: జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. కానీ, ఇందుకు రాష్ట్రాలు అంగీకరించకపోవచ్చన్నారు. ఇందుకు రాష్ట్రాల అంగీకారం కూడా తప్పనిసరి అన్నది గుర్తు చేశారు. రాష్ట్రాలు కూడా సుముఖత వ్యక్తం చేస్తే ఈ విషయంలో కేంద్రం ముందుకు వెళుతుందని పురి చెప్పారు. దీన్ని ఎలా అమలు చేయాలన్నది మరో అంశంగా పేర్కొన్నారు. దీనిపై ఆర్థికమంత్రి స్పష్టత ఇవ్వగలరని పేర్కొన్నారు. లిక్కర్, ఇంధనాలు రాష్ట్రాలకు ఆదా య వనరులుగా ఉన్నందున, వాటిని జీఎస్టీ కిందకు తీసుకురావడానికి అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయాన్ని మంత్రి వినిపించారు. చదవండి: ఫోన్పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
చావనైనా చస్తాం.. భూమి మాత్రం ఇచ్చేదిలేదు
ఖలీల్వాడి : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ కొండూర్ గ్రామంలోని అన్నదమ్ముల భూమిలో వైకుంఠధామం నిర్మించాలంటున్న గ్రామస్తుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారిద్దరూ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సీహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన హన్మాండ్లు, లింగంకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల భూమి ఉంది. మూడేళ్ల క్రితం ఈ భూమిలో వైకుంఠధామం నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. అయితే 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిలో వైకుంఠధామం నిర్మిస్తే తమకు జీవానాధారమైన సాగు భూమి లేకుండా పోతుందని గ్రామస్తుల్ని వేడుకున్నారు. అయినప్పటికీ గ్రామస్తులు, కుల సంఘం సభ్యులు మూడేళ్లుగా పట్టువిడవకుండా ఒత్తిడి చేస్తుడటంతో విసిగిపోయిన హన్మాండ్లు, లింగంలు నందిపేట్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నారు. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలసి జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి అన్నదమ్ములిద్దరూ ఒంటిపై డీజీల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు డీజీల్ డబ్బాలతోపాటు అగ్గిపెట్టెను లాక్కున్నారు. తమను కుల బహిష్కరణ చేశారని, గ్రామంలో కూడా తమతో ఎవరూ మాట్లాడటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క ఊళ్లకు వెళ్లి వ్యవసాయపనులు చేసుకుంటున్నామని వాపోయారు. స్పందించిన సీపీ కేఆర్ నాగరాజు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆర్మూర్ ఏసీపీకి ఆదేశాలు జారీ చేశారు. -
సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. న్యూఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, ముంబైలో రూ.106.31గా ఉంది. కోల్కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, హైదరాబాద్లో రూ.109.66గా ఉంది. మంగళవారం నుంచి ఈ ధరలపై 40 పైసలు త్గగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గి చాలా రోజులుగా స్థరంగా కొనసాగుతుండటంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు దిగువన ఉంది. ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో చివరిసారిగా ఏప్రిల్ 7 ఇంధన ధరలను తగ్గించారు. అలాగే ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంతో అక్టోబర్ తొలి అర్ధభాగంలో ఇంధన విక్రయాలు భారీగా పెరిగి కరోనా ముందు స్థితికి చేరుకున్నాయి. పండుగ సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీ వృద్ధి నమోదు చేశాయి. దీంతో ధరలు తగ్గించాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం లీటర్పై 40 పైసలే తగ్గించినప్పటికీ.. రానున్న రోజుల్లో రూ.2వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
ముడిచమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురు, డీజిల్ .. ఏటీఎఫ్ ఎగుమతులపై కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ ను పెంచింది. క్రూడాయిల్పై టన్నుకు రూ. 8,000గా ఉన్న సుంకాన్ని రూ. 11,000కు పెంచింది. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 5 నుంచి రూ. 12కు పెంచింది. ఈ నెల ప్రారంభంలో దాదాపు సున్నా స్థాయికి దిగి వచ్చిన ఏటీఎఫ్ (విమాన ఇంధనం)పై తిరిగి సుంకాలు విధించింది. లీటరుకు రూ. 3.50 మేర నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు రేట్లు భారీగా పెరగడం వల్ల వివిధ ఇంధనాలపై ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద విధించే సుంకాలను విండ్ఫాల్ ట్యాక్స్లుగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల బాటలో దేశీయంగా జూలై 1న కేంద్రం వీటిని విధించింది. ఆ తర్వాత ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్లో రెండు విడతల్లో వాటిని తగ్గించింది. దేశీ క్రూడాయిల్పై పన్నులతో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, వేదాంత వంటి సంస్థలపై ప్రభావం పడనుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనింగ్ కంపెనీలు.. డీజిల్, ఏటీఎఫ్ మొదలైన ఇంధనాలను ఎగుమతి చేస్తున్నాయి. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
డీజిల్, ఏటీఫ్ ఎగుమతులపై మరోసారి విండ్ఫాల్ టాక్స్ షాక్
న్యూఢిల్లీ: డీజిల్, జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. వీటి ఎగుమతులపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ టాక్స్ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కు పెంచుతూ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.2 నుంచి రూ.9 కి పెంచింది. దీంతోపాటు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ.13,000 నుంచి రూ.13,300కి పెరిగింది. మార్జిన్ల పెరుగుదలకు అనుగుణంగా ఎగుమతులపై పన్నును పెంచారు. అంతర్జాతీయ చమురు బెంచ్మార్క్లలో మార్పులు, ఒపెక్, దాని మిత్రదేశాల అంచనా ఉత్పత్తి తగ్గింపునకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తయ్యే చమురుపై కూడా లెవీని పెంచింది. (షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్) ఇది చదవండి: SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కాగా దేశంలో మొదటిసారిగా జూలై 1న విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్లను విధించిందిప్రభుత్వం. పెట్రోల్, ఏటీఎఫ్పై లీటరుకు రూ. 6 ఎగుమతి సుంకం విధించి. ఆ తరువాత జూలై 1న డీజిల్ ఎగుమతిపై రూ. 13 పన్ను విధించింది.జూలై 20న జరిగిన మొదటి పక్షంవారీ సమీక్షలో, పెట్రోల్పై లీటర్కు రూ.6 ఎగుమతి సుంకం రద్దు చేయడంతోపాటు, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతిపై లీటరుకు రూ. 2 చొప్పున టాక్స్ తగ్గించింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్పై పన్నును టన్నుకు రూ.17వేలకు తగ్గించింది. మళ్లీ ఆగస్టు 2న డీజిల్, ఎటీఎఫ్ ఎగుమతులపై పన్ను తగ్గించింది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగడంతో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీని టన్నుకు రూ.17,750కి పెంచింది. తదనంతరం, ఆగస్టు 19న, మూడవ పక్షంవారీ సమీక్షలో, డీజిల్పై ఎగుమతి పన్ను రూ. 7కు పెంచి,ఏటీఎఫ్పై లీటరుకు రూ. 2ల పన్ను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. -
గుడ్ న్యూస్: డీజిల్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ కోత
సాక్షి, న్యూఢిల్లీ: విండ్ఫాల్ టాక్స్ వడ్డింపుపై కేంద్రం మరోసారి కిలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల విధించిన విండ్ఫాల్ ట్యాక్స్పై తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. డీజిల్ ఎగుమతులపై విండ్ఫాల్ పన్నును సగానికి తగ్గించింది. అలాగే జెట్ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై టాక్స్ను రద్దు చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై పన్నును పెంచింది. (Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే?) అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతిపై పన్ను లీటరుకు రూ.11 నుంచి రూ.5కు తగ్గించారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు రూ.4 పన్నును తొలగించింది. దీంతో డీజిల్ లీటర్పై విండ్ఫాల్ ట్యాక్స్ను రూ.11 నుంచి రూ.6 కు దిగి వచ్చింది. దేశీయంగా ఉత్పత్తి చేయబడే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ. 17,000 నుండి రూ.17,750కి పెంచింది.పెట్రోల్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ జీరోగా కొనసాగుతుంది. క్రూడాయిల్పై పన్ను పెంపుద్వారా ఓఎన్జీసీ, వేదాంత లాంటి ఉత్పత్తి దారులకు కష్ట కాలమేనని, అలాగే డీజిల్, ఏటీఎఫ్లపై పన్నుల కోత రిలయన్స్ కు సానుకూలమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (ఇదీ చదవండి:నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!) చమురు ఉత్పాదక సంస్థలు, పెట్రో ఎగుమతి కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయన్న కారణంతో జూలై 1న కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ను విధించిన సంగతి తెలిసిందే. జూన్లో 26.18 బిలియన్ల డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఎగుమతులు మందగించడంతో జూలై నెలలో 31 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా విండ్ఫాల్ ట్యాక్స్ను ప్రభుత్వం సవరించింది. జూలై 20న ఆ పన్నులను కొంతమేర తగ్గించిన కేంద్రం మరోసారి సారి కోత పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం నుండి జూలైలో రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో రెండోసారి విండ్ఫాల్ టాక్స్ను తగ్గించింది. కమోడిటీ ధరలు పెరగడం, బలహీనమైన రూపాయి కారణంగా జూలైలో దిగుమతులు 43.59 శాతం పెరగగా, ఎగుమతులు 0.76 శాతం పడిపోయాయి. -
విండ్ ఫాల్ టాక్స్పై కేంద్రం కీలక నిర్ణయం
-
విండ్ఫాల్ టాక్స్ కోత: వారికి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: విండ్ఫాల్ టాక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది డీజిల్, క్రూడ్ ఆయిల్, జెట్ ఇంధన రవాణాపై విండ్ఫాల్ పన్ను తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. డీజిల్, విమాన ఇంధన రవాణాపై లీటర్కు 2 రూపాయలు పన్ను తగ్గుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది, ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోలుపై రూ.6 (లీటరుకు) ఎగుమతి పన్నును కూడా రద్దు చేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్నును కూడా దాదాపు 27 శాతం తగ్గించింది. టన్నుకు 23,250 రూపాయల నుంచి తగ్గించి రూ.17 వేలుగా ఉంచింది. అంతర్జాతీయంగా చమురు రేట్టు తగ్గడంతో దేశీ చమురు ఉత్పత్తి దారులు, రిఫైనర్లపై విండ్ఫాల్ పన్నును తగ్గించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. విండ్ఫాల్ టాక్స్ విధించిన ఒక నెలలోపే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు నేటి (జూలై 20) నుంచే అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు, ఎగుమతులపై సుంకాల కోత పెట్రోలియం రంగానికి భారీ ఊరటనిస్తుందని పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. ఫలితంగా రిలయన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ లాంటి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రయోజనం సమకూరనుంది. ట్యాక్స్ తగ్గింపుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీఎల్, ఓఎన్జీసీ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లి పుంజుకున్నాయి. చాలాకాలం తరువాత ఇటీవల 100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ ధర మళ్లీ పైకెగసింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ క్రూడాయిల్ 107.23 డాలర్లు పలుకుతోంది. -
తెలంగాణ: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. భారీ క్యూలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమవు తోంది. డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయకుండా చమురు సంస్థలు వినియోగదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా పెరిగిన క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా రిటైల్గా పెట్రోల్, డీజిల్ ధరలను భారీ స్థాయిలో పెంచుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తుండడం, వాణిజ్య పరంగా వినియోగించే బల్క్ డీజిల్ను ఆయా సంస్థలు ఎక్కువ ధర కారణంగా తమవద్ద తీసుకోకుండా రిటైల్ మార్కెట్లో కొనుగోలు చేస్తుండటంతో చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే కోటాను తగ్గిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండెంట్పై 25 నుంచి 40 శాతం వరకు కోత విధించి పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు డీలర్లు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ ధాని శివార్లతో పాటు జిల్లా కేంద్రాల్లోని చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న బంకుల్లో వినియోగదారులు క్యూ కడుతున్నారు. తొలుత పారిశ్రామిక ప్రాంతాలు అధికంగా ఉన్న రాజధాని శివారు బంకుల వద్ద బంకుల్లో డీజిల్ కొరత మొదలు కాగా, క్రమంగా పెట్రోల్ కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని బంకులతో పాటు జిల్లా కేంద్రాల్లోని బంకుల్లోనూ కొరత కనిపిస్తోంది. ఫిబ్రవరి నుంచి బల్క్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచే యడంతో టీఎస్ ఆర్టీసీతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఫార్మా కంపెనీలు డీజిల్ను ఓపెన్ మార్కెట్లో రిటైల్ బంకుల్లోనే కొనుగోలు చేస్తున్నాయి. ఇలా బల్క్ డీజిల్ కొనుగోళ్లు తగ్గడంతో వాటిల్లుతున్న నష్టాన్ని తగ్గించుకునేందుకు రిటైల్ బంకుల కోటా కు చమురు సంస్థలు కోత పెడుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఇండెంట్ మేరకు సరఫరా: రాష్ట్రంలో మూడు చమురు సంస్థలకు చెందిన 7 డిపోలు ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా 3,520 పెట్రోల్ బంకులకు ప్రతిరోజు సుమారు 50 లక్షల లీటర్లకు పైగా పెట్రోల్, 87 లక్షల లీటర్లకు పైగా డీజిల్ డిమాండ్ ఉంది. ఇందులో సుమారు 60 శాతం వినియోగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. కాగా ప్రస్తుతం 60 శాతం నుంచి 75 శాతం కోటాను కూడా పంపిం చడం లేదని, ఎప్పటికప్పుడు డీజిల్, పెట్రోల్ డిమాండ్ పెరుగుతుండగా, రెండేళ్ల క్రితం నాటి ఇండెంట్ అనుసరించి ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయని డీలర్లు ఆరోపిస్తున్నారు. మూడు ఆయిల్ కంపెనీలు కరోనా కంటే ముందు నాటి అమ్మకాలను పరిగణనలోకి తీసుకొని కోటా అమలు చేస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుత ఇండెంట్తో నిమిత్తం లేకుండా పాత ఇండెంట్ ప్రకారం అందులో 25 శాతం నుంచి 40 శాతం వరకు కోత విధించి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్కు విడివిడిగా 20 వేల లీటర్ల చొప్పున ఇండెంట్ పెడితే రెండు కలిపి 20 వేల లీటర్లు సరఫరా చేస్తున్నారని ఓ డీలర్ తెలిపారు. ఒక బంక్లో నాలుగు చమురు కంపార్టుమెంటులు ఉంటే ఒకే కంపార్ట్మెంటుకు మాత్రమే సరఫరా చేస్తుండడంతో కొరత పెరిగిందని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో శివార్లతో పాటు జిల్లాల్లో కూడా రెండురోజులకోసారి బంకులు మూత పడే పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి పెట్రోల్ విషయంలో ‘బల్క్’ సమస్య లేనప్పటికీ పెట్రోల్ కోటాను కూడా కంపెనీలు తగ్గించి పంపుతున్నాయి. ఉద్దర లేదు..: గతంలో పెట్రోల్ బంకులకు సరఫరా చేసిన చమురుకు 3 నెలల వరకు క్రెడిట్ ఆప్షన్ ఉండేది. అయితే గత మూడు నెలల నుంచి ఆయిల్ కంపెనీలు ముందుగా డీడీ చెల్లించి ఇండెం ట్ పెడితేనే చమురును సరఫరా చేస్తున్నాయి. అలాగే పాత బకాయిలు చెల్లించని డీలర్లకు సరఫరా నిలిపివేశాయి. దీనివల్ల కూడా చాలాచోట్ల బంకుల్లో నోస్టాక్ బోర్డులు కన్పిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కోటా తగ్గించడంలో భాగంగానే చమురు కంపెనీలు డీడీలను తప్పనిసరి చేశాయని డీలర్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు పెట్రోల్ బంకులు మూత: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణలు, ఎక్సైజ్ డ్యూటీల తగ్గింపు వల్ల ప్రభుత్వ కంపెనీల ధరలు ప్రస్తుతం పెట్రోల్ రూ.109.64 ఉండగా, డీజిల్ రూ. 97.80గా ఉంది. కానీ నయారా/ఎస్సార్ రేట్లు వరుసగా రూ.111.93, రూ.98.58 గా ఉన్నాయి. ఇక జియో –బీపీ పెట్రోల్ ధర రూ. 116.77 కాగా, డీజిల్ రూ.102.86గా ఉంది. దీంతో వినియోగదారులు ఈ బంకుల వైపు వెళ్లకపోవడంతో ఇవన్నీ దాదాపుగా మూతపడ్డాయి. ఇక బల్క్ డీజిల్ ధర ప్రస్తుతం రూ.128గా ఉంది. బల్క్కు నై..రిటైల్కు సై: టీఎస్ ఆర్టీసీ తనకు చెందిన డిపోలలోని బంకుల ద్వారా ప్రతిరోజు 5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగించేది. అయితే మార్చిలో బల్క్ డీజిల్ ధరను లీటర్ మీద రూ.25 నుంచి రూ.30 వరకు పెంచడంతో ఆర్టీసీ సొంత బంకులను మూసివేసింది. ప్రతిరోజు మూడు సొంత పెట్రోల్ బంకుల ద్వారా 20 వేల లీటర్లకు పైగా డీజిల్ వినియోగించే జీహెచ్ఎంసీ కూడా చెత్త వాహనాలను రాంకీకి అప్పగించి, ఇతర వాహనాలకు రిటైల్గానే డీజిల్ కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో చమురు కొరత లేదు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదు. 3 రోజులకు సరపడా నిల్వలు ఎప్పుడూ మెయిన్టైన్ అవుతున్నాయి. అనవసర ప్రచారం వల్ల షార్టేజ్ ఏర్పడుతుందేమో తెలియదు. బల్క్ డీజిల్ కొనుగోలుదారులు రిటైల్ మార్కెట్లో కొనుగోలు చేయడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. బంకుల్లో 20 శాతం అమ్మకాలు పెరిగాయి. – మంగీలాల్, ఆయిల్ కంపెనీస్ స్టేట్ లెవల్ కోఆర్డినేటర్ బల్క్ కొనుగోళ్లు లేకే డీలర్ల కోటా తగ్గింపు బల్క్ డీజిల్ ధర ఎక్కువగా ఉండటంతో పలు సంస్థలు రిటైల్గా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో చమురు సంస్థలకు నష్టం వాటి ల్లుతోంది. దీన్ని అధిగమించేందుకే 3 నెలలుగా రిటైల్ కోటాను తగ్గించాయి. కోవిడ్ సమయంలో ఫార్మాసిటీకి డీజిల్పై రూ.28 తగ్గించి సరఫరా చేశారు. కానీ ఇప్పుడు దాదాపుగా అంతే మొత్తం ఎక్కువ పెట్టి ఆ సంస్థ బల్క్ డీజిల్ కొనుగోలు చేయడం లేదు. కేంద్రం బల్క్ డీజిల్ లైసెన్స్ ఉన్నవాళ్లు విధిగా వాళ్ల కోటా మేర కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు. – డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ‘ఢీ’జిల్ గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. డీజిల్ కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. బంకుల్లో సరిపడా డీజిల్ దొరకట్లేదు. దీంతో స్టాకు రాగానే.. ఒక్కసారిగా ఎగబడుతున్నారు. మంగళవారం రాత్రి తిరుమలగిరిలోని బంకు వద్ద కనిపించిన దృశ్యమిది. – తిరుమలగిరి(తుంగతుర్తి) -
పెట్రోల్, డీజిల్ కష్టాలు..!
-
విశాఖలో పెట్రో కొరత!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. గత కొద్దికాలంలో డిమాండ్కు తగిన స్థాయిలో ఆయిల్ కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా కావడం లేదు. ఫలితంగా రోజులో కొద్ది సమయం పాటు కొన్ని పెట్రోలు బంకుల యాజమాన్యాలు షాపులను మూసివేస్తున్నాయి. ప్రధానంగా గత నెలలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో ఉత్పత్తి నిలిచి పోవడంతోనే సమస్య ప్రారంభమయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం రిఫైనరీలో కాస్తా ఉత్పత్తి యథావిధిగా ఇబ్బందులు లేకుండా సాగుతోంది. అయినప్పటికీ గత కొద్దికా లంగా ఏర్పడిన ఉత్పత్తి కొరతను తీర్చుకునేందుకు అనుగుణంగా బీపీసీఎల్, ఐవోసీలకు కోటా విధానాన్ని అమలు చేస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ వినియోగం ఆధారంగా కోటాను ఇవ్వడంతో పాటు బల్క్ వినియోగదారులకు ఆయిల్ అమ్మకాలను నిలిపి వేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో 260కి పైగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ రోజువారీ వినియోగం సగటున రోజువారీగా 17 లక్షల లీటర్ల నుంచి 18 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. అయితే, రోజువారీగా సరఫరా మాత్రం 16 లక్షల లీటర్ల నుంచి 17 లక్షల లీటర్ల మేర ఉంటుందని పెట్రోల్ డీలర్లు చెబుతున్నారు. బల్క్ వినియోగదారులకు సరఫరా నిలిచిపోవడంతో పాటు బల్క్ ధర కంటే రిటైల్ ధరనే తక్కువగా ఉండటంతో కొద్ది మంది బల్క్ వినియోగదారులు కాస్తా రిటైల్గా కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు సరఫరా కాస్తా తగ్గిపోవడంతో పాటు బల్క్ వినియోగదారులు రిటైల్గా కొనుగోలు చేయడంతో బంకులకు సరఫరా అయిన ఆయిల్ నిల్వలు కాస్తా వెంటనే అయిపోతున్నాయి. ఫలితంగా కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తిరిగి ఆయిల్ సరఫరా అయ్యే వరకు బంకులను మూసేసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోందని, కొద్దిరోజుల్లోనే ఇబ్బందులు లేకుండా సరఫరా జరుగుతుందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. బల్క్ వినియోగదారులూ రిటైల్ గానే...! వాస్తవానికి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధానంగా బల్క్ వినియోగదారులందరూ ఐవోసీ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో హెచ్పీసీఎల్కు మాత్రమే రిఫైనరీ ఉంది. ఫలితంగా అటు బీపీసీఎల్ కానీ ఇటు ఐవోసీ కానీ హెచ్పీసీఎల్ నుంచి మాత్రమే ఆయిల్ను తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు బల్క్ ధర కంటే రిటైల్ ధరనే చౌక. దీంతో డీలర్లు కాస్తా బల్క్ వినియోగదారులకు విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బల్క్ వినియోగదారులకు ఆయిల్ను సరఫరా చేయవద్దనే షరతును కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ విధించినట్టు తెలుస్తోంది. ఫలితంగా బల్క్ వినియోగదారులకు కాస్తా ఆయిల్ సరఫరా కావడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బల్క్ వినియోగదారులు కూడా రిటైల్గా వచ్చి ఆయిల్ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరఫరా అయిన పెట్రోల్, డీజిల్ కాస్తా బంకులల్లో ఖాళీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయిల్ సరఫరా చేసేందుకు కోసం ఆయిల్ కంపెనీలకు పలువురు డీలర్లు అడ్వాన్స్లను చెల్లించడం పరిపాటి. అయితే, గత కొద్దికాలంగా అడ్వాన్స్లను చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఆయిల్ కంపెనీలు తేల్చిచెప్పినట్టు సమాచారం. డిసెంబర్ కోటాను బట్టే...! విశాఖ తీరంలో హెచ్పీసీఎల్కు రిఫైనరీ ఉంది. ఈ రిఫైనరీ విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రిఫైనరీ సామర్థ్యాన్ని ఏకంగా 15 ఎంఎంపీటీఏలకు పెంచాలని సంస్థ నిర్ణయించింది. ఈ రిఫైనరీ నుంచే హెచ్పీసీఎల్ బంకులతో పాటు బీపీసీఎల్, ఐవోసీ బంకులకు కూడా ఆయిల్ సరఫరా అవుతుంది. గత నెలలో హెచ్పీసీఎల్ రిఫైనరీలో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఆయిల్ సరఫరాలో గత కొద్దికాలంగా ఇబ్బందులు తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం రిఫైనరీలో ఉత్పత్తి ప్రారంభమయ్యింది. అయినప్పటికీ కొద్దికాలం పాటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేసేందుకుగానూ డిసెంబర్ కోటాకు అనుగుణంగా సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు చెబుతున్నట్టు సమాచారం. ఇది కూడా బంకు యాజమాన్యాలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫలితంగా తమ వద్ద ఉన్న పెట్రోల్, డీజిల్ అయిపోయిన తర్వాత కొన్ని పెట్రోల్ బంకులు మూతవేసుకుంటున్నారు. -
గట్టెక్కే ప్రా‘సెస్’ లో ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: పెంచిన డీజిల్ సెస్తో ఆర్టీసీకి నష్టాల స్ట్రెస్ (ఒత్తిడి) తగ్గింది. క్రమంగా గాడిన పడుతోంది. జూన్ ఆరోతేదీ (సోమవారం)న టికెట్ రూపంలో రూ.15.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఆర్టీసీ చరిత్రలో (పండగలు కాని సమయం) ఆల్టైమ్ రికార్డు. సాధారణంగా ప్రతి సోమవారం ఆదాయం భారీగా ఉంటుంది. సాధారణరోజుల్లో ఆ మొత్తం రూ.12 కోట్లు– రూ.12.50 కోట్లుగానే ఉంటుంది. కానీ, ఈ నెల 9, 10, 11 తేదీల్లో టికెట్ రూపంలో ఆదాయం వరసగా రూ.15.20 కోట్లు, రూ.15.51 కోట్లు, రూ.15.70 కోట్లు నమోదైంది. ఇది డీజిల్ అదనపు సెస్ మహిమ. 10, 11 తేదీ ల్లోని ఆదాయం జూన్ ఆరోతేదీ నాటి ఆల్టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేయడం గమనార్హం. ఏప్రిల్ 9న ప్రతి టికెట్పై కేటగిరీలవారీగా రూ.2 నుంచి రూ. 10 వరకు విధించిన డీజిల్ సెస్ వల్ల సాధారణ రోజుల్లో పెద్దగా ఆదాయం పెరగలేదన్న ఉద్దేశంతో, దాన్ని అలాగే ఉంచి, ఎక్కువ దూరం ప్రయాణిం చినవారిపై ఎక్కువ సెస్, తక్కువ దూరం ప్రయా ణిస్తే తక్కువ సెస్ పడేలా.. దూరం ఆధారంగా అద నపు డీజిల్ సెస్ విధించిన విషయం తెలిసిందే. ఇది భారీ ప్రభావమే చూపుతోంది. ఒక్క పెంపుతో రోజుకు రూ.2.50 కోట్ల మేర అదనంగా ఆదాయం నమో దైంది. ఇది ఇలాగే కొనసాగితే ఆర్టీసీ దశ తిరిగేలా ఉంది. మరి కాస్త యత్నిస్తే.. ఏకంగా ఆర్టీ సీని బ్రేక్ ఈవెన్కు చేర్చేలా కనిపిస్తోంది. కొత్త సెస్తో నెలకు రూ.75 కోట్లు ఆర్టీసీకి సగటున రోజువారీ అదాయం రూ.11 కోట్లు ఉండగా 3 నెలల క్రితం కొత్తగా సేఫ్టీ సెస్, ప్యాసింజర్ సెస్(పెంపు), టోల్గేట్ సెస్ విధించారు. ఆ తర్వాత డీజిల్ సెస్ చేర్చారు. దీంతో రోజువారీ ఆదాయం రూ.12,50 కోట్లకు చేరువైంది. అయితే, ఆదాయం పెంపుదలకు ఇంకా కొత్త మార్గాలు వెతికింది. దీంతో కొందరు అధికారులు, డీజిల్ సెస్ను టికెట్పై నిర్ధారిత మొత్తంలా కాకుండా, దూరాన్ని బట్టి వేర్వేరు మొత్తాలకు చార్జీలు వేయాలని సూచించారు. దీంతో వెంటనే దాన్ని అమలులోకి తెచ్చిన ఆర్టీసీ, అదనపు డీజిల్ సెస్ పేరుతో చార్జీలను సవరించింది. అది భారీ ఆదాయాన్ని సమకూరుస్తోంది. కొత్త సెస్ నెలకు రూ.75 కోట్లు, సాలీనా రూ.900 కోట్ల మేర ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఈ సెస్ విధించకముందు రోజువారీ నష్టాన్ని రూ.5 కోట్లుగా ఆర్టీసీ చూపింది. అందులో ఇప్పుడు దాదాపు రూ.3 కోట్ల లోటు పూడేటట్టుగా ఉంది. మరో రూ.2 కోట్ల లోటు కూడా పూడితే ఆర్టీసీ నష్టాలు ఆగిపోయినట్టే. బస్పాస్ ప్రభావం త్వరలో.. అదనపు డీజిల్ సెస్తోపాటే విద్యార్థుల బస్పాస్ ధరలను కూడా ఆర్టీసీ భారీగా పెంచింది. పాస్లపై రాయితీ మొత్తాన్ని తగ్గించుకోవటం ద్వారా కొన్ని రకాల పాస్ల ధరలను రెండు రెట్లు పెంచింది. ప్రస్తుతం వేసవి సెలవుల దృష్ట్యా విద్యార్థులు పాస్లను ఇంకా రెన్యూవల్ చేయించుకోలేదు. ఆ ప్రక్రియ మొదలైతే పెరిగిన బస్పాస్ల ఆదాయం కూడా ఆర్టీసీకి జమ అవుతుంది. విద్యార్థుల బస్పాస్ ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయం సగటున రోజుకు రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే రోజువారీ నష్టాల్లో మరో రూ.అరకోటి పూడినట్టే. ఆక్యుపెన్సీ రేషియో మరికాస్త పెంచుకోగలిగితే.. ఆర్టీసీ బ్రేక్ ఈవెన్ దశకు చేరుతుంది. అంటే లాభనష్టాలు లేనిస్థితికి వస్తుంది. కాగా, కరీంనగర్ జోన్ పరిధిలోని కొన్ని డిపోలు లాభాల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. -
డీజిల్ మోత.. చార్జీల వాత!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రోజువారీగా డీజిల్పై చేసే వ్యయం రూ.3.63 కోట్ల నుంచి రూ.5.42 కోట్లకు పెరిగింది. అంటే 1.80 కోట్లు అదనపు భారం పడుతోంది. ఆర్టీసీ మొత్తం వ్యయంలో ఇప్పుడు డీజిల్ వాటా 30 శాతానికి చేరుకుంది. ఇటీవలి వరకు ఇలా డీజిల్ భారం పెరిగినా దాన్ని ఆర్టీసీ భరిస్తూ రావటమో, కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం పొందడమో జరిగింది. కానీ, డీజిల్ ధరలు వెనక్కి వచ్చే అవకాశం కనిపించక పోవ డంతో ఈ భారంలో కొంత మొత్తాన్ని జనంపై వేసేలా ఆర్టీసీ ‘సెస్’ల విధింపు మొదలుపెట్టింది. నష్టాలు కొండలా పేరుకుపోయి.. రాష్ట్రం విడిపోయిన కొత్తలో తెలంగాణ ఆర్టీసీకి సాలీనా రూ.450 కోట్ల వరకు నష్టం ఉండేది. డీజిల్ ధరలు, ఇతర వ్యయాలు పెరగడంతో నష్టం రూ.2 వేల కోట్లకు చేరింది. కరోనా సమస్యలు కూడా దానికి తోడయ్యాయి. రూ.3 వేల కోట్లకుపైగా పేరుకున్న అప్పులు, వాటిపై వడ్డీని భరించలేకపోవడం, ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆర్ధికసాయం లేకపోవడం, బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోవడం వంటి సమస్యలతో ఆర్టీసీ విలవిల్లాడుతోంది. ఈ క్రమంలోనే చార్జీల పెంపు, సెస్ల విధింపుపై దృష్టి సారించింది. ఇప్పటివరకు చార్జీల పెంపు తీరు ►రాష్ట్ర విభజన తర్వాత 2016 జూన్లో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచింది. సాలీనా ప్రజలపై రూ.350 కోట్ల అదనపు భారం మోపింది. ఆ సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.58. ►2019 డిసెంబర్లో టికెట్ చార్జీలను సవరిం చింది. సాలీనా జనంపై రూ.700 కోట్ల భారం పడింది. ఆ రోజు లీటర్ డీజిల్ ధర రూ.71. ►2022 మార్చి–జూన్ మధ్య గతంలో ఎన్నడూ లేనట్టుగా ‘సెస్’ల విధింపును ఆర్టీసీ మొదలు పెట్టింది. కేవలం రెండున్నర నెలల వ్యవధిలో సెస్లు, టోల్ప్లాజాల రుసుము పేరుతో చార్జీలు పెంచి.. సాలీనా ప్రయాణికులపై రూ.250 కోట్ల మేర అదనపు భారం మోపింది. ►ఇకముందు కూడా డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ‘అదనపు సెస్’ను విధించే డైనమిక్ విధానాన్ని అమలు చేయనుంది. కొత్త చార్జీలు అమల్లోకి.. డీజిల్ సెస్ను విధిస్తూ సవరించిన కొత్త చార్జీలు గురువారం తొలి సర్వీసు నుంచే అమల్లోకి వచ్చా యి. టికెట్ చార్జీలు ఉన్నట్టుండి పెరిగిపోవడంపై చాలా ప్రాంతాల్లో ప్రయాణికులు కండక్టర్లతో వాదనకు దిగారు. ఇక కొత్త చార్జీల ప్రకారం.. ఎంజీబీఎస్ నుంచి విజయవాడ వెళ్లే సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ.420 నుంచి రూ.470కి.. రాజధాని టికెట్ ధర రూ.550 నుంచి రూ.600కు పెరిగాయి. ►ఎంజీబీఎస్ నుంచి భద్రాచలం వెళ్లే సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ.470 నుంచి రూ.550కి.. ఎంజీబీఎస్ నుంచి తిరుపతి వెళ్లే సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ.840 నుంచి 890కి పెరిగాయి. ►పల్లె వెలుగుల్లో రెండో స్టేజీ (10 కి.మీ.)కి రూ.5, నాలుగో స్టేజీకి మరో రూ.ఐదు, ఏడో స్టేజీకి మరో రూ.5.. ఇలా టికెట్లు జారీ అయ్యాయి. ►2019 డిసెంబర్లో చమురు కంపెనీల నుంచి ఆర్టీసీ బల్క్గా కొనే డీజిల్ ధర లీటరుకు రూ.66 ►ప్రస్తుతం రిటైల్గా బంకుల్లో ఆర్టీసీ కొంటున్న డీజిల్ ధర లీటరుకు రూ.98.50.. ►రెండున్నరేళ్ల సమయం.. ఒక్కో లీటర్పై అదనంగా పడ్డ భారం రూ.32.50. -
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక వారంలో 4 రోజులే పని?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో పెట్రోలు, డీజిల్ కొరత నానాటికీ పెరుగుతోంది. దీంతోపాటు వాటి ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు పాక్ ప్రభుత్వం సరిక్తొత ప్లాన్ను అమలు చేయాలని భావిస్తోంది. ఉద్యోగుల పని దినాలను తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజల్ కొరత సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందాలని పాక్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు పాక్ పత్రిక డాన్ సోమవారం ఓ కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, దేశంలో వినియోగం పెరగడం, దిగుమతి వ్యయం పెరగడం వంటి కారణాలతో పాక్ ఈ నిర్ణయం తీసుకోనుందట. ఈ పద్ధతిని అనుసరించి ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఆలోచన అమలు ద్వారా వార్షికంగా $2.7 బిలియన్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని పాక్ అంచనా వేసింది. దీనితో, సగటు పీఓఎల్ ఆదా నెలకు 12.2 కోట్లుగా అంచనా వేస్తూ, ఇది సంవత్సరానికి $1.5 బిలియన్లకు చేరుకోవచ్చని భావిస్తోంది. అంతేకాక 90 శాతం నూనె వాడకం పనిదినాల్లోనూ, మిగిలిన 10 శాతం సెలవు దినాల్లోనూ నెలలో వినియోగిస్తుండటం గమనార్హం. దీంతో వారానికి 4 రోజులే పని దినాలకే పాక్ ప్రభుత్వం మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. చదవండి: Russian Army Dog Max: చనిపోయే స్థితిలో రష్యా ‘మాక్స్’.. ప్రాణాలు నిలిపిన ఉక్రెయిన్కు సాయం -
గుడ్న్యూస్: పెట్రో ధరలపై భారీ ఊరట.. భారీగా తగ్గించిన కేంద్రం
-
TSRTC: తక్కువ ధరకు ‘కర్ణాటక డీజిల్’ కథ ఆదిలోనే కంచికి..
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక నుంచి కాస్త చవకగా డీజిల్ కొనేందుకు తెలంగాణ ఆర్టీసీ చేసిన ప్రయత్నం రెండు ట్యాంకర్లతో కంచికి చేరింది. చమురు భారంతో అతలాకుతలమవుతున్న ఆర్టీసీ సదుద్దేశంతో చేసిన ప్రయత్నం కొత్త సమస్యలకు దారితీసే పరిస్థితి ఉండటంతో దాన్ని విరమించుకుంది. దీంతో మళ్లీ డీజిల్ భారంతో దిక్కుతోచని పరిస్థితిలో ఎప్పటిలాగే ప్రైవేటుగా కొనేందుకు రిటైల్ బంకులకేసి సాగుతోంది. బల్క్ డీజిల్ ధర భగ్గుమనటంతో పెట్రోలు కంపెనీలతో ఉన్న ఒప్పందానికి తాత్కాలిక విరామమిస్తూ కాస్త తక్కువ ధర ఉన్న బంకుల్లో కొంటున్న విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధమని తెలిసి... ప్రస్తుతం బల్క్ డీజిల్ లీటరుకు ధర రూ.119 ఉండగా, బంకుల్లో రూ.115కు చేరింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చూపు పొరుగు రాష్ట్రం కర్ణాటకపై పడింది. అక్కడి ప్రభుత్వ పన్నులు తక్కువగా ఉండటంతో, సగటున లీటరు ధర రూ.95 పలుకుతోంది. దీంతో ఇటీవల సరిహద్దుకు చేరువగా ఉన్న కొన్ని కర్ణాటక బంకు యజమానులతో చర్చించి ట్యాంకర్లతో డీజిల్ కొనాలని బస్భవన్ కేంద్రంగా అధికారులు భావించారు. ఓ బంకు నుంచి తక్కువ ధరకే రెండు ట్యాంకర్ల డీజిల్ కూడా వచ్చింది. కానీ ఇలా పొరుగు రాష్ట్రం నుంచి ట్యాంకర్లతో పెద్దమొత్తంలో డీజిల్ తెప్పించుకోవటం నిబంధనలకు విరుద్ధమన్న విషయాన్ని ఆర్టీసీ అధికారులు తర్వాత గుర్తించారు. తక్కువ పన్నులున్న రాష్ట్రం నుంచి ఎక్కువ పన్నులున్న మరో రాష్ట్రానికి తరలించటం సరికాదని.. అధికారులు చమురు కంపెనీలతో ఆరా తీసి తెలుసుకున్నారు. ఆ వెంటనే కర్ణాటక డీజిల్ను కొనాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దిక్కుతోచని పరిస్థితి.. ఇటీవలే డీజిల్ సెస్ అంటూ ఆర్టీసీ టికెట్ ధర కొంతమేర పెంచింది. ఆ రూపంలో దాదాపు రూ.30 కోట్ల వరకు ఆదాయన్ని పెంచుకోగలిగింది. కానీ అది ఏమాత్రం చాలని పరిస్థితి. అయితే, ఇప్పటికిప్పుడు మళ్లీ సెస్ పెంచితే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆర్టీసీ భయపడుతోంది. ఇక గతంలో ప్రభుత్వం ముందుంచిన చార్జీల పెంపు ప్రతిపాదనకు మోక్షం కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతోంది. -
పడిపోయిన ఆర్టీసీ బస్సుల మైలేజీ
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణా సంస్థల్లో అత్యధిక మైలేజీతో దేశవ్యాప్తంగా రికార్డు సొంతం చేసుకుంటూ వస్తున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు దాన్ని కోల్పోయేలా కనిపిస్తోంది. లీటరు డీజిల్కు సగటున 5.4 కి.మీ. మైలేజీ (కేఎంపీఎల్) సాధించి ఇటీవలే పురస్కారాన్ని కూడా సాధించింది. కొన్నేళ్లుగా ఈ రికార్డును సొంతం చేసుకుంటూ వస్తున్న ఆర్టీసీ ఇప్పుడు గతి తప్పింది. ఇప్పుడు అది సగటున 5.2 కంటే తక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం. అసలే డీజిల్ ధరలు మండిపోయి చమురు ఖర్చును భరించలేకపోతున్న ఆర్టీసీకి ఇప్పుడు మైలేజీ కూడా పడిపోవడం పెనుభారంగా పరిణమించింది. ఇదే కారణం.. : గతంలో నిత్యం డిపోల వారీగా డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఉండేది. మైలేజీ ఎక్కువగా సాధించాలంటే డ్రైవింగ్ ఎలా ఉండాలన్న విషయంలో సూచనలుండేవి. తక్కువ మైలేజీ తెస్తున్న డ్రైవర్లను గుర్తించి వారికి ప్రత్యేక సూచనలు చేసేవారు. ఇటీవల బల్క్ డీజిల్ ధరలు భగ్గుమనడంతో బస్సులకు ప్రైవేటు బంకుల్లో డీజిల్ పోయిస్తున్నారు. ఇందుకోసం డ్రైవర్ తన డ్యూటీ ముగించుకునే సమయంలో పెట్రోలు బంకు వరకు వెళ్లి డీజిల్ పోయించుకుని రావాల్సి వస్తోంది. ఈ కారణంతో గంటకుపైగా సమయం వృథా అవుతోంది. వారి పని సమయం మించిపోతుండటంతో కౌన్సిలింగ్ నిలిపేశారు. ఇది మైలేజీపై ప్రభావం చూపుతోంది. దీన్ని గుర్తించిన ఎండీ సజ్జనార్ వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. డీజిల్ కోసం బంకు వరకు వెళ్లకుండా, బంకు యజమానులే చిన్నసైజు ట్యాంకర్ల ద్వారా డీజిల్ను డిపోకు తెచ్చి లోపల ఉండే ఆర్టీసీ బంకుల్లో లోడ్ చేసే ఏర్పాటు చేస్తున్నారు. తిరిగి కౌన్సిలింగ్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. -
బయో డీజిల్ పేరుతో ఇంధన దందా
సాక్షి, యాదాద్రి: బయో డీజిల్ పేరుతో సాగుతున్న కృత్రిమ డీజిల్ దందాను సోమవారం స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండమడుగు పారిశ్రామిక వాడ కేంద్రంగా కొంతమంది వ్యక్తులు గుజరాత్లోని ప్రైవేట్ రీఫైనరీల నుంచి ద్రవపదార్థాలను తీసుకొచ్చి వాటికి కొన్ని రసాయనాలు కలిపి కృత్రిమ డీజిల్ తయారు చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. పెట్రోల్ బంక్లలో లభించే డీజిల్ మాదిరిగానే ఈ కృత్రిమ డీజిల్తో వాహనాలు నడుస్తుండటంతో, వాహనాలకు మైలేజీ కూడా అధికంగా వస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ రేట్లు ఆకాశన్నంటుతుండటం, ఈ కృత్రిమ డీజిల్ లీటరు రూ.85 నుంచి రూ.90లకే లభిస్తుండటంతో ప్రైవేటు ట్రావెల్స్, భారీ వాహనాల వినియోగదారులు ఈ డీజిల్నే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ్నుంచే హైదరాబాద్, గుంటూరు, తిరుపతి తదితర పట్టణాలకు ఈ కృత్రిమ డీజిల్ను సరఫరా చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఆయిల్ ట్యాంకర్లలో డీజీల్ తీసుకువచ్చి బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద గోదాంలో నిల్వ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ఇక్కడి నుంచి వాహనదారులకు, కొన్ని పెట్రోల్ బంక్లకు తమ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొనుగోలు దారులను డీజిల్ అని నమ్మించేందుకు తెల్లని ద్రవ ప్రదార్థంలో పసుపు రంగు పౌడర్ను కలుపుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున రంగుప్యాకెట్లను సైతం నిల్వ ఉంచారు. విషయం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు కొండమడుగు పారిశ్రామిక వాడలోని గోదాంపై సోమవారం దాడులు చేసి కృత్రిమ డీజిల్ ట్యాంకర్లను పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మేనేజర్ చిరాగ్పటేల్, ఈ డీజిల్ను కొనుగోలుచేస్తున్న సీఎంఆర్ ట్రావెల్స్ యజమాని, మరికొందరిపై కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నాం: ఎస్ఓటీ కృత్రిమ డీజిల్ ఘటనపై విచారణ జరుపుతున్నామని భువనగిరి జోన్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎ. రాములు తెలిపారు. డీజిల్ లాగానే ఉన్న ఈ ద్రవ పదార్థాన్ని నిర్ధారణ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపించినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వాస్తవాలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. -
లంకకు భారత్ ఆపన్నహస్తం
కొలంబో: ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు శనివారం శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్ అందించిన నాలుగో డీజిల్ సాయం. ఇక విద్యుదుత్పత్తి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది. 36 గంటల కర్ఫ్యూ ఆహార కొరత, ధరల మంటను భరించలేక శ్రీలంకలో జనం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో శనివారం సాయంత్రం ఆరింటి వరకు దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ విధించారు. ఆదివారం జరగనున్న దేశవ్యాప్త నిరసనలను అడ్డుకోవడమే దీని ఉద్దేశంగా కన్పిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో ఎమర్జెన్సీ విధించడం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అన్ని పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఆర్థిక సంక్షోభం ముగిసి పరిస్థితి చక్కబడాలంటే అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు గొటబయా రాజపక్సకు ఫ్రీడం పార్టీ విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించకపోతే అధికార కూటమి నుంచి తప్పుకుంటామని తేల్చిచెప్పింది. 🇱🇰 #SriLankaEconomicCrisis #GoHomeGota pic.twitter.com/gx5yQYyob7 https://t.co/ZmEsprNC7T — Anonymous (@YourAnonNews) April 2, 2022 -
ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు.. మళ్ళీ పెంచారు
-
పెట్రోల్,డీజిల్ను తెగ వాడేస్తున్నారు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మార్చి నెలలో ఇంధన విక్రయాలు కోవిడ్ ముందస్తు స్థాయికి చేరాయి. మహమ్మారి సంబంధిత పరిమితుల ఎత్తివేతతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ధరలు పెరిగే అవకాశం ఉందని విక్రేతలు, వినియోగదార్లు ముందస్తుగా నిల్వ చేయడమూ ఇందుకు కారణం. డీలర్లు తక్కువ ధరకు ఇంధనాన్ని కొనుగోలు చేసి, సవరించిన అధిక ధరలకు విక్రయించడం ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలని ఆశించారు. గడిచిన రెండేళ్లలో డీజిల్ విక్రయాలు అధికంగా నమోదైంది మార్చి నెలలోనే. అయిదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు 137 రోజులు స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు కాగానే ధరలు పెరుగుతాయన్న అంచనాతో మార్చి మొదటి రెండు వారాల్లో డీలర్లు, ప్రజలు పెట్రోల్, డీజిల్ను విరివిగా కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో వినియోగం పెట్రోల్ 17.3, డీజిల్ 22.3 శాతం అధికమైంది. ధరల సవరణ మార్చి 22 నుంచి మొదలైంది. ధరలు పెరగడం మొదలు కావడంతో వినియోగం తగ్గుముఖం పట్టింది. ఇవీ గణాంకాలు.. ప్రభుత్వ రంగ సంస్థలు మార్చి నెలలో 2.69 మిలియన్ టన్నుల పెట్రోల్ను విక్రయించాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.7 శాతం, 2019తో పోలిస్తే 14.2 శాతం అధికం. మొత్తం అమ్మకాల్లో ఈ సంస్థల వాటా ఏకంగా 90 శాతముంది. డీజిల్ విక్రయాలు 10.1 శాతం పెరిగి 7.05 మిలియన్ టన్నులుగా ఉంది. 2019 మార్చితో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. మార్చి 1–15 మధ్య అమ్మకాలు పెట్రోల్ 18 శాతం, డీజిల్ 23.7 శాతం దూసుకెళ్లాయి. 2020తో పోలిస్తే గత నెలలో జరిగిన విక్రయాలు పెట్రోల్ 38.6 శాతం, డీజిల్ 41.6 శాతం అధికం. ఇక విమానాల్లో వాడే ఇంధనం 9.8 శాతం దూసుకెళ్లి మార్చిలో 4,91,200 టన్నులకు చేరింది. కోవిడ్ ముందస్తు స్థాయితో పోలిస్తే 27.6 శాతం వెనుకబడి ఉంది. 2020 మార్చితో పోలిస్తే 7.5 శాతం ఎక్కువ కావడం విశేషం. ఎల్పీజీ అమ్మకాలు 12 శాతం అధికమై గత నెలలో 2.53 మిలియన్ టన్నులకు చేరింది. -
తగ్గని బాదుడు..మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు!
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల పెంపు కొనసాగుతుంది. దీంతో ఆదివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్పై 50పైసలు, లీటర్ డీజిల్పై 55పైసలు పెరిగాయి. దేశంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.35 పైసలు ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.98.68పైసలుగా ఉంది వైజాగ్లో పెట్రోల్ ధర రూ.113.08 ఉండగా డీజిల్ ధర రూ.99.09 పైసలుగా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.99.11 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.90.42 పైసలుగా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ.113.88 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.98.13 పైసలుగా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.90పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00 పైసలుగా ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.108.53పైసలు ఉండగా డీజిల్ ధర రూ.93.57పైసలుగా ఉంది 'మూడిస్' ఏం చెబుతుందంటే ప్రముఖ ఇన్వెస్టర్ సర్వీస్ సంస్థ మూడిస్ ప్రకారం..ఈ ఏడాదిలో జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మనదేశానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ సంస్థలు పెట్రోల్ ధరల్ని పెంచకుండా తటస్థంగా ఉంచాయి. దీని కారణంగా చమురు సంస్థలకు రూ.19వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. అదే సమయంలో బ్యారెల్ చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వెరసీ కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకునేలా పెట్రో ధరల పెంపు అనివార్యమైనట్లు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. -
షాకింగ్:రాకెట్లా పెట్రోల్,డిజీల్ ధరలు..రూ.15 నుంచి రూ.20కి పెరిగే ఛాన్స్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన హెచ్పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ ఏకంగా 2.25 బిలియన్ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయాయి. ఈ మూడు సంస్థల ఎబిట్డాలో ఇది 20 శాతానికి సమానం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు నాలుగు నెలల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించకుండా ఒకే ధరను కొనసాగించడం తెలిసిందే. 137 రోజుల పాటు ధరలను సవరించలేదు. బ్యారెల్ క్రూడ్ 82 డాలర్ల వద్ద చివరిగా ధరలను సవరించగా.. 120 డాలర్లకు పెరిగిపోయినా కానీ, అవే రేట్లను కొనసాగించాయి. నిత్యం రూ.525 కోట్ల నష్టం.. ‘‘ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బ్యారెల్ చమురుపై 25 డాలర్ల ఆదాయాన్ని, పెట్రోల్, డీజిల్ విక్రయంపై 24 డాలర్ల నష్టాన్ని చూస్తున్నాయి. ఒకవేళ చమురు ధరలు బ్యారెల్కు సగటున 111 డాలర్ల వద్ద కొనసాగితే, పెరిగిన ధరల మేరకు విక్రయ రేట్లను సవరించకపోతే.. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ రోజువారీగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై 65–70 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు) నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. మూడున్నర నెలల విరామం తర్వాత మార్చి 22 నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాన్ని ప్రారంభించడం తెలిసిందే. మరింత పెంచాల్సిందే..! ‘‘ముడి చమురు బ్యారెల్ ధర 110–120 డాలర్ల మధ్య కొనసాగితే ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్పై రూ.13.10–24.90 మేర.. లీటర్ పెట్రోల్పై 10.60–22.30 చొప్పున ధరలను పెంచాల్సి వస్తుంది’’ అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. క్రిసిల్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం చూసినా.. ముడి చమురు బ్యారెల్ 100 డాలర్ల వద్ద సగటున ఉంటే పెట్రోల్, డీజిల్కు లీటర్పై రూ.9–12 మేర, 110–120 డాలర్ల మధ్య ఉంటే రూ.15–20 మధ్య పెంచాల్సి వస్తుంది. ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఒక్కటే 1–1.1 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోగా, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ 55–560 మిలియన్ డాలర్ల మేర 2021 నవంబర్ – 2022 డిసెంబర్ మధ్యకాలంలో నష్టాన్ని చవిచూసినట్టు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా. ‘‘ఆదాయంలో ఈ మేరకు నష్టం స్వల్పకాల రుణ భారాన్ని పెంచుతుంది. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నంత వరకు మూలధన నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. కొంత కాలానాకి చమురు ధరలు దిగివస్తే అప్పుడు ఆయిల్ కంపెనీలు కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. -
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పెట్రోవాత
-
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆందోళనలు
-
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
-
హైదరాబాద్లో డీజిల్ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే..
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఇంధనం లేక ఆగిపోయిన వాహనాలకు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ పట్టిస్తే యధావిధిగా స్టార్ట్ అవుతాయి. కానీ ఈ పెట్రోల్ బంక్లో డీజిల్, పెట్రోల్ పట్టిస్తే మాత్రం ఈ డబ్బులు వృథాగా పోగొట్టుకోవడమే కాక.. వాహన మరమ్మత్తులకు కూడా జేబు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో భారీ మోసం వెలుగుచూసింది. నీళ్లతో కలిపిన డీజిల్ను వాహనదారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ డీజిల్ పోయించకున్న వెంటనే వాహనాలు ఆగిపోయినట్లు చెప్తున్నారు. ఇదేంటని డీజిల్ని పరీక్షిస్తే లీటర్కు మూడొంతుల నీళ్లు కలిపినట్లు తేలింది. ఈ విషయంపై పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వాహనదారులను మోసం చేస్తున్న ఈ బంక్ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (గుడ్న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్) -
మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..
కారు నడవాలంటే పెట్రోలో, డీజిలో కొట్టించాలి.. లేదంటే ఎల్పీజీ, సీఎన్జీ నింపుకోవాలి.. అలా కాకుండా ఎక్కడంటే అక్కడ కాసిన్ని కర్ర ముక్కలను ట్యాంక్లో పడేసి కారు నడిపేయగలిగితే.. భలేగా ఉంటుంది కదా! ఇదేదో భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ కాదు.. ఎప్పుడో వందేళ్ల కిందటిదే. దానితో కార్లే కాదు.. బైకులు, బస్సులు కూడా నడిపేశారు. అసలు కర్ర ముక్కలతో కారు నడపడం ఏమిటి? ఎలా నడిచేవి? మరి ఇప్పుడెందుకు వాడటం లేదో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ 18వ శతాబ్దం తొలినాళ్ల నాటికే యూరప్ అంతటా పారిశ్రామికీకరణ పెరిగింది. కానీ కరెంటు వినియోగం ఇంకా విస్తృతం కాలేదు. బొగ్గు, పెట్రోల్తో పాటు సహజ వాయువు (సీఎన్జీ)ను వినియోగించేవారు. వీధి దీపాలకూ సీఎన్జీని వాడేవారు. వాటి ధర ఎక్కువ. కొరత కూడా. అందుకే బొగ్గు, కలప, బయోమాస్ వంటివాటిని వినియోగించి సింథటిక్ గ్యాస్ (సిన్గ్యాస్)ను తయారు చేసి.. పరిశ్రమల్లో, వీధి దీపాల కోసం వినియోగించడం మొదలుపెట్టారు. అయితే 19వ శతాబ్దం మొదలయ్యే సరికి.. ఈ సాంకేతికత జనానికి అందుబాటులోకి వచ్చింది. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చాయి. పెట్రోల్, సీఎన్జీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దానికితోడు మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావంతో పెట్రోల్, సీఎన్జీ కొరత మొదలైంది. ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కార్లు, బైకులు, ఇతర వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనం అవసరమైంది. అప్పుడే ‘ఉడ్ గ్యాస్ జనరేటర్’ తెరపైకి వచ్చింది. ఏమిటీ ‘సిన్ గ్యాస్’? గాలి చొరబడకుండా మూసేసిన కంటెయినర్లలో కలప, బొగ్గును వేసి, బయటి నుంచి వేడి చేస్తారు. దీనివల్ల బొగ్గు, కలప మండిపోకుండానే.. వాటి నుంచి నైట్రోజన్, హైడ్రోజన్, మిథేన్, కార్బన్ మోనాక్సైడ్ కలిసి ఉన్న గ్యాస్ విడుదలవుతుంది. సాధారణ వంట గ్యాస్ (ఎల్పీజీ) లాగానే ఈ గ్యాస్కు మండే లక్షణం ఉంటుంది. దానిని పరిశ్రమల్లో, వీధి దీపాల కోసం, ఇళ్లలో వంట కోసం వినియోగించేవారు. 1807లోనే లండన్లో తొలిసారిగా ‘సిన్ గ్యాస్’ ద్వారా వీధి దీపాన్ని వెలిగించారు. అలా మొదలై 19వ శతాబ్దం మొదలయ్యే నాటికి ఈ గ్యాస్ను వాడకం బాగా పెరిగింది. విద్యుత్ అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ గ్యాస్తోనే పరిశ్రమలు నడిచాయి. ఫ్రెంచ్ ఇంజనీర్ ఆవిష్కరణతో.. పెట్రోల్, సీఎన్జీకి బదులు సిన్గ్యాస్ను వాడొచ్చని గుర్తించిన ఫ్రెంచ్ ఇంజనీర్ జార్జెస్ ఇంబర్ట్.. 1920లో మొబైల్ ఉడ్ గ్యాస్ జనరేటర్ను రూపొందించారు. కర్ర ముక్కలతో సిన్ గ్యాస్ ఉత్పత్తి అయ్యేలా చేశారు. అందుకే దాన్ని‘ఉడ్ గ్యాస్’గా పిలిచారు. వాహనాల ఇంజన్లో మార్పులు చేసి ‘ఉడ్ గ్యాస్’తో నడిచేలా మార్చారు. అప్పటికి పెట్రోల్, సీఎన్జీ ఉండటంతో దీనికి డిమాండ్ రాలేదు. 1930 చివరికి 9 వేల వాహనాలు ఇంబర్ట్ జనరేటర్లతో నడిచేవి. కానీ రెండో ప్రపంచ యుద్ధం ప్రభావంతో మళ్లీ పెట్రోల్, సీఎన్జీల కొరత మొదలైంది. ధరలూ పెరగడంతో..‘ఇంబర్ట్ జనరేటర్లకు డిమాండ్ పెరిగింది. 1940–42 నాటికి ఒక్క జర్మనీలోనే 5 లక్షల వాహనాలు ‘ఉడ్ గ్యాస్’తో నడిచినట్టు అంచనా. కర్ర ముక్కల కోసం 3 వేలకుపైగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ సహా యూరప్ దేశాల్లో ‘ఉడ్ గ్యాస్’ వాడారు. ‘ఉడ్ గ్యాస్’ వాడటం ఆపేశారెందుకు? ►పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వంటివాటితో పోలిస్తే.. ఉడ్ గ్యాస్లో వాయువులకు మండే సామర్థ్యం తక్కువ. దాని నుంచి విడుదలయ్యే శక్తి కూడా తక్కువ. కొద్దికిలోమీటర్లు ప్రయాణించాలంటే కిలోల కొద్దీ కలప కావాల్సి వచ్చేవి. పైగా మెల్లగా వెళ్లాల్సి వచ్చేది. ►ఉడ్గ్యాస్ జనరేటర్, ఇతర పరికరాల బరువు వందల కిలోలు ఉంటుంది. జనరేటర్ను కార్లు, బస్సులు, ఇతర వాహనాల వెనుక అదనపు టైర్లతో అమర్చుకోవాలి, దాని నుంచి వాహనం ముందు భాగంలో ఏర్పాటు చేసే ట్యాంకు, కూలింగ్ యూనిట్కు పైపులతో అమర్చాలి. నిర్ణీత దూరం తర్వాత వాహనం ఆపి.. జనరేటర్లో కర్ర ముక్కలను నింపాలి. వాహనం కూడా మెల్లగా గంటకు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి వచ్చేది. ►బైకుల కోసం చిన్న జనరేటర్లు వచ్చినా.. కొద్దిదూరమే ప్రయాణించగలిగేవారు. ►ఉడ్ గ్యాస్ వాహనాన్ని ఎప్పుడంటే అప్పుడు వెంటనే స్టార్ట్ చేయడానికి కుదరదు. జనరేటర్ వేడెక్కి తగిన స్థాయిలో గ్యాస్ వెలువడేందుకు 15 నిమిషాలైనా పడుతుంది. అప్పటిదాకా ఆగాల్సిందే. ►ఈ గ్యాస్లో ఉండే కార్బన్ మోనాక్సైడ్ విషపూరిత వాయువు. అందుకే జనరేటర్ నుంచి పైపును కారు బయటిభాగం నుంచే ఇంజన్కు అనుసంధానించేవారు. ►రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ పె ట్రోల్, సీఎన్జీ ఇంధనాలు సులువుగా దొరకడం, ఎక్కువ మైలేజీ ఇచ్చే టెక్నాలజీలు వచ్చాయి. దీంతో ‘ఉడ్ గ్యాస్’ జనరేటర్లు మూలకుపడ్డాయి. -
బస్సులకిక బయటి ఇంధనమే!
ఖమ్మం మయూరి సెంటర్: ఆర్టీసీకి ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్ సరఫరా చేసే క్రమంలో ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో బయటి బంకుల్లోనే డీజిల్ పోయించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీన్ని పేరు చెప్పడానికి అంగీకరించని ఓ ఆర్టీసీ అధికారి ధ్రువీకరించారు. ట్యాక్స్లు ఇతరత్రా తేడాలతో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధర లీటర్గా రూ.97గా ఉంటోంది. కానీ, బయటి బంకుల్లో రూ.94.71గా ఉండటం గమనార్హం. ఇందులో భాగంగా రాష్ట్ర రవాణామంత్రి పువ్వాడ అజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంక్ల యజమానుల నుంచి కొటేషన్లు స్వీకరించగా, శ్రీశ్రీ హెచ్పీ బంక్ యజమాన్యం లీటర్ డీజిల్ను రూ.94.53కు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం నుంచి బస్సులన్నింటినీ బంక్కు పంపించగా రాత్రి 11 గంటల వరకు బారులు తీరి కనిపించాయి. కాగా, విధులు ముగించుకుని 9.30 గంటల తర్వాత వచ్చిన డ్రైవర్లు బస్సులతో బంక్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. మళ్లీ ఉదయమే డ్యూటీకి వెళ్లాల్సిన తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని డ్రైవర్లు వాపోయారు. ఖమ్మం రీజియన్లోని అన్ని డిపోల బస్సుల్లో బుధవారం నుంచి బయటి బంకుల్లో డీజిల్ పోయించనున్నట్లు తెలిసింది. -
వాహనదారులకు బంపరాఫర్, ఫ్రీగా 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ పొందొచ్చు
దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు తలకు మించిన భారంగా మారింది. దీంతో వాహనదారులు ఇంధన వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోవెహికల్స్ వాహనదారుల్ని అట్రాక్ట్ చేసేందుకు ఆయా సంస్థలు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ, ఇండియన్ ఆయిల్ సంస్థలు సంయుక్తంగా ఆఫర్ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఆఫర్ను వినియోగించుకున్న వాహనదారులు సంవత్సరానికి 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఉచితంగా పొందవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం? ►ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లలో ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో పెట్రోల్, డీజిల్పై ఖర్చుచేస్తే అందులో 5శాతం ఫ్యూయల్ పాయింట్లుగా సంపాదించవచ్చు. తద్వారా సంవత్సరానికి 50లీటర్లను పెట్రోల్ లేదా డీజిల్ను ఉచితంగా పొందవచ్చు. ►మొదటి 6 నెలల్లో నెలకు గరిష్టంగా 250 ఫ్యూయల్ పాయింట్లు, కార్డ్ జారీ చేసిన 6 నెలల తర్వాత గరిష్టంగా 150 ఫ్యూయల్ పాయింట్లను సంపాదించవచ్చు. ►5శాతం కిరాణా, బిల్లు చెల్లింపులపై ఫ్యూయల్ పాయింట్లు లభిస్తాయి. ►ప్రతి కేటగిరీలో నెలకు గరిష్టంగా 100 ఫ్యూయల్ పాయింట్లను పొందవచ్చు. ►క్రెడిట్ కార్డ్తో ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.150కి 1 ఫ్యూయల్ పాయింట్ని పొందవచ్చు ►ఈ ఆఫర్లో అదనంగా 'ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా రివార్డ్స్ టీఎం' ప్రోగ్రామ్లో మెంబర్షిప్ పొందవచ్చు.ఇలా ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్స్ వాహనదారులు సంవత్సరానికి 50 లీటర్ల పెట్రోల్, లేదా డీజిల్ను ఉచితంగా పొందవచ్చు' అని ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ సంస్థలు తెలిపాయి. మరిన్ని వివరాల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..! -
రైతులకు డీజిల్పై రాయితీ పెంచండి
సాక్షి, అమరావతి: సాగు వాస్తవిక ఉత్పత్తి వ్యయం, డీజిల్పై అధిక రాయితీలు, జన్యుమార్పిడి విత్తనాలు (జీఎంఓ) వంటి వాటితో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేసేలా రాబోయే బడ్జెట్ (వ్యవసాయ) ఉండాలని, నిధుల కేటాయింపును కనీసం 25 శాతమైనా పెంచాలని పలువురు వ్యవసాయ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీకి ప్రారంభమైన ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా.. గడచిన 48 గంటల్లో రాష్ట్రానికి చెందిన వ్యవసాయ రంగ ప్రముఖులు వర్చువల్ విధానంలో జరిగిన సమావేశాల్లో తమ సలహాలను, సూచనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతులకు ఇచ్చే రుణాలను కనీసం 25 శాతం పెంచాలని కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్స్ (సిఫా) ముఖ్య సలహాదారు పి. చెంగల్ రెడ్డి సూచించారు.ఇక్రిశాట్, ఐసీఏఆర్ అభివృద్ధి చేసిన జన్యు సాంకేతికతకు తక్షణ ఆమోదం తెలపాలని ఆయన కోరారు. పంట ధరల విధానంపై ప్రభుత్వ సలహా సంఘంగా ఉన్న వ్యవసాయ ఖర్చులు, ధరల సంఘానికి వాస్తవిక ఖర్చుల ఆధారంగా ఎంఎస్పీ నిర్ధారించేందుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చేనేత రంగ నిపుణుడు డాక్టర్ డి.నరసింహారెడ్డి, రైతు నాయకుడు వై.శివాజీ సలహాలిచ్చారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరతను తగ్గించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎంఎస్పీ నిర్ణాయక విధానాన్ని సమూలంగా మార్చాలని కోరారు. దేశ ఆహారభద్రతకు భరోసా ఇచ్చిన హరిత విప్లవ రాష్ట్రాలు భారతీయ పౌష్టికాహార భద్రతా రాష్ట్రాలుగా మారేందుకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చాలన్నారు. రాష్ట్రాలు ఈ ఖర్చును భరించే దశలో లేవని పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సీజన్కు ఒక్కో రైతుకు 5 వేల లీటర్ల వరకు డీజిల్ను అనుమతించడంతో పాటు భారీ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. క్రిమిసంహారక మందులపై పన్నులు తగ్గించాలని సలహా ఇచ్చారు. ఎంఎస్పీపై కమిటీలో ఏపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నియమించే కమిటీలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉండడంతో పాటు సుమారు 28 రకాల పంటలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదేనని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, చేపట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేని విధంగా ఉన్నందున ఆ కమిటీలో సభ్యత్వానికి తమకు అర్హత ఉందని విజ్ఞప్తి చేశారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు; ఎవరి వాటా ఎంత?
కేంద్ర ప్రభుత్వం ఈనెల 3వ తేదీన పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే. వెనువెంటనే అదేరోజు రాత్రి కూడబలుక్కున్నట్లుగా బీజేపీ పాలిత, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు వ్యాట్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర రాష్ట్రాలూ తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. పెట్రో ధరలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోయింది కేంద్రమే కాబట్టి... మరింత ఉపశమనం కూడా కేంద్రమే ఇవ్వాలని తెలంగాణ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు వాదించాయి. రాష్ట్రాల ఆదాయవనరులు పరిమితం... అసలే కోవిడ్ సంక్షోభ సమయం కాబట్టి తాము తగ్గించలేమని అశక్తతను వ్యక్తం చేశాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్లపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వస్తున్న ఆదాయం ఎంత? అందులో రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఎంత? ఇస్తున్నదెంత? అనే విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి మంగళవారం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం... 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో 1.78 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఇది రెట్టింపు కంటే ఎక్కువైంది. మొత్తం 3.72 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. కారణం కేంద్రం పన్నులు భారీగా పెంచడమే. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా 41 శాతం. అంటే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిన రూ. 3.72 లక్షల కోట్ల రూపాయల్లో రాష్ట్రాల వాటా (41 శాతం లెక్కన) కింద కేంద్రం రూ. 1,52,520 కోట్ల రూపాయలను చెల్లించాలి. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే ఈ 41 శాతం పన్నుల వాటాలో ఏ రాష్ట్రానికి ఎంతివ్వాలనేది ఫైనాన్స్ కమిషన్ (జనాభా దామాషా పద్ధతిన) నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం రాష్ట్రాలకు ఎక్సైజ్ డ్యూటీలో తమ వాటా అందుతుంది. కానీ 2020–21 ఆర్థికానికి 1.52.520 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు పంచాల్సిన కేంద్ర ఇచ్చిందెంతో తెలుసా? రూ. 19,972 కోట్లు మాత్రమే. అంటే 2020–21లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటాలో ఏకంగా 1,32,548 కోట్లను కేంద్రం తమ బొక్కసంలో వేసేసుకుంది. ఎందుకిలా? సమాఖ్య వ్యవస్థలో కేంద్ర సర్కారు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన న్యాయమైన వాటాను ఎలా తగ్గించగలదు? అనే కదా మీ సందేహం? అసలు మతలబు ఇదీ... కేంద్ర ప్రభుత్వ పెట్రోల్, డీజిల్లపై వసూలు చేసే పన్నును ఎక్సైజ్ డ్యూటీ పద్దు కింద నేరుగా వసూలు చేస్తే... రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా దక్కుతుంది. ఇక్కడే కేంద్రం మతలబు చేస్తోంది. ఎక్సైజ్ డ్యూటీ పద్దు కింద నామమాత్రంగా చూపి... మిగతా పన్నును అంతా వివిధ సెస్సుల రూపంలో చూపెడుతోంది. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే డివైజిబుల్ పూల్ (రాష్ట్రాలతో పంచుకునేది) కిందకు వస్తుంది. ఈ పద్దు కింద చూపే దాంట్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. సెస్సుల రూపంలో వచ్చే దాంట్లో పైసా కూడా రాష్ట్రాలకు దక్కదు. గంపగుత్తగా వచ్చినదంతా కేంద్ర ఖజానాను వెళుతుంది. అదెలాగో ఈ రెండు పట్టికల్లో చూద్దాం. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన తర్వాత ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులో ఏ పద్దు కింద ఎంత రాబడుతుందో చూద్దాం. – నేషనల్ డెస్క్, సాక్షి -
పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?
Convert Diesel And Petrol Car To Electric Car: ఢిల్లీ ప్రభుత్వం ఆటోమొబైల్ రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాత డీజిల్ వెహికల్స్ను ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ కిట్లను తయారు చేసే సంస్థ ఢిల్లీ రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకోనుందని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు. 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, 2018లో సుప్రీంకోర్టు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత డీజిల్ వాహనాలు,15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాత పెట్రోల్ వాహనాలు ఢిల్లీ -ఎన్సీఆర్ (National Capital Region) లో నడపరాదని ఆదేశించింది. ఈ తీర్పు కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని వినియోగదారులు తమ వాహనాల్ని మూలన పెట్టేశారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఢిల్లీలోని 10 ఏళ్లకు పై బడిన పెట్రో వాహనాల యజమానులకు ఉపశమనం కలగనుంది. పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే అయ్యే ఖర్చు మనదేశంలో ఈవీ కన్వర్షన్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ధర రూ.1లక్ష నుంచి రూ.4లక్షల వరకు ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ఈట్రియో ఇప్పటికే మారుతీ ఆల్టో,డిజైర్స్ వంటి పెట్రోల్ -డీజిల్ వాహనలను ఒకే ఛార్జ్పై 150 కిలోమీటర్ల వరకు బ్యాటరీ పరిధి కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తోంది. ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ధర దాదాపు రూ.4లక్షలుగా ఉంది. 2012లో బెంగళూరు కేంద్రంగా ఆల్టిగ్రీన్ సంస్థ పెట్రో వాహనాల్ని హైబ్రిడ్ వెర్షగా మార్చేస్తున్నాయి. ఆల్ట్రిగ్రీన్ హైబ్రిడ్ కిట్ ఇంజిన్ను అమర్చుతుంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ మెషిన్, జనరేటర్, వైర్జీను,పవర్, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ తో పాటు 48వీ బ్యాటరీ ప్యాక్ 4లీడ్ యాసిడ్ బ్యాటరీలతో డిజైన్ చేస్తుంది. ఈ ప్లగ్ ఇన్ సిస్టమ్ ధర రూ.60వేల నుంచి రూ.80వేల మధ్య ఉంటుంది. ఢిల్లీకి చెందిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ రెట్రోఫిట్ కారు కంపెనీ ఏదైనా మాన్యువల్ గేర్ బాక్స్ ఇంజిన్ కారును రూ.1 నుంచి రూ.2లక్షలకు, తయారీతో పాటు మోడల్ ఆధారంగా హైబ్రిడ్గా మార్చేస్తుంది. అయితే ఈ కిట్ ధర రూ.5 లక్షల వరకు ఉండనుందని తెలుస్తోంది. మరి పాతకార్లపై భారీ మొత్తాన్ని వెచ్చించి వాటిని ఈవీ వెహికల్స్గా ఎందుకు మార్చుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. పైగా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ను కొనుగోలు చేసినందుకు ఆయా ప్రభుత్వాలు రాయితీతోపాటు, ట్యాక్స్లో రాయితీ పొందవచ్చు. చదవండి: అరె డాల్ఫిన్లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది -
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో మరింత భారం
-
దేశంలో వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
-
ఇంధన ధరలు తగ్గేదే లే.! అక్కడ పెట్రోల్ రూ. 121 దాటేసింది..!
Petrol Diesel Prices Rise To New High On Oct 31: ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఇంధన ధరలను మరోసారి పెంచాయి. దీంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 39 పైసలు మేర పెరిగింది. ఆదివారం (అక్టోబర్ 31, 2021) పెట్రోల్, డీజిల్పై పెంపుదల కనిపిస్తోంది. ►తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109.34పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.98.07పైసలు వద్ద కొనసాగుతోంది. ►వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.115.15పై., డీజిల్ రూ.106.23కు చేరింది. ►కోలకత్తాలో పెట్రోలో రూ.109.79పైసలు, డీజిల్ రూ.101.19పైసలకు చేరాయి. ►హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.72కి చేరింది. డీజిల్ రూ.106.98 వద్ద కొనసాగుతోంది. ►విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.115.28 , రూ.107.94 గా ఉన్నాయి. ►చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.106.04, డీజిల్ రూ.102.25 గా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలోని ట్యాక్స్ల ఆధారంగా ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. దేశంలోని అంతర్గత ప్రాంతాల్లో ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాలో, పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ.121 మార్కును దాటేశాయి. -
మళ్లీ బాదేశారు...!
-
పెట్రోలు ధర తగ్గేది ఎప్పుడు? మళ్లీ బాదేశారు!
చమురు కంపెనీలకు కరుణ, జాలి, దయాలాంటి లక్షణాలేమీ కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల వంకతో ఎడాపెడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ధరల పెరుగుదలతో మాకేం సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయి. ఇప్పటికే కరోనా సంక్షోభంతో ఆదాయం తగ్గిపోయిన సామాన్యులకు పెట్రోలు ధరలు మోయలేని గుదిబండగా మారుతున్నాయి. గ్యాప్లేకుండా వరుసగా పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి చమురు సంస్థలు. ఈ నెలలో ఇప్పటికే ఇరవై సార్లకు పైగా ఇంధన ధరలు పెరిగాయి. ఇది చాలదన్నట్టు గురువారం పెట్రోలు, డీజిల్లపై లీటరుకు 35 పైసల వంతున మరోసారి ధర పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.112.64గా నమోదు అవగా లీటరు డీజిల్ ధర రూ.105.36గా ఉంది. ఇటువైపు పెట్రోలు ధరల మోతనే భరించడం కష్టంగా ఉంటే మరో వారం రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేందుకు కేంద్రం రెడీ అవుతోంది. -
మళ్లీ తగిలిన పెట్రోల్ షాక్.. రూ.120 దిశగా పరుగులు
పెట్రోలు ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పేరుతో మరోసారి ఆయిల్ కంపెనీలు సామాన్యులపై భారం మోపాయి. పెట్రోలు, డీజిల్లపై 35 పైసల వంతున ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర 112.27లకు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.46లుగా నమోదు అయ్యింది. అక్టోబరు వచ్చినప్పటి నుంచి పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 1న హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.105.96లు ఉండగా డీజిల్ ధర రూ.99.55గా ఉంది. అప్పటి నుంచి కేవలం ఆరు రోజులు మినహా దాదాపు ఇరవై సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. ఈ నెలలో లీటరు పెట్రోలు ధర రూ.5.31 వరకు పెరిగింది. డీజిల్కి సంబంధించి ధర రూ.4.91 వరకు పెరిగింది. -
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఎంతంటే?
శుక్రవారం రోజు మరో సారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ పై 31 పైసలు,డీజిల్ పై 38 పైసలు పెరిగాయి. దీంతో వాహనదారులు పెరుగుతున్న ఇంధన ధరలతో చేతి చమురు వదులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ఇంధన రేట్లను పెంచడం దారుణమని వాపోతున్నారు. రవాణా రంగం మీద ఆధారపడే వాళ్లు సైతం బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు.ఇన్ని రోజులు వర్క్ ఫ్రం హోంకే పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.కానీ రోజురోజుకి రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆఫీస్కు వెళ్లాలంటే జంకుతున్నారు. దేశంలోని పలు నగరాల్లో రోజురోజుకి పెరగుతున్న ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.ఇప్పటికే పెట్రోల్ రేటు వంద దాటి పరుగులుపెడుతుండగా.. డీజల్ రేట్లు సైతం వంద మార్క్ను దాటాయి. పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ వివరాలు హైదరాబాద్లో పెట్రోల్ రూ.107.71 ఉండగా డీజిల్ లీటర్ రూ.100.51 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.54 ఉండగా.. లీటర్ డీజిల్ రూ. 92.12 ఉంది ముంబైలో పెట్రోల్ రూ. 109.54 ఉండగా డీజిల్ రూ .99.92 ఉంది కోల్కతాలో పెట్రోల్ రూ. 104.23 ఉండగా డీజిల్ రూ. 95.23 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ .101.01 డీజిల్ రూ. 96.60 ఉంది. -
మరోసారి పెరిగిన పెట్రో ధరలు..ఎంతంటే?
శుక్రవారం రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. సహజ వాయువు ధరలు పెరగడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్టస్థాయికి చేరుకోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరల వ్యత్యాసంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ► ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై 25 పైసలు పెరిగి రూ.101.89కి చేరింది, డీజిల్ ధర లీటరుపై 30 పైసలు పెరిగి రూ.89.87 ఉంది ► ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.95 ఉండగా డీజిల్ ధర రూ. 97.84 ఉంది ► హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.106కి చేరింది, లీటర్ డీజిల్ ధర 33 పైసలు పెరిగి రూ.99.08 ఉంది ► విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.1.06కి పెరిగి రూ.108.67కి చేరింది, లీటర్ డీజిల్ ధర రూ.1.06 పెరిగి రూ.100.39కు ఉంది ► వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధరపై 0.82పైసలు పెరిగి రూ.107.51కు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.99.28 ఉంది. -
అమెరికాపై ఫ్రాన్స్ ఆగ్రహం
పారిస్: సాంప్రదాయక జలాంతర్గాముల కొనుగోలు వ్యవహారం అమెరికా, ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 66 బిలియన్ డాలర్ల విలువైన 12 డీజిల్–ఎలక్ట్రిక్ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి 2016లో ఆస్ట్రేలియా ఫ్రాన్స్తో భారీ కొనుగోలు ఒప్పందం కుదర్చుకుంది. అయితే, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల కొత్త ‘ఆకస్’ కూటమి పరోక్షంగా ఈ కొనుగోలు ఒప్పందం రద్దుకు దారితీసింది. సంప్రదాయక జలాంతర్గాములు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయబోమని, ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు లేఖ రాశారు. ఫ్రాన్స్కు బదులుగా అమెరికా నుంచి అత్యాధునిక అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియా కొనుగోలుచేయనుంది. తమతో ఒప్పందం రద్దుకు అమెరికానే ప్రధాన కారణమని ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందుకు నిరసన అమెరికాలో తమ రాయబారి ఫిలిప్ ఎతీన్ను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించింది. ఆస్ట్రేలియా వైఖరిని తూర్పారబడుతూ అక్కడి తమ రాయబారి జీన్ పియర్ థబాల్ట్ను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించింది. -
స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో మరోసారి పెట్టోలు, డీజిలు ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోలు, డీజిల్లకు సంబంధించి లీటరుపై 15 పైసల వంతున ధరను ఆదివారం చమురు కంపెనీలు తగ్గించాయి. ఈ నెలలో పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గడం వరుసగా ఇది రెండో సారి. తగ్గిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 105.26గా ఉంది. డీజిల్ ధర రూ. 96.69లుగా ఉంది. మేలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వరుసగా పెట్రోలు, డీజిల్ ధరలను చమురు కంపెనీలు పెంచుకుంటూ పోయాయి. దీంతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలు ధర వంద రూపాయలు దాటగా, డీజిల్ ధర సెంచరీకి చేరువైంది. అయితే ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం ప్రారంభమైంది. బ్యారెల్ ముడి చమురు ధర 75 డాలర్ల నుంచి 64 డాలర్లకు పడిపోయింది. కొద్ది కాలంగా కొంచెం అటుఇటుగా అక్కడే కొనసాగుతోంది. దీంతో చమురు కంపెనీలు కొద్ది కొద్దిగా ధరలను తగ్గిస్తున్నాయి. చదవండి: ఇండియన్ ఆయిల్ కొత్త మస్కట్ ఇదే -
డీజిల్ దొంగలు
-
స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
వాహన దారులకు స్వల్ప ఊరట లభించింది. లీటరు పెట్రోలు, డీజిల్పై కేవలం15 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రెండవసారి తగ్గినట్లైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.49 ఉండగా లీటర్ డీజిల్ రూ.88.92గా ఉంది హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.105.63ఉండగా డీజిల్ రూ.97.16గా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.52 వద్ద ఉండగా డీజిల్ ధర రూ .96.48గా ఉంది ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. దీంతో పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. -
4 నెలలు.. రూ.900 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: కేవలం 4 నెలలు.. ఏకంగా రూ.900 కోట్ల నష్టాలు.. ఆర్టీసీ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రెండేళ్ల కింద కిలోమీటర్కు 20 పైసలు చొప్పున టికెట్ ధరలను ప్రభుత్వం పెంచటంతో ఒక్క సారిగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. రోజు వారీ ఆదాయం రూ.14 కోట్లకు చేరుకోవటంతో తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్కు చేరుకునే బాట పట్టింది. సరిగ్గా ఇదే సమయంలో కోవిడ్ దెబ్బ తీసింది. కోవిడ్తో దాదాపు ఏడాదిన్నరగా తీవ్ర ఒడిదుడుకుల్లో నడుస్తున్న ఆర్టీసీని పట్టపగ్గా ల్లేకుండా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు మరింత దెబ్బకొట్టాయి. ఫలితంగా ఆర్టీసీ చరి త్రలో ఎన్నడూ లేనంతగా నష్టాలొచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆర్టీసీకి రూ.900 కోట్లమేర నష్టాలు వచ్చినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సగటున నెలకు రూ.225 కోట్ల చొప్పున నష్టం వస్తోంది. గతంలో 2015–16లో రూ.1,150 కోట్లు, 2019–20లో రూ.1,002 కోట్ల నష్టం వాటిల్లగా, ఈసారి వాటికి రెట్టింపు మొత్తంలో నష్టం వచ్చే దిశగా ఆర్టీసీ సాగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్టీసీని నిర్వహించడం కూడా కష్టం కానుంది. వీలైనంత తొందరలో టికెట్ ధరలను పెంచి కొంతలో కొంతైనా ఆదుకోవాలని ఆర్టీసీ.. ప్రభుత్వాన్ని కోరుతోంది. డీజిల్ భారం రోజుకు రూ.2 కోట్లు.. దాదాపు ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పుడు డీజిల్పై రోజుకు రూ.2 కోట్ల అదనపు భారం పడుతోంది. వరసగా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు ఆర్టీసీని కోలుకోనీయకుండా చేస్తున్నాయి. మూడునాలుగు నెలల క్రితం కిలోమీటరుకు రూ.14 చొప్పున చమురు ఖర్చు ఉండేది. ఇప్పుడది దాదాపు రూ.18కి చేరింది. ఇప్పట్లో చమురు ధరలు తగ్గే అవకాశం కనిపించకపోవటంతో ఆర్టీసీ సతమతమవుతోంది. చమురు భారం నుంచి బయటపడే మార్గం లేకపోవటంతో ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తూ కొంత ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంది. గతంలో ఇదే ఉద్దేశంతో బయో డీజిల్ను ఆర్టీసీ వినియోగంలోకి తెచ్చింది. 10 శాతం మేర బయో డీజిల్ను కలిపి వాడేది. ఇది సాధారణ డీజిల్తో పోలిస్తే లీటరుకు రూ.5 నుంచి రూ.6 వరకు తక్కువ. అంతమేర ఖర్చు ఆదాయ అయ్యేది. అయితే బయో డీజిల్ సరఫరా చేసే సంస్థ దాన్ని సరిగా అందించడం లేదన్న ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితమే ఆ ఒప్పందాన్ని ఆర్టీసీ రద్దు చేసుకుంది. ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం రూపంలో వచ్చే ఆదా కూడా లేకుండా పోయింది. బయోడీజిల్ స్థానంలో ఇథెనాల్ను కూడా వినియోగించే అవకాశం ఉంది. అయిదే దీని వినియోగంపై ఆర్టీసీ ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. -
ఇంటి వద్దకు డీజిల్ బల్క్ డెలివరీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తాజాగా ముంబై, పరిసర ప్రాంతాల్లో ఇంటి వద్దకే బల్క్గా డీజిల్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఇందుకోసం యాప్ ఆధారిత డీజిల్ డోర్ డెలివరీ సేవల సంస్థ హమ్సఫర్ ఇండియా, ఒకారా ఫ్యూయెలాజిక్స్తో చేతులు కలిపింది. త్వరలో మహారాష్ట్రలోని పుణె, నాగ్పూర్, నాసిక్ తదితర నగరాలకు ఈ సర్వీసులు విస్తరించనున్నట్లు ఐవోసీ చీఫ్ జనరల్ మేనేజర్ (మహారాష్ట్ర ఆఫీస్) రాజేశ్ సింగ్ తెలిపారు. డీజిల్ పంపిణీలో ఇదొక వినూత్న విధానమని ఆయన వివరించారు. వ్యవసాయ రంగం, ఆస్పత్రులు, హౌసింగ్ సొసైటీలు, భారీ యంత్రాల కేంద్రాలు, మొబైల్ టవర్లు మొదలైన వాటికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇప్పటిదాకా భారీ మొత్తంలో డీజిల్ కొనుక్కునే (బల్క్) వినియోగదారులు బ్యారెళ్లలో రిటైల్ అవుట్లెట్ల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేదని సింగ్ తెలిపారు. దీని వల్ల గమ్యస్థానానికి చేరేలోగా డీజిల్లో కొంత భాగం కారిపోవడం తదితర సమస్యల వల్ల నష్టపోవాల్సి వచ్చేదని ఆయన వివరించారు. డీజిల్ డోర్ డెలివరీతో ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చని, బల్క్ కస్టమర్లకు చట్టబద్ధంగా డీజిల్ సరఫరా సాధ్యపడుతుందని సింగ్ పేర్కొన్నారు. -
స్థిరంగా కొనసాగుతున్న పెట్రో ధరలు, 14 రోజులుగా
దేశీయ మార్కెట్లో చమురు ధరలు 14రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు వారాల క్రితం పెరిగిన చమరు ధరలు ఆ తర్వాత నుంచి ఎలాంటి మార్పుచోటు చేసుకోలేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.05 శాతం పెరుగుదలతో 75.14 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.14 శాతం పెరుగుదలతో 73.72 డాలర్లకు చేరింది. శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
డీజిల్ డోర్ డెలివరీ... ఎప్పుడు? ఎక్కడ?
ఢిల్లీ: వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీజిల్ డోర్ డెలవరీ స్కీంని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అమల్లోకి తెచ్చింది. ఢిల్లీకి చెందిన స్టార్టప్ సంస్థతో కలిసి సేఫ్20 పేరుతో డీజిల్ డోర్ డెలివరీ చేస్తోంది. 20 లీటర్ల క్యాన్ ఢిల్లీ కేంద్రంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 20 లీటర్ల జెర్రీ క్యాన్లను ఢోర్ డెలివరీగా బీపీసీఎల్ అందిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న హమ్ సఫర్ సంస్థతో బీపీసీఎల్ టై అప్ అయ్యింది. 20 లీటర్ల సామర్థ్యం కల జెర్రీ క్యాన్లలో డీజిల్ని డోర్ డెలివరీ చేస్తోంది. డోర్ డెలివరీ కావాలంటే కనీసం 20 లీటర్లు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఉపయోగకరం డోర్ డెలివరీ పథకం వల్ల అపార్ట్మెంట్లు, సెల్ఫోన్ టవర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, హాస్పటిల్స్, బ్యాంకులు, కన్స్ట్రక్షన్ సైట్లు, హోటళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీపీసీఎల్ అంటోంది. గతంలో డీజిల్ కావాలంటే పెట్రోల్ పంప్కు రాక తప్పని పరిస్థితి నెలకొని ఉండేది. పైగా ఫ్యూయల్ స్టేషన్ నుంచి డీజిల్ రవాణా చేయడం ప్రయాసతో కూడిన వ్యవహరం. మార్గమధ్యంలో డీజిల్ ఒలకడం సర్వ సాధారణంగా జరిగేది. అయితే తాజా డోర్ డెలివరీతో ఈ కష్టాలు తీరనున్నాయి. ఇంటి వద్దకే డీజిల్ తెప్పించుకుని జనరేటర్, లిఫ్టు, క్రేన్లు, భారీ యంత్రాలు తదితర అవసరాలకు సులభంగా ఉపయోగించవచ్చు. మొదట అక్కడే గతంలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేవ్, ఉత్తరఖండ్ ప్రాంతాల్లో ఈ డోర్ డెలివరీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయి. ఊరికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఉండే హోటళ్లు, రిసార్టులకు ఈ స్కీం చాలా ప్రయోజనకారిగా మారింది. ఆ తర్వాత వ్యవసాయ అవసరాలు ఎక్కువగా ఉండే పంజాబ్, హర్యానాల్లోనూ అమలు చేశారు. దేశమంతటా డీజిల్ డోర్ డెలివరీని మొదటగా అమలు చేసిన నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని ఈ సారి డిమాండ్ ఎక్కువగా ఉండే ఢిల్లీలో డీజిల్ డోర్ డెలివరీని అమల్లోకి తెచ్చారు. ఇక్కడ సానుకూల ఫలితాలు వస్తే క్రమంగా దేశమంతటా విస్తరించనున్నారు. -
Petrol & Diesel: ఆ రెండు రాష్ట్రాల్లో అత్యధిక వ్యాట్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధికంగా పెట్రోల్పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుండగా, రాజస్తాన్ డీజిల్పై అత్యధికంగా వ్యాట్ విధిస్తోందని చమురు శాఖ మంత్రి హర్దీప్ పూరి సోమవారం లోక్సభకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. దేశంలో ఈ నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి పెరిగాయని తెలిపారు. పెట్రోల్ ధరలో 55%, డీజిల్ ధరలో 50% మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధిస్తున్న పన్నులే ఉంటున్నాయని ఆయన వివరించారు. కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.32.90 చొప్పున, లీటర్ డీజిల్పై రూ.31.80 చొప్పున ఎక్జైజ్ డ్యూటీ విధిస్తుండగా, మిగతాది రాష్ట్రాలు వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్నాయన్నారు. 2020–21 ఆర్థికంలో కేంద్రం ఎక్సైజ్డ్యూటీ రూపంలో రూ.1,01,598 కోట్లను పెట్రోల్ నుంచి, రూ.2,33,296 కోట్లను డీజిల్ నుంచి వసూలు చేసిందన్నారు. పెట్రోల్, డీజిల్ మూల ధర, కేంద్ర పన్నులపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తున్నాయని తెలిపారు. దేశంమొత్తమ్మీద అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాట్ అతి తక్కువగా లీటరు పెట్రోల్ పై రూ.4.82, డీజిల్పై 4.74 ఉందన్నారు. అదేవిధంగా, దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్లో లీటరు పెట్రోల్పై వ్యాట్ రూ.31.55, రాజస్తాన్లో డీజిల్పై రూ.21.82గా ఉంది. -
40 కిలోమీటర్ల ప్రయాణం, ఖర్చు 10పైసలే
ట్రెండ్ మారుతోంది. ఆ ట్రెండ్కు తగ్గట్లు మారకపోతే వెనకబడిపోతాం. అది మనుషులైనా..వస్తువులైనా. ప్రపంచ దేశాల్లో ఆర్ధిక సంక్షోభం, దానికితోడు పెరిగిపోతున్న పెట్రో ధరలతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గుచూపుతున్నారు. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వారి ఇష్టాలకు అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల్ని తయారు చేసే పనిలో పడ్డాయి. 10 పైసల ఖర్చుతో తాజాగా నహాక్ మోటార్స్ సంస్థ గరుడ, జిప్పీ పేర్లతో కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. సంప్రదాయ పద్దతిలో పెడల్స్ తొక్కుతూ ఈ సైకిల్పై ప్రయాణం చేయవచ్చు. అదే విధంగా పెడల్స్ తొక్కకుడా బ్యాటరీ సాయంతో వెళ్లిపోవచ్చు. ఈ సైకిల్లో లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చారు. వీటిని ఒక్క సారి చార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల ప్రయాణం చేయచ్చని కంపెనీ హామీ ఇస్తోంది. బ్యాటరీ ఛార్జింగ్కి అతి తక్కువ విద్యుత్ను ఉపయోగించుకుంటుందని, ఒకసారి ఛార్జింగ్ చేస్తే అక్షరాల 10 పైసలకు మించి విద్యుత్ ఖర్చు అవదని కంపెనీ చెబుతోంది. ధర ఇలా ప్రస్తుతం మా ర్కెట్లో గరుడ మోడల్ ధర 31,999 రూపాయలు ఉండగా జిప్పీ ధర రూ. 33,499గా నిర్ణయించినట్లు నహాక్ మోటార్ తెలిపింది. . -
దేశంలో పెట్రో ధరలు, వాహనదారులకు ఊరట
కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తిన వేళ దేశంలో చమురు వాహనదారులకు ఊరట కలిగిస్తున్నాయి. గత ఆదివారం నుంచి ఈ రోజు(ఆదివారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ ధరలు 39 సార్లు పెరగ్గా అదే సమయంలో డీజిల్ రేట్లు 36 సార్లు పెరిగాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇక ఆదివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పెట్రో ఎక్సయిజ్ పన్నులతోనే మౌలిక వసతుల అభివృద్ధి
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చిన ఎక్సయిజ్ పన్ను వసూళ్ల మొత్తాలను ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా సరకు రవాణాపై తీవ్రభారం చూపడంపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో దేశంలోనూ ఎక్సయిజ్ పన్ను లీటర్కు రూ.19.98 నుంచి రూ.32.9కు పెరిగిందని మంత్రి చెప్పారు. 2020–21లో 13వేల కి.మీ.ల రహదారులు సగటున రోజుకు 13 కి.మీ.ల చొప్పున 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 13,327 కి.మీ.ల మేర జాతీయ రహదారులను నిర్మించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1,39,032 కి.మీ.ల జాతీయ రహదారుల్లో 37,058 కి.మీ.ల 4/6 లేన్ల జాతీయరహదారుల వ్యవస్థ ఉందని ఆయన పేర్కొన్నారు. 2021–22లో మరో 12 వేల కి.మీ.ల రహదారులను నిర్మిస్తామన్నారు. -
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా,గత శనివారం లీటర్ పెట్రోల్పైన 30పైసలు పెరిగింది. ఆ తర్వాత ఆదివారం నుండి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జులై నెల 20రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి...మే 3 నుంచి ఇప్పటివరకూ వరుసగా 5 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. గత ఆదివారం ఒపెక్, అనుబంధ దేశాలు ఆగస్ట్ నుంచి చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పదం ప్రకారం.. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచనున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో చమురు ధరలు నిలకడగా ఉన్నాయి. భవిష్యత్లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గురువారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎఫెక్ట్: చమురు ధరలు తగ్గనున్నాయా?!
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 3 నుంచి నేటి మధ్య కాలంలో వరుసగా 4 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. అయితే అందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడం ఓ కారణమేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది మరో వైపు త్వరలో చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 18 న జరిగిన ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో పెట్రోలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.కరోనా ఎఫెక్ట్తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. జులై 16న బ్యారెల్ ధర 73.59 డాలర్లు ఉండగా... జులై 19న ధర 68.62డాలర్లుగా ఉంది. ముడి చమురు ఉత్పత్తి పెరుగుతూ పోతే దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
పెట్రోల్ ధరలు: మోదీజీ.. ఈ మహిళ మొర ఆలకించేనా..?
పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా దేశ వ్యాప్తంగా వాహనదారులు తమదైన స్టైల్లో చేస్తున్న నిరసన కొనసాగుతుంది. పార్లమెంట్ వర్షాకాల నేపథ్యంలో పెరుగుతున్న చమురు ధరలు తగ్గించే విషయంపై ప్రధాని మోదీ ప్రసంగించాలని కోరుకుంటున్నారు. ఓవైపు పెట్రోల్ బంకుల్లో కార్లపైకెక్కి అర్ధనగ్నంగా దండాలు పెడుతుంటే,మహిళలు పెట్రోల్ బంకుల్లో తమ మొర ఆలకించాలంటూ మోదీ ఫ్లెక్సీకి దణ్ణాలు పెడుతున్నారు. నెటిజన్లు సైతం #ThankYouModiJiChallenge అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు.ఈ నిరసనతో పెట్రో ధరలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా' అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మంగళవారం రోజు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరడగంతో.. దేశీయంగా పెట్రో ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఈ నెలలో ఈ ఇరవై రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఒక్క ఢిల్లీలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం పెట్రోల్ 63 పర్యాయాలు, డీజిల్ 61సార్లు పెరిగింది. మంగళవారం పెట్రోల్,డీజిల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది చదవండి: 'పెగసస్' చిచ్చు, సర్వీస్లను షట్ డౌన్ చేసిన అమెజాన్ -
స్థిరంగా పెట్రో ధరలు, రెండు నెలల్లో ఎంత పెరిగాయంటే?
దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజు చమురు ధరలు స్వల్పంగా పెరిగినా శుక్రవారం రోజు వాటి ధరలు అలాగే స్థిరంగా ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి(ఒపెక్) లతో జరిగే చర్చలు విఫలం కావడంతో వాటి ప్రభావం పెట్రో ధరలు పెరగడానికి కారణమైంది. ఈ రెండు నెలల కాలంలో పెట్రోల్ ధర రూ. 10కి పెరిగింది. దీంతో దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో చమురు ధరలు రికార్డ్ స్థాయిల్ని నమోదు చేశాయి. ఇక శుక్రవారం రోజు పెట్రోల్ డీజిల్ ధరలు వివరాలు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54 గా ఉండగా డీజిల్ ధర రూ.89.87 గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.23 గా ఉండగా డీజిల్ ధర రూ.94.39 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.54 గా ఉండగా డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.94 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.95.26 గా ఉంది. -
Petrol Price : మేలో 14 సార్లు, జూన్లో 16 సార్లు.. మరి జులైలో ?
ముంబై : పెట్రోలు ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్లపై ఆరు పైసల వంతున ధర పెంచాయి చమురు కంపెనీలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు 60 రోజుల్లో 34 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. 34 సార్లు బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎన్నికల హడావుడి కొనసాగినన్నటి రోజులు దాదాపు రెండు నెలలుగా పెట్రోలు ధరలు పెరగలేదు. కానీ మే మొదటి వారంలో ఫలితాలు వెలువడిన అనంతరం పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరుగుతూ పోయాయి. ఇప్పటి వరకు 60 రోజుల్లో 34 సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. ఇందులో జులైలో ఇప్పటికే రెండు సార్లు ధరలు పెరగగా జూన్లో 16 సార్లు, మేలో 14 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. పెట్రోలుపై రూ. 8.82 పెంపు ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 34 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 8.82 ధరను పెంచారు. ఇదే సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ. 8.51 పెరిగింది. తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ రూ103.11; డీజిల్ రూ.97.26 పైసలకు చేరుకుంది. చదవండి : New IT Rules: ఫేస్బుక్ పోస్టులపై భారీ వేటు -
మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
హైదరాబాద్ : పెట్రోలు, డీజిల్ ధరలను చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోలుపై రూ. 35 పైసలు, డీజిల్పై 35 పైసల ధరను పెంచాయి. గురువారం పెట్రోల్పై 26 పైసలు, డీజిల్ లీటర్కు 7 పైసలు వరకు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి ఆ వెంటనే మరోసారి ఇంధన ధరలను పెంచేశాయి. వారం వ్యవధిలోనే పెట్రోలు ధర దాదాపు రూపాయన్నర పెరిగింది. లీటరు పెట్రోలు ధర సెంచరీ క్రాస్ చేసేందుకు పరుగులు పెడుతోంది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర హైదరాబాద్లో పెట్రోల్ రూ.101.90.. డీజిల్ రూ.96.63 కి చేరుకుంది. ధర తగ్గించండి - ఇక్రా మరోవైపు డోమెస్టిక్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా ఇచ్చిన రిపోర్టులో పెట్రోలు, డీజిల్లపై సెస్ తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. ధరలు తగ్గడం వల్ల ఫ్యూయల్ వినియోగం పెరుగుతుందని... ప్రభుత్వ ఆదాయానికి ఢోకా ఉండదని సూచించింది. చదవండి : ప్రభుత్వంపై చెల్లింపుల భారం..రూ.116.21 లక్షల కోట్లు -
ఈ బాదుడేందో.. 48 రోజుల్లో 27వసారి
ఒక్కరోజు గ్యాపిచ్చిన చమురు కంపెనీలు మళ్లీ బాదుడు షురూ చేశాయి. పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 27 పైసలు పెంచి పెంపు దూకుడు ఇలానే కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చాయి. ఇక తాజా ధరల పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.97.22 ఉండగా డీజిల్ రూ.87.97 గా ఉంది. ముంబై లో లీటర్ పెట్రోల్ ధర రూ.103.36గా ఉంటే డీజిల్ ధర రూ. 95.44 ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర రూ.97.12 ఉండగా డీజిల్ ధర రూ.90.82 ఉంది. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో లీటర్ పెట్రోల్ రూ.100 అంతకంటే ఎక్కువగానే ఉంది. ఆదివారం తాజా ధరల పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన రాష్ట్ర రాజధానుల జాబితాలో పాట్నా చేరబోతోంది. ఇక తొలిసారి పెట్రోల్ ధర రూ.100 దాటిన మొదటి రాష్ట్ర రాజధానుల్లో భోపాల్, ఆ తరువాత జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరులు ఉన్నాయి. ఈ ఏడాది మే4వ తేదీ నుంచి ఇప్పటివరకూ పెట్రో ధరలు పెంచడం 27వసారి. అంటే 48 రోజుల్లో చమురు ధరలు వరుసగా పెరుగుతూ పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 103.65 ఉండగా డీజిల్ ధర రూ. 97.88గా ఉంది విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.89 ఉండగా.. డీజిల్ ధర రూ.97.14గా ఉంది కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.26 ఉండగా.. డీజిల్ ధర రూ.97.52గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 103.65 ఉండగా.. డీజిల్ రూ.97.88గా ఉంది. తెలంగాణలో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.04 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.89గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.26 ఉండగా.. డీజిల్ ధర రూ.96.10 గా ఉంది. వరంగల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.58 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.46గా ఉంది. -
హైదరాబాద్: రూ.100.20 పలికిన లీటర్ పెట్రోల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. డీజిల్ లీటర్ ధర వందకు చేరువైంది. సోమవారం పెట్రోల్ రూ.100.20, డీజిల్ రూ.95.14 పైసల చొప్పున ధర పలికాయి. కరోనా కష్టకాలంలో సైతం ఇంధన ధరలపై బాదుడు తప్పడం లేదు. తాజాగా పక్షం రోజుల్లో లీటర్ పెట్రోల్పై రూ.2, డీజిల్పై రూ.2.17 పైసలు పెరిగింది. ఒకవైపు కరోనా సెకండ్వేవ్ ఉగ్రరూపం, మరోవైపు ఉపాధి కోల్పోయి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతుంటే చమురు ధరల పెంపు మరింత భారంగా మారాయి. పెరుగుతున్న ఇంధనం ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రెండు నెలలుగా పైపైకి.. కరోనా కష్టకాలంలో గత రెండు మాసాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. వాస్తవంగా ఈ ఏడాది ఆరంభంలో మొదటి రెండు నెలల్లో లీటర్ పెట్రోల్పై రూ.8.32 పైసలు, డీజిల్పై 9.51 పైసలు పెరిగాయి. ఆ తర్వాత వరసగా రెండు నెలలు లీటర్ పెట్రోల్పై 75 పైసలు, డీజిల్పై 92 పైసలు తగ్గాయి. తిరిగి వరుసగా పైసలు పెరిగి రెండు నెలల వ్యవధిలో లీటర్ పెట్రోల్పై రూ.6.02 పైసలు, డీజిల్పై రూ 7.32 పెరిగినట్లు చమురు సంస్థల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గరిష్ట స్థాయికి ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రోజువారీ సవరణ కంటే ముందే ఇంధన ధరలు గరిష్ట స్ధాయికి చేరి తర్వాత తగ్గుముఖం పట్టాయి. నాలుగేళ్ల క్రితం రోజువారీ సవరణలు ప్రారంభం కావడంతో పైసల్లో హెచ్చు తగ్గులు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా పెట్రోల్ 2013 సెప్టెంబర్లో లీటర్ ధర రూ. 83.07 పలికి గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి రోజువారీ ధరల సవరణ అనంతరం 2018 అక్టోబర్ 4న లీటర్ పెట్రోల్ ధర రూ.89.11కు పెరిగి రికార్డు బద్దలు కొట్టింది. డీజిల్ 2018 అక్టోబర్లో లీటర్ ధర రూ.82.38తో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ రూ.82.80కు చేరి పాత రికార్డును అధిగమించింది. తాజాగా మరింత గరిష్ట ధరకు చేరుకున్నాయి. నగర వాటా 70 శాతం పైనే గ్రేటర్లో వాహనాల సంఖ్య సగటున 65 లక్షలపైగానే ఉంటుంది. పెట్రోల్, డీజిల్ వినియోగంలో నగర వాటా 70% వరకు ఉంటుంది. నగరం మొత్తమ్మీద 558 వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రతినిత్యం 35 నుంచి 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 నుంచి 33 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. జీఎస్టీలో చేర్చాలి చమురు ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటా శాతమే సగానికిపైగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్లను కూడా జీఎస్టీలో చేర్చాలి. అప్పుడే ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. ధరలు ఇదే విధంగా కొనసాగితే నిత్యావసర సరుకులు మరింత పెరుగుతాయి. వాహనాలు కూడా నడపడం కష్టమే. – సయ్యద్ జావీద్, అధ్యక్షుడు, గ్రేటర్ సిటీ ట్యాక్స్ వేల్పేర్ అసోసియేషన్ -
Petrol, Diesel Prices Today: దిగిరాని ధరలు
Petrol, Diesel Prices Today: ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు లేదు. మంగళవారం వరుసగా 23 పైసలు, 25 పైసల మేర పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే కొనసాగుతున్నాయి. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర. 99.71, డీజిల్ ధర. 91.57 రూపాయాలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధరలు వరుసగా.. 93.44, 84.32 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక రాజస్తాన్లోని కొన్ని పట్టణాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేయగా... మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ సెంచరీ మార్కు దిశగా పరుగులు తీస్తోంది. చెన్నై: పెట్రోల్- రూ.95.06, డీజిల్- రూ. 89.11 కోల్కతా: పెట్రోల్- రూ. 93.49, డీజిల్- రూ. 87.16 హైదరాబాద్: పెట్రోల్- రూ. 97.27, డీజిల్- రూ. 92.07 -
Petrol, Diesel Prices In May: భారీగా పెరిగిన ధరలు
Petrol, Diesel Prices Today: ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 25 పైసల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ. 93.44, డీజిల్ రూ. 84.32 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక ముంబైలో అత్యధికంగా ఈ ధరలు వరుసగా రూ. 99.49(సెంచరీకి చేరువలో), 91.30గా ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల్లో మార్పులు చేయాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మేరకు రేట్ల మోత మోగుతుండటం గమనార్హం. ఇక ఈ నెలలో ధరలు పెరగటం ఇది పదమూడోసారి. గత మూడు వారాలుగా మొత్తంగా లీటరు పెట్రోల్ ధర. 3.04, డీజిల్ ధర 3.59 మేర పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీ: పెట్రోల్- రూ. 93.44, డీజిల్- రూ. 84.32 ముంబై: పెట్రోల్- రూ. 99.49, డీజిల్- రూ. 91.30 చెన్నై: పెట్రోల్- రూ.95.06, డీజిల్- రూ. 89.11 కోల్కతా: పెట్రోల్- రూ. 93.49, డీజిల్- రూ. 87.16 హైదరాబాద్: పెట్రోల్- రూ. 97.12, డీజిల్- రూ. 91.92 చదవండి: Stock Market:లాభాలతో మొదలైన సూచీలు -
Petrol, Diesel Prices Hike: మరోసారి పెరిగిన ధరలు
Petrol, Diesel Prices Today: వాహనదారులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధి అనంతరం పెట్రోల్, డీజిల్ ధరల్లో శుక్రవారం మరోసారి పెరుగుదల నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 19 పైసలు పెరగగా, ప్రస్తుతం అక్కడ లీటరు ధర రూ. 93.85గా ఉంది. ఇక 29 పైసల మేర డీజిల్ ధర పెరగడంతో లీటరుకు రూ. 83.80 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక వాణిజ్య రాజధాని ముంబై విషయానికొస్తే.. లీటరు పెట్రోల్ ధర సెంచరీకి చేరువ(99.32)లో ఉండగా, డీజిల్ ధర రూ. 91.01గా ఉంది. ఇక చెన్నైలో ఈ ధరలు వరుసగా రూ. 94.71, రూ. 88.62, కోల్కతాలో రూ. 93.11,రూ. 86.64గా ఉన్నాయి. కాగా గత పద్దెమినిది రోజులుగా మొత్తం మీద లీటరు పెట్రోల్ ధర రూ. 2.64, డీజిల్ ధరలు రూ. 3.07 మేర పెరిగింది. హైదరాబాద్: లీటరు పెట్రోల్ ధర 96.70(20 పైసల పెరుగుదల), డీజిల్ ధర. 91.36(32 పైసలు). నగరం పెట్రోల్ ధర డీజిల్ ధర ఢిల్లీ 93.04 83.80 ముంబై 99.32 91.01 చెన్నై 94.71 88.62 కోల్కతా 93.11 86.64 చదవండి: Stock Market: లాభాలతో ప్రారంభమైన సూచీలు -
గుడ్న్యూస్: త్వరలో పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చెమటలు పట్టిస్తున్న క్రమంలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. సమయం వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు పన్నుల్లో కోత పెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అజిత్ కుమార్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల ఆదాయంలో భారీ వృద్ధిని చూపించింది. దీనికి ప్రధాన కారణం ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ ఆదాయం భారీగా పెరగడమే. ‘‘రానున్న నెలల్లో ఆదాయంలో బలమైన వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావంతో ఉన్నాము’’ అని కుమార్ చెప్పారు. కేంద్ర సర్కారు గతేడాది పెట్రోల్పై లీటర్కు రూ.13, డీజిల్పై లీటర్కు రూ.16 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రూ.32.90కు చేరింది. విక్రయ ధరలో సుమారు 39 శాతం ఎక్సైజ్ సుంకమే. అదే విధంగా డీజిల్ లీటర్పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.31.80గా ఉంది. రాష్ట్రాల్లో వ్యాట్, ఇతర పన్నులు కూడా కులుపుకుంటే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరల్లో పన్నుల వాటా 55-60 శాతంగా ఉంటోంది. వెరసి కొనుగోలుదారులకు ధరలు భారంగా పరిణమించాయి. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తామన్న సీబీఐసీ చీఫ్ అందుకు నిర్ధిష్ట కాలపరిమితిని మాత్రం వెల్లడించలేదు. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్ -
భారీగా తగ్గిన ఇంధన వినియోగం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్తో ఎకానమీ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో దేశీయంగా ఇంధన వినియోగం గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతం క్షీణించింది. ఇంధన వినియోగం ఇంతగా తగ్గడం 1998–99 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే ప్రథ మం. 2019–20లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 214.12 మిలియన్ టన్నులుగా ఉండగా 2020–21లో ఇది 194.63 మిలియన్ టన్నులకు క్షీణించింది. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) విడుదల చేసిన డేటాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా డీజిల్ తగ్గుదల .. దేశీయంగా అత్యధికంగా ఉపయోగించే ఇంధనమైన డీజిల్ వినియోగం 12 శాతం తగ్గి 72.72 మిలియన్ టన్నులుగా నమోదైంది. పెట్రోల్ డిమాండ్ 6.7 శాతం క్షీణించి 27.95 మిలియన్ టన్నులకు పరిమితమైంది. వంట గ్యాస్ ఎల్పీజీ వినియోగం మాత్రమే 4.7 శాతం పెరిగి 26.33 మిలియన్ టన్నుల నుంచి 27.59 మిలియన్ టన్నులకు చేరింది. కరోనా వైరస్ మహమ్మారి ఉపశమన చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొంత మేర సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం ఇందుకు దోహదపడింది. మరోవైపు, విమానయాన సంస్థలు చాలా భాగం మూతబడే ఉండటంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) డిమాండ్ 53.6 శాతం క్షీణించి 3.7 మిలియన్ టన్నులకు పరిమింతమైంది. నాఫ్తా అమ్మకాలు దాదాపు అంతక్రితం ఆర్థిక సంవత్సరం స్థాయిలో 14.2 మిలియన్ టన్నులుగా ఉండగా, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్ వినియోగం 6 శాతం పెరిగి 7.11 మిలియన్ టన్నులకు చేరింది. ఎకానమీకి ఊతమిచ్చే దిశగా కేంద్రం నిర్మాణ కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు తీసుకోవడం ఇందుకు దోహదపడింది. క్రమంగా కోవిడ్ పూర్వ స్థాయికి.. లాక్డౌన్ను కఠినతరంగా అమలు చేయడంతో గతేడాది ఏప్రిల్లో ఇంధన వినియోగం సగానికి సగం పడిపోయింది. ఆంక్షలను సడలించే కొద్దీ క్రమంగా కోలుకోవడం మొదలైంది. గతేడాది సెప్టెంబర్లో పెట్రోల్ అమ్మకాలు తిరిగి కోవిడ్–19 పూర్వ స్థాయికి చేరుకోగా, ఆ తర్వాత నెలల్లో పండుగ సీజన్తో డీజిల్ విక్రయాలు కూడా పుంజుకున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఇంధనానికి డిమాండ్ ఏకంగా 18 శాతం ఎగిసి 18.77 మిలియన్ టన్నులకు చేరింది. డీజిల్ వినియోగం అత్యధికంగా 27 శాతం, పెట్రోల్కు డిమాండ్ 25.7 శాతం ఎగిసింది. గత మార్చిలో బేస్ స్థాయి తక్కువగా ఉండటం కూడా ఇందుకు కొంత కారణమైంది. లాక్డౌన్పరమైన ఆంక్షలు గతేడాది మార్చి ఆఖరు నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను తీసుకురావడం ఇప్పట్లో సాధ్యం కాని విషయమని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్కుమార్ మోదీ తేల్చేశారు. జీఎస్టీ కిందకు వస్తే వార్షికంగా రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుందంటూ.. ఇందుకు ఏ రాష్ట్రం కూడా సుముఖంగా లేదన్నారు. రాష్ట్రాలకు రూ.2లక్షల కోట్ల నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలంటూ ప్రశ్నించారు. జీఎస్టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు మరో 8–10 ఏళ్ల పాటు వేచి చూడాల్సి రావచ్చని పేర్కొన్నారు. ఆర్థిక బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో బుధవారం సుశీల్మోదీ మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రాలు కలసి ఉమ్మడిగా పెట్రోలియం ఉత్పత్తులపై ఏటా రూ.5 లక్షల కోట్ల మేర పన్నులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ట రేటు అయిన 28 శాతమే పన్ను అమలవుతుందని.. ప్రస్తుతం అయితే వాటి విక్రయ ధరలో 60 శాతం వరకు పన్ను అమలవుతున్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు చారిత్రక గరిష్టాలకు చేరడంతో ధరలు దిగివచ్చేందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తుండడం తెలిసిందే. ప్రతిపక్ష నేతలు బహిరంగంగా ప్రకటనలు అయితే ఇస్తారు కానీ.. ఈ అంశాలను జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్రస్తావించరంటూ ఆయన విమర్శించారు. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో సుశీల్ ఈ విమర్శ చేశారు. బిహార్ మంత్రిగా పనిచేసిన సమయంలో జీఎస్టీ కౌన్సిల్కు సుశీల్ ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రాలు ముందుకు వస్తే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకురావడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ మంగళవారం ప్రకటన చేసిన విషయం గమనార్హం. -
జోరుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు
ఇండియాలో ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. అన్ని నగరాల్లోను పెట్రోల్ రూ.90 దాటగా, డీజిల్ ధరలు చాలా చోట్ల రూ.80 దాటాయి. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడటం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నట్లు ప్రభుత్వాలు పేర్కొన్నాయి. సామాన్య ప్రజానీకం దానికి భిన్నంగా చమురుపై విధించిన పన్నులను తగ్గించాలని కోరుతున్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సాధారణ ప్రజానీకం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వాహన కొనుగోలుదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వెహికిల్స్ వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను కూడా కేంద్రం ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రికల్ వెహికిల్స్ అందరికీ అందుబాటులోకి రానప్పటికీ ప్రజలు దాని గురుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇటీవలి కాలంలో ప్రధానంగా ఎలక్ట్రికల్ టూ-వీలర్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ వెహికిల్ సేల్స్ భారీగా పెరిగాయి. ఓకినావా ఆటోటెక్ స్కూటర్ అమ్మకాలు ఈ ఏడాది 30 శాతం నుంచి 40 శాతానికి పెరిగినట్లు ఒకినావా ఆటోటెక్, ఎండి & వ్యవస్థాపకుడు జీతేందర్ శర్మ పేర్కొన్నారు. గత మూడేళ్ల నుంచి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోలు చేస్తే ఒక యూనిట్ ఖర్చుతో పదుల కిలోమీటర్లు వెళ్తుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ వెహికిల్ ధరలు రూ.1 లక్ష నుంచి ప్రారంభం అవుతున్నాయి. చాలా మంది చిన్న చిన్న వ్యాపారులు కూడా వీటిని కొనుగోలు చేసి వస్తువులు కొనుగోలు, రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. వ్యాపారులు అద్దె గూడ్స్ వెహికిల్స్లలో వస్తువులు తెచ్చుకునేవారు. ఇప్పుడు చాలామంది సొంతగా ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కొనుగోలు ఖర్చు మాత్రమే ఉండి, ఆ తర్వాత రవాణా ఖర్చు పెద్దగా లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. చదవండి: 2020లోనూ స్టార్టప్లలో పెట్టుబడుల జోరు -
లీటర్ పెట్రోల్, డీజిల్పై కేంద్రానికి ఎంత లాభమంటే..
న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలేం ఖర్మ ఏకంగా గ్రహాలన్నింటిని చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. తాజాగా సోమవారం 16వ సారి ఇంధన ధరలు పెరిగాయి. కేంద్రానికి అధిక ఆదాయం తెచ్చే వనరుల్లో ఇంధనానిది ప్రముఖ స్థానం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. ఇంధనం మీద వసూలు చేసే ఎక్సైజ్, సెస్, సర్చార్జీల ద్వారా కేంద్రానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు తెలిపింది. మే 6, 2020 నుంచి ఇప్పటి వరకు కేంద్రం లీటర్ పెట్రోల్ మీద 33 రూపాయలు, లీడర్ డీజిల్ మీద 32 రూపాయలు లాభపడినట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఎక్సైజ్ సుంకం, సర్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2020 వరకు కేంద్రం లీటర్ పెట్రోల్పై 19.98 రూపాయలు, డీజిల్పై 15.83 రూపాయలు ఆర్జించగా.. మార్చి 14 నుంచి మే 5 వరకు ఈ మొత్తం రూ.22.98, 21.19కు పెరగగా.. మే 6 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు లీటర్ పెట్రోల్ మీద ఏకంగా 32.98, లీటర్ డీజిల్(బ్రాండెడ్) మీద 34.19 రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ఇంధన రేట్లకు సంబంధించి గత కొద్ది రోజులుగా కేంద్రం విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలు దేశంలో ఇంధన ధరలు.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరల మాదిరిగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అనురాగ్ ఠాకూర్ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. "సాధారణంగా, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇతర దేశాల కంటే ఎక్కువ, తక్కువగా ఉంటాయి. ఇందుకు వివిధ కారణాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పన్ను పాలన, సంబంధిత సబ్సిడీ పరిహారాలు వంటివి ఇంధన ధరలను ప్రభావితం చేస్తాయి. వీటి వివరాలను ప్రభుత్వం నిర్వహించదు” అని తెలిపారు. ఇంధన ధరలను నియంత్రించాలంటే.. దీనిని కూడా జీఎస్టీ పరిధిలో చేర్చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంధనం అత్యధిక ఆదాయం తెచ్చే వనరుగా ఉంది. కనుక దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావంటున్నారు. ఇంధాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చే అంశంపై అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 “వస్తువులు,సేవల పన్ను”ను వివరిస్తుంది. అంటే వస్తువులు, సేవల సరఫరాపై పన్ను లేదా రెండింటి సరఫరాపై పన్ను విధించాలి. ఇక పెట్రోలియం వంటి ఉత్పత్తుల సరఫరా జీఎస్టీ పరిధిలోకి రాదు’’ అన్నారు. ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ దీని గురించి ప్రతిపాదనలు చేస్తే.. అప్పుడు కేంద్రం ఇంధానాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది అన్నారు. చదవండి: అధిక పెట్రో ధరలు భారమే అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! -
ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమే
పెట్రోల్, డీజిల్పై విధించిన పన్నులను తగ్గించాలని అని వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఈ విషయంపై స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమేనని అని అన్నారు. అయితే, ఇంధన ధరలపై విధించిన పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉంది అన్నారు. "అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదల కారణంగా భారతదేశం కూడా ఇంధన ధరలను పెంచవలసి వచ్చింది. కానీ, ఇది తాత్కాలికం త్వరలో క్రమంగా ధరలు తగ్గుతాయి" అని కేంద్ర మంత్రి అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ఇంధనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై పన్నులను విధిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పెట్రోలియం ధరపై కేంద్రం మాత్రమే సుంకాలు విధించడం లేదు రాష్ట్రాలు కూడా సుంకాలు విధిస్తున్నాయి కాబట్టి రాష్ట్రాలు, కేంద్రం చర్చించాల్సిన అవసరం ఉంది అన్నారు. కేంద్రం వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొంది. చదవండి: దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ మారుతి సుజుకి బంపర్ అఫర్ -
డీజిల్ భారం తగ్గింపునకు ఆర్టీసీ ప్రణాళిక
సాక్షి, అమరావతి : డీజిల్ భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రణాళికలు రూపొందిస్తోంది. సంస్థకు ఉద్యోగుల వేతనాల తర్వాత డీజిల్పై ఖర్చే అధికం. ఏటా వేతనాలకు రూ.3 వేల కోట్లు వెచ్చిస్తున్న సంస్థ డీజిల్పై రూ.2,100 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆర్టీసీలో రోజుకు 8 లక్షల లీటర్ల డీజిల్ వాడుతున్నారు. డీజిల్పై రూపాయి పెరిగితే రోజుకు రూ.8 లక్షలు నెలకు రూ.2.40 కోట్లు అదనపు భారం పడుతుంది. అదే రూ.2 పెరిగితే అదనంగా రూ.4.80 కోట్ల భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ సీఎన్జీ బస్సులను పెంచుకోవడం, బయో డీజిల్ వాడకంపై దృష్టి సారించింది. 350 విద్యుత్తు బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తిరుమలకు 150, విజయవాడలో 100, విశాఖపట్నంలో 100 విద్యుత్తు బస్సులను నడిపాలని నిర్ణయించింది. కేంద్రం ఫేమ్–2 పథకం కింద నిధులు అందించేందుకు సుముఖంగానే ఉండటంతో ఆర్టీసీ విద్యుత్తు బస్సుల కోసం ప్రతిపాదనలు పంపింది. తొలుత తిరుమలలో 150 బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే బస్సులు పెంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 302 సీఎన్జీ బస్సులున్నాయి. విజయవాడలో విద్యాధరపురం, గవర్నర్పేట–2, ఇబ్రహీంపట్నం డిపోల పరిధిలోను, తూర్పుగోదావరి రీజియన్లో రాజమండ్రిలోను సీఎన్జీ బస్సులు తిప్పుతున్నారు. వీటిని పెంచేందుకు ఈడీల కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆయిల్ బంకుల ఏర్పాటుపై అధ్యయనం ఆర్టీసీ డిపోల్లో ఆయిల్ బంకులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ వాహనాలకు ఆయిల్ సరఫరా చేస్తే నాన్ టిక్కెట్ రెవెన్యూ కింద కొంత ఆదాయం ఆర్జించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం.. పోలీస్ శాఖ గుంటూరు, విశాఖల్లో నిర్వహిస్తున్న ఆయిల్ బంకులపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం ఆర్టీసీ డిపోల్లో బంకుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. -
రికార్డు బద్దలు కొట్టిన పెట్రోల్.. ట్విటర్ పోస్టుల హల్చల్!
న్యూఢిల్లీ : గత తొమ్మిది రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్,డీజిల్ ధరలు పదవ రోజు కూడా పెరిగి వాహనదారులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ముందెన్నడూ లేని విధంగా రాజస్తాన్, మధ్య ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ 100 రూపాయల మార్కును చేరింది. ‘నేనమన్నా తక్కువ తిన్నానా!’ అన్నట్లు డీజిల్ కూడా 90 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. ఫన్నీ, సెటైరికల్ మీమ్స్, ఫొటోలు, వీడియోలను షేర్ చేయటం మొదలుపెట్టారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు 100కు చేరటంపై వెలిసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #పెట్రోల్ 100 ట్విటర్లో ట్రెండింగ్లోకి వచ్చింది. ( పెట్రో వాత : త్వరలో 150 రూపాయలకు? ) సోషల్ మీడియా వైరల్గా మారిన ఫన్నీ, సెటైరికల్ పోస్టులు.. Well played Petrol congratulations to your debut century 🙌#petrol100 pic.twitter.com/2PimXDi8U0 — Johny (@naanthamizh) February 18, 2021 Petrol & Diesel be like #PetrolDieselPriceHike #PetrolPriceHike pic.twitter.com/T30lVUU1Ns — archit wahi (@ruuuuuuuuuuud) February 18, 2021 People after Some more Days ...#petrol100 pic.twitter.com/CnNNFxD9Wv — Ayush Vaishnav (@AyushVa21516182) February 17, 2021 @dominos_india change their way of delivery after petrol price hike😂#petrol100 pic.twitter.com/QR2usRSLqy — Vishnu Meena (@VishnuMeena98) February 18, 2021 Petrol and diesel prices are getting raised day by day!🛢🛢 Future rides of chapris be like :#petrol100 pic.twitter.com/QnK8rxCHkg — Swayam parmar (@Swayamparmar5) February 17, 2021 Petrol touches 100 Rs/litre! Me driving to office: #petrol100 pic.twitter.com/SzS3d5KXHq — Andy (@iamandy1987) February 18, 2021 Ye best option hai 😂#petrol100 #PetrolDieselHike #ModiHaiToMehngaiHai pic.twitter.com/qmWtSNCdXF — Demo is Crazy 🙈🙉🙊 (@karuna_pala) February 17, 2021 #As the petrol and diesel prices are touching new highs every day.This is what a common man can do from his end 😣. #PetrolDieselPriceHike #petrol100 pic.twitter.com/YJDJCwpvT4 — Rashid Sheikh (@RashidS28059637) February 17, 2021 -
‘డీజిల్కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’
లక్నో: సామాన్యులు పోలీస్ స్టేషన్కు వెళ్తే అధికారులు.. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో.. ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది జనాలు పోలీసుల ప్రవర్తనకు జడిసి స్టేషన్కు వెళ్లాలంటే భయపడతారు. ఇక ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. తప్పకుండా ఖాకీల చేతులు తడపాల్సిందే. లేదంటే మన కంప్లైంట్ పక్కకు పడేస్తారు. అందరు ఇలానే లేకపోయినా.. చాలా చోట్ల మాత్రం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి యూపీలో చోటు చేసుకుంది. కిడ్నాపయిన తన బిడ్డను విడిపించాల్సిందిగా కోరుతూ.. పోలీసు స్టేషన్కు వెళ్లిన ఓ మహిళ పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారు. వికలాంగురాలు అని కూడా చూడకుండా.. ఆమె వద్ద నుంచి 15 వేల రూపాయల వరకు వసూలు చేశారు. కానీ ఫిర్యాదును మాత్రం పట్టించుకోలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమార్తె క్యారెక్టర్ గురించి అసభ్యంగా మాట్లాడారు. పోలీసులు నిర్లక్ష్యాన్ని భరించలేని ఆ తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. (చదవండి: ప్రేమికుల కిడ్నాప్.. సినిమాను తలపించేలా ) వివరాలు.. కాన్పూర్కు చెందిన గుడియా అనే వికాలంగురాలి భర్త చనిపోయాడు. మైనర్ కుమార్తెతో కలిసి ఉన్న కొద్ది పాటి భూమిని సాగు చేసుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం గుడియా మైనర్ కుమార్తెని ఆమె బంధువు ఒకరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. దాంతో గుడియా పోలీస్ స్టేషన్లో దీని గురించి ఫిర్యాదు చేసింది. ఇక ఆమె కుమార్తెని వెతికాలంటే డీజిల్ ఖర్చు భరించాల్సిందిగా పోలీసులు గుడియాకు తెలిపారు. అందుకు అంగీకరించిన ఆ తల్లి బంధువుల దగ్గర అప్పు తెచ్చి మరి డీజిల్ ఖర్చులకు గాను 15 వేల రూపాయలు చెల్లించింది. ఇలా మూడు నాలుగు సార్లు డబ్బులు ఇచ్చిన్నప్పటికి ఫలితం మాత్రం శూన్యం. కుమార్తె గురించి ప్రశ్నిస్తే.. వెతుకుతున్నాం అంటూ సమాధానమిచ్చేవారు. ఆ తర్వత అసలు రెస్పాన్స్ లేదు. (చదవండి: కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్ యువతి) దాంతో గుడియా అధికారులను నిలదీయగా.. వారు ఆమె పట్ల ఏ మాత్రం జాలీ, దయ లేకుండా.. ‘‘ఇక్కడ నుంచి వెళ్లు.. అసలు నీ కుమార్తె ఎలాంటిదో.. ఎవరితో వెళ్లిపోయిందో’’ అంటూ నీచంగా మాట్లాడారు. ఇక తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను అన్నది గుడియా. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. స్టేషన్ ఎస్హెచ్ఓను విధుల నుంచి తొలగించడమేకాక మరో అధికారిని నియమించి గుడియా కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇక గుడియాను పోలీసు వాహనంలో తీసుకెళ్లి ఆమె ఇంటి వద్ద వదిలేశారు. -
పెట్రో సెగ: కేంద్రంపై బీజేపీ ఎంపీ వ్యంగ్యాస్త్రం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా.. తాజాగా బడ్జెట్లో కేంద్రం పెట్రోల్, డీజిల్ మీద వ్యవసాయ సెస్ విధిస్తున్నుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వగా.. ఈ సెస్ను సుంకం నుంచి మినహాయిస్తామని... వినియోగదారులపై ఈ భారం మోపమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: పెట్రో...కనికట్టు) ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించి ఓ వ్యంగ్య ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక దీనిలో ‘‘రామ జన్మభూమిగా భావించే ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయలు.. సీతమ్మవారు పుట్టిన దేశం నేపాల్లో లీటర్ పెట్రోల్ ధర 53 రూపాయలు.. అదే రావణుడి లంకలో పెట్రోల్ లీటర్ 51 రూపాయలు మాత్రమే’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక దేశంలో ఇంధన రేట్లు పెరిగిన నాటి నుంచి ఈ ఫోటో వైరలవ్వగా.. సుబ్రహ్యణ్య స్వామి ట్వీట్ చేయడంతో మరోసారి ఇది వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. pic.twitter.com/Imrz3OSag7 — Subramanian Swamy (@Swamy39) February 2, 2021 -
బడ్జెట్ 2021: మరింత మండిపోనున్న ఇంధనం
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ సగటు వేతన జీవిని నిరాశ పరిచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ‘‘విశ్వాసం పక్షిలాంటిది. తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న సమయంలో కూడా అది వెలుతురును అనుభవిస్తూ.. పాడుతుంది’’ అంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. దాదాపు గంట 51 నిమిషాలు సాగిన నిర్మల బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు. దాంతో పాత శ్లాబులే కొనసాగుతాయని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్యానికి, మౌలిక సదుపాయల అభివృద్ధికి, రైల్వేలకు, వ్యవసాయనికి పెద్ద పీట వేశారు. పెట్రో బాదుడు.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబెలేత్తుతుండగా.. బడ్జెట్ తర్వాత వాటి ధరలు మరింత పెరగనున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 2.50 రూపాయలు, డీజిల్పై 4 రూపాయల వ్యవసాయ సెస్సు విధించనున్నారు. దాంతో పెట్రో మంట ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. -
రికార్డు స్థాయికి పెట్రో ధరల పరుగు
సాక్షి, న్యూఢిల్లీ: చుక్కల్ని తాకుతున్న ఇంధన ధరలు వినియోగదారులకు చెమటలు పట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే గరిష్ఠ సాయికి చేరాయి. కాగా చమురు సంస్థలు మరోసారి ధరలను పెంచేశాయి. మంగళవారం లీటర్ పెట్రోల్, డీజల్పై మరో 25 పైసలు వడ్డించడంతో పెట్రోల్ ధర దేశరాజధాని ఢిల్లీలో 85 రూపాయలకు చేరింది. వారం వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలో రూపాయికిపైగా పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. జనవరి 6 నుండి ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ .1.49, రూ .1.51 పెరిగాయి. ముంబైలో పెట్రోల్ ధర ఆల్టైమ్ గరిష్ట స్థాయి వద్ద లీటరు రూ .91.80 కు చేరుకోగా, డీజిల్ రేటు లీటరుకు రూ .82.13 కు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.20, డీజిల్ ధర 75.38 చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 87.85 వద్ద, డీజిల్ ధర రూ. 80.67 కోలకతాలో లీటరు పెట్రోలు ధర రూ. 86.63 వద్ద, డీజిల్ ధర రూ. 78.97 హైదరాబాద్లో లీటరుపెట్రోలు ధర రూ. 88.63 వద్ద, డీజిల్ ధర రూ. 82.26 అమరావతిలో లీటరు పెట్రోలు ధర 91.43, డీజిల్ ధర రూ. 84.58 -
మరోసారి సత్తా చాటిన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో తెలంగాణ ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. డీజిల్ వినియోగంలో పొదుపు పాటించి మైలేజీలో మెరుగుదల సాధించటం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్–2020 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ ఢిల్లీలో బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 4,001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. 2019లో ఆర్టీసీ సగటు మైలేజీ (కిలోమీటర్ పర్ లీటర్–కేఎంపీఎల్) 5.16 ఉండగా, 2020లో 5.28కి పెరిగింది. అంటే 0.12 మేర మెరుగుపడింది. ఏయేటికాయేడు కేఎంపీఎల్ను మెరుగుపరుచుకుంటూ వస్తున్న ఆర్టీసీ, జాతీయ స్థాయిలో ఇంధన పొదుపులో ఉత్తమ సంస్థగా మొదటి రెండు స్థానాల్లో నిలుస్తు వస్తోంది. తాజాగా మరోసారి దాన్ని నిలబెట్టుకుంది. చదవండి: హమ్మయ్యా! బ్యాటరీ బస్సు ఆశలు సజీవం ఈ మెరుగుదల ఆధారంగా సంవత్సర కాలంలో ఆర్టీసీ 24 లక్షల లీటర్ల ఇంధనాన్ని పొదుపు చేసినట్టయింది. ప్రసుతం బహిరంగ మార్కెట్లో ఉన్న డీజిల్ ధర ప్రకారం చూస్తే ఈ పొదుపు మొత్తం విలువ దాదాపు రూ.19 కోట్లు అవుతుంది. జనవరి 16న వర్చువల్ పద్ధతిలో జరిగే సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణ ఆర్టీసీ ఎండీకి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. పురస్కారంతోపాటు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని హయత్నగర్–1, ఉప్పల్, దిల్సుఖ్నగర్ డిపోలు ఇంధన పొదుపులో ఉత్తమ డిపోలుగా నిలిచాయి. కేంద్రమంత్రి ఈ మూడు డిపోలకు కూడా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. నగదు ప్రోత్సాహకం కింద ఒక్కో డిపోకు రూ.50 వేల చొప్పున అందించనున్నారు. చదవండి: సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం -
పెట్రో ధరల మోత
-
పెట్రో ధరల మోత
సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప విరామం తరువాత పెట్రో ధరల మోత శుక్రవారం కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 17 పైసల నుండి 20 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర కూడా 21 నుండి 24 పైసల వరకు పెరిగింది. ఐఓసీఎల్ వెబ్సైట్ ప్రకారం ప్రధాన మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోలు,డీజిల్ ధరలు ఢిల్లీ: పెట్రోలు ధర లీటరుకు రూ. 82.86 డీజిలు ధర రూ 73.07రూపాయలు ముంబై : పెట్రోలు ధర లీటరుకు రూ. 89.52 డీజిలు ధర 79.66 రూపాయలు చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 85.76 డీజిలు ధర 78.45 రూపాయలు కోల్కతా : పెట్రోలు ధర లీటరుకు రూ. 84.37 డీజిలు ధర 76.64 రూపాయలు హైదరాబాద్ : పెట్రోలు ధర లీటరుకు రూ. 86.18, డీజిలు ధర 79.73 రూపాయలు అమరావతి: పెట్రోలు ధర లీటరుకు రూ. 89.00, డీజిలు ధర 82 రూపాయలు విశాఖపట్టణం: పెట్రోలు ధర లీటరుకు రూ. 87.77, డీజిలు ధర 80.89 రూపాయలు -
పెట్రోల్, డీజిల్ ధరలకు 11వ సారి రెక్కలు
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల నిలకడ తదుపరి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు బలపడి రూ. 82.66కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 19 పైసలు అధికమై రూ. 72.84ను తాకింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. తదుపరి తాజా పెంపుతో కలిపి ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ 11సార్లు ధరలను పెంచడం గమనార్హం! దీంతో 11 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్కు సగటున సుమారు రూ. 1.20 వరకూ పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక డీజిల్ ధర అయితే మరింత అధికంగా లీటర్ రూ. 1.80 వరకూ ఎగసినట్లు తెలియజేశారు. చమురు జోరు ఫైజర్ వ్యాక్సిన్కు యూకే ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో విదేశీ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధరలు దాదాపు 2 శాతం ఎగసాయి. ఈ బాటలో తాజాగా మరోసారి నామమాత్రంగా బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 45.30 డాలర్లకు చేరగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48.30 డాలర్లను తాకింది. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల నిలకడ తదుపరి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు బలపడి రూ. 81.89కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 24 పైసలు అధికమై రూ. 71.86ను తాకింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మంగళవారం(24) వరకూ ఐదు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. ఈ బాటలో తాజాగా మరోసారి ధరలను పెంచాయి. దీంతో ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటర్కు 83 పైసలు పెరిగింది. ఇక డీజిల్ ధర అయితే మరింత అధికంగా లీటర్ రూ. 1.40 ఎగసింది. చమురు జోరు న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 45 డాలర్లను అధిగమించగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48 డాలర్లకు చేరింది. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
ఆర్టీసీకి ఆయిల్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి చమురు సమస్య నెలకొంది. ప్రస్తుతం ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో రెండు నెలలుగా చమురు సంస్థలకు డీజిల్ తాలూకు పూర్తి బిల్లులు చెల్లించలేక పోతోం ది. దీంతో దాదాపు రూ.70 కోట్ల వరకు బకాయిలు ఏర్పడ్డాయి. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో చమురు సంస్థలు బిల్లుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో చమురు సర ఫరాను నిలిపేయనున్నట్లు ఆ సంస్థలు హెచ్చరిం చాయి. ఒకట్రెండు రోజులు నిలిపేశాయి కూడా. దీంతో ఆర్టీసీలో ఆందోళన మొదలైంది. చమురు సంస్థల ప్రతినిధులతో చర్చించి కొంతమేర చెల్లిం చేందుకు సిద్ధమయ్యింది. దీంతో తాత్కాలి కంగా సరఫరాను ఆయా సంస్థలు పునరుద్ధరిం చాయి. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లించే హామీతో సరఫరా ను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఆలోగా డబ్బు లు చెల్లించకుంటే డీజిల్ సరఫరాను ఆపేయను న్నట్టు ఆయిల్ కంపెనీలు హెచ్చరించాయి. 4.5 కోట్లకు చేరుకున్న ఆదాయం.. లాక్డౌన్తో బస్సు సర్వీసులు నిలిచిపోవటంతో ఆర్టీసీకి ఆదాయం లేకుండా పోయింది. దాదాపు రెండున్నర నెలలు చిల్లిగవ్వ ఆదాయం లేదు. మే చివరలో జిల్లా బస్సు సర్వీసులు మొదలైనా కరో నా కేసుల తీవ్రత కారణంగా జనం బస్సులెక్కేం దుకు భయపడ్డారు. ఆక్యుపెన్సీ రేషియో 25 శాతంగా ఉండటంతో నామమాత్రపు ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత పక్షం రోజులుగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 55 శాతానికి చేరడంతో రోజువారీ ఆదాయం రూ.4 కోట్లను మించుతోంది. మూడు రోజుల క్రితం సిటీ బస్సులు ప్రారంభమయినా.. పావు శాతమే తిరుగుతుండటంతో రూ.30 లక్షల ఆదాయం ఉంటోంది. కార్గో బస్సుల రూపంలో రూ.10 లక్షల అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇవి తప్ప ఆర్టీసీ వద్ద వేరే నిధులు లేకపోవటంతో చమురు » కాయిలు తీర్చేందుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 2.6 కోట్ల లీటర్ల చమురు ఖర్చు... ప్రస్తుతం ఆర్టీసీ నిత్యం 16.6 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను తిప్పుతోంది. దీనికి 2.6 కోట్ల లీటర్ల చమురు ఖర్చవుతోంది. గతంలో ఎప్పటి కప్పుడు బిల్లులు చెల్లించే పద్ధతి ఉండేది. ఇప్పుడు రోజుకు కొంతమేర మాత్రమే చెల్లిస్తున్నా రు. దీంతో ఎక్కువ మొత్తం పేరుకుపోతూ రూ.70 కోట్లకు బకాయి చేరుకుంది. ఆర్టీసీకి ఇతర ఆదా యం లేకపోవటంతో చమురు కంపెనీలు కూడా ఆలోచనలో పడ్డాయి. గతంలో ఎప్పుడూ లేనట్టు ఒత్తిడి పెంచి, ఆర్టీసీ చరిత్రలో తొలిసారి చమురు సరఫరాను నిలిపివేయటంలాంటి సీరియస్ నిర్ణ యం తీసుకున్నాయి. ఈ కారణంగానే ఆదాయం పెంపునకు సిటీలో ఆగమేఘాల మీద బస్సు సర్వీ సులు ప్రారంభించాల్సి వచ్చింది. క్రమంగా వీటి సంఖ్యను పెంచుతూ ఆదాయాన్ని పెంచుకు నేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దయతో వ్యవహరించండి.. లాక్డౌన్ వేళ సర్వీసులు పూర్తిగా నిలిచిపోవటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించలేదని చమురు సరఫరా నిలిపివేసేలా ఆ సంస్థలు వ్యవహరించటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చమురు కంపెనీలకు అతిపెద్ద వినియోగదారు ఆర్టీసీనే. నిత్యం లక్షల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీ విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల స్వయంగా ఆర్టీసీ సొంతంగా పెట్రోలు బంకులు స్థాపించి చమురు కంపెనీలకు డీలర్గా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజా సేవలో ఉండే ఆర్టీసీ విషయంలో కంపెనీలు దయతో వ్యవహరించాలని పేర్కొంటున్నారు. -
పెట్రోల్, డీజిల్పై రోడ్ డెవలప్మెంట్ సెస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విక్రయించే పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై రహదారుల అభివృద్ధి సెస్ను విధిస్తూ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్స్ ఇచ్చారు. లీటర్ పెట్రోలు, డీజిల్పై రూపాయి సెస్ను విధిస్తూ ఏపీ వ్యాట్ చట్టం–2005కు సవరణ చేశారు. కోవిడ్ ఉపద్రవంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని, లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ (వాణిజ్య పన్నులు, ఎక్సైజ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనలో ఇంకా ఏముందంటే.. ► గతేడాది ఏప్రిల్ నెల ఆదాయం రూ.4,480 కోట్లుండగా, లాక్డౌన్తో ఈ ఏడాది రూ.1,323 కోట్లకే పరిమితమైంది. ► కేంద్రం కూడా 2020–21 ఏడాదికి జీఎస్టీ పరిహారాన్ని కూడా చెల్లించడం లేదు. ► కోవిడ్–19 కట్టడికి ఆరోగ్యరంగంపై అధికంగా వ్యయం చేయడంతో పాటు, కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున చేపట్టడంతో రాబడి కంటే వ్యయం ఎక్కువైంది. ► వీటిని పరిగణనలోకి తీసుకున్నాక రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సెస్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ► దీని ద్వారా వచ్చే సుమారు రూ.500 కోట్లను ప్రత్యేకంగా రహదారుల అభివృద్ధి కోసం ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదలాయిస్తాం. -
ప్రీ–కోవిడ్ స్థాయికి పెట్రోల్ డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో దారుణంగా పడిపోయిన పెట్రోల్ డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్య భద్రతల దృష్ట్యా ప్రయాణికులు ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాకే ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ సెప్టెంబర్ ప్రథమార్థంలో పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు ప్రీ–కోవిడ్ స్థాయిని అందుకున్నాయని ప్రిలిమినరీ ఇండస్ట్రీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అమ్మకాలు 9.45లక్షల టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 9లక్షల విక్రయాలతో పోలిస్తే ఇది 2.2శాతం అధికం. ఇక నెలవారీ పరిశీలిస్తే ఆగస్ట్ 1–15 మధ్య మొత్తం అమ్మకాలు 9లక్షల టన్నులుగా ఉన్నాయి. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు(మార్చి 25)తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. మరోవైపు డీజిల్కు డిమాండ్ పెరగడం లేదు. సమీక్షించిన కాలంలో వార్షిక ప్రాతిపదిక డీజిల్ అమ్మకాలు 6శాతం క్షీణత నమోదు చేశాయి. ఇక నెలవారీగా ఆగస్ట్తో పోలిస్తే అమ్మకాలు 19.3శాతం పెరిగాయి. అదే విధంగా వార్షిక ప్రాతిపదికన జెట్ ఫ్యూయల్ అమ్మకాలు 60శాతం క్షీణత చవిచూడగా, ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు 12.5శాతం వృద్ధిని సాధించాయి. కార్ల అమ్మకాలు 14శాతం పెరగ్గా, ద్విచక్ర వాహన అమ్మకాలు 3శాతం తగ్గాయి. లాక్డౌన్ సడలింపులతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతుంది. అయితే రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పరిమితులతో కూడిన లాక్డౌన్ విధింపులు డిమాండ్ పుంజుకునేందుకు ఆటంకాన్ని కల్గిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అన్లాక్ ప్రక్రియతో డిమాండ్ రికవరీ సంకేతాలు కన్పిస్తున్నాయని అయితే నెలవారీ వినియోగ వృద్ధిని అధిగమించేందుకు ఈ ఏడాది చివరి వరకు పట్టవచ్చని ఐఓసీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య అన్నారు. -
పెట్రోలు ధర జోరు
సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప విరామం తరువాత పెట్రోలు ధరలు మళ్లీ జోరందుకున్నాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా పెట్రోలు ధరను పెంచుతూ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మెట్రో నగరాల్లో లీటరు పెట్రోలు ధరపై 11 పైసలు వరకు పెంచాయి. హైదరాబాదులో 11 పైసలు, ముంబై, కోల్కతాలో పెట్రోల్ ధర 10 పైసలు పెరగగా, చెన్నైలో 9 పైసలు పెరిగింది. 13 రోజుల్లో చమురు లీటరు పెట్రోలు ధర 1.51 పైసలు పెరిగింది. మరోవైపు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. (హైదరాబాద్లో రూ. 85 దాటిన పెట్రోలు ) తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 81.94 రూపాయలకు చేరింది. డీజిల్ ధర రూ.73.56 పైసలుగా ఉంది. హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 85.15 చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 84.91 -
వరుసగా ఆరో రోజు పెట్రో బాదుడు
సాక్షి, ముంబై : వరుస బాదుడు తరువాత మధ్యలో కాస్త శాంతించినా పెట్రో ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. గత ఐదురోజులుగా భగ్గుమంటున్న పెట్రోలు ధర వరుసగా ఆరో రోజు మంగళవారం కూడా పెరిగింది. ఆగస్టు 16 నుండి చమురు కంపెనీలు (ఆగస్టు 19 తప్ప) మెట్రోల్లో పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. అయితే, దాదాపు ఒక నెలరోజుల నుంచి డీజిల్ ధరలో మార్పులేదు. మంగళవారం ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో పెట్రోల్ రేటు 9-11 పైసలు పెరిగింది. పెట్రోల్ ధర లీటరుకు ఢిల్లీలో 81.73రూపాయలు ముంబైలో 88.39 రూపాయలు చెన్నైలో 84.73 రూపాయలు కోల్కతాలో 83.24 రూపాయలు హైదరాబాద్లో 84.94 రూపాయలు బెంగళూరులో 84.39 రూపాయలు డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో 73.56 రూపాయలు ముంబైలో 80.11 రూపాయలు చెన్నైలో 78.86 రూపాయలు కోల్కతాలో 77.06 రూపాయలు హైదరాబాద్లో 80.17 రూపాయలు బెంగళూరులో 77.88 రూపాయలు ఆసియా , ఐరోపాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుఎస్ గల్ఫ్ తీరంలో వ్యాపారులు భారీగా ఉత్పత్తి కోతలు విధించడంతో ముడి చమురు ధరలు మండుతున్నాయని రాయిటర్స్ తెలిపింది. -
21వ రోజు.. ఆగని పెట్రో, డీజిల్ ధరలు
ఢిల్లీ : దేశంలో వరుసగా 21వ రోజు కూడా పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు శనివారం లీటర్ పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 21 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80.38 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 80.40 రూపాయలకు చేరింది. దీంతో 21 రోజుల్లో డీజిల్పై మొత్తం 10.27 రూపాయలు, పెట్రోల్పై 9.18 రూపాయలు పెరిగాయి. లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జూన్ 7 నుంచి దేశంలో వరుసగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జూన్ 1న లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయలు ఉండగా, ప్రస్తుతం అది 80.33 రూపాయలకు చేరింది. కరోనా నేపథ్యంలో రోజురోజుకు పెట్రో, డీజిల్ ధరలు పెరిగిపోతుండడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజైన శుక్రవారం పెట్రోల్పై 21 పైసలు, డీజిల్పై 17 పైసలు పెంచిన సంగతి తెలిసిందే. -
వరుస షాక్లు : మళ్లీ పెట్రో పిడుగు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో షాక్లు కొనసాగుతున్నాయి. శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెట్రోల్ లీటర్కు 21 పైసలు, డీజిల్ ధర లీటర్కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 83 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 80.13కు, డీజిల్ లీటర్కు 80.19 రూపాయలకు ఎగబాకింది. ఇక పెట్రో భారాలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ధరల సవరణ పేరుతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను మోతెక్కిస్తున్నాయి. కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు పెట్రో ధరలను మించి డీజిల్ ధర పరుగులు తీయడంతో నిత్యావసరాల ధరలూ చుక్కలు చూస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి : ‘పెట్రో’ మంట; వైరలవుతున్న బిగ్బీ ట్వీట్ -
మళ్లీ పెట్రో షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వరసగా 19వ రోజు గురువారం కూడా పెరిగాయి. పెట్రోల్ ధరను లీటర్కు 16 పైసలు, డీజిల్ లీటర్కు 14 పైసల చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. భారత్లో తొలిసారిగా డీజిల్ ధరలు పెట్రోల్ ధర కంటే పెరిగాయి. ఇక తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు 82.79 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు 79.92 రూపాయలకు పెరగ్గా, డీజిల్ లీటర్ ధర ఏకంగా 80.02 రూపాయలకు ఎగబాకింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను పెంచడంతోనే డీజిల్ ధరలు దేశరాజధానిలో పెట్రోల్ను మించిపోయాయని ప్రభుత్వరంగ ఐఓసీ చీఫ్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. చదవండి : ఢిల్లీ: పెట్రోల్తో పోటీ పడిన డీజిల్ ధర -
బండి ఓకే.. ఆయిలే గుదిబండ!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్స్ మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి. కొనేది కారైనా, బైకైనా మనోళ్లు చూసేది మాత్రం వాల్యూ ఫర్ మనీ! అందుకే కార్ల కోసం మారుతి సుజుకీ వైపు, బైకుల కోసం హీరో కంపెనీ వైపు చూస్తారు. హీరో ఇండియాలో అతి పెద్ద బైకుల తయారీ కంపెనీ. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. బైకులు, కార్లు కొనే ముందు ఓ సారి పెట్రోల్, డీజిల్ ధరల గురించి సగటు భారతీయుడు ఆలోచిస్తున్నాడు. గడచిన పదేళ్లలో వాహనాల ఇంధన రేట్లు పెరగడం ఒక ఎత్తైతే, ఈ పదిహేను రోజుల్లో పెరిగిన తీరు మరో ఎత్తు. పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశానికి ఎగబాకడం వినియోగదారుల్లో గుబులుపుట్టిస్తోంది. దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 రూపాయలను తాకాయి. ఇలా వాహనదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్న మొత్తం నిజంగా ఆయిల్ కంపెనీలకే వెళ్తుందా అంటే సమాధానం లేదు అనే చెప్పాలి. (అప్లికేషన్లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు) ప్రతి లీటరుకు చెల్లిస్తున్న మొత్తంలో 60 శాతానికిపైగా పన్ను కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. మే ఆరో తేదీన ఢిల్లీలో లీటరు పెట్రోల్ రేటు 71.26 రూపాయలు కాగా, లీటరు డీజిల్ ధర 69.39. వీటి నుంచి పన్నుతీసేస్తే లీటరు పెట్రోల్ అసలు ధర 18.28 రూపాయలుగా, లీటరు డీజిల్ ధర 18.78 రూపాయలుగా తేలింది. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 32.98 రూపాయలు, లీటరు డీజిల్ పై 31.83 రూపాయల ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. ఇక ఢిల్లీ ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 16.44 రూపాయల వ్యాట్ విధిస్తోండగా, లీటరు డీజిల్ పై 16.26 రూపాయల పన్ను వడ్డిస్తోంది. అతి కొద్ది మొత్తం డీలర్ మార్జిన్ కింద పోతోంది. వీటన్నింటినీ కలిపితే లీటరు ఆయిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతానికి పైగా పన్ను వేస్తున్నాయి.(ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు) కరోనా వైరస్ వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో ఆయిల్ పై పన్ను శాతం 75ని తాకింది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 55 శాతం పైగా సుంకాలను చమురుపై వడ్డిస్తున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ సెక్టార్ నుంచి భారత ప్రభుత్వానికి 2.14 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1.50 లక్షల కోట్లను చమురు రంగం ఆర్జించిపెట్టింది. -
లాక్డౌన్ వేళ పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం వరుసగా ఎనిమిదో రోజూ భారమయ్యాయి. పెట్రోల్ లీటర్కు 62 పైసలు, డీజిల్ లీటర్కు 64 పైసల మేర పెరగడంతో ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటర్కు 4.52 రూపాయలు, డీజిల్ ధర లీటర్కు 4.64 రూపాయలకు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలకు అనుగుణంగా ధరలను చమురు కంపెనీలు సవరించాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 78.03 రూపాయలకు చేరగా, ఢిల్లీలో 75.78 రూపాయలకు ఎగబాకింది. లాక్డౌన్ వేళ ప్రజల ఆదాయం దిగజారిన సమయంలో పెట్రో ధరల పెంపుపై సామాన్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆందోళనకరమని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. చదవండి : పెట్రోలు : మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం