కేంద్రానికి ఆర్‌ఈసీ 1,143 కోట్ల డివిడెండ్‌ | REC pays Rs 1143 cr interim dividend for FY19 to govt | Sakshi
Sakshi News home page

కేంద్రానికి ఆర్‌ఈసీ 1,143 కోట్ల డివిడెండ్‌

Published Sat, Mar 23 2019 12:29 AM | Last Updated on Sat, Mar 23 2019 12:29 AM

REC pays Rs 1143 cr interim dividend for FY19 to govt - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.11 (110 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను  ప్రకటించింది. డివిడెండ్‌ చెల్లింపుల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,143 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది.  ఈ మొత్తానికి సమానమైన ఆర్‌టీజీఎస్‌  క్రెడిట్‌ అడ్వైస్‌ను ఆర్‌ఈసీ ప్రభుత్వానికి అందజేసింది.   

రూ.96,357 కోట్ల రుణాలు:  ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రూ.96,357 కోట్లు మంజూరు చేశామని, వీటిల్లో రూ.52,269 కోట్లు పంపిణీ చేశామని ఆర్‌ఈసీ వివరించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో స్థూల లాభం 32 శాతం వృద్ధితో రూ.6,466 కోట్లకు, నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.4,508 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement