
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జీయో కస్టమర్లకు ఊరట నిచ్చింది. జియో ఇటీవల ప్రకటించిన ట్రిపుల్క్యాఫ్ ఆఫర్ను మరికొంత కాలం పొడిగించింది. జియో ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ సేవల పరిమితిని పొడిగించింది. డిసెంబర్ 15వ తేదీ వరకు జియో కస్టమర్లు ట్రిపుల్ క్యాష్బ్యాక్ ఆఫర్ వినియోగించుకోవచ్చని ప్రకటించింది. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనతో గడువు తేదీని మరికొద్ది రోజులు పొడిగించినట్టు జియో వెల్లడించింది.
ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా వినియోగదారులు రూ.399 ఆపైన విలువ గల ప్లాన్ను జియో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా రీచార్జి చేసుకుంటే వారికి రూ.400 విలువ గల 8 ఓచర్లు లభిస్తాయి. ఒక్కో ఓచర్ విలువ రూ.50 ఉంటుంది. దీంతోపాటు కస్టమర్లకు రూ.1899 విలువైన డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. వీటిని ఆజియో, యాత్రా, రిలయన్స్ ట్రెండ్స్ సైట్లలో వాడుకోవచ్చు. ఇక జియో పార్ట్నర్ వాలెట్ యాప్స్ అమెజాన్ పే, పేటీఎం, ఫోన్ పే, మొబిక్విక్లలో జియో యూజర్లు రీచార్జి చేసుకుంటే వారికి రూ.300 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈనెల 25వ తేదీతో ముగిసిన ఈ ఆఫర్ను డిసెంబర్ 15వరకు పొడిగించింది. నవంబరు 10 నుంచి నవంబరు 25 వరకు రూ. 2,599ల విలువైన ట్రిపుల్ క్యాష్బ్యాక్ప్లాన్ను ఆఫర్ అందుబాటులో ఉంటుందని ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment