ఉద్యోగులకు బంపర్‌ బోనస్‌.. అయితే.. | Porsche Gave Bonus To Employees Encouraged To Donate Covid 19 Fight | Sakshi

ఉద్యోగులకు బోనస్‌.. విరాళాలు ఇవ్వండి!

Apr 11 2020 12:43 PM | Updated on Apr 11 2020 1:02 PM

Porsche Gave Bonus To Employees Encouraged To Donate Covid 19 Fight - Sakshi

పోర్షే కారు(ఫొటో కర్టెసీ: పోర్షే ట్విటర్‌)

బెర్లిన్‌: ఈ ఏడాది ప్రారంభంలో అందించిన బోనస్‌ నుంచి కొద్ది మొత్తం కోవిడ్‌-19(కరోనా వైరస్‌)పై పోరుకు విరాళంగా ప్రకటించాలని ప్రముఖ కార్ల తయారీ సంస్థ పోర్షే తన ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జించినందుకు గానూ ఈ జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం తన ఉద్యోగులకు బంపర్‌ బోనస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ విజయం సాధించడంలో తోడ్పాటు అందించిన వారందరికీ 9 వేల యూరోలు బోనస్‌(వ్యక్తిగత పెన్షన్‌ ప్రణాళిక కోసం 700 యూరోలు అదనం)గా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకున్న వేళ సాటి వారికి సహాయంగా నిలిచేందుకు విరాళాలు అందించాలని సంస్థ ఉద్యోగులను కోరింది. 

ఇక పోర్షే బోర్డు వ్యక్తిగతంగా 5 మిలియన్‌ యూరోలు దానం చేసిందని... దీనిని సామాజిక కార్యక్రమాల కోసం వినియోగిస్తుందని తెలిపింది. ఇలా ప్రతీ ఒక్కరూ స్వచ్చంగా ముందుకు వచ్చి మహమ్మారిపై పోరులో ముందుండాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘మనమంతా కలిసికట్టుగా పనిచేసినందు వల్లే విజయాలు సాధించాం. ఇందులో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ప్రతీ ఒక్కరికి బోనస్‌ లభిస్తుంది. అయితే ఈసారి ఆ మొత్తాన్ని సంఘీభావం తెలిపేందుకు ఉపయోగిద్దాం’’అంటూ  కంపెనీ ఉన్నత పదవిలో ఉన్న ఆలివర్‌ బ్లూమ్‌ ఉద్యోగులను చైతన్యవంతం చేశారు.  కాగా కరోనా ధాటికి ఆటోమొబైల్‌ సహా అన్ని రంగాలు కుదేలవుతున్న విషయం తెలిసిందే.(కరోనాతో ఏవియేషన్‌ కుదేలు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement