offer
-
శాంసంగ్ ప్రీమియమ్ ఫోన్పై భారీ తగ్గింపు
మంచి కెమెరా, డిస్ప్లే, పనితీరు, క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్తో గతేడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అప్పట్లో అధిక ధర కారణంగా ఈ ప్రీమియమ్ ఫోన్ను కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ ఇప్పుడు తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్ల తరువాత రూ .93,000 కంటే తక్కువకు లభిస్తుంది. మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా వచ్చినప్పటికీ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాకు క్రేజ్ అలాగే ఉంది. కాబట్టి మంచి కెమెరా, ఏఐ ఫీచర్లతో సరైన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్ల కోసం చూస్తున్నట్లయితే అమెజాన్కి వెళ్లి ఈ డీల్ చూడవచ్చు.తగ్గింపు అలర్ట్శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్లో రూ.98,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.1,29,999. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే రూ.2,955 తగ్గింపు లభిస్తుంది. అలాగే కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ ఆదా కోసం), రూ .4,775 నుండి ప్రారంభమయ్యే స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలు కోసం మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. దీనికి ఆ ఫోన్ మోడల్, వర్కింగ్ కండీషన్, బ్రాండ్ను బట్టి రూ.22,800 వరకు పొందవచ్చు. యాడ్-ఆన్లుగా వినియోగదారులు రూ .6,999 టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్ను కూడా ఎంచుకోవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెసిఫికేషన్లు120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల క్యూహెచ్ డీ+ అమోఎల్ఈడీ ప్యానెల్ ను ఇందులో అందించారు. ఈ డివైజ్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్పై నడుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 45వాట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఇప్పటికే లైవ్ ట్రాన్స్లేట్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను అందిస్తోంది. రాబోయే ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్డేట్తో ఇది మరిన్ని ఏఐ ఫీచర్లను పొందుతుంది.కెమెరా విషయానికొస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో పాటు అదనంగా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. -
టూ వీలర్లకు ఫ్రీగా పెట్రోల్!
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ద్విచక్ర వాహనదారుల కోసం అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఈ సంస్థ ప్రారంభించి 45 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఫౌండేషన్ డే ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టూ వీలర్లకు ఉచితంగా పెట్రోల్తోపాటు (Free Petrol) క్యాష్ కూపన్ అందిస్తోంది.ఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్ఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్ను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఎంపిక చేసిన బీపీసీల్ రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్తో పాటు కనీసం ఒక ప్యాక్ మ్యాక్ 4టీ (MAK 4T) లూబ్రికెంట్ను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ ఆఫర్లో పాల్గొనడానికి అర్హులు. ఈ పథకం ద్విచక్ర వాహన కస్టమర్లకు మాత్రమే. ఇందులో పాల్గొని రూ. 75 విలువైన పెట్రోల్ను ఉచిత పొందొచ్చు. జనవరి 24నే మొదలైన ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు కొనసాగనుంది.బీపీసీఎల్ డీలర్లు, పంపిణీదారులు, ఛానల్ భాగస్వాములు, ప్రకటనల ఏజెన్సీల ఉద్యోగులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఈవెంట్ మేనేజర్లు మొదలైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఆఫర్లో పాల్గొనడానికి అర్హులు కారు. అలాగే వాహనదారులకు ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి రిజిస్ట్రేషన్కు వినియోగించిన మొబైల్ నంబర్ మరోసారి ఉపయోగించేందుకు వీలు లేదు.ఆఫర్ ప్రయోజనాలుఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్ కింద మ్యాక్ 4టీ (MAK 4T) ల్యూబ్రికెంట్ ఆయిల్ కొనుగోలు చేశాక తక్షణమే రూ. 75 విలువైన పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది. లూబ్రికెంట్ల ప్యాక్లో రూ. 1000 వరకు విలువ చేసే క్యాష్ కూపన్ ఉంటుంది. దీనిని రిటైల్ అవుట్లెట్లోనే కౌంటర్లో నగదుగా మార్చుకోవచ్చు. క్యూఓసీ యంత్రాన్ని ఉపయోగించి మ్యాక్ క్విక్ కియోస్క్లో ఆయిల్ చేంజ్ ఉచితంగా చేసుకోవచ్చు. ఆర్ఓ డీలర్ హలో బీపీసీఎల్ యాప్ని ఉపయోగించి కూపన్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, ఆ మొత్తాన్ని కస్టమర్కు అక్కడికక్కడే అందజేస్తారు. కస్టమర్ హలో బీపీసీఎల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, నిర్ణీత కేవైసీ ప్రక్రియను అనుసరించిన తర్వాత కూపన్ను స్వయంగా స్కాన్ చేయవచ్చు. -
ఐఫోన్ చవగ్గా కావాలా?
మీకు ఐఫోన్ అంటే ఇష్టమా? చవగ్గా తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. యాపిల్ తాజా మోడళ్ల ఐఫోన్ కొనుగోలు చేయలేని ఐఫోన్ (iPhone) ప్రియుల కోసం ముఖేష్ అంబానీకి చెందిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) ఓ మంచి డీల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ తగ్గింపును అందిస్తోంది.యాపిల్ 2022లో లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ ఐఫోన్ 14 ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్లో అందుబాటులో ఉంది. దీని అసలు రిటైల్ ధర రూ. 54,900 కాగా రిలయన్స్ డిజిటల్ దీనిపై రూ.6,500 తగ్గింపు అందిస్తోంది. ఫ్లాట్ రూ. 6,500 తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్ల ద్వారా ఐఫోన్ 14 రూ. 47,400 లకే పొందవచ్చు. హెచ్ఎస్బీసీ (HSBC) క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 2,000 వరకు అదనంగా 5% తగ్గింపును పొందవచ్చు. దీంతో తుది ధర రూ. 46,400కి తగ్గుతుంది. అంటే మొత్తంగా రూ. 8,500 తగ్గింపు.ఐఫోన్ 14 ఫీచర్లు2022 అక్టోబర్లో రూ. 79,900 బేస్ ధరతో యాపిల్ ఐఫోన్ 14 లాంచ్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో ముఖ్యంగా సేల్ ఈవెంట్ల సమయంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లలో ఐఫోన్ 14 ఒకటి. ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. వెనుకవైపు 12MP డ్యూయల్-కెమెరా, సెల్ఫీ ప్రియుల కోసం డ్రాప్ నాచ్ 12MP ఫ్రంట్ షూటర్ కెమరా ఇందులో ఉన్నాయి.ఇదిలా ఉండగా యాపిల్కు చెందిన తాజా సిరీస్ ఐఫోన్ 16 (iPhone 16). గత ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 16 సిరీస్ను యాపిల్ భారత్లో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 20 నుంచి విక్రయాలు ప్రారంభం కాగా ఊహించినట్లుగానే ఐఫోన్ 16 సిరీస్కు భారత్లో భారీ స్పందన లభించింది. మొదటి రోజే రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. బేస్ మోడల్కు ఐఫోన్ 16 ధరలు రూ.79,900 కాగా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 144,900 వరకు ఉంది. -
లేటెస్ట్ గూగుల్ ఫోన్పై రూ.26 వేల డిస్కౌంట్!
మీ పాత స్మార్ట్ఫోన్ను (smartphone) మార్చేసి ఖరీదైన కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం కావచ్చు. ఈ ఫోన్పై ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ (Flipkart)లో భారీ డీల్ అందుబాటులో ఉంది. ఐదు వేలు.. 10 వేలు కాదు.. ఏకంగా రూ. 26,000 తగ్గింపు లభిస్తోంది. ఇంత భారీ డిస్కౌంట్ ప్రీమియం ఫోన్లపై తరచుగా లభించదు. కాబట్టి పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే ఇది సువర్ణావకాశం.34 శాతం తగ్గింపు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్పై 34 శాతం తగ్గింపు లభిస్తోంది. తగ్గింపు తర్వాత గూగుల్ పిక్సెల్ 8 (Hazel, 128 GB) (8 GB RAM) ధర రూ.49,999 అయింది. వాస్తవంగా ఈ స్మార్ట్ఫోన్ రూ. 75,999 వద్ద లిస్ట్ అయింది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్తో రూ. 28200 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ (HDFC) క్రెడిట్ కార్డ్పై రూ.3000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐదు శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. నెలకు రూ.8,334 నో-కాస్ట్ ఈఎంఐ (EMI) ఆఫర్ కూడా ఉంది.గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు6.2-అంగుళాల OLED డిస్ప్లేగూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు27W వైర్డు, 18W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో 4575mAh బ్యాటరీఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్అద్భుతమైన కెమెరాగూగుల్ పిక్సెల్ 8 ఫోన్లో అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 10.5 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో ఏఐ సాంకేతికతను పొందుపరిచారు. కెమెరాలోని 'మ్యాజిక్ ఎరేజర్' ఫీచర్తో ఫోటో నుండి అనవసరమైన వాటిని తొలగించవచ్చు. 'రియల్ టోన్' ఫీచర్ విభిన్న స్కిన్ టోన్లను ఖచ్చితమైన రీతిలో చూపుతుంది. 'నైట్ సైట్' ఫీచర్ తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలను తీస్తుంది. -
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) రిపబ్లిక్ డేకి ముందే.. మాన్యుమెంటల్ సేల్ను నిర్వహిస్తోంది. సేల్ సమయంలో, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు & ఇతర అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై బ్యాంక్ ఆఫర్లు మాత్రమే కాకుండా.. భారీ తగ్గింపులను కూడా అందించనుంది. ఇందులో భాగంగానే ఐఫోన్ 16 కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ వివరంగా చూసేద్దాం.ఆపిల్ ఐఫోన్ 16 (Apple iPhone 16)ఐఫోన్ 16 125జీబీ వేరియంట్ ధర రూ. 79,999. అయితే ఫ్లిప్కార్ట్ మాన్యుమెంటల్ సేల్ సమయంలో ఇది రూ. 69,999లకే లభిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఐఫోన్ 16పై 12 శాతం డిస్కౌంట్ లభిస్తోందని స్పష్టమవుతోంది. డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్స్ & ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ వంటివి పొందవచ్చు.ఇతర ఆఫర్స్ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే.. 10 శాతం లేదా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు.అంతే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 42150 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 16 డీటెయిల్స్ఐఫోన్ 16 కొత్త కెమెరా లేఅవుట్, కొత్త జెన్ చిప్సెట్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొన్ని ప్రధాన అప్గ్రేడ్లతో వస్తుంది . ఆపిల్ కెమెరా ఫీచర్లను యాక్సెస్ చేయడానికి లేదా ఏఐ పవర్డ్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగించే కొత్త కెమెరా కంట్రోల్ బటన్ను కూడా పరిచయం చేసింది. ఐఫోన్ 16 మెరుగైన పనితీరు కోసం 8జీబీ ర్యామ్ కలిగిన ఏ18 చిప్ కూడా పొందుతుంది.ఆపిల్ విజన్ ప్రో కోసం.. స్మార్ట్ఫోన్ నిలువుగా ఉన్న కెమెరా మాడ్యూల్స్ పొందుతుంది. ఇది 48 మెగా పిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. కాబట్టి ఇది మంది ఫొటోగ్రఫీ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద కొంత తక్కువ ధర వద్ద ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని స్పష్టమవుతోంది.భారీగా పెరిగిన ఐఫోన్ ఎగుమతులుదేశంలో తయారవుతున్న ఐఫోన్ ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్ఆపిల్ తయారీ కేంద్రాలుభారతదేశంలో ఆపిల్ ప్రధాన తయారీదారులుగా ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. -
జియో న్యూ ఇయర్ ఆఫర్.. ఎన్ని ప్రయోజనాలో..
కొత్త సంవత్సరం 2025 వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికం కంపెనీ జియో (Jio)తన వినియోగదారుల కోసం ప్రత్యేక “న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్”ని (new recharge plan) ప్రారంభించింది. విస్తృతమైన కనెక్టివిటీ, ఖర్చు ఆదా, ప్రత్యేకమైన డీల్స్తో రూ. 2025 ప్లాన్ను తీసుకొచ్చింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వినియోగదారులకు మెరుగైన మొబైల్ అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం.రూ.2025 ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.2025 ప్లాన్తో సబ్స్క్రైబర్లు అపరిమిత 5జీ ఇంటర్నెట్ని ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ పరిమితి 2.5 జీబీతో మొత్తం 500 జీబీ 4జీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఎస్ఎంఎస్ పంపవచ్చు. పెద్ద మొత్తంలో డేటా వినియోగించేవారికి, కమ్యూనికేషన్ కోసం ఫోన్లను విస్తృతంగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.రూ.2150 విలువైన కూపన్లుజియో భాగస్వామి బ్రాండ్ల నుండి అదనపు విలువను పొందడం ఈ ప్లాన్ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి. వినియోగదారులు ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అజియో (AJIO) నుండి కనీసం రూ. 2500 కొనుగోలుపై రూ. 500 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విగ్గీలో రూ. 499 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్లపై రూ. 150 తగ్గింపును పొందొచ్చు. ఇక ఈజ్మైట్రిప్లో (EaseMyTrip) విమాన బుకింగ్లపై రూ. 1500 ఆదా చేసుకోవచ్చు.డిసెంబర్ 11న ప్రారంభమైన రూ. 2025 ప్లాన్ 2025 జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు కొత్త సంవత్సరాన్ని అదిరిపోయే సేవింగ్స్, ఆఫర్స్తో మొదలు పెట్టవచ్చు. హై-స్పీడ్ 5జీ, పుష్కలమైన డేటా, అపరిమిత కాల్స్, పార్ట్నర్ డిస్కౌంట్స్ వంటి ఫీచర్లతో జియో రూ. 2025 ప్లాన్ ఆధునిక వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. -
కొత్త సంవత్సరంలో లేటెస్ట్ ఐఫోన్.. బంపర్ డిస్కౌంట్
కొత్త సంవత్సరంలో ఐఫోన్ (iPhone) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఫ్లి ప్కార్ట్ (Flipkart) ఐఫోన్ 15 (iPhone 15)పై గొప్ప డీల్ని తీసుకొచ్చింది. ఈ డీల్ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఇలా చేస్తే రూ.50,999కే ఐఫోన్ 15యాపిల్ (Apple) అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 15 అసలు ధర 128జీబీ వేరియంట్కు రూ.69,900 లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్ వేరియంట్ ఫ్లిప్కార్ట్లో రూ. 57,999 ధరతో లిస్ట్ అయింది. అన్ని ఇతర కలర్ వేరియంట్లు రూ. 58,999 వద్ద ఉన్నాయి.అయితే మీరు ఈ ఫోన్ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15పై రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా రూ. 6000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఆఫర్ల తర్వాత, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్పై ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 15 స్పెక్స్ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో యాపిల్ బయోనిక్ ఎ16 (Bionic A16) చిప్సెట్ ఉంటుంది. ఇది 5-కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్బీ టైప్-సి పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్లోనే వస్తుంది. -
విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం దేశంలో ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు విమాన ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదనంగా 10 కిలోల వరకు బ్యాగేజ్ను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది.అర్హతలు ఇవే..దేశీయ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థుల వయసు 12 ఏళ్ల వరకు ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు 12-30 ఏళ్ల వయసు వరకు ఉండొచ్చు. అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిందై ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక విద్యాసంవత్సరం ఫుల్ టైమ్ కోర్సులో చేరి ఉండాలి.ఇదీ చదవండి: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడాఎక్కడ బుక్ చేసుకోవాలి..?ఈ ఆఫర్ వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎయిరిండియా బ్యాంకు పార్టనర్లు జారీ చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అందనంగా ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకునే విద్యార్థులకు కన్వినియెన్స్ ఛార్జీల రూపంలో ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. దానివల్ల దేశీయ విమానాల్లో ప్రయాణించే విద్యార్థులు రూ.399, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లేవారు రూ.999 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
విద్యార్థులకు ఇండిగో స్పెషల్ ఆఫర్..
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' విద్యార్థుల కోసం 'స్టూడెంట్ స్పెషల్' అనే ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇండిగో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ప్రత్యేక ఛార్జీలు, అదనపు ప్రయోజనాలు లభించనున్నట్లు ప్రకటించింది.విమాన టికెట్ మీద 6 శాతం రాయితీ కల్పించడం మాత్రమే కాకుండా.. 10 కేజీల వరకు అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి ఇండిగో అనుమతించింది. విద్యార్థులు కోసం తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉంటుందో.. స్పష్టంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంఇండిగో ప్రకటించిన ఈ స్పెషల్ ఆఫర్ కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా గోవా, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మొత్తం 80 రూట్లలో నడిచే విమాన సర్వీసుల్లో అందుబాటులో ఉంటుంది. 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు తమ స్కూల్ లేదా యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డును కలిగి ఉండాలి. ఐడీ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ ఆఫర్ ఉపయోగించుకోవడానికి అర్హులు. -
దీపావళి షాపింగ్ చేస్తున్నారా?: డబ్బు ఆదా కోసం ఐదు టిప్స్..
దీపావళి వచ్చేస్తోంది.. ఇప్పటికే చాలామంది షాపింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు. షాపింగ్ అంటేనే డబ్బు ఖర్చు పెట్టడం. ఇలా డబ్బు ఖర్చుపెట్టే క్రమంలో కొంత ఆదా చేసే మార్గాల కోసం అన్వేషిస్తారు. దీనికోసం కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి టిప్స్ గురించి తెలుసుకుందాం.బడ్జెట్ ప్లాన్ వేసుకోవడంపండుగ వస్తోంది కదా అని కంటికి కనిపించిందల్లా.. కొనేస్తే పర్సు ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి? దానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాలను ముందుగానే లెక్కించుకోవాలి. కిరాణా వస్తువులు, స్వీట్స్ వంటివన్నీ కూడా ఒకేసారి కొనుగోలు చేయడం ఉత్తమం. పండుగ సీజన్లో అందుబాటులో ఉన్న అన్ని డిస్కౌంట్స్ వాడుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. డిస్కౌంట్స్ ఉన్నాయి కదా అని అనవసర వస్తువులను కొనుగోలు చేయకూడదు.క్యాష్బ్యాక్ ఆఫర్స్ ఉపయోగించుకోవడందసరా, దీపావళి సమయంలో క్యాష్బ్యాక్ ఆఫర్స్ విరివిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ ప్లాట్ఫామ్లలో క్యాష్బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ షాపింగ్లో క్యాష్బ్యాక్ లభించే అవకాశాలు ఎక్కువ. వీటిని ఉపయోగించుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది.ధరలను సరిపోల్చడంఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో ఒక వస్తువు ధర ఏ ప్లాట్ఫామ్లో ఎంత ఉందో గమనించాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ వస్తువులను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా డబ్బు ఆదా అవుతుంది. ధరలను సరిపోల్చడానికి ప్రైస్ ట్రాకింగ్ టూల్స్ ఉపయోగించడం ఉత్తమం.డిస్కౌంట్స్ తెలుసుకోవడంషాపింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవాలి. అయితే చాలా సైట్స్ డిస్కౌంట్స్ పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి డిస్కౌంట్స్ లభించే ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆదమరిచినా నష్టపోవడం ఖాయం.ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలుబ్యాంక్ ఆఫర్స్ సద్వినియోగం చేసుకోవడంషాపింగ్ చేసే క్రమంలో బ్యాంకులు అందించే ఆఫర్స్ వినియోగించుకోవాలి. క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల మీద డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ వంటివి ఈ పండుగల సమయంలో చాలానే లభిస్తాయి. కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్లను కూడా అందిస్తాయి. వీటిని కూడా ఉపయోగించుకుంటే.. డబ్బు కొంత ఆదా అవుతుంది. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించి షాపింగ్ చేస్తే.. నిర్దిష్ట కాలంలో తిరిగి చెల్లించాలి. లేకుంటే అది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదు. -
దసరా బంపర్ ఆఫర్.. వంద రూపాయలకే 10 కేజీల మేక!
dussehra offer: రండీ బాబూ రండీ.. ఆలసించినా ఆశాభంగం. త్వరపడండి.. మంచి తరుణం మించినా దొరకదు. ఏంటీ హడావుడి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సాధారణంగా దసరా పండుగకు జనమంతా షాపింగ్ చేయడం సర్వసాధారణం. అటు దుకాణాదారులు కూడా ఆఫర్లతో పాటు ఉచిత బహుమతులతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.ఇదిలావుంచితే రానున్న దసరా పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులకు వెరైటీ ఆఫర్లు ప్రకటించారు. నేలకొండపల్లి చెందిన కొందరు యువకులు డ్రా ద్వారా బహుమతులు అందించాలని నిర్ణయించారు. అయితే, టీవీలు, కూలర్లు, బైక్లు వంటివి కాకుండా ఈసారి వినూత్న బహుమతులను ప్రకటించారు.కేసు బీర్లు, నాటు కోళ్లురూ.100 చొప్పున టికెట్లు అమ్మకం చేపట్టి ఈనెల 10న తీయనున్న డ్రాలో మొదటి బహుమతి 10 కిలోల మేక ఇస్తామని పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రెండో బహుమతిగా బ్రాండెడ్ మద్యం బాటిల్, మూడో బహుమతి కేసు బీర్లు, నాలుగో బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదో బహుమతిగా మద్యం బాటిల్ ఇస్తామని ప్రకటించడంతో టికెట్లు జోరుగానే అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.వేములవాడలో కేసు కాగా, నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలోనూ ఇంతకుముందు ఇలాంటి ఆఫర్లే ప్రకటించారు. ఈ ట్రెండ్ చాలా ఊర్లకు పాకింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం పోలీసులు కన్నెర్ర చేశారు. వేములవాడ పట్టణంలో “100 కొట్టు మేకను పట్టు” క్యాప్షన్తో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రైజ్మనీల పేరుతో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. -
మూవీ లవర్స్కు బంపరాఫర్.. అయితే ఆ ఒక్క రోజే!
మూవీ లవర్స్కు ఓ గుడ్ న్యూస్. తాజాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఈనెల 20న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్లో ఎక్కడైనా సరే రూ.99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్పై ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది.ఇంకేందుకు ఆలస్యం.. మీకు నచ్చిన సినిమాను కేవలం రూ.99కే మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసేయండి. అయితే ఈ ఆఫర్ కేవలం పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీటైమ్, డిలైట్ మల్టీప్లెక్స్ల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ ఆ రోజు అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. కాగా.. ఈ రోజుల్లో థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ బంపరాఫర్ పట్ల సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఉచితంగా 'జియో ఎయిర్ ఫైబర్': ఇలా చేయండి
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దీపావళి డబుల్ ధమాకా' ఆఫర్ను రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఒక సంవత్సరం ఫ్రీ 'జియో ఎయిర్ ఫైబర్' సేవను ఆస్వాదించే అవకాశాన్ని పొందవచ్చు. ఇంతకీ ఈ అవకాశాన్ని ఎలా పొందాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..ఉచితంగా జియో ఎయిర్ ఫైబర్ పొందాలంటే?ఫ్రీగా జియో ఎయిర్ ఫైబర్ సేవలను పొందాలంటే.. 2024 సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3వరకు ఏదైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్లో లేదా మైజియో స్టోర్లో రూ. 20000 లేదా అంతకంటే ఎక్కువ ధరకు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినవాళ్ళే ఉచిత జియో ఎయిర్ ఫైబర్ పొందటానికి అర్హులు.ఈ ఆఫర్ కొత్త వాళ్ళకు మాత్రమే కాకుండా ఇప్పటికే జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉన్న కస్టమర్లు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు.ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలుఅర్హత పొందిన కస్టమర్లు ప్రతి నెల నవంబర్ 24 నుంచి అక్టోబర్ 25 వరకు యాక్టివ్ ఎయిర్ఫైబర్ ప్లాన్కు సమానమైన 12 కూపన్లను పొందుతారు. ప్రతి కూపన్ను 30 రోజులలోపు సమీప రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్టోర్లో రీడీమ్ చేసుకోవచ్చు. ఈ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ సంప్రదించండి. -
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్
ఐఫోన్ 16 సిరీస్ను ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల చేయడానికి యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 మోడల్ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్తో లభిస్తోంది.యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 79,600 లుగా ఉంది. దీన్ని ఫ్లిప్కార్ట్లో కొంటే రూ. 56,000 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ వేరియంట్ రూ. 56,499కి అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.23,101 ఆదా చేసుకోవచ్చు. దీంతో పాటు, యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. అంటే ఐఫోన్ 14 ప్లస్ రూ.55,499కే లభిస్తుందన్న మాట.ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్» 1200 నిట్స్ బ్రైట్నెస్తో పెద్ద » 6.7-అంగుళాల స్క్రీన్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే» డిస్ప్లే దెబ్బతినకుండా సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్» A15 బయోనిక్ చిప్సెట్» 12-మెగాపిక్సెల్ రియర్ డ్యూయల్ కెమెరా» 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా -
నీరజ్ ‘గోల్డ్’ గెలిస్తే అందరికీ... ఓ సీఈవో అదిరిపోయే ఆఫర్!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఓ పోస్ట్ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్ను వివరిస్తూ మరో పోస్ట్ను మోహక్ నహ్తా షేర్ చేశారు."నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్లో పూర్తి వివరాలు అందించారు. పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్ను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్తో యూజర్ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్ఇన్ ప్లాట్ఫారమ్లో భాఈగా రీపోస్ట్లు, లైక్లు, కామెంట్లను పొందింది. యూఎస్లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. -
రూ.2 లక్షల కోట్ల గూగుల్ ఆఫర్.. తిరస్కరించిన విజ్
సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ 'విజ్' (Wiz)ను కొనుగోలు చేయడానికి గూగుల్ 23 మిలియన్ డాలర్లు (రూ. 2 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది. ఈ భారీ ఆఫర్ను విజ్ సున్నితంగా తిరస్కరించింది. ఈ ఆఫర్ను తిరస్కరించడానికి గల కారణాన్ని కంపెనీ కో ఫౌండర్ 'అసాఫ్ రాపాపోర్ట్' మెమోలో వెల్లడించారు.గూగుల్ ఇచ్చిన ఈ భారీ ఆఫర్ను తిరస్కరించడం కష్టమే.. కానీ కంపెనీ ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం, యాన్యువల్ రికావరింగ్ రెవెన్యూలో 1 బిలియన్ డాలర్లను సాధించాలని విజ్ కో-ఫౌండర్ అసాఫ్ రాపాపోర్ట్ మెమోలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ డీల్ గురించి గూగుల్ కంపెనీగానీ, విజ్ గానీ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.విజ్ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియా, ఇజ్రాయెల్ దేశాల్లో 900 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మోర్గాన్ స్టాన్లీ, డాక్యుసైన్తో సహా ప్రముఖ క్లయింట్లను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీ ప్రస్తుతం ఫార్చ్యూన్ 100 కంపెనీలలో 40 శాతం వాటాను కలిగి ఉంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు
బెంగళూరు: ’ఓలా ఎలక్ట్రిక్ రష్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 పోర్ట్ఫోలియోపై రూ. 15,000 వరకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవి జూన్ 28 వరకు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఎస్1 ఎక్స్+పై రూ. 5,000, ఎస్1 ప్రో.. ఎస్1 ఎయి ర్పై రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటు లభిస్తుంది.ఎస్1 ఎక్స్+పై రూ. 5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, మొత్తం ఎస్1 శ్రేణిపై నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు క్యాష్బ్యాక్ సహా మొత్తం రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఎస్1 పోర్ట్ఫోలియోలో ఆరు వేరియంట్లు ఉన్నాయి.మొత్తం ఉత్పత్తుల శ్రేణి బ్యాటరీలపై 8 ఏళ్లు/80,000 కి.మీ. మేర ఎక్స్టెండెడ్ వారంటీని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కావాలంటే పరిమితిని పెంచుకునేందుకు కస్టమర్లు రూ. 4,999–రూ. 12,999 వరకు చెల్లించి యాడ్–ఆన్ వారంటీని ఎంచుకోవచ్చు. -
వన్ ప్లస్ ఫోన్ పై క్రేజీ డిస్కౌంట్..
-
బంపరాఫర్.. మల్టీప్లెక్స్ల్లో టికెట్ రూ.99 మాత్రమే
సినిమాలు తెగ చూసేవాళ్లకు ఇది బంపరాఫర్. ఎందుకంటే మే 31న అంటే ఈ శుక్రవారం సినిమా లవర్స్ డే సందర్భంగా మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏ మల్టీఫ్లెక్స్లో అయినా సరే రూ.99 మాత్రమే మూవీ చూడొచ్చని ప్రకటించింది. కానీ ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాలకు వర్తించదని చెప్పి చిన్నపాటి షాకిచ్చింది.ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో 'హనుమాన్', 'గుంటూరు కారం' లాంటి సినిమాలు వచ్చాయి. వీటి వల్ల బాక్సాఫీస్ కళకళాలాడింది. దీని తర్వాత టాలీవుడ్ అనే కాదు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో సరైన మూవీస్ రిలీజ్ కాకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి చూడటం గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్ రూ.99 అని ఆఫర్ పెట్టింది.(ఇదీ చదవండి: హీరోయిన్ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!)ఆఫర్ చూసి మీరు తెగ ఎగ్జైట్ అయిపోయింటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది వర్తించదని చెప్పి షాకిచ్చింది. మన దగ్గర సినిమా లవర్స్ డే ఉన్నప్పటికీ.. కొన్ని మల్టీప్లెక్స్ల్లో కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ ధర రూ.112గా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. వీళ్లకు ఆఫర్ ఇవ్వకపోయినా సరే ఎలానూ చూస్తారులే అనే ధీమానా? లేదా మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. ఇలా తెలుగు ప్రేక్షకులపై మల్టీప్లెక్స్లా చిన్నచూపు ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ ఏడాది జనవరిలోనూ ఇలానే సినిమా లవర్స్ డే అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫర్ ప్రకటించింది. నాలుగు నెలల తిరక్కుండానే మళ్లీ బంపరాఫర్ అని చెప్పుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే వ్యాపారం తగ్గినా ప్రతిసారీ కావాలనే ఇలా ఆఫర్స్ అని అంటున్నారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)Cinema Lovers Day returns on 31st May with movies for just Rs 99/-!🍿Join us at cinemas across India to celebrate a day at the movies. Over 4000+ screens are participating, making it an unforgettable cinematic experience!#CinemaLoversDay pic.twitter.com/b2XAOC3yxy— Multiplex Association Of India (@MAofIndia) May 28, 2024 -
యువతకు జాక్పాట్.. భారీ వేతనంతో ఉద్యోగాలు!
హర్యానాకు చెందిన యువతకు ఇజ్రాయెల్లో అత్యధిక వేతనంలో కూడిన ఉద్యోగాలు లభించాయి. దీంతో 530 మంది యువకుల బృందం హర్యానా నుండి ఇజ్రాయెల్కు బయలుదేరింది. వీరిని హర్యానా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఇంతకుముందే వీరికి ఇంటర్వ్యూలు పూర్తికాగా, ఇప్పుడు వీరంతా ఇజ్రాయెల్కు పయనమయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మంగళవారం 530 మంది యువకులు న్యూఢిల్లీ నుండి ఇజ్రాయెల్కు వెళ్లారు. దీనికి ముందు హర్యానా సీఎం నయాబ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఈ యువకులతో మాట్లాడారు. ఇజ్రాయెల్లో ఉద్యోగాల భర్తీకి హర్యానా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో గత జనవరిలో రోహ్తక్లో ఆరు రోజుల పాటు జరిగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. మొత్తం 8,199 మంది యువకులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరు ఇజ్రాయెల్ వెళ్లే ముందు హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ ఈ యువకులను అభినందించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్లో కార్మికుల కొరత తలెత్తింది. దీంతో కార్మికులను తమ దేశానికి పంపాలని ఇజ్రాయెల్ భారతదేశాన్ని అభ్యర్థించింది. ఇజ్రాయెల్లో 10 వేల మంది నిర్మాణ కార్మికుల అవసరం ఉంది. వీరికి నెలకు రూ.1,37,000 జీతం లభించనుంది. దీంతో పాటు వైద్య బీమా, ఆహారం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. -
మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే..
ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది భారీగా వేసవి తాపం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ యాప్లు, రిటైల్ స్టోర్ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఐసెర్ రేటింగ్ కొందరు సరైన అవగాహన లేక పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్ (ఐఎస్ఈఈఆర్) రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్ రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్ రేట్ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుంది. ఇన్వర్టర్తో మేలు చాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్, ఆఫ్ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్లో చాలా వరకు కన్వర్ట్బుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల అవుట్డోర్ యూనిట్లోని ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది. ఇదీ చదవండి: 8.8 కి.మీ క్యాబ్ రైడ్ ధర చూసి షాక్.. చివరికి ఏమైందంటే.. ధరల మధ్య వ్యత్యాసం ఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్ కొనాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి. -
గుంపు మేస్త్రీకి 1.37 లక్షల శాలరీ ఆఫర్!
దారిద్ర్యంలో మగ్గిపోతున్న వ్యక్తికి ఒక్కసారిగా లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం లభిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఊహకందని ఆఫర్ బీహార్ గుంపు మేస్త్రీకి దక్కింది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్లో గత కొన్ని నెలలుగా హమాస్తో జరుగుతున్న యుద్ధం కారణంగా పలు భవనాలు శిధిలమయ్యాయి. తిరిగి భవనాలను నిర్మించేందుకు ఇజ్రాయెల్కు నిర్మాణ కార్మికుల అవసరం ఎంతో ఉంది. దీనిలో భాగంగానే కార్మికుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా భవన నిర్మాణపు పనుల్లో పాల్గొనే కార్మికులకు డిమాండ్ అధికంగా ఉంది. అర్హతను అనుసరించి గుంపు మేస్త్రీలను రూ. 1.37 లక్షల వేతనంతో నియమించుకుంటున్నారు. ఇలా నియమితులైనవారు ఏడాది నుంచి ఐదు సంవత్సరాల పాటు అక్కడ పనులు చేయాల్సి ఉంటుంది. బీహార్లోని చాప్రా నివాసి జితేంద్ర కుమార్ రాయ్ అనే తాపీ మేస్త్రీకి ఇజ్రాయెల్లో పనిచేసే అవకాశం దొరికింది. పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయిన జితేంద్ర చిన్నప్పటి నుంచి సైనికునిగా మారాలని కలలుగనేవాడు. అతనికి తగిన పని దొరక్కపోవడంతో తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. గుంపు మేస్త్రీగా ధృవీకరణ పత్రం పొందేందుకు జంషెడ్పూర్లోని నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశాడు. ప్రస్తుతం జితేంద్ర బీహార్లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రతీనెలా రూ.20 వేల వరకూ సంపాదిస్తుంటాడు. ఇజ్రాయెల్ వెళ్లే అవకాశం రాగానే జితేంద్ర ఎగిరిగంతేశాడు. తమ కుటుంబం ఇన్నాళ్లూ అనుభవించిన పేదరికం ఇక పటాపంచలైపోతుందని జితేంద్ర ఆశాభావం వ్యక్తం చేశాడు. -
బంపరాఫర్.. రూ. 1799కే ఫ్లైట్ జర్నీ!
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. వన్వే టికెట్ డొమెస్టిక్ రూట్లలో రూ. 1,799, అంతర్జాతీయ రూట్లలో రూ. 3,899 నుంచి ప్రారంభమయ్యే నెట్వర్క్-వైడ్ సేల్ను ప్రారంభించింది . ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ పేరిట పరిమిత-కాల నెట్వర్క్-వ్యాప్త ఆఫర్ను ఫిబ్రవరి 2న ప్రారంభించింది. ఇది ఫిబ్రవరి 5 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఎయిర్ ఇండియా వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే బుకింగ్ చేస్తే ఈ ఆఫర్పై కన్వీనియన్స్ ఫీజు కూడా మినహాయించనున్నట్లు ఎయిర్ఇండియా ఒక విడుదలలో తెలిపింది. షరతులు ఇవే.. ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ కింద బుకింగ్లు కేవలం నలుగురికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 2 నుంచి సెప్టెంబర్ 30 మధ్య చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ లోపు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయ మార్గాల్లో అన్నీ కలుపుకొని వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ.1,799 నుంచి ప్రారంభమవుతాయి. అయితే వన్-వే బిజినెస్ క్లాస్లో ఇది రూ. 10,899. ఇక అంతర్జాతీయ మార్గాల్లో వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ. 3,899 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సేల్ అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్నవారికి సీట్లు లభిస్తాయని ఎయిర్ లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు ఆదా చేసుకోవచ్చు. దేశంలోని పలు నగరాలతో పాటు యూఎస్, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ & మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణ ఆసియాలో ఎయిర్లైన్ నిర్వహించే గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి. -
లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్.. అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడు కొనేయండి!
మార్కెట్లోకి రకరకాల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైన సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే లాంచ్ అయినప్పుడు వాటి ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది వాటిని కొనలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కంపెనీలు కొన్ని నెలల తర్వాత ఆ ఫోన్ల ధరలను తగ్గిస్తుంటాయి. మోటరోలా రేజర్ 40 (Moto Razr 40), మోటరోలా రేజర్ 40 అల్ట్రా (Moto Razr 40 Ultra) ఫ్లిప్ ఫోన్లు గతేడాది జూన్లో విడుదలయ్యాయి. 2000ల ప్రారంభం నాటి ఐకానిక్ Motorola Razr ఫ్లిప్ ఫోన్లను పునరుద్ధరిస్తూ లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటి ధరలను మోటరోలా భారీగా తగ్గించింది. అధిక ధరల కారణంగా అప్పుడు కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు. రూ.20,000 తగ్గింపు మోటరోలా భారత్లో తన మోటో రేజర్ 40, మోటో రేజర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్లకు గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. మోటో రేజర్ 40 ధరను రూ. 15,000 తగ్గించింది. దీని అసలు ధర రూ. 59,999 కాగా ఇప్పడు రూ. 44,999కి తగ్గింది. అదేవిధంగా మోటో రేజర్ 40 అల్ట్రా ధరను ఏకంగా రూ. 20,000 తగ్గించింది. రూ. 89,999 ఉన్న ఈ ఫోన్ను రూ. 69,999కే కొనుక్కోవచ్చు. మోటరోలా అధికారిక వెబ్సైట్తోపాటు అమెజాన్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. మోటో రేజర్ 40 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 144 Hz రిఫ్రెష్ రేట్, 1080×2640 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.90-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 1.50-అంగుళాల సెకండరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ రంగులలో లభ్యం 4200 mAh బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మోటో రేజర్ 40 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 165 Hz రిఫ్రెష్ రేట్తో 6.9-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా రంగులలో లభ్యం వైర్లెస్, వైర్డు ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే 3800mAh బ్యాటరీ -
Ayodhya: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎయిర్ లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి. అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (Paytm) ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 1000 మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టిక్కెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే.. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటీఎం ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు లభిస్తాయి. ఆఫర్ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. -
చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫరిస్తే రిజెక్ట్ చేశా..
-
పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్!
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోరఖ్పూర్లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు.. -
బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై రూ.10,000 తగ్గింపు!
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ తమ ఇయర్ ఎండ్ యాపిల్ సేల్ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్తో సహా కొన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 15ప్రో 1టీబీ వేరియంట్ను డిస్కౌంట్పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ వేరియంట్ను బ్యాంక్ ఆఫర్లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్ 14 మోడల్లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. కేవలం ఐఫోన్లే కాకుండా మ్యాక్బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్బుక్ ఎయిర్ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 5th Gen) ఆఫర్ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది. -
అన్లిమిటెడ్ ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: అన్లిమిటెడ్ స్టోర్స్ ‘రెడ్ అలర్ట్ సేల్ ఆఫర్’ను ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వ్రస్తాలపై 50% ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే రూ.3వేల షాపింగ్పై అంతే విలువైన ఉత్పత్తులు ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా 87 స్టోర్లలో జనవరి 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్యాషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కోరింది. -
సింగిల్ ఛార్జ్ 200 కిమీ రేంజ్! ధర కూడా తక్కువే..
Komaki LY Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో దాదాపు అన్ని సంస్థలు ఈ రంగం వైపే జోరుగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో విడుదలైన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ సమయంలో రూ. 96,968 వద్ద అమ్ముడైన ఈ స్కూటర్ ఇప్పుడు రూ. 78,000 వద్ద లభిస్తోంది. అంటే కంపెనీ ఈ స్కూటర్ మీద రూ. 18,968 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని తయారైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్, డ్యూయల్ బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీతో కూడిన స్కూటర్ 85 కిలోమీటర్ల రేంజ్ అందిస్తే, డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ 200 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి రిమూవబుల్ బ్యాటరీ కలిగిన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇది బ్యాటరీ స్టేటస్, న్యావిగేషన్ వంటి మరిన్ని వివరాలను రైడర్కు తెలియజేస్తుంది. ఆన్బోర్డ్లో సౌండ్ సిస్టమ్ ఉండటం వల్ల, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ప్లే చేయవచ్చు. డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.1.97 లక్షల డిస్కౌంట్ - నేడే ఆఖరు..
భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది బైక్ రైడర్లు ఇష్టపడే బైక్ బ్రాండ్లలో ఒకటి 'డుకాటి' (Ducati). ఫెస్టివల్ సీజన్ పూర్తయిన తరువాత కూడా ఈ కంపెనీ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన మోడల్ మీద భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏ బైకుపై సంస్థ డిస్కౌంట్ అందిస్తోంది, డిస్కౌంట్ తర్వాత ఈ బైక్ ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి కంపెనీకి చెందిన మాన్స్టర్ (Monster) బైకుపై సంస్థ ఏకాంగి రూ. 1.97 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ధర రూ. 12.95 లక్షలు కాగా.. డిస్కౌంట్ తరువాత ఇది రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు (నవంబర్ 30) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డుకాటి మాన్స్టర్ బైక్ 937 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలిగి 9250 ఆర్పీఎమ్ వద్ద 109 బీహెచ్పీ పవర్, 6500 ఆర్పీఎమ్ వద్ద 92 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, డుకాటి క్విక్ షిఫ్ట్ ద్వారా 6-స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది, తద్వారా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లో డుకాటి మాన్స్టర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, ఎస్పీ వేరియంట్లు. ప్రారంభంలో ఈ బైక్ రూ. 15.95 లక్షల ధర వద్ద విడుదలైంది, ఆ తరువాత ఈ ధరలు కొంత అతగ్గుముఖం పట్టాయి. దీంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. -
బుకింగ్లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
ఓటర్లకు ఉచితంగా పోహా, జిలేబీ
ఇండోర్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు స్థానిక దుకాణాదారులు ప్రత్యేకమైన ఆఫర్ను ప్రకటించారు. సాధారణంగా రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పారీ్టలు ఉచితాలు ప్రకటించడం అందరికీ తెలిసిందే. కానీ మధ్యప్రదేశ్లో పారీ్టలకు బదులు దుకాణాదారుల సంఘం ఉచితం ఆఫర్తో ముందుకొచి్చంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం ముందుగా ఓటేసే అభ్యర్థులకు ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే తమ ఆఫర్లోని అంతరార్థమని ఆ సంఘం అసలు విషయం బయటపెట్టింది. 230 ఎమ్మెల్యే నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఒకేదఫాలో నవంబర్ 17వ తేదీన జరగనున్నాయి. పోహా, జిలేబీ ఆఫర్పై ‘56 దుకాణ్ ట్రేడర్స్’ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజాన్ శర్మ పీటీఐతో మాట్లాడారు. ‘ నగర స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఇండోర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఓటింగ్ శాతంలోనూ తొలిస్థానంలో నిలవాలన్నది మా ఆకాంక్ష. అందుకే ఓటర్లను ఉచిత పోహా, జిలేబీతో ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. నవంబర్ 17వ తేదీన ఉదయం తొమ్మిది గంటల్లోపు ఎవరైతే ఓటు వేసి వేలికి సిరా గుర్తు చూపిస్తారో వారికే పోహా, జిలేబీ ఉచితంగా ఇస్తాం. ఉదయం తొమ్మిది తర్వాత సిరా గుర్తు చూపిస్తే పది శాతం డిస్కౌంట్ ఇస్తాం’ అని శర్మ వివరించారు. ఇండోర్ నగరంలో ఉన్న ఈ ‘56 దుకాణ్’కు స్వచ్ఛమైన వీధి ఆహార హబ్ గుర్తింపునిస్తూ ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్టిఫికెట్ జారీచేసింది. ఇండోర్ అర్బన్ పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో మొత్తంగా ఇక్కడ 14.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 67 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 15.55 లక్షలకు పెరిగింది. జిలేబీ ఆఫర్ను ఇక్కడి ఓటర్లు ఏ మేరకు సది్వనియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే. -
శ్రేయాస్ షిప్పింగ్ @ రూ. 400
ముంబై: డీలిస్టింగ్కు శ్రేయాస్ షిప్పింగ్.. షేరుకి రూ. 400 చొప్పున కౌంటర్ ఆఫర్ను ప్రకటించింది. ఆఫర్ ఈ నెల 17న ముగియనుంది. వెరసి కంపెనీ రెండోసారి డీలిస్టింగ్ ప్రయత్నాలను చేపట్టింది. గత నెలలో తొలుత ప్రకటించిన రూ. 338 ధరను రూ. 375కు సవరించినప్పటికీ వాటాదారులు షేరుకి రూ. 890 ధరలో షేర్లను టెండర్ చేయడంతో ఆఫర్ ధరను మరోసారి పెంచింది. తద్వారా కౌంటర్ ఆఫర్కు తెరతీసింది. డీలిస్టింగ్ ప్రాసెస్లో భాగంగా ఆఫర్ ఈ నెల 11న ప్రారంభమై 17న ముగియనున్నట్లు మాతృ సంస్థ ట్రాన్స్వరల్డ్ హోల్డింగ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. డీలిస్టింగ్ ప్రకటనకు ముందు మే 19న షేరు ధర రూ. 262 వద్ద నిలిచింది. ఈ ధరతో పోలిస్తే కౌంటర్ ఆఫర్ దాదాపు 53 శాతం ప్రీమియంకావడం గమనార్హం! కాగా.. 60 రోజుల సగటు ధర రూ. 292 కావడంతో ఫ్లోర్ ధరకు 37 శాతం ప్రీమియంతో కౌంటర్ ఆఫర్ను నిర్ణయించింది. ఇక మంగళవారం(10న) ముగింపు ధర రూ. 374తో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. ఈ ఏడాది మే 21న శ్రేయాస్ షిప్పింగ్ డీలిస్టింగ్ను స్వచ్చందంగా చేపట్టనున్నట్లు ట్రాన్స్వరల్డ్ వెల్లడించిన విషయం విదితమే. ప్రస్తుతం కంపెనీలో ట్రాన్స్వరల్డ్కు 70.44 శాతం వాటా ఉంది. -
ఎస్బీఐ గుడ్న్యూస్, హోంలోన్ ఆఫ్ర్ పొడిగింపు, ఇక కార్ లోన్లపై..!
SBI Festive Offer: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.పండుగ సీజన్లో కార్ లోన్ తీసుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా కారు కనాలనుకునే కస్టమర్ల లోన్లపై తాజా ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ ఆఫర్ 2024, జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. హోమ్లోన్లపై రాయితీ పొడిగింపు అంతేకాదు హోమ్లోన్లపై అందిస్తున్న రాయితీని పొడిగించింది. గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల (bps) తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆఫర్నురానున్న ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో పొడిగించింది. డిసెంబరు 2023 దాకా తగ్గింపు వడ్డీరేట్లు వర్తిస్తాయిని బ్యాంకు వెల్లడించింది. (ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా) సంవత్సరానికి ఆటో రుణంపై బ్యాంకు MCLR రేటు 8.55 శాతం. గ్రీన్ కార్ లోన్ (ఎలక్ట్రిక్ వెహికల్) 9.65 శాతం నుండి 9.35 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. కస్టమరల క్రెడిట్ స్కోర్లు , విభిన్న కాలవ్యవధుల ప్రకారం వివిధ కార్ లోన్ రేట్లు నిర్ధారిస్తుంది. అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నామని బ్యాంకు పేర్కొంది. కారు లోన్ కోసం గరిష్ట కాలవ్యవధి 7 సంవత్సరాలు. కారు ఆన్-రోడ్ ధరమొత్తంలో 90 శాతం వరకు రుణం ఇవ్వవచ్చు.ఈ లోన్ ద్వారా కొత్త ప్యాసింజర్ కారు, మల్టీ యుటిలిటీ వెహికల్ , SUVని కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ ప్రీపేమెంట్ చేయాలనుకుంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపు ఛార్జీ తీసుకోబడదు. అలాగే ఏడాది తరువాత త కస్టమర్పై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీ ఉండదు. కారు రుణాలపై పరిమిత కాల వ్యవధిలో అందిస్తున్న ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ పొందాలంటే కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) అవసరమైన పత్రాలు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, రెసిడెన్షియల్ ప్రూఫ్, ఫారం 16, ఐడీ కార్డు (పాన్ ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్) లాంటివి ఇవ్వవచ్చు. ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ ఎలా పొందాలి? ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ తీసుకోవడానికి, బ్యాంకు యాప్ యోనోకులాగిన్ అవ్వాలి. ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ బ్యానర్పై క్లిక్ చేసి, అక్కడ మీ వివరాలను ధృవీకరించడంతోపాటు, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్ వస్తుంది దీన్ని సంబంధిత బ్యాంకు శాఖలో సమర్పించాలి. Make your festive season more joyful by driving home your dream car with amazing Car Loan deals!#SBI #CarLoan #FestiveOffers pic.twitter.com/MEAmMEAZJx — State Bank of India (@TheOfficialSBI) September 23, 2023 -
ఆ ఓటీటీ షోలు చూస్తే డబ్బులే డబ్బులు! స్నాక్స్ ఖర్చు కూడా..
ఇటీవల ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ బాగా పెరిగింది. చాలా సినిమాలు, షోలు ప్రత్యేకంగా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ (Netflix)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే షోలకు కోట్లాది మంది ప్రేక్షకులు ఉన్నారు. నెట్ఫ్లిక్స్లో అత్యంత జనాదరణ పొందిన షోలను వీక్షించే ఒక అదృష్ట అభిమాని 2,500 డాలర్లు (రూ.2.07 లక్షలు) గెలుచుకోవచ్చు. ఆన్లైన్ క్యాసినోస్ అనే సంస్థ ఈ ఆఫర్ అందిస్తోంది. సెప్టెంబర్ 25న నేషనల్ బింజ్ డే నాటికి విజేతను ఎంపిక చేయనుంది. విజేతకు పేమెంట్ రూపంలో 2,000 డాలర్లు (రూ.1.65 లక్షలు) అందిస్తారు. అలాగే స్నాక్స్ ఖర్చు కోసం మరో 500 డాలర్లు (రూ.41,000) చెల్లిస్తారు. దీంతోపాటు ఒక వేళ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేకపోతే అదికూడా ఉచితంగానే అందిస్తారు. (ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..) నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే మూడు అత్యంత ప్రజాదరణ పొందిన షోలు ‘స్క్విడ్ గేమ్’ (Squid Game), ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things), ‘వెనస్డే’(Wednesday)లను వీక్షించడానికి విజేతకు ఒక నెల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఒక్కో షోకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారికి ఎన్ని ఎపిసోడ్లు చూస్తున్నారు.. వీక్షిస్తున్నప్పుడు పరధ్యానానికి గురవుతున్నారా.. మళ్లీ ఎలా తిరగి షోలో నిమగ్నమవుతున్నారు..వంటి ప్రమాణాలను ఉపయోగించి ప్రతి షోకి 10కి స్కోర్ ఇవ్వమని అడుగుతారు. మూడు ప్రోగ్రామ్లలో మొత్తం 51 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇవన్నీ వీక్షించడానికి సుమారు 50 గంటలు పడుతుంది. విజేతను సెప్టెంబర్ 25 నాటికి ఎంపిక చేసి మొదటగా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్, స్నాక్స్ ఖర్చు కోసం 500 డాలర్లు అందిస్తారు. నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే మూడు షోలపై రివ్యూలను సమర్పించడానికి అక్టోబర్ 25 వరకు సమయం ఉంటుంది. ఇదంతా పూర్తయ్యాక చివరగా 2,000 డాలర్లు అందిస్తారు. -
ఆ ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చేసింది.. అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా
Karizma XMR: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్ను (మంగళవారం, ఆగస్టు 29) లాంచ్ చేసింది. కరిజ్మా XMR 210 పేరుతో ఈ కొత్త బైక్ లాంచ్తో కరిజ్మా బ్రాండ్ను రీలాంచ్ చేసింది. అంతేకాదు ఈ బైక్పై ఆకర్షణీయమైన్ రూ. 10వేల ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. యంగ్ జనరేషన్ బైకర్లను దృష్టిలో ఉంచుకని దీన్ని తీసు కొచ్చినట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ వెల్లడించింది. బుకింగ్లను కూడా షురూ చేసింది. రూ. 1,82,900 లాంచింగ్ ప్రైస్గా ఉన్న Karizma XMR 210 ఈ తగ్గింపుతో రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్ ధర ఆల్ ఇండియా) అందుబాటులో ఉంటుంది. నటుడు,బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కరిజ్మా XMR 210ని ఆవిష్కరించారు. ఇది ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్ , మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం. Karizma XMR 210 ఇంజీన్, ఫీచర్లు 210cc సింగిల్-సిలిండర్, 4V, DOHC , లిక్విడ్-కూల్డ్ యూనిట్ 9250 RPM (కంపెనీ అత్యంత శక్తివంతమైన ఇంజిన్)ను అమర్చింది. RPM వద్ద 20.4 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ కూల్ సెటప్ డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్బాక్స్ ఫ్యాటర్ రియల్ వెక టైర్తో వస్తుంది.ఇంకా ఈ బైక్లో కొత్త ఎల్ఈడీ లైట్లు , ఇండికేటర్లు, స్లీకర్ ఇంధన ట్యాంక్, షార్ప్ లైన్లో, రైడర్కు ప్రొటెక్షన్గా స్నాజీ విండ్స్క్రీన్తో యంగస్టర్స్ను ఆకట్టుకునేలా ఉంది. కాల్ల్స్, ఇతర నోటిఫికేషన్ అలర్ట్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సరికొత్త ఫుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, తేదీ, సమయం, టూర్, ఓడోమీటర్ రీడింగ్, ఇంధన స్థాయి, టాకోమీటర్ స్పీడోమీటర్ రీడింగ్ల వంటి సమాచారాన్ని అందిస్తుంది. Say hello to the Most Powerful in its Class machine loaded with cutting-edge tech, and a design that's an absolute head-turner. 😎 Introducing the new #KarizmaXMR, at an introductory price of Rs. 1,72,900* (*Ex-showroom price All India). BOOKINGS OPEN https://t.co/Y7zhD7lJTE pic.twitter.com/7NEhA4Fijr — Hero MotoCorp (@HeroMotoCorp) August 29, 2023 -
ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
పురాతన వస్తువులను వేలం పాటల్లో అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం మామూలే ! కానీ, ఒక సాధారణమైన గోడ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయి వార్తలకెక్కింది. వాషింగ్టన్ డీసీలోని ఈ గోడ యజమాని పేరు అలెన్ బర్గ్. ఒకసారి ఈ గోడ పక్కన ఉన్న ఇంటికి నీరు లీక్ అవుతున్నట్లు ఆ ఇంటి యజమాని గమనించాడు. దక్షిణంవైపు గోడకు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల దూలాలు తడిసి శిథిలావస్థకు చేరుకున్నాయని ఇంజినీర్ చెప్పడంతో, ఆ యజమాని అలెన్ను తన గోడ భాగాన్ని సరిచేయాలని కోరాడు. అతడు అందుకు నిరాకరించడమే కాకుండా, ఆ యజమానితో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో ఆ ఇంటి యజమాని సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అలెన్కు కోటిన్నర రూపాయలు జరిమానా విధించింది. దీంతో ఇప్పుడు అలెన్ తనకున్న ఆ ఒక్క ఆస్తి, ఈ గోడను రూ.నలభై లక్షలకు అమ్మకానికి పెట్టాడు. దాదాపు నాలుగేళ్ల పాటు ఎవరూ కొనక పోవడంతో, తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఆ పొరుగింటి యజమానే దీనిని కొన్నాడు. ఏది ఏమైనా ఆలెన్కు వాళ్ల తాత ఇచ్చిన ఆ ఒక్క గోడ అతన్ని కోటీశ్వరుడుని చేసింది. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
ఆ పని చేస్తే.. శరద్ పవార్కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ..
ముంబయి: ఇటీవల శరద్ పవార్, అజిత్ పవార్ల భేటీ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జట్టు కడుతున్న ఇండియా కూటమిని చెదరగొట్టేందుకు అజిత్ పవార్ నేతృత్వంలో వ్యూహం నడుస్తోందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. బీజేపీతో పొత్తు కుదిరితే శరద్ పవార్కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని వినికిడి. దీనిపై ఆయన ఏం చెప్పారంటే..? పుణెలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో శరద్ పవార్, అజిత్ పవార్లు భేటీ అయ్యారు. అజిత్ పవార్ వర్గం ఏక్నాథ్ షిండే ప్రభుత్వంతో కలిసిన నెలరోజుల తర్వాత చిన్నాన్న శరద్ పవార్ను కలిశారు. అయితే.. ఈ నెలఖరున ముంబయిలో ఇండియా కూటమి సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష కూటమికి షాక్ ఇచ్చే విధంగా శరద్ పవార్ను బీజేపీతో కలిసేలా అజిత్ పవార్ ఒప్పించే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకున్నారు. ఈ పుకార్లపై మాట్లాడిన శరద్ పవార్.. అలాంటి చర్చలేవీ జరగలేదని స్పష్టం చేశారు. కొంతమంది శ్రేయోభిలాషులు తనను బీజేపీతో పొత్తు కుదిరేలా ఒప్పించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. కానీ అందుకు తాను ఒప్పుకోలేదని కూడా పేర్కొన్నారు. అజిత్ పవార్తో సమావేశం జరిగినట్లు పేర్కొన్న ఆయన.. పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. పార్టీ పెద్దగా తనకు ఏం ఆఫర్ ఇవ్వగలరని అన్నారు. అజిత్ పవార్తో సాధారణంగానే సమావేశం జరిగిందని శరద్ పవార్ గతంలో కూడా చెప్పారు. అయితే.. శరద్ పవార్ భేటీ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) కూటమిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శరద్ పవార్ను భీష్మ పితామహగా పేర్కొన్న ఎంపీ సంజయ్ రౌత్.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ఎలాంటి పనులను శరద్ పవార్ చేయరని ధీమా వ్యక్తం చేశారు. ముంబయిలో ఆగష్టు 31న ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పరిణామాలు మహాకూటమిని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విభజించడమే బీజేపీకి తెలిసిన పని అని శరద్ పవార్ విమర్శించారు. యథావిధిగా కూటమి భేటీ జరుగుతుందని అన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
మోటో జీ14: ఫీచర్లు అదుర్స్! ధర తెలిస్తే వదిలిపెట్టరు!
Moto G14 : మెటరోలా ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ఫోన్ మోటో జీ 14 కొనుగోలుకు లభిస్తోంది. భారీ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, మల్టీ కెమెరా,డాల్బీ అట్మోస్-ఆధారిత స్టీరియో స్పీకర్స్ లాంటి అదిరే ఫీచర్స్తో ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. మోటో జీ 14 ధర, ఆఫర్ మోటో జీ 14 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (సింగిల్) వేరియంట్ ఫ్లిప్కార్ట్లో రూ.9,999 ధరతో లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మాత్రమే ఆఫర్లకు అర్హులు. ఫోన్పై తక్షణం రూ.750 తగ్గింపును పొందవచ్చు. ఫోన్ను ప్రీ-ఆర్డర్ చేసిన వారు రూ. 3,200 విలువైన స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్కు అర్హులు. స్టీల్ గ్రే , స్కై బ్లూ రంగులలో లభ్యం. (‘ఎక్స్’ లో లక్షల్లో ఆదాయం: పండగ చేసుకుంటున్న కంటెంట్ క్రియేటర్లు) మోటో జీ 14 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల ఫుల్హెచ్డి+ డిస్ప్లే 2GHz క్లాక్ స్పీడ్ ఆక్టా-కోర్ Unisoc T616 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ డ్యుయల్రియర్కెమెరా : 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్, 8ఎంపీ సెల్ఫీకెమెరా 5,000 mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్కు బంపర్ ఆఫర్ -
ఆ దీవుల్లో స్థిరపడేవారికి భారీ నజరానా!
ఐర్లండ్ పరిధిలో ఉన్న దీవుల్లో స్థిరపడటానికి సిద్ధపడేవారికి అక్కడి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చాలా దీవులు జనాలు లేక కళ తప్పినట్లు ఉండటంతో, ఈ దీవులను జనాలతో కళకళలాడేలా చేయాలని ఐర్లండ్ ప్రభుత్వం తలపెట్టింది. ఈ దీవుల్లో స్థిరపడటానికి వచ్చేవారికి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి, ఇతర అవసరాలకు 84 వేల యూరోలు (రూ.76.16 లక్షలు) ఇవ్వనున్నట్లు ఐర్లండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హీదర్ హంప్రీస్ ప్రకటించారు. ఈ దీవుల్లో నివాసం ఉండేవారికి మంచి కెరీర్ అవకాశాలను కల్పిస్తామని ఆమె తెలిపారు. ఇక్కడ నివాసం ఉండేందుకు వచ్చేవారికి ఖాళీ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు జాతీయ దీవుల కార్యాచరణ ప్రణాళిక కింద ప్రభుత్వ గ్రాంటు చెల్లిస్తామని వెల్లడించారు. చదవండి లాఠీ పట్టుకుని బోర్ కొట్టిందేమో! ఏకంగా గరిట పట్టుకుని.. -
గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీస్కు రప్పించడానికి కొత్త ఎత్తుగడ!
మండే వేసవిలో లగ్జరీ ఏసీ హోటల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడకుండా ఉంటారు? ఆఫీస్కి వెళ్లేందుకు చెమటలు కక్కుతూ ప్రయాణించాల్సిన పనిలేదు. ఆఫీస్ క్యాంపస్లోని హోటల్లోనే మకాం. అయితే ఈ ఆఫర్ గూగుల్ ఉద్యోగులకు మాత్రమే. వర్క్ ఫ్రం హోమ్కి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్కు రప్పించడానికి గూగుల్ వేసిన కొత్త ఎత్తుగడ ఇది. గూగుల్ ఫుల్టైమ్ ఉద్యోగులు క్యాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని క్యాంపస్ హోటల్లో ఒక రోజుకు 99 డాలర్లకే రూమ్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సమ్మర్ స్పెషల్ ఆఫర్ అంటూ దీన్ని పేర్కొన్నట్లు ‘సీఎన్బీసీ’ నివేదించింది. గూగుల్ ఉద్యగులు హైబ్రిడ్ వర్క్ప్లేస్కి మారడాన్ని సులభతరం చేసేలా సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అమలు అవుతుంది. అయితే హోటల్లో బస చేసేందుకు అయ్యే మొత్తాన్ని తమ పర్సనల్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఉద్యోగులే భరించుకోవాలి. ఆ మొత్తాన్ని కంపెనీ రీయింబర్స్ చేయదు. ఎందుకంటే ఇది అన్అప్రూవ్డ్ బిజినెస్ ట్రావెల్ కిందకు వస్తుందని కంపెనీ పేర్కొంది. ఉదయం హడావుడిగా ఆఫీసుకు రావాల్సిన పని లేదు. ఓ గంట ఎక్కువగా నిద్ర పోవచ్చు. మధ్యలో రూమ్కి వెళ్లి బ్రేక్ఫాస్ట్ లేదా వర్కవుట్ చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ పూర్తయ్యాక హోటల్ టాప్ డెక్కి వెళ్లి ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని ఆస్వాదించవచ్చు అంటూ ఈ ఆఫర్కు సంబంధించిన ప్రకటన చెబుతోంది. గూగుల్ యాజమాన్యంలోని ఈ హోటల్ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గత సంవత్సరం ప్రారంభించిన కొత్త క్యాంపస్లో ఉంది. 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్కు ఆనుకుని ఉంది. ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న 4,000 మంది ఉద్యోగులకు ఇక్కడ వసతి కల్పించే సామర్థ్యం ఉందని దీని ప్రారంభం సందర్భంగా కంపెనీ పేర్కొంది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా ఉంటాయి. చాలా టెక్ కంపెనీల కార్యాలయాలతో పాటు టెక్ పరిశ్రమ ఉద్యగులు ఇక్కడ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడున్న కార్పొరేట్ కార్యాలయాలు చాలా గూగుల్ యాజమాన్యంలోనివో లేకుంటే లీజ్కు తీసుకున్నవో ఉంటాయి. కంపెనీకి చెందిన హోటళ్లలో ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు తరచూ ఇస్తుంటామని గూగుల్ ప్రతినిధి తెలిపారు. Google Jobs Cut 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గూగుల్.. వాళ్లు చేసిన పాపం ఏంటంటే.. -
ఆఫర్ అంటే ఇది.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే టమాటాలు ఫ్రీ!
చెన్నై: సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రమైన ఆఫర్లతో పాటు బోలెడు డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. ఏదేమైనా మార్కెట్లో పోటీని తట్టుకుని ముందుకు సాగాలనుకుంటున్నాయి. అందుకే మార్కెటింగ్ పరంగా ట్రెండింగ్ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి కొన్ని సంస్థలు. ప్రస్తుతం టమాటా ఊహించని ధర పలుకుతూ అందరికీ షాకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ దేశీయ విమాన సంస్థ తమ వద్ద ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వారికి టమాటాలు ఫ్రీ అంటూ ఆఫర్ను ప్రకటించాయి. మదురైలో దేశీయ విమాన టిక్కెట్ బుకింగ్కు కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటింంది. వివరాలు.. తమిళనాడులో టమాటా ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు టమాటాలను పంపిణీ చేస్తోంది. ఈ స్థితిలో మదురైలోని ఓ ట్రావెల్ సంస్థ ఇక్కడ విమాన టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటన విడుదల చేసింది. డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్కు కిలో టమాట, విదేశీ విమానాలకు 1.5 కిలో ఉన్నట్లు పేర్కొంది. కాగా కొత్త ఆఫర్కు ప్రయాణికుల నుం మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
అమ్మవారికి నిమ్మకాయ దండలెందుకు వేస్తారు?
అమ్మవారికి నిమ్మకాయల దండలెందుకు వేస్తారు? గుమ్మడి కాయను ఎందుకు బలి ఇస్తారు?..నిజానికి మాములు రోజుల్లోనే కాదు బోనాలప్పుడూ, కొన్ని ప్రత్యేక పండుగల్లో అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పించడం, నిమ్మకాయల దండలు వేసి అర్చించడం వంటివి చేస్తాం . ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు ? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది. మనమొకసారి పరిశీలిస్తే, లక్ష్మీ దేవికి , సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండాలు వేసే ఆచారం కనిపించదు . కానీ శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది. శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది . నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. లయకారుని శక్తి కదా అమ్మవారు. కాలస్వరూపమై, దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది. దేవి సత్వ స్వరూపమే అయినా సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవీ స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా, రాత్రిపూట నగర సంచారం / గ్రామ సంచారం చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తారు . అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. శిరస్సుకి ప్రతిగానే ఈ కూష్మాండం.. "కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం". వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా ! రాజులు మాంసాహారాన్ని, బ్రాహ్మణులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాఖాహారాన్ని తీసుకుంటారు . మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె ‘బలిప్రియ’. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సుకి ప్రతీక కూష్మాండం (గుమ్మడికాయ ). అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ‘ఓ బలిదానమా ! నా భాగ్యమువలన కూష్మాండ రూపంలో ఉన్నావు (గుమ్మిడికాయ రూపంలో ). అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి, నా ఆపదలను నశింపజేయి’. అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. అదేవిధంగా నిమ్మకాయ దండలని సమర్పించడము కూడా ! రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి, శాంతిస్తారని చెబుతారు. అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు. కానీ ఈ సంప్రదాయాన్ని ఇళ్ళల్లో చేసుకొనే పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి . ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో వాడకపోవడం మంచిది. ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే, మీరు తయారు చేసి, గుడిలో ఉన్న దేవతకి సమర్పించి, మీ పేరిట అర్చన చేయించుకొని, అక్కడ చేసిన అర్చనలో నుంచి నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధానికి, వాహనానికి కట్టుకోండి. దానివలన దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. శత్రుపీడలు నివారించబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి . దుష్టశక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదు.!! (చదవండి: జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?) -
హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ఫోన్!
తక్కువ ధరకు కొత్త బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ అద్భుతమైన డీల్ ఉంది. ప్రముఖ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) స్మార్ట్ ఫోన్ అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్లు ఇవీ... ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ ఫోన్పై 29 శాతం భారీ తగ్గింపు అందిస్తోంది. ఏడాది క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ.16,999 కాగా ఫ్లిప్కార్ట్లో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంకు డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే మరింపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.11,450 వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్, అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును వినియోగిస్తే 5 శాతం తగ్గింపు అదనంగా లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫీచర్స్ 6.6 అంగులాల డిస్ప్లే. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరా, 50 ఎంపీ మెయిన్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్లు -
మా ఆర్మీకి శిక్షణ ఇవ్వండి
మిన్స్క్: రష్యాలో స్వల్పకాలిక తిరుగుబాటు విఫలయత్నం అనంతరం తమ దేశానికి చేరుకున్న వాగ్నర్ గ్రూప్నకు బెలారస్ అధ్యక్షుడు ఓ ఆఫర్ ఇచ్చారు. తమ దేశ మిలటరీకి శిక్షణ ఇవ్వాలంటూ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ను అధ్యక్షుడు లుకషెంకో కోరారు. ‘ఇక్కడికి వచ్చి మన సైన్యానికి యుద్ధ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని వాగ్నర్ గ్రూప్ను కోరాం. వారి అనుభవం మాకెంతో అవసరం’అని ఆయన అన్నట్లు అధికార వార్తా సంస్థ బెల్టా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పోరాడుతూ సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్న వాగ్నర్ గ్రూప్ను పశి్చమదేశాలు ద్వేషిస్తున్నాయన్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి స్థాయిలో ప్రపంచ సైనిక–రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోందని హెచ్చరించారు. దీనిని పరిష్కరించడానికి చర్చల అవసరాన్ని పశి్చమదేశాలు గుర్తించడం లేదని విమర్శించారు. పోలెండ్ మరో ఉక్రెయిన్ మాదిరిగా మారబోతోందని, ఆ దేశానికి ఈయూ, అమెరికా ఆయుధాలు అందిస్తున్నాయని ఆరోపించారు. -
ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్!
Oppo Reno 8 5G: సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్స్, 5జీ నెట్వర్క్కు సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నవారికి ఫ్లిప్కార్ట్ ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద రూ. 38,999 విలువైన 'ఒప్పో రెనొ 8 5జీ' సరసమైన ధరలోనే కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో ఒప్పో కంపెనీ విక్రయిస్తున్న అత్యుత్తమ మొబైల్ ఫోన్స్లో ఒకటి 'రెనొ 8 5జీ'. ఇది దేశీయ విఫణిలో 2022 జులైలో విడుదలైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ లేదా 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్లో లభిస్తుంది. 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే కలిగిన ఈ మొబైల్ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనో క్రోమ్ కెమెరా పొందుతుంది. సెల్ఫీలు లేదా వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 4500 mAh. (ఇదీ చదవండి: జీతగాడి స్థాయి నుంచి స్టార్ హీరోలకు మేనేజర్గా.. బిజినెస్తో కోట్ల సంపాదన - సాధారణ వ్యక్తి సక్సెస్ స్టోరీ!) అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి.. 5జీ నెట్వర్క్తో లభిస్తున్న ఈ స్మార్ట్ఫోన్ మీద ఫ్లిప్కార్ట్ రూ. 29,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే దీనిని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ: లాంచింగ్ ఆఫర్ ముగుస్తోంది!
శాంసంగ్కు చెందిన టాప్ ప్రీమియం స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్54 5 జీపై భారీ తగ్గింపు లభిస్తోంది. గెలాక్సీ ఎఫ్ సిరీస్లోఇటీవల లాంచ్ అయిన ఈ స్మార్ట్ఫోన్ ఇపుడు ఫ్లిప్కార్ట్లో ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. మెటోర్ బ్లూ ,స్టార్డస్ట్ సిల్వర్ రెండు రంగులలో లభిస్తుంది. ఐదు సంవత్సరాల వరకు భద్రతా అప్డేట్స్, అలాగే తాజా ఫీచర్లు, మెరుగైన భద్రత ఉంటుందని కంపెనీ భరోసా ఇస్తోంది. గెలాక్సీ ఎఫ్54 5జీ స్పెసిఫికేషన్స్ 6.7అంగుళాల sAMOLED+ డిస్ప్లే Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 8జీబీర్యామ్ , 256 జీబీ స్టోరేజ్ ఐకానిక్ గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్ 108 ఎంపీ నో షేక్ కెమెరా, 8+2 ఎంపీ లెన్స్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000mAh బ్యాటరీ, 25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ ఫ్లిప్కార్ట్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్,ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్లపై రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్లతో సహా, గెలాక్సీ ఎఫ్54 5జీ ధర రూ. 27,999లకే కొనుగోలు చేయవచ్చు. జూన్ 20వరకే ఈ ఆఫర్అందుబాటులో ఉంటుంది. -
'కాంగ్రెస్లో చేరడం కంటే.. బావిలో దూకి చావడం మేలు'
నాగ్పూర్:కాంగ్రెస్లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్లో చేరవలసిందిగా దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ కోరినప్పుడు తాను ఈ మేరకు ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేసిన పనికంటే బీజేపీ 9 ఏళ్లలోనే రెండింతల పని చేసినట్లు చెప్పారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై మహారాష్ట్రలోని బాంధ్రాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. ఈ క్రమంలో తన రాజకీయ జీవతం తొలినాళ్ల నాటి విషయాలను పంచుకున్నారు. అయితే..గడ్కరీ రాజకీయ జీవితం అంతా ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉంది. ఏబీవీపీ నుంచి విద్యార్థి నాయకునిగా మొదలైన ఆయన ప్రస్థానం ఆర్ఎస్ఎస్ విలువలతో రాజకీయ జీవితం ప్రారంభమైంది. పార్టీ కోసం నిజాయితిగా కష్టపడి పనే చేసే కార్యకర్తగా నితిన్ గడ్కరీ మంచి పేరు సంపాదించుకున్నారు. 'మనదేశ ప్రజాస్వామ్య చరిత్రను మర్చిపోవద్దు. గతం నుంచి మనం నేర్చుకోవాలి. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో గరీబి హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది. కానీ నెరవేర్చలేకపోయింది. స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసింది.'అని గడ్కరీ అన్నారు. దేశాన్ని అసలైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ సఫలుడయ్యాడని కొనియాడారు. ఇదీ చదవండి:ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు.. -
సూపర్ ఆఫర్.. డబ్బులు లేకుండా ఓయో రూమ్!
హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో (OYO) భారతీయ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. స్టే నౌ పే లేటర్ (SNPL) సౌకర్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ-కామర్స్ వెబ్సైట్లు, రిటైల్ షాపులు ఇలాంటి బై నౌ పే లేటర్ ఆఫర్లను అందిస్తుంటాయి. ఆఫర్ వివరాలు SNPL సౌకర్యం కింద కస్టమర్లకు రూ. 5,000 వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తారు. 15 రోజుల బస తర్వాత మొత్తాన్ని సెటిల్ చేయాలి. ఈ ఫీచర్ కోసం క్రెడిట్ ఆధారిత చెల్లింపుల సేవ అయిన Simplతో ఓయో భాగస్వామ్యం కలిగి ఉంది. ఓయో యాప్ హోమ్ స్క్రీన్పై ఈ ఫీచర్ని యాక్సెస్ చేయవచ్చు లేదా చెల్లింపు మోడ్ ఎంపిక సమయంలో Simplని ఎంచుకోండి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఈ SNPL ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఓయో గ్లోబల్ సీవోవో, చీఫ్ టెక్నాలజీ & ప్రోడక్ట్ ఆఫీసర్ అభినవ్ సిన్హా చెప్పారు. Simpl ద్వారా హోటల్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు 65 శాతం వరకు తగ్గింపుతోపాటు రూ. 50 క్యాష్బ్యాక్ను లభిస్తుంది. అయితే Simpl యాప్లో చెల్లింపును 15 రోజులకు మించి ఆలస్యం చేస్తే, మీ బిల్లు మొత్తాన్ని బట్టి వడ్డీ, రూ. 250 వరకు ఆలస్య రుసుముతోపాటు జీఎస్టీని విధిస్తుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
46 శాతం డిస్కౌంట్తో ప్రీమియం మొబైల్.. ఇలా చేస్తే మీ సొంతం!
Xiaomi 12 Pro: మార్కెట్లో అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ల జాబితాలో 'షావోమి 12 ప్రొ' (Xiaomi 12 Pro) ఒకటి. ఈ మొబైల్ ఇప్పుడు ఏకంగా 46 శాతం డిస్కౌంట్తో సరసమైన ధరకే లభిస్తుంది. ఈ లేటెస్ట్ మొబైల్ని అందుబాటు ధరకు ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో సేవింగ్స్ డేస్ సేల్స్లో భాగంగా షావోమి 12 ప్రొ మొబైల్ 46 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సేల్స్లో కేవలం ఈ మొబైల్ ఫోన్ మీద మాత్రమే కాకుండా.. ఇతర ప్రీమియం స్మార్ట్ఫోన్స్, బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మీద కూడా ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కలిగిన షావోమి 12 ప్రొ 5జీ ఫోన్ అసలు ధర రూ. 79999. అయితే డిస్కౌంట్ పొందిన తరువాత ఇది రూ. 42,499కే లభిస్తుంది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. అన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫోన్ 5జీ నెట్వర్క్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ సెట్ అమర్చారు. 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.72 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే, అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. (ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!) షావోమి 12 ప్రొ కొనాలనుకునే వారు HDFC క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా మంచి కండిషన్లో ఉన్న మొబైల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. దాదాపు రూ. 80వేల మొబైల్ సగం ధరకే కొనుగోలు చేయడానికి తప్పకుండా ఈ కండిషన్స్ పాటించాలి. -
మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ!
ఆఫర్లంటే ఇష్టపడని వారుండరు. అందుకే కంపెనీలు, రెస్టారెంట్లు సైతం డిస్కౌంట్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. ఓ రెస్టారెంట్ యజమాని వినూత్నమైన ఆఫర్తో కస్టమర్ల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఇలాంటి ఆఫర్ ప్రకటించినందుకు కొంత మంది తిట్టుకుంటున్నారు కూడా. అసలు ఈ రెస్టారెంట్ కథేంటంటే... అమెరికాలో హార్ట్ ఎటాక్ గ్రిల్ అనే రెస్టారెంట్ ఉంది. హాస్పిటల్-థీమ్ సర్వీస్ కారణంగా ఈ రెస్టారెంట్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో వెళ్లి చూస్తే అచ్చం ఆసుపత్రిలానే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వంట చేసేవాళ్లు, వడ్డించేవారు డాక్టర్లు, నర్సుల్లా తెల్లకోటు ధరించి ఉంటారు. మగవారైతే డాక్టర్లుగా, ఆడవారు నర్సుల్లా పనిచేస్తుంటారు. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ రెస్టారెంట్లో తినాలనుకుంటే కస్టమర్లు సైతం పేషంట్లలా తయారవ్వాలి. హార్ట్ ఎటాక్ గ్రిల్లోని మెనూలోకి వస్తే, ఇందులో కూడా క్వాడ్రపుల్ బైపాస్ బర్గర్ల వంటి పేర్లుతో కనిపిస్తాయి. ఇటీవల ఈ రెస్టారెంట్ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది 158 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవారికి ఉచితంగా రుచికరమైన ఆహారాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. ఇంకేముందు లావుగా ఉన్నవాళ్లు డైటింగ్ పక్కన పెట్టి ఇందులో ఈటింగ్ మొదలుపెట్టారు. బంఫర్ ఆఫర్ను వదులుకోలేక ఆమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రెస్టారెంట్కి వెళ్లి లాగించేస్తున్నారు.ఈ తరహా ఆఫర్లను ఇవ్వడమంటే అది ఊబకాయాన్ని ప్రోత్సహించడమేనని కొందరు భావించారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ వారి జీవితాలను రిస్క్లో పెడుతున్న ఈ రెస్టారెంట్ను మూసివేయాలని ట్విటర్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నెట్టింట ఈ రెస్టారెంట్పై ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి. ఇంత జరుగుతన్నా ఈ రెస్టారెంట్ కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చదవండి: ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్! -
అదో పెద్ద స్కామ్ అనుకున్నా.. తీరా చూస్తే: ఏజెంట్ హీరోయిన్
అఖిల్ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఈ చిత్రంలో హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తోంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది తెలుగులో నా తొలి సినిమా అని.. మంచి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు సాక్షి వైద్య. సాక్షి వైద్య మాట్లాడుతూ .. 'వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్ని. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను. అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్’ ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్ ఛాన్స్ గురించి చెప్పారు. ఈ ఆఫర్ను నేను మొదట్లో స్కామ్ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బేనర్ అని, పెద్ద దర్శకుడు, పెద్ద స్టార్ అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. ‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను' అని అన్నారు. -
ఐఫోన్14 ప్లస్పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపు!
యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ (Apple iPhone 14 Plus)పై ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపుతో అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ భారతదేశంలో రూ. 89,999 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దీనిపై రూ.12,000 ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అదనం. యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ 89,999 ఉండగా ఫ్లిప్కార్ట్లో ఇది ఇప్పుడు భారీ తగ్గింపుతో రూ.77,999లకే అందుబాటులో ఉంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల విషయానికొస్తే, పాత మోడల్ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ. 29,500 వరకు పొందవచ్చు. ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్.. విండోస్ కంప్యూటర్కు కనెక్ట్ చేసుకోవచ్చు! ఇక రూ. 99,900 ఉన్న 256GB వేరియంట్ ఫోన్ రూ. 87,999లకే కొనుక్కోవచ్చు. రూ. 1,19,900 ధర ఉన్న 512GB వేరియంట్ రూ. 1,07,900లకే అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 14 ప్లస్ పర్పుల్, స్టార్లైట్, మిడ్నైట్, బ్లూ, ప్రొడక్ట్ (రెడ్), ఎల్లో కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్14పైనా తగ్గింపు రూ. 79,999 ధరతో ప్రారంభమైన యాపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 71,999లకే అందుబాటులో ఉంది. అంటే రూ. 8,000 డిస్కౌంట్. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు పరిమాణం మినహా యాపిల్ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. రెండూ A15 బయోనిక్ చిప్సెట్తో 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్నాయి. కెమెరా పరంగా ఐఫోన్14, ఐఫోన్14 ప్లస్ 12MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: ఊరిస్తున్న కార్లు వచ్చేస్తున్నాయి.. మే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. -
ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు!
ప్రత్యేకంగా యాపిల్ ప్రీమియమ్ ఉత్పత్తులను విక్రయించే దేశంలోని ప్రముఖ రీసెల్లర్ కంపెనీ మాపుల్ (Maple) అక్షయ తృతీయ సందర్భంగా ఐఫోన్ 14 (iPhone 14)పై ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో ఐఫోన్ 14 కొంటే రూ.21,000 తగ్గింపు పొందవచ్చు. లేదా నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్తో ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! ప్రస్తుతం ఐఫోన్ 14 512 GB ధర రూ. 1,09,900 ఉంది. కానీ మాపుల్లో రూ.11,000 తగ్గింపుతో పాటు హెడ్ఎఫ్సీ క్యాష్బ్యాక్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000 మొత్తంగా రూ. 21,000 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 14 128జీబీ, 256 జీబీ వేరియంట్లపైనా కూడా 10 శాతం మాపుల్ డిస్కౌంట్, హెచ్డీఎఫ్సీ క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్లను పొందవచ్చు. ఇదీ చదవండి: నెట్ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు ఇక ఈఎంఐపై ఫోన్ కొనాలనుకుంటున్నవారి కోసం కూడా ప్రత్యేక ఆఫర్ను మాపుల్ కల్పిస్తోంది. బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్తో ఐఫోన్ 14ను అందిస్తోంది. ముంబై, మంగళూరులో స్టోర్లను కలిగి ఉన్న మాపుల్ దేశమంతటా ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది. 5 లక్షల మందికిపైగా కస్టమర్లను కలిగి ఉంది. లేటెస్ట్ ఐఫోన్లు, మాక్బుక్లు, ఐపాడ్లు, యాపిల్ వాచ్లపై ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి సమీపంలోని మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో maplestore.in ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్ను ప్రారంభించిన టిమ్కుక్ -
గుడ్ ఫ్రైడే ఆఫర్: రూ.1500కే నథింగ్ ఫోన్ (1)
సాక్షి,ముంబై: గుడ్ ఫ్రైడే రోజున ఫ్లిప్కార్ట్ సేల్లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ నథింగ్ ఫోన్ (1) పై భారీ ఆఫర్ లభిస్తోంది. యూకే ఆధారిత కార్ల్ పీ నేతృత్వంలోని వినియోగదారు టెక్ కంపెనీ త్వరలో ఫోన్ (2)ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నందున నథింగ్ ఫోన్ డిస్కౌంట్ ధరలో లభించనుంది. సేల్స్లో దూసుకుపోతున్న నథింగ్ ఫోన్ (1) గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫ్లిప్కార్ట్ సేల్లో కేవలం రూ. 1,500కే అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సేల్లో గుడ్ ఫ్రైడే రోజున రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 29,999కి లిస్ట్ చేయబడింది. దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై 5శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. దీంతో స్మార్ట్ఫోన్ ధర రూ.28,500కి తగ్గింది. దీంతోపాటు పాత స్మార్ట్ఫోన్కు బదులుగా ఫ్లిప్కార్ట్ రూ. 27,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా నథింగ్ ఫోన్ (1) ధరను రూ. 1,500కి దిగొచ్చింది. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) నథింగ్ ఫోన్ (1) లాంచింగ్ ప్రైస్. రూ. 32,999 నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు 6.55-అంగుళాల OLED డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ 120Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా సెటప్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా అపరిమిత డేటా ఆఫర్ను ప్రకటించింది. రూ.599 నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లు ఉచిత కాల్స్, అపరిమిత 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందుకోవచ్చు. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్తోసహా మరిన్ని యాప్స్ను ఉచితంగా పొందవచ్చు. అలాగే జియో వెల్కమ్ ఆఫర్ కింద అర్హత కలిగిన వినియోగదార్లకు అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ప్రీపెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్కు మారాలనుకొనే వారికి, కొత్త కస్టమర్లకు జియో 30 రోజుల ఉచిత ట్రయల్ని ఆఫర్ చేస్తోంది. -
ఓలా స్కూటర్లపై భారీ తగ్గింపు... ఆఫర్ ఒక్క రోజే!
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా..అయితే మీకో అదిరిపోయే ఆఫర్. పాపులర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను సగం ధరకే సొంత చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆఫర్ విద్యార్థులకు, ఉద్యోగులకు మాత్రమే.. అది కూడా మార్చి 31 ఒక్క రోజు మాత్రమే. (బంగారం కొనేవారికి అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. మరి పాత బంగారం సంగతేంటి?) విద్యార్థులు, ఉద్యోగులు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ.61,999, ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) స్కూటర్ను రూ. 69,999 లకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ మార్చి 31 తర్వాత అందుబాటులో ఉండదు. వాస్తవంగా ఓలా ఎస్1 ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,900. అలాగే ఎస్1 ప్రో ధర రూ. 1,39,999. ఈ డీల్ 5.99 శాతం వడ్డీతో నెలకు రూ. 2,199 నో కాస్ట్ ఈఎంఐలో లభిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఓలా ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఎస్1 స్కూటర్పై రూ. 3,000, అలాగే ఎస్1 ప్రో స్కూటర్పై రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. ఇవి మాత్రమే కాక రూ. 10,000 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. (ఐఫోన్లకు కొత్త అప్డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!) ఈ ఆఫర్ను పొందడానికి విద్యార్థులు, ఉద్యోగులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు (ID)లో ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించాలి. అక్కడ కొనుగోలుదారులకు ఆఫర్ నిబంధనలు, షరతుల గురించి తెలియజేస్తారు. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) -
రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్!
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులో ఉంది. అదే ‘గెట్ 1’ ఎలక్ట్రిక్ స్కూటర్. అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంఆర్పీ రూ.65,999గా ఉండగా దీన్ని ఇప్పుడు రూ. 38 వేలకే కొనుక్కోవచ్చు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! రూ.65,999 ఎంఆర్పీ ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను కంపెనీ ప్రస్తుతం భారీ డిస్కౌంట్తో రూ. 43,499లకే అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా మరో ఆఫర్ కూడా ఉంది. రూ. 5 వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 38 వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. కళ్లు చెదిరే ఫీచర్స్ గెట్ 1’ ఎలక్ట్రిక్ స్కూటర్లో 48వీ 13 ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ కిలోమీటరు వెళ్లేందుకు అయ్యే ఖర్చు 10 పైసలు మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఈబేబికార్ట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. ఆన్లైన్ కొనుగోలుపై సందేహం అక్కర్లేదు. 7 రోజుల రిటర్న్ పాలసీ ఉంటుంది. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 35 కిలోమీటర్లు. 130 కేజీల వరకు లోడింగ్ కెపాసిటీ ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్, 250 వాట్ 48 వోల్ట్ బీఎల్డీసీ హబ్ మోటార్ ఇందులో ఉన్నాయి. ఫ్రంట్, రియర్ బ్రేక్ సెన్సార్లు, బ్యాటరీ ఇండికేటర్ ఆకట్టుకుంటున్నాయి. ట్యూబ్లెస్ టైర్లు, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సెక్యూరిటీ లాక్ వంటివి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ఫుల్గా చార్జింగ్ చేసేందుకు 6 నుంచి 7 గంటలు పడుతుంది. -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!
సాక్షి,ముంబై: శాంసంగ్ కొత్త 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 5nm ప్రాసెసర్ , 6000 mAh బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్ఫోన్ను ఈరోజు (మార్చి 24) భారత మార్కెట్లో విడుదల చేసింది. 5జీ సెగ్మెంట్లో మాత్రమే వస్తోంది. ఈ కనెక్టివిటీ కోసం 13 బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందీ మొబైల్. అలాగే Exynos 1330 చిప్సెట్తో వస్తుందని, ఇందులోన బిగ్ బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పరిచయ ఆఫర్గా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీను ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్ల కొనుగోళ్లపై 4 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ కోసం రూ. 12,990, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,490కే అందిస్తోంది. మార్చి 30 మధ్యాహ్నం 12 గంటలనుంచి సేల్ మొదలవుతుంది. ఫ్లిప్కార్ట్, శాంసంగ్ తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో త్రి కలర్స్లో అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్పెసిఫికేషన్స్ 6.6-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, Android 13 ఆధారంగా One UI 5 50ఎంపీ ప్రధాన కెమెరా 2MP మాక్రో కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా . 6000 mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అతేకాదు గరిష్టంగా 2 తరాల OS అప్గ్రేడ్లను 4 సంవత్సరాల వరకు భద్రతా అప్డేట్లను అందిస్తుంది. ఫైనాన్షియల్ అప్లికేషన్లు, వ్యక్తిగత ఐడీలు, ఇతర రహస్య పత్రాలను స్టోర్ చేసుకునేందుకు ఆల్-ఇన్-వన్ అప్లికేషన్ వాయిస్ ఫోకస్ ఫీచర్ , Samsung Walletకి మద్దతు కూడా ఉంది. -
గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్.. కానీ
ఇటీవల కాలంలో ఆపిల్ ఐఫోన్ను ఉపయోగించడానికి దాదాపు అందరూ ఆసక్తి చూపుతారు. అయితే ధర ఎక్కువగా ఉన్న కారణంగా చాలామంది కొనుగోలు చేయలేకపోతారు. అయితే అలాంటి వారికోసం కంపెనీ ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇప్పుడు యాపిల్ మొబైల్ కొనాలనుకునే వినియోగదారులు రూ. 22,999 చెల్లించి ఫ్లిప్కార్ట్లో 'ఐఫోన్ 12 మినీ' కొనుగోలు చేయవచ్చు. నిజానికి ఈ మొబైల్ ధర రూ. 59,900. క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కావున రూ. 49,999కే లభిస్తుంది. అదే సమయంలో ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 27,000 తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ బ్రాండ్, స్థితి వంటి వాటిమీద ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి. కంపెనీ తెలిపిన అన్ని షరతులను మీరు పాటిస్తే రూ. 22,999తో యాపిల్ ఫోన్ని సొంతం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: Volkswagen ID.2all EV: ఫోక్స్వ్యాగన్ నుంచి రానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇదే) ఆపిల్ ఐఫోన్ 12 మినీ 5.4 ఇంచెస్ సూపర్ రెటీనా XDE డిస్ప్లే కలిగి, IP68 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ పొందుతుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్ A 14 బయోనిక్ చిప్సెట్, 64 GB ఇంటర్నల్ మెమరీ వంటివి పొందుతుంది. కంపెనీ ఈ మొబైల్ మీద ఆరు నుంచి ఏడు సంవత్సరాల సెక్యూరిటీ, ఇతర అప్డేట్లను అందిస్తుంది. -
ఒక ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ.. అరెస్ట్
క్రైమ్: స్మార్ట్ఫోన్ కొంటే బీర్లు ఫ్రీ అని అనౌన్స్ చేశాడు. ఊరంతా పోస్టర్లు అంటించి.. పాంప్లెట్స్ పంచాడు. ఆ ప్రకటనతో ఒక్కసారిగా ఆ సెల్ఫోన్ దుకాణం ముందు జనం ఎగబడ్డారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పాటు అక్కడ రచ్చ రచ్చ చేశారు. ఇది కాస్త పోలీసుల దాకా చేరింది. రంగ ప్రవేశం చేసి ఆ బంపరాఫర్ ప్రకటించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. యూపీ భదోహిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చౌరీ రోడ్లో రాజేశ్ మౌర్య అనే వ్యక్తి సెల్ఫోన్ల షాప్ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తన దుకాణంలో మార్చి 3 నుంచి 7వ తేదీల మధ్య సెల్ఫోన్ కొంటే రెండు బీర్ క్యాన్లు ఇస్తానని ప్రకటించాడు. సెంటర్లలో పోస్టర్లు అతికించి, పాంప్లెట్స్ పంచాడు. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. ట్రాఫిక్కు విఘాతం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. ఐపీసీ సెక్షన్ 151 (ప్రజాశాంతికి విఘాతం కలిగించడం) నేరం కింద మౌర్యను అరెస్ట్ చేసి, దుకాణాన్ని సీల్ చేశారు. -
స్టార్ హీరో మూవీ టికెట్స్పై బంపరాఫర్.. ఆ మూడు రోజులే..!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. ఈ ఏడాది జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలు పో షించగా, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా కీ రోల్స్ చేశారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్తో యశ్రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించారు. తాజాగా ఈ చిత్రబృందం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సినీ ప్రియుల కోసం యశ్రాజ్ ఫిలింస్ సంస్థ క్రేజీ ఆఫర్ను ప్రకటించింది. ఈ సినిమా టికెట్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ ఆఫర్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వర్తిస్తుందని పేర్కొంది. పఠాన్ సెలబ్రేషన్స్ పేరిట ఈ ఆఫర్ను ప్రకటించింది చిత్రబృందం. పఠాన్ కోడ్ ఉపయోగించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 3, 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది అయితే ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్ కింద టికెట్లను కేటాయించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు పఠాన్ మూవీ చూడని వారు క్రేజీ ఆఫర్తో ఎంచక్కా థియేటర్లలో చూసేయొచ్చు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) -
పెండింగ్ చలాన్లపై 50శాతం డిస్కౌంట్.. ఒక్కరోజే రూ.5.6 కోట్లు వసూలు..
బెంగళూరు: వాహనదారులు పెండింగ్ చలాన్లు కట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన 50 శాతం డిస్కౌంట్ వర్కవుట్ అయింది. ఆఫర్ ప్రకటించిన మరునాడే వాహనదారులు ఎగబడ్డారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి తమ పెండింగ్ చలాన్లు కట్టారు. దీంతో శుక్రవారం ఒక్క రోజే రూ.5.6 కోట్లు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలో మొత్తం రూ.530 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనాదారులు కట్టాల్సి ఉంది. ఇందులో కేవలం బెంగళూరుకు చెందినవారే రూ.500కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఫలితంగా వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. బెంగళూరులో చలాన్లు పెండింగ్ ఉన్నవారు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి లేదా వెబ్సైట్, పేటీఎం ద్వారా చెల్లింపులు జరపవచ్చని అధికారులు తెలిపారు. 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఫిబ్రవరి 11 వరకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో వచ్చే వారం రోజులు కలెక్షన్లు భారీగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చదవండి: సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు.. -
‘కేసు వాపస్ తీసుకుంటే నెలకి రూ.1 కోటి ’.. మహిళా కోచ్ సంచలన ఆరోపణ
చండీగఢ్: హరియాణా క్రీడాశాఖ మంత్రి సందీప్సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన జూనియర్ మహిళా అథ్లెటిక్ కోచ్ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కేసు వాపసు తీసుకోవాలని లేదంటే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తాను చావుకు భయపడనని, సందీప్ సింగ్కు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తనను దేశం విడిచి వెళ్లిపోవాలని, అందుకు నెలకి రూ.1 కోటి చొప్పున ఇస్తామని బేరమాడినట్లు వెల్లడించారు. ‘నా నోరు మూయించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను చావుకు భయపడను. బెదిరింపులు వస్తున్నా వెనక్కి తగ్గను. నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నాకు నచ్చిన దేశానికి వెళ్లిపోతే నెలకి రూ.1 కోటి అందుతాయని ఆఫర్ చేశారు. నా ఫిర్యాదును వెనక్కి తీసుకుని, వేరే దేశానికి వెళ్లమని నన్ను అడిగారు. నాకు తెలుసు ఆయన(సందీప్ సింగ్) మంత్రివర్గం నుంచి తొలగించబడతాడు, జైలుకు వెళతాడు, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.’అని మహిళా కోచ్ తెలిపినట్లు ఏఎన్ఐ నివేదించింది. అలాగే.. ఈ కేసును హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం మాట్లాడారు సీఎం ఖట్టర్. క్రీడాశాఖ మంత్రిపై వచ్చిన లైంగిక ఆరోపణలు అంసబ్ధమైనవని, ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన దోషిగా మారడని స్పష్టం చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అథ్లెట్ మహిళా కోచ్కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా! -
ఇది కదా ఆఫర్ అంటే.. ఇలా చేస్తే, కేవలం రూ.1490లకే యాపిల్ ఎయిర్పొడ్స్!
యాపిల్ కంపెనీ.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. మార్కెట్లో తన ప్రాడెక్ట్లకు ఓ బ్రాండ్ పేరుతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకుంది ఈ కంపెనీ. అందుకే యాపిల్ మార్కెట్లోకి విడుదల చేసే ఏ ప్రాడెక్ట్కైన విపరీతమైన డిమాండ్తో పాటు కాస్త ఖరీదుగా ఉంటాయి. అయితే యాపిల్ ఎయిర్పోడ్స్ కొనాలని చూస్తున్న వారికి ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘ఇయర్ ఎండ్ సేల్’ రూపంలో అద్భుత అవకాశం అందిస్తోంది. తన కస్టమర్ల కోసం యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో (Apple AirPods pro) ని అద్భుతమైన ఆఫర్లో కేవలం రూ.1490 మీ సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం! ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో Apple AirPods pro ధర రూ. 20,990గా ఉంది. ఈ ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ యాపిల్కు ఉన్న బ్రాండ్, ఈ ఇయర్పోడ్స్ సౌండ్ క్వాలిటీ కూడా అదే స్థాయిలో ఉండడంతో దీనికి క్రేజ్ విపరీతంగా ఉంటుంది. అందుకే వీటి కొనుగోలు మ్యూజిక్ లవర్స్ ఎగుబడుతుంటారు. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా బంఫర్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. అదేంటంటే.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ పేమెంట్స్పై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ. 2000 తగ్గింపుతో మనకు రూ.18,990లకే లభిస్తుంది. వీటితో పాటు అదనంగా, కస్టమర్లు తమ పాత స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.17,500 వరకు అద్భుతమైన తగ్గింపు కూడా ఉంది. ఇంతటి భారీ తగ్గింపుతో అనంతరం మీరు ఈ ఇయర్పాడ్స్ని కేవలం రూ. 1,490కే కొనుగోలు చేయవచ్చు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎక్స్ఛేంజ్ విలువ పూర్తిగా కస్టమర్ల ఫోన్ కండీషన్పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ పరిమితం కాలం ఉంటుందని తెలుస్తోంది, కాబట్టి వెంటనే యాపిల్ ఇయర్పోడ్స్ని కొనుగోలు చేయాలనుకున్న వారు త్వరపడండి. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్ఫోన్పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే! -
న్యూ ఇయర్ ఆఫర్ అదరహో.. ఎయిర్టెల్ యూజర్లుకు 50జీబీ డేటా ఫ్రీ!
కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా పలు కంపెనీలు తమ కస్టమర్ల ఆకట్టుకునేందుకు ఆఫర్లును ప్రకటిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భారతీ ఎయిర్టెల్ తాజాగా న్యూ ఇయర్ ఆఫర్ను తీసుకొచ్చింది. ఎయిర్టెల్ వినియోగదారుల కోసం ఉచితంగా 50 జీబీ డేటా (Data) ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫ్రీ డేటా ఆఫర్ పొందాలనుకున్న కస్టమర్లు ఏం చేయాలంటే.. ఎయిర్టెల్ కంపెనీ కొత్త ఏడాదిని పురస్కరించుకుని వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకునే యూజర్లకు 5 జీబీ నుంచి 50 జీబీ డేటాను ఆఫర్ను అందిస్తోంది. వినియోగదారులు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. యాడ్స్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఇలా వివిధ రకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే.. ఎయిర్టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ను నెల రోజులు తీసుకుంటే వారి 5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రూ. 98కే ఈ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. 50 జీబీ డేటా ఉచితంగా పొందాలంటే మీరు ఏడాది వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని విలువ రూ. 301గా ఉంది. గమనించాల్సిన విషయం ఎంటంటే.. ఇక్కడ ఎవరైతే వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకే ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. చదవండి: వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. అక్కడ మాత్రం జాబ్ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయ్! -
న్యూ ఇయర్ క్రేజీ ఆఫర్.. అదిరే ఫీచర్లున్న ఈ రెడ్మీ 5జీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ఇండియా ఇటీవలే రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G) స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల సంగతి తెలిసిందే. తాజాగా తన కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్గా ఈ స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండు వేరియంట్లపై రూ.1,000 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం Mi.com, అమెజాన్ (Amazon)లో వెయ్యి రుపాయలు తగ్గింపు ధరతో... 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,999 ధరగా ఉంది. అంతకుముందు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. Redmi Prime 5Gలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది డిస్ప్లేలో వాటర్డ్రాప్-స్టైల్ డిస్ప్లే నాచ్ను కలిగి ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5వాట్ ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. పవర్ఫుల్ నైట్ విజన్, పోర్ట్రైట్ మోడ్, మూవీ ఫ్రేమ్, షార్ట్ వీడియో, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మెడో గ్రీన్, థండర్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ కలర్స్లో లభిస్తుంది. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్లు ద్వారా ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి ఈ హ్యాండ్సెట్ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,000 తగ్గింపు ఇస్తుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ల ద్వారా చేసిన కొనుగోళ్లకు 750 తక్షణ తగ్గింపు అందిస్తోంది. అమెజాన్ నుంచి ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.2,000 నుంచి ప్రారంభం అవుతుంది. -
బంఫర్ ఆఫర్: రూ.1497కే ఎంచక్కా గాల్లో ఎగిరిపోండి.. త్వరపడాలి!
దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా(AirAsia) న్యూ ఇయర్ సందర్భంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రాబోతున్న కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'న్యూ ఇయర్, న్యూ డీల్స్' పేరిట తమ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను కేవలం రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అమలులో ఉంటుందని, దీని కింద బుకింగ్ చేసుకున్న ప్యాసింజర్లు వచ్చే ఏడాది(2023) జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ ధర బెంగళూరు-కొచ్చి వంటి రూట్లతో పాటు, దాని నెట్వర్క్ అంతటా ఇదే విధమైన తగ్గింపు విక్రయ ఛార్జీలు ఉన్నట్లు తెలిపింది. కంపెనీ వెబ్సైట్, కంపెనీ మొబైల్ యాప్, ఇతర ప్రధాన బుకింగ్ ఛానెల్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. కొనసాగుతున్న లాయల్టీ ప్రయోజనాలలో భాగంగా, వెబ్సైట్, యాప్లో బుకింగ్ చేసే (నియో పాస్) NeuPass సభ్యులు కాంప్లిమెంటరీ ఫ్రూట్ ప్లాటర్, ప్రాధాన్యత చెక్-ఇన్, బ్యాగేజీ, బోర్డింగ్తో పాటు 8 శాతం నియో కాయిన్స్ (NeuCoins) వరకు కూడా పొందుతారు. మరోవైపు, ప్రముఖ సంస్థ ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. Bank your new year resolutions now! Ring in 2023 with our #NewYearNewDeals sale, with fares starting ₹1,497! Book till 25 Dec for travel till 15 Apr 2023 on https://t.co/QiptjwMRjT or the AirAsia India mobile app. pic.twitter.com/bEwWXFlcLY — AirAsia India (@AirAsiaIndia) December 23, 2022 -
బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్!
భారత్లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కొన్ని మొబైల్స్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లతో వస్తుంటాయి. తాజాగా ట్రాన్స్పరెంట్ లుక్తో లక్షల మందిని ఆకర్షించిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ నథింగ్ ఫోన్ (1) కూడా ఓ బంపర్ ఆఫర్ని తీసుకొచ్చింది. నథింగ్ బ్రాండ్ ఫౌండర్ కార్ల్ పి ఉచితంగా నథింగ్ ఫోన్ 1అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఫ్రీ ఆఫర్ దక్కించుకోవడం కోసం ట్విట్టర్లో నడుస్తున్న ఒక కాంటెస్ట్లో పాల్గొనాలని తెలిపారు. కాంటెస్ట్ అంటే ఏదో కష్టంగా ఉంటుంది అనుకుంటే మీరు పొరపడినట్లే. మీరు చేయాల్సిందల్లా కార్ల్ పీ ట్వీట్కు కామెంట్ చేయడమే. మీ కామెంట్కు ఎవ్వరూ లైక్ కొట్టకపోతే మీకు నథింగ్ ఫోన్ 1ను ఉచితంగా గెలుచుకోవచ్చు. అలాగే ఎక్కువ లైక్స్ పొందిన కామెంట్కు ఉచితంగా నథింగ్ స్మార్ట్ఫోన్ 1 లభిస్తుంది. ఇందులో విజేతలను 24 గంటల్లోగా ప్రకటించనున్నారు. దీని బట్టి చూస్తే ఇద్దరు ఉచితంగా నథింగ్ స్మార్ట్ఫోన్లు పొందే అద్భుత అవకాశమని అనుకోవచ్చు. అయితే ఈ కాంపిటీషన్ వినడానికి ఈజీగానే ఉన్న కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే ప్రతి కామెంట్కు లైక్స్ ఉన్నాయి. అందువల్ల ఉచితంగా స్మార్ట్ఫోన్ పొందటం కష్టమే అని చెప్పుకోవాలి. మరో వైపు ఎక్కువ లైక్స్ పొందిన వారికి కూడా ఫోన్ ఉచితంగా వస్తుంది. అందువల్ల ఎక్కువ లైక్స్ పొందే వారికి మాత్రం ఉచిత ఫోన్ పొందే అవకాశం ఉంది. భారత్లో నథింగ్ స్మార్ట్ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 27,499 (8GB RAM, 128GB స్టోరేజ్) నుంచి ప్రారంభమవుతుంది. 256GB స్టోరేజ్తో దాని మోడల్ ధర రూ. 30,499, టాప్-ఎండ్ మోడల్ 12GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ.33,499. మూడు వేరియంట్లు కొన్ని ఆఫర్లు, డీల్స్తో ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. చదవండి: బిలియనీర్కు భారీ షాక్.. ఒక్క రోజులో 63వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి! -
ఒక్క రోజే ఆఫీసుకు: మీషో మరోసారి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ఆన్లైన్ రిటైల్ స్టార్టప్ మీషో మరోసారి తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. రోజూ ఆఫీస్కు రావాల్సిందేనని ఆదేశిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మీషో వారానికి ఒక రోజు ఆఫీసుకు వస్తే సరిపోతుందని ప్రకటించింది. వారంలో ఒకరోజు ఆఫీసుకు రండి అంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది మీషో. వారంలో మిగతా రోజులు ఇంటినుంచే పని చేసు కోవచ్చని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది(2023) జూన్ నుంచి ఈ విధానం అమల్లో ఉంటుందని తెలిపింది. అప్పటివరకు మీషో ఉద్యోగులు ఎక్కడినుంచైనా పనిచేసుకోవచ్చు. మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బ్లాగ్ పోస్ట్లో మీషో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఫ్లెక్సీ-ఆఫీస్ అనేది వారానికి ఒకసారి ఆఫీసుకు, మిగతా రోజులు రిమోట్గా పనిచేస్తారని ఇది ఒక టీంగా ఉద్యోగులకు మధ్య సాన్నిహిత్యం పెరగడానికి తోడ్పడుతుందని చెప్పారు. ఇటీవలి సర్వేలో, మెజారిటీ ఉద్యోగులు తమ మధ్య వ్యక్తిగత కనెక్షన్ల అవసరం గురించి మాట్లాడారని అందుకే ఫ్లెక్సీ-ఆఫీస్ మోడల్ను అవలంబిస్తున్నట్లు తెలిపారు. కాగా మీషోలో మొత్తం1850 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 50 శాతం మంది బెంగళూరులో ఉన్నారు. మిగిలిన సిబ్బంది దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. తాజా నిర్ణయంతో ఇపుడు వారు బెంగళూరుకు మకాం మార్చాలి లేదా వారానికి ఒకసారి ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. -
ఇయర్ ఎండ్ ఆఫర్: ఆ కంపెనీ కార్లపై భారీ తగ్గింపు!
ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ని ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్గా తమ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్ని అందిస్తోంది. ఈ జాబితాలో న్యూ హోండా అమేజ్, జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం హోండా సిటీ, ఐదవ తరం సిటీ వంటి కొన్ని మోడళ్లపై రూ.72,340 వరకు తగ్గింపు అందిస్తోంది. కంపెనీ ప్రకటించిన ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లు, కస్టమర్ లాయల్టీ బోనస్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. హోండా అందిస్తున్న అద్భుతమైన ఈ ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం! హోండా అమేజ్ ►కొత్త హోండా అమేజ్ కారుపై రూ. 43వేల తగ్గింపు ప్రయోజనాలతో అందిస్తోంది. ► రూ. 10,000 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 12,144 వరకు FOC ఉపకరణాలను అందిస్తోంది. ► కొనుగోలుదారులు న్యూ హోండా అమేజ్పై ఎక్స్ఛేంజ్ బోనస్గా రూ. 20,000 పొందవచ్చు. ►అంతేకాకుండా, ఈ కారుపై రూ. 5000 కస్టమర్ లాయల్టీ బోనస్ , రూ. 6,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉంది. 5 జనరేషన్ హోండా సిటీ ►5 జనరేషన్ హోండా సిటీ కారుపై రూ. 72,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. మాన్యువల్ గ్రేడ్లు ►రూ. 30,000 వరకు నగదు తగ్గింపు ►కార్ ఎక్స్ఛేంజ్లో రూ. 20,000 తగ్గింపు ►హోండా సిటీ 5వ తరం రూ. 7,000 ఎక్స్చేంజ్ బోనస్తో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ రూ. 8,000. ►కంపెనీ రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్ను కూడా అందిస్తోంది. హోండా WR-V ► హోండా WR-V కారుపై రూ. 72,340 వరకు అద్భుతమైన తగ్గింపు ఆఫర్ని ప్రకటించింది. ►రూ. 30,000 నగదు తగ్గింపు , రూ. 35,340 వరకు FOC ఉపకరణాలకు అందిస్తోంది. ►కార్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా రూ. 20,000 వరకు అందిస్తోంది. ►కస్టమర్ లాయల్టీ బోనస్గా రూ. 5,000 పొందవచ్చు. ►కార్ ఎక్స్ఛేంజ్ బోనస్గా రూ.7,000 ► రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు హోండా జాజ్ ►5-సీటర్ హ్యాచ్బ్యాక్, హోండా జాజ్ కోరుకునేవారి కోసం రూ. 37,047 వరకు తగ్గింపు ఆఫర్ను లభిస్తుంది. ►రూ. 10,000 వరకు నగదు తగ్గింపుతో పాటు FOC ఉపకరణాలు రూ. 12,047 వరకు ఉంది. ►కార్ ఎక్స్ఛేంజ్లో తగ్గింపు విలువ రూ. 10,000. ►ఈ కారుపై రూ. 5,000 విలువైన కస్టమర్ లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ రూ. 3,000. ►అంతేకాకుండా, రూ. 7,000 విలువైన హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
ఇండిగో ఎయిర్లైన్స్ పరిమిత ఆఫర్.. కేవలం రూ. 2218లకే విమాన ప్రయాణం!
దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఏయిర్ లైన్స్. ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్ని తీసుకొచ్చింది. కేవలం రూ. 2218 (వన్ వే ఛార్జీ) ప్రారంభ ధరతో విమానంలో ప్రయాణించడానికి గొప్ప ఆఫర్తో ప్రయాణికులకు అందించనుంది. ఇండిగో సంస్థ ప్రకటించిన ఈ వింటర్ సేల్ ఆఫర్ డిసెంబర్ 1న ప్రారంభం కాగా డిసెంబర్ 6 తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో టికెట్స్ను బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దేశంలో ఏ ప్రదేశానికైనా త్వరలో మీరు వెళ్లాలనుకుంటే ఈ 6 రోజుల్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ విండో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రకారం జనవరి 10 నుంచి ఏప్రిల్ 13 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఇది పరిమిత సీట్లకు మాత్రమే. ఈ ఆఫర్లో విమానాశ్రయ ఛార్జీలు, ప్రభుత్వ పన్నులపై తగ్గింపు వర్తించదు. మరో విషయం ఏంటంటే ఇండిగో దేశీయ నెట్వర్క్లోని వివిధ రంగాలలో నాన్స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. గ్రూప్ బుకింగ్లపై ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్ను బదిలీ చేయడం, నగదుగా మార్చడం వంటివి సాధ్యం కాదు. ఇండిగో అందించే ఈ ఆఫర్ పూర్తిగా బెస్ట్ ఎఫర్ట్ ప్రాతిపదికన అందిస్తోంది. పరిస్థితుల బట్టి ముందస్తు నోటీసు లేకుండా, కారణం చెప్పకుండా ఈ ఆఫర్ను ఎప్పుడైనా రద్దు చేసే లేదా సవరించే హక్కును ఇండిగో సంస్థకు ఉంది. Winter sale alert! Domestic fares starting at ₹2,218. Hurry, book before 06-Dec-22 for travel between 10-January-23 and 13-April-23. Book now https://t.co/uwwNJostmC pic.twitter.com/TibbaAsWy0 — IndiGo (@IndiGo6E) December 2, 2022 చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్టీవీ! -
అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్టీవీ!
మీరు తక్కువ బడ్జెట్లో ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. కేవలం 7వేల రూపాయలకు ఎల్ఈడీ స్మార్ట్టీవీని అందిస్తోంది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. టెక్నాలజీ పెరిగే కొద్దీ వస్తువులలో ఫీచర్లు పెరగడంతో పాటు వాటి ధరలు తగ్గుతున్నాయి. గతంలో ఎల్ఈడీ స్మార్ట్టీవీ 32 ఇంచెస్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 25 వేలు పైనే ఉండేది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అదే స్మార్ట్ టీవీ రూ. 10వేలు లోపే దొరుకుతోంది. తాజాగా అమెజాన్ రూ. 7వేలకు అదిరిపోయే స్మార్ట్ టీవీ తన కస్టమర్లకు అందిస్తోంది. అమెజాన్ అదిరిపోయే ఆఫర్ VW 80 cm (32 అంగుళాలు) HD Ready LED TV VW32A (బ్లాక్) (2021 మోడల్) టీవీపై బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర చూస్తే బడ్జెట్లోనే దొరుకుతోంది. ఎలా అంటే కంపెనీ నిర్ణయించిన ఈ టీవీ అసలు ధర రూ.12,999 ఉండగా, అమెజాన్ వెబ్సైట్లో 48% డిస్కౌంట్ను లభ్యమవుతోంది. ఈ ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు తక్కువ ధరకే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇందులో 60 hz రిఫ్రెష్ రేట్, 20 వాట్ల సౌండ్ అవుట్పుట్ ఉంది. దీనిపై ఒక సంవత్సరం వారంటీని కూడా పొందుతారు. ఇతర ప్రాడెక్టలతో అనుసంధానం కోసం కనెక్టివిటీ పోర్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో HDMI అలాగే USB, AV పోర్ట్లు ఉన్నాయి. చదవండి: ఎలాన్ మస్క్కు అమెజాన్ బంపరాఫర్! -
చుక్కలు చూపిస్తున్న ఎలుకలు.. ఖతం చేసేందుకు ఏకంగా కోటికి పైగా జీతం!
న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్ని నిద్రపోని నగరం అని అంటారు. ఎలుకలు నిజంగానే న్యూయార్క్వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సబ్ వేలు, మెట్రో స్టేషన్లు, రోడ్డు పక్కనున్న చెత్త కుండీలు... ఎక్కడ చూసినా స్వైరవిహారం చేస్తున్నాయి. న్యూయార్క్ జనాభా 88 లక్షలైతే ఎలుకలు ఏకంగా 20 లక్షల వరకు ఉన్నాయట! ఎలుకలను నిర్మూలించే వారికి ‘‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’’ పేరుతో పెద్ద ఉద్యోగాన్ని మేయర్ కార్యాలయం ఆఫర్ చేసింది! ఇందుకు భారీగా 1,20,000 నుంచి 1,70,000 డాలర్లు (రూ.96 లక్షల నుంచి రూ.1.36 కోట్లు) వేతనం చెల్లిస్తారు!! అక్టోబర్ నుంచే న్యూయార్క్ ప్రభుత్వం ఎలుకలపై యుద్ధం మొదలు పెట్టింది. ఇందుకోసం రేయింబవళ్లు వ్యూహాలు పన్నుతూ వాటిని తుదముట్టించే వారికోసం ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది! -
ఒప్పో రెనో 8 5జీ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు
సాక్షి,ముంబై: ఒప్పో రెనో రెనో 8 5జీ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఆన్లైన్ రీటైలర్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లలో డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉంది. ఒప్పో రెనో సిరీస్లో భాగంగా రెనో 8 5జీ, రెనో 8 ప్రొ 5జీ వేయింట్లను లాంచ్ చేసింది. తాజాగా రెనో 8 5జీ స్టాండర్డ్ వేరియంట్ పై అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో భారీ డిస్కౌంట్ లభ్యం. అమెజాన్ డిస్కౌంట్: ఒప్పో రెనో 8 5జీ 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు అమెజాన్లో రూ. 28,180కి లభిస్తోంది. దీని అసలు ధర రూ. 38,999. దీంతోపాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో వెయ్యి రూపాయలు తగ్గింపు. ఫెడరల్ బ్యాంక్ లేదా RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించడంపై 750, ఈఎంఐ లావాదేవీలను ఎంచుకుంటే మరో వెయ్యి రూపాయల తగ్గింపు లభ్యం. గరిష్టంగా రూ 14,050 వరకు తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ ఆఫర్ : రెనో 8 5G రూ 29,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు అన్ని ప్రముఖ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై అక్టోబర్ 31 వరకు రూ. 2,500 తగ్గింపు లభిస్తుంది. సిటీ బ్యాంక్ వినియోగదారులు ఈఎంఐయేతర లావాదేవీలను ఎంచుకుంటే 1,500 క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అయితే 2 వేలు తగ్గుతుంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కొనుగోలుపై 5శాతం డిస్కౌంట్. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్గా రూ. 21వేల వరకు తగ్గింపును కూడా అందుబాటులో ఉంది. -
తక్కువ ధరలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ వచ్చేసింది..సర్ప్రైజ్ ఆఫర్
సాక్షి,ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను నేడు (శనివారం, అక్టోబరు 22)న లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ స్కూటర్ బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1తో పోలిస్తే 20వేల రూపాయల తగ్గింపుతో సరికొత్త ఎస్1 ఎయిర్ను తీసుకురావడం గమనార్హం. రోజూ ఒక స్కూటర్, అందరికీ స్కూటర్.అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎస్ 1 ఎయిర్ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ S1 ధర రూ.84,999గా ఉంచింది. అయితే లాంచింగ్ ధర రూ. 79,999గా నిర్ణయించింది. కేవలం 999 రూపాయలు చెల్లించి దీన్ని ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ లాంచింగ్ ఆఫర్ అక్టోబర్ 24 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతందని కంపెనీ ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జర్తో స్కూటర్ 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఓలా ఈవెంట్లో తెలిపారు. ఇది కాకుండా, లాక్,అన్లాకింగ్ కోసం అధునాతన ఫీచర్లను అందించినట్టు చెప్పారు. అధునాతన డిజైన్తో అప్డేట్ చేసిన ఎస్1 ఎయిర్ ఎకో, రెగ్యులర్, స్పోర్ట్తో సహా మూడు రైడింగ్ మోడ్స్లో, అయిదు రంగుల్లో లభించ నున్నాయి. ఏడు అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే, బహుళ రైడ్ ప్రొఫైల్లు, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ అండ్ కాల్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డెలివరీలు ఏప్రిల్ 2023 మొదటి వారంలో ప్రారంభం. A scooter for everyday, a scooter for everyone. The most awaited Ola S1 Air is here at an introductory price of Rs. 79,999! Offer valid till 24th October only. Hurry! Reserve now for Rs. 999 🥳🥳 pic.twitter.com/KmV0DGRs3Z — Ola Electric (@OlaElectric) October 22, 2022 -
Narendra Modi Birthday: 56 వంటకాలతో మోదీ థాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ‘‘శనివారం నుంచి 26వ తేదీ దాకా 56 రకాల ఉత్తరాది వంటకాలతో ప్రత్యేకంగా మోదీ థాలి వడ్డిస్తాం. 40 నిమిషాల్లో థాలీని పూర్తి చేసిన వారికి రూ.8.5 లక్షలు అందజేస్తాం. ఇద్దరు విజేతలను మోదీకెంతో ఇష్టమైన కేథార్నాథ్ సందర్శనకు పంపిస్తాం’’ అని ప్రకటించింది. ఈ థాలీలో 20 రకాల కూరలతోపాటు రకరకాల బ్రెడ్లు, పప్పు, గులాబ్ జామ్, కుల్ఫీ సహా మొత్తం 56 వెరైటీలుంటాయి. వెజిటేరియన్ థాలి రూ.2,600, నాన్ వెజ్ థాలి రూ.2,900. డిన్నర్ థాలి అయితే మరో రూ.300 ఎక్కువట. వీటిపై పన్నులు అదనం. మోదీ అంటే తమకెంతో అభిమానమని కన్నాట్ప్లేస్లో ఉన్న ఆర్డర్ 2.1 అనే ఈ రెస్టారెంట్ ఓనర్ సువీత్ కాల్రా చెప్పారు. ‘‘మా రెస్టారెంట్ అందించే వెరైటీ థాలీలకు ఎంతో ఆదరణ ఉంది. ధరలను తగ్గించాలని మోదీని కోరుతూ 10 రోజుల్లో ‘ద్రవ్యోల్బణం–మాంద్యం థాలి’ కూడా తీసుకొస్తాం’’ అన్నారు. ఈ రెస్టారెంట్లో ‘పుష్ప థాలి’, ‘బాహుబలి థాలి’ కూడా సర్వ్ చేస్తుండటం విశేషం! ప్రధాని బహుమతుల వేలం ఎగ్జిబిషన్ ప్రారంభించిన కిషన్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన 1,222 మైన జ్ఞాపికలు, బహుమతుల ఈ–వేలం నాలుగో విడత ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 దాకా సాగనుంది. ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను శుక్రవారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. వేలం ద్వారా సమకూరే మొత్తం నమామి గంగ ప్రాజెక్టుకు వెళ్తుందని గుర్తు చేశారు. దేశ జీవనాడి అయిన గంగా నదిని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ వేలంలో అందరూ పాల్గొనాలని కోరారు. -
పోకో ఎం5 వచ్చేసింది.. లాంచింగ్ ఆఫర్, ధర, ఫీచర్లు
సాక్షి,ముంబై: పోకో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ఇండియాతోపాటు ప్రపంచ మార్కెట్లో పోకో ఎం5ని లాంచ్ చేసింది. పోకో ఎం 4 M4 సిరీస్ సక్సెసర్ కొన్ని అప్గ్రేడ్లతో దీన్నివిడుదల చేసింది. భారతదేశంలో పోకో ఎం5 ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ ధర రూ.12,499 6 జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్ మోడల్ ధర రూ.14,499 ఎల్లో, ఐసీ బ్లూ , పవర్ బ్లాక్ మూడు రంగుల్లో ఇవి లభ్యం. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో సెప్టెంబర్ 13న సేల్ షురూ కానుంది. అయితే పరిమిత కాలానికి విక్రయ ఆఫర్లను అందిస్తున్నట్లుపోకో తెలిపింది. రెండు వేరియంట్లపై రూ. 1500 తగ్గింపును అందిస్తోంది. అంటే వీటిని వరుసగా రూ. 10,999 ప్రారంభ ధరతో రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. పోకో ఎం5 స్పెసిఫికేషన్స్ 6.58అంగుళాల డిస్ప్లే 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+2+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్ -
అవున్సార్! ఉక్రెయిన్ యుద్ధంతో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది!!
అవున్సార్! ఉక్రెయిన్ యుద్ధంతో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది!! -
రిలయన్స్ డిజిటల్ ‘ఎలక్ట్రానిక్స్ సేల్’.. కళ్లు చెదిరే ఆఫర్లు అప్పటివరకే!
ముంబై: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్ డిజిటల్ ‘ఎలక్ట్రానిక్స్ సేల్ – డిజిటల్ ఇండియా సేల్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాల కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్టు 16వ తేదీ వరకు టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, యాక్సెసరీల కొనుగోళ్లపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చని తెలిపింది. ప్రముఖ బ్యాంకుల కార్డులపై 10% డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే 10% డిస్కౌంట్ వోచర్లను పొందవచ్చు. తదుపరి కొనుగోలుపై ఈ డిస్కౌంట్ను వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లతో పాటు Reliancedigitalలో కూడా ఆఫర్ల విక్రయాలు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. అదిరిపోయే ఆఫర్లు సేల్లో భాగంగా 65 ఇంచెస్ UHD ఆండ్రాయిడ్ టీవీలు ₹49,990 ప్రారంభ ధరకు అందుబాటులో ఉన్నాయి. 43 ఇంచెస్ టీవీ ధర ₹19,990 నుంచి ప్రారంభమవుతుంది. రిలయన్స్ డిజిటల్ సేల్లో, ఇంటెల్ కోర్ i3, 8GB RAM, 512 SSD స్టోరేజ్తో కూడిన HP స్మార్ట్ సిమ్ ల్యాప్టాప్ రూ. 43,999కే అందుబాటులో ఉంది. రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్లో స్మార్ట్ఫోన్లపై 35 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. యాపిల్, సామ్సంగ్, మోటోరోలా, వన్ప్లస్, షావోమీ, రియల్మీ సహా మరిన్ని బ్రాండ్స్ స్మార్ట్ఫోన్లు ఆఫర్లతో లభిస్తున్నాయి. బ్లూటూత్ స్పీకర్లు, ఇయర్ఫోన్స్పై 70శాతం వరకు ఆఫర్లు ఇస్తున్నట్టు రిలయన్స్ డిజిటల్ పేర్కొంది. చదవండి: Ola Electric Car: ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఒక్క చార్జింగ్తో 500 పైగా కిలోమీటర్లు! -
అదిరిపోయే బంఫర్ ఆఫర్.. రూ.1475కే విమాన ప్రయాణం!
భారతదేశం ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా( AirAsia) తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ను తీసుకువచ్చింది. కేవలం రూ.1475కే తమ కంపెనీ విమానంలో ప్రయాణించే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తోంది. ఢిల్లీ-లక్నో వంటి రూట్లతో పాటు సంస్థ నెట్వర్క్ అంతటా ఇదే విధమైన ఆఫర్లు ఉంటాయని తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 10 నుంచి 13 వరకు ఎయిర్ ఏషియా విమానాలను బుక్ చేసుకున్న ప్యాసింజర్ అర్హులుగా పేర్కొంది. వీటితో పాటు మీ బుకింగ్ టికెట్ ప్రయాణం 25 ఆగస్టు 2022 నుంచి 31 మార్చి 2023 మధ్య ఉండేలా చూసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈ ఆఫర్ అంతర్జాతీయ విమానాలకు వర్తించదు. కంపెనీ పేర్కొన్న తేదీలో బుక్ చేసుకుంటే తక్కువ ధరకే ఎంచక్కా గాల్లో ఎగరవచ్చు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ను ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి. ఆగస్టు 5 నుంచి ఈ ఎయిర్లైన్స్ లక్నో నుంచి బెంగళూరు, గోవా, న్యూఢిల్లీకి రోజువారీ డైరెక్ట్ విమానాలను నడుపుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నివేదించిన ప్రకారం, ఈ ఎయిర్లైన్ భారతదేశంలో అత్యంత సమయపాలన కలిగిన విమానయాన సంస్థగా కొనసాగుతోంది. Freedom never felt better. Celebrate 75 years of India’s Independence with special fares starting at ₹1,475! Book now till 13 August on https://t.co/4gF7kebVg3, the AirAsia India and @tata_neu mobile apps and earn #NeuCoins! #AzadiKaAmritMahotsav #IndependenceSale pic.twitter.com/4gJzMY1t8E — AirAsia India (@AirAsiaIndia) August 10, 2022 చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
షిండే కేబినెట్లో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. శివసేనపై తిరుగుబాటు చేసి భాజపాతో కలిసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు ఏక్నాథ్ షిండే. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వాదనలు వెలువడ్డాయి. ఈ సమయంలోనే సీఎం షిండే ఢిల్లీ పర్యాటన చేపట్టటం ఆ వాదనలకు బలం చేకూర్చింది. ఇదే అదునుగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు డబ్బులు దండుకునేందుకు ప్రయత్నించారు. షిండే కేబినెట్లో చోటు కల్పిస్తామని, అందుకు రూ.100 కోట్లు ఇవ్వాలని ఓ ఎమ్మెల్యేకు ఆఫర్ ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ప్లాన్ అడ్డం తిరిగి కటకటాలపాలయ్యారు. మంత్రివర్గంలో చోటు కోసం రూ.100 కోట్లకు బేరం ఆడారంటూ.. భాజపా ఎమ్మెల్యే రాహుల్ కుల్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే పీఏ బాలక్రిష్ణ థోరట్కు జులై 16న రియాజ్ షేక్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఎమ్మెల్యే రాహుల్తో ఆఫర్ గురించి మాట్లాడాలని చెప్పాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేతో తాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, మీకు సాయం చేయాలనుకుంటున్నాని చెప్పాడు. ఈ క్రమంలో నారిమన్ పాయింట్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఇరువురు కలిశారు. ఈ సందర్భంగా తనకు సీనియర్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని, వారు మీకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని నమ్మించే ప్రయత్నం చేశాడు. అందుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాహుల్ కుల్.. వారితో బేరం ఆడి రూ.90 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల గుట్టు బయటపడింది. ఇదీ చదవండి: లోక్సభలో ‘సేన’ నేతగా రాహుల్ షెవాలే: షిండే -
పవన్ కల్యాణ్కు కేఏ పాల్ భారీ ఆఫర్.. రూ.1000 కోట్ల నజరానా
సాక్షి, హైదరాబాద్: పవన్ కల్యాణ్కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ తన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానన్నారు. పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేఏ పాల్ అన్నారు. చదవండి: (‘కేఏపాల్తో మా కుటుంబానికి ప్రాణహాని.. నా భర్తను విడిపించండి’) -
‘విక్రమ్కి చేతుల్లేవ్.. కానీ అతనే మా కారును నడిపిస్తే సంతోషిస్తా!’
స్ఫూర్తిగొలిపే వ్యక్తులను మెచ్చుకోవడంతో పాటు వారిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆనంద్ మహీంద్రా ఎప్పుడు ముందుటారు. అంతేకాదు ప్రతిభకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు క్షణకాలం కూడా వెనుకాడరు. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది కూడా. తాజాగా మరోసారి తనదైన శైలిలో ఓ అసాధారణ ప్రతిభవంతుడికి అరుదైన ఆఫర్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. విక్రమ్ అగ్నిహోత్రి మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన విక్రమ్ అగ్నిహోత్రికి చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదంలో రెండు చేతులు పోయాయి. ఐనప్పటికీ పట్టుదలతో చేతులు లేని లోటును కాళ్లతో భర్తీ చేశాడు. కాళ్లతోనే రాయడం నేర్చుకుని మాస్టర్స్ డిగ్రీ పొందాడు. కంప్యూటర్ ఆపరేట్ చేయడలడు. నీటిలో ఈదగలడు. ఇదే క్రమంలో ఎంతో కష్టపడి కారు డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాడు. చేతుల్లేకపోయినా కాళ్లతోనే కారును నేర్పుగా నడిపే ఒడుపును ఒంటబట్టిచ్చుకున్నాడు. చట్టాలను మార్చాడు తాను ఎందులో ఎవరికీ తక్కువ కాదంటూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు విక్రమ్ అగ్నిహోత్రి. అయితే అతనికి లైసెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. కోర్టుల్లో న్యాయ పోరాటం చేసిన తర్వాత చివరకు చట్టాల్లో మార్పులు చేసి లైసెన్సు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం దివ్యాంగుల కోసం అతనో ఎన్జీవోను నిర్వహిస్తున్నాడు. విక్రమ్ అగ్నిహోత్రికి పట్టుదల అతని ప్రత్యేక ప్రతిభలను వివరిస్తూ ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. మాకు గర్వకారణం విక్రమ్ అగ్నిహోత్రి విజయగాథ తనకెంతో స్పూర్తిని కలిగించందంటూ ఆనంద్ మహీంద్రా స్పందించాడు. అతనికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. మా అందరిలో స్ఫూర్తి నింపుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు మహీంద్రా పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తి మా కారును డ్రైవ్ చేయడం మాకు గర్వకారణం అంటూ ‘ఆఫర్’ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. It would be an honour and a privilege to have this man drive our cars. Vikram, I bow low to you. You are what we call a Rise story. Thank you for inspiring us to embrace life with gratitude… pic.twitter.com/SyxncKOoob — anand mahindra (@anandmahindra) May 21, 2022 వాట్ నెక్ట్స్ మహీంద్రా మాటలను బట్టి త్వరలోనే వివేక్ అగ్నిహోత్రికి ఏదైనా మహీంద్రా బ్రాండ్ కొత్త కారుని బహుమతిగా ఇస్తారని నెటిజన్లు అంటున్నారు. గతంలో ఆయన ఈ విధంగా చాలా మందికి కార్లను బహుమతిగా అందించారు. కాగా విక్రమ్కి ఉద్యోగ అవకాశం కల్పించాలని మరికొందరు కోరుతున్నారు. చదవండి: నా భార్య కోసం ఆర్డర్ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్ మహీంద్రా -
ఓయో రూమ్స్ బంపరాఫర్, ఫ్రీగా హోటల్ రూమ్స్లో ఉండొచ్చు!
ఇండియన్ హోటల్ రూమ్స్ ఆగ్రిగ్రేటర్ ఓయో వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ట్రావెల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓయో రూమ్స్ ఫ్రీగా వినియోగించుకోవచ్చని అధికారికంగా తెలిపింది. ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. పీటీఐ నివేదిక ప్రకారం..విజార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్లోని గోల్డ్ సభ్యులు 5రాత్రులు(5రోజుల పాటు) ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఓయో విజార్డ్ దేశంలో తరుచూ ప్రయాణం చేసే వారికి అందుబాటులో ఉంది. ఇతర ప్రయోజనాల్ని అందించడంతో పాటు ఓయో రూమ్స్ విజార్డ్ సౌకర్యం ఉన్న హోటళ్లపై 10శాతం డిస్కౌంట్ను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు 92 లక్షలకు పైగా సభ్యులతో ఓయో విజార్డ్ అనేది అతిపెద్ద లాయల్టీ ప్రోగ్రామ్స్లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్కు చెందిన ట్రావెల్ కష్టమర్లు ఎక్కువగా ఉన్నారు. వారికి అదనపు సౌకర్యాల్ని కల్పించేందుకు ఓయో విజర్డ్ బ్లూ, విజర్డ్ సిల్వర్, విజర్డ్ గోల్డ్ స్కీమ్లను అందుబాటులోకి తెచ్చింది. వారికే లాభం ఫ్రీ రూమ్ నైట్స్, తగ్గింపు ఆఫర్లు వంటి మా ప్రోత్సాహకాల వల్ల కస్టమర్లు ఓయోలో పదే పదే ఉండేందుకు మరొక అవకాశాన్ని అందుబాటులో ఉంచాం. 2021 మార్చి 31తో ముగిసిన ఏడాదిలో 70 శాతానికి పైగా రిపీట్ కస్టమర్లు ఉన్నారు. తాజా కొత్త లాయల్టీ సర్వీసుల వల్ల వీరికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్), చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే వివరించారు. -
టైం వేస్ట్ చేసుకోకండి.. కాంగ్రెస్ చీఫ్కు ‘ఆప్’ భారీ ఆఫర్
గాంధీనగర్: ఎన్నికల వేళ గుజరాత్ పాలిటిక్స్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ హస్తం పార్టీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో తమ పార్టీ(ఆప్)లో చేరాలని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా కోరారు. శుక్రవారం ఇటాలియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ పటేల్ వంటి అంకిత భావంతో పనిచేసే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండదు. పటేల్కు కాంగ్రెస్లో ఉండటం ఇష్టం లేకపోతే వెంటనే ఆప్లో చేరాలి. పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు ఆప్ గౌరవమిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. హార్దిక్ పటేల్ సమయం వృథా చేసుకోకుండా ఆప్లో చేరండి. ఆప్ గెలుపునకు సహకరించండి’’ అని అన్నారు. ఇటాలియా ఇలా కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, అంతకు ముందు హార్దిక్ పటేల్.. రాష్ట్ర పార్టీ నాయకులు తనను వేధిస్తున్నారని, తాను పార్టీ విడిచి వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ అధిష్టానం కూడా తనను పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. రాష్ట్ర పార్టీ తనను వేధిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. If Hardik Patel is not liking in Congress, he should join a like-minded party like AAP. Instead of complaining to Congress, wasting his time, he should contribute here... A party like Congress would not have a place for dedicated people like him: Gopal Italia, AAP Gujarat chief pic.twitter.com/LjKZv31hL9 — ANI (@ANI) April 15, 2022 కాంగ్రెస్ పార్టీ కోసం ‘‘2017లో మీరు(అధిష్టానం) హార్దిక్ని ఉపయోగించుకున్నారు. 2022 వచ్చేసరికి మీకు నరేష్ కావాల్సి వచ్చారు. 2027లో మరో పాటిదార్ నాయకుడు కోసం చూస్తారు. హార్దిక్ పటేల్నే శక్తిమంతుడిగా మీరు తయారు చెయ్యలేరా?’’ అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ఖొదాల్దమ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ పటేల్ను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
Paytm: వైజాగ్ వర్తకులకు అదనపు ఆదాయం, వాళ్లకి క్యాష్బ్యాక్!
హైదరాబాద్: పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) తన మర్చంట్ భాగస్వాముల ఆదాయం పెంపునకు ప్రత్యేక కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రారంభించింది. పేటీఎం యాప్తో చెల్లింపులను స్వీకరించడం ద్వారా ప్రతి నెలా రూ.2,100 అదనపు ఆదాయం పొందొచ్చని ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్టు పేటీఎం తెలిపింది. పేటీఎం అందిస్తున్న ఈ ఆఫర్ కింద వినియోగదారులు సైతం తమ మొదటి యూపీఐ చెల్లింపు అనంతరం రూ.100 వరకు క్యాష్బ్యాక్ పొందొచ్చని పేర్కొంది. పేటీఎం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుత వర్తకులను ప్రోత్సహించడం, కొత్తవారిని ఆకర్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు సంస్థ ప్రకటించింది. చదవండి: ట్రాఫిక్ ఈ చలాన్స్.. పేటీఎం ద్వారా రూ. 60 కోట్లు వసూళ్లు -
బంపర్ ఆఫర్, బీస్ట్ మూవీ చూసిన వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితం!
Chennai Theatres Offered Free Of Cost Petrol To FDFS Tickets: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ బీస్ట్ మూవీ బుధవారం(ఏప్రిల్ 13) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ రోజు విడుదల అనగా చెన్నై వారం నుంచి బీస్ట్ మూవీ సందడి మొదలైంది. ప్రతి థియేటర్ ముందు విజయ్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఈ రోజు ఉదయం నుంచే థియేటర్ల వర్ద విజయ్ ఫ్యాన్స్ భారీ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాల అభిషేఖాలు, బాణా సంచాలు పెలుస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. చదవండి: బీస్ట్ బాగోలేదట, థియేటర్కు నిప్పంటించిన ఫ్యాన్స్! ఈ నేపథ్యంలో బీస్ట్ మూవీ చూసేందుకు థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఫస్ట్షో చూసిన వారికి విరుద్ నగర్లోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్ థియేటర్లు ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే దీనికి వారు ఓ కండిషన్ కూడా పెట్టారు. ఎఫ్డీఎఫ్ఎస్(ఫస్ట్ డే ఫస్ట్ షో) కోసం ఎవరైతే 5 టికెట్లు కొంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా ఈ థియేటర్లో ఫస్ట్ షోను ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రదర్శించారు. చదవండి: బాలీవుడ్ లవ్బర్డ్స్ పెళ్లి సందడి షురూ! విశేషాలెన్నో! ఇక్కడ ఒక ఎఫ్డీఎఫ్ఎస్ టికెట్ ధర రూ. 500 ఉండగా మిగతా థియటర్లో రూ. 400 నుంచి రూ. 300లుగా ఉంది. మరోవైపు చెన్నైలోని పలు చోట్లు విజయ్ ఫ్యాన్స్ సైతం ప్రేక్షకులకు లీటర్ ప్రెట్రోల్ను ఉచితంగా ఇస్తున్నారు. మక్కళ్ ఇయ్యక్కం తరపున అభిమానులంతా భీస్ట్ సినిమా చూసిన ప్రేక్షకులు లీటర్ ప్రెట్రోల్ను ఫ్రీగా అందిస్తున్నారు. అలాగే బీస్ట్ మూవీ చూసేందుకు ఒన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ రోజు సెలవు ప్రకటించాయి. కాగా నెల్సన్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజ హెగ్డే సందడి చేసింది. ఈ మూవీలోని అరబిక్ కుత్తు పాట ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. -
మాయావతికి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినా ఆమె స్పందించలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. సీబీఐ, ఈడీ, పెగసస్ల భయంతోనే ఆమె బీజేపీ విజయానికి బాటలు వేశారని పేర్కొన్నారు. సమృద్ధ్ భారత్ ఫౌండేషన్ ప్రచురించిన ‘ది దళిత్ ట్రూత్’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం రాహుల్ ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఒక ఆయుధమని కాంగ్రెస్ నేత రాహుల్ అభివర్ణించారు. ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హస్తగతం చేసుకుందని ఆరోపించారు. రాజ్యాంగంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.‘కేవలం అధికారం చేజిక్కించుకోవడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించే కొందరు రాజకీయ నేతల వంటి వాడిని కాదు. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది. అదేవిధంగా, తీవ్రంగా కొట్టి హింసింది. నేనింకా నేర్చుకోవాలని దేశం భావిస్తున్నట్లు దాని ద్వారా తెలుసుకున్నాను’అని అన్నారు. -
జోయాలుక్కాస్ ఆఫర్ పొడిగింపు
ఆంధ్రా/తెలంగాణ: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ‘అతుల్యమైన ఫ్లాట్ 50%’ ఆఫర్ను మార్చి 27 వరకు పొడిగించింది. కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ జాయ్ అలూక్కాస్ చెప్పారు. అతుల్యమైన ఫ్లాట్ 50%తో మజూరీ ఛార్జీల విషయంలో మార్కెట్లో అత్యంత పోటీ ధరల్ని తీసుకొచ్చామన్నారు. పరిమిత కాల ఆఫర్ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ ఆఫర్కు అదనంగా కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఏడాది ఉచిత బీమా, జీవిత కాల ఉచిత నిర్వహణ, పసిడి మారి్పడి ఆఫర్లను పొందవచ్చన్నారు. -
అమ్మమ్మాస్ బంపర్ ఆఫర్.. వన్ ప్లస్ వన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మమ్మాస్ బ్రాండ్తో ఈజీ టు కుక్ ఉత్పత్తుల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ మంగమ్మ ఫుడ్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుతోంది. మార్చిలోగా ఎనిమిది ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కంపెనీకి హైదరాబాద్లో ఇటువంటివి రెండు కేంద్రాలున్నాయి. 2023 చివరినాటికి 100 స్టోర్ల స్థాయికి చేరతామని మంగమ్మ ఫుడ్స్ కో– ఫౌండర్ ప్రతిమ విశ్వనాథ్ తెలిపారు. ఈ ఏడాదే బెంగళూరు, పుణే నగరాల్లో అడుగుపెడతామని, విస్తరణకు నిధులు సమీకరిస్తామన్నారు. ‘పచ్చళ్లు, తృణధాన్యాలు, స్వీట్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వంటి 100 రకాల ఉత్పత్తులను తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నాం. 10 లక్షల మంది వినియోగదార్లను సొంతం చేసుకున్నాం. మూడవ వార్షికోత్సవం సందర్భంగా యాప్ ద్వారా జరిపే కొనుగోళ్ళకు పలు ఉత్పత్తులపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాం. ఇక అన్ని స్టోర్లనూ కంపెనీ సొంతంగా స్థాపిస్తోంది. ఫ్రాంచైజీ విధానానికీ సిద్ధమే. స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేసి స్థల యజమానికి కమీషన్ ఇస్తాం. అమ్మకాల్లో ఆన్లైన్ వాటా 10 శాతం ఉంది’ అని ప్రతిమా విశ్వనాథ్ వివరించారు. -
పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్...!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. టాటా మోటార్స్ ఫిబ్రవరి నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను విడుదల చేసింది. Tiago , Tigor , Nexon , Harrier , Safari వంటి టాటా కార్లపై ఈ నెలలో కస్టమర్లు రూ. 40,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి. Tata Tiago,Tigor కార్లపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో అందుబాటులో ఉంది . అయితే, ఈ ఆఫర్లు కొత్తగా ప్రవేశపెట్టిన టియాగో, టిగోర్ సీఎన్జీ మోడల్స్పై వర్తించవు. దాంతో పాటుగా రూరల్ డిస్కౌంట్ రూ. 2,500, కార్పొరేట్ ప్రయోజనంగా రూ. 3,000, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రూ. 3,000 డిస్కౌంట్ను టాటా మోటార్స్ అందిస్తోంది. Nexon కాంపాక్ట్ SUVపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో పాటు, పెట్రోల్ ట్రిమ్స్పై కార్పొరేట్, హెల్త్ వర్కర్స్ స్కీమ్ కింద రూ.3,000 తగ్గింపు, డీజిల్ ట్రిమ్ రూ.5,000 తగ్గింపుతో లభిస్తుంది. డార్క్ ఎడిషన్ రేంజ్ మినహా మొత్తం నెక్సాన్ శ్రేణిలో కార్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. టాటా హారియర్, సఫారీ కార్లపై రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో వస్తాయి . వీటికి అదనంగా గ్రామీణ తగ్గింపు, కార్పొరేట్ తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల స్కీమ్ రూ. 5,000 తగ్గింపును పొందుతుంది. చదవండి: పవర్ఫుల్ ర్యామ్, 50 ఎంపీ కెమెరాతో వివో 5జీ స్మార్ట్ఫోన్..ధర ఎంతంటే..? -
ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త..!
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వ్యక్తిగత ల్యాప్స్డ్ పాలసీల పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాలసీ ప్రీమియం కాలంలో పాలసీలను మధ్యలోనే నిలిపివేసిన పాలసీదారుల తిరిగి తమ పాలసీల పునరుద్దరణకు ఎల్ఐసీ అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25, 2022 మధ్య కాలంలో అర్హత కలిగి ఉన్న పాలసీదారులు నిలిచిపోయిన తమ పాలసీని తిరిగి పునరుద్దరించుకోవచ్చు అని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి వల్ల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారు పెరుగుతుండటంతో ఎల్ఐసీ పాలసీదారులకు వారి పాలసీలను పునరుద్ధరించడానికి, జీవిత వర్తింపును పునరుద్ధరించడానికి, వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడానికి ఇది ఒక మంచి అవకాశం" అని బీమా సంస్థ పేర్కొంది. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ బీమా పథకాల పాలసీదారులు ఆలస్యం రుసుములో రాయితీ పొందవచ్చు అని తెలిపింది. ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదు సంవత్సరాల్లోపు ఉన్న కొన్ని అర్హత కలిగిన పాలసీలను పునరుద్ధరించనున్నట్టు ఎల్ఐసీ తెలిపింది. అంతేకాకుండా ఆలస్య రుసుములో 20 నుంచి 30 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొంది. (చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!) -
'ఆర్ఆర్ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ
Amazon OTT Gives Big Offer To RRR Movie Team: అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ రౌద్రం.. రణం.. రుధిరం 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా వేసి తీవ్ర నిరాశకు గురి చేసింది చిత్రబృందం. దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్డౌన్ వల్ల సినిమాను పోస్ట్పోన్ చేసేందుకే జక్కన్న టీం మొగ్గు చూపింది. దీంతో అశేష ప్రేక్షకజనం అసహనం వ్యక్తం చేశారు. అందుకు కారణమైన మహమ్మారిని తిట్టుకుంటూ సర్ది చెప్పుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఆర్ఆర్ఆర్ మేకర్స్తో అద్భుతమైన ఆఫర్ అందించింది. అమెజాన్ తరచుగా రూ. 30 కోట్లకుపైగా పెట్టుబడితో బిగ్-టికెట్ ఎంటర్టైనర్లను కొనుగోలు చేస్తుంది. అంటే పలు పెద్ద చిత్రాలను కొనుక్కొని పే-పర్ వాచ్ రూపంలో ఓటీటీలో విడుదల చేస్తుంది. ఇలా యూఎస్ఏ సర్క్యూట్లో తరచుగా కొంటూ రిలీజ్ చేస్తుంది. కానీ భారతీయ మార్కెట్లో ఇలాంటి ప్రయోగం మాత్రం ఇప్పటివరకూ చేయలేదు అమెజాన్. అలాగే యూట్యూబ్లో కూడా కొన్ని సినిమాలను అద్దెకు చూడవలసి ఉంటుంది. అలాంటి సినిమాలను నిర్ణీత ధరతో ఒక రోజు కోసం అద్దెకు తీసుకుంటుంది. ఇలాంటి ఆఫర్ను ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్కు అమెజాన్ ఇచ్చింది. దీని ద్వారా సులభంగా రూ. 200 కోట్ల ఆదాయాన్ని పొందవచ్చని తెలిపిందట. అయితే ఈ ఆఫర్ను ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఒప్పుకోలేదు. థియేటర్ల ద్వారా వచ్చే కలెక్షన్లతో పోల్చితే ఈ ఆదాయం చాలా తక్కవ అని మేకర్స్ అభిప్రాయపడ్డారట. దీంతో ఈ ఆఫర్ను వారు తిరస్కరించారని సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ నుంచి రూ. 400 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. అలా అయితేనే సినిమాకు పెట్టిన బడ్జెట్ పూర్తి స్థాయిలో తిరిగి పొందగులుగుతారు. ఇది సింగిల్ పేఅవుట్ మోడల్, పే-పర్-వాచ్ మోడల్ అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ చిత్రం ఓటీటీకి సంబంధించిన ఎంపిక కాదని దర్శకనిర్మాతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ సినిమాకు సుమారు రూ. 400 కోట్లు ఖర్చు అయినట్లు తెలిసిందే. ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ వాయిదా.. ఫన్నీగా, బాధగా ట్రోలింగ్ -
జంప్ కాకుండా ఒక్కొక్కరికి రూ.కోటిన్నర బోనస్!
మెటావర్స్ సాంకేతికత సంగతి ఏమో గానీ.. దాని కోసం ఉద్యోగుల నియామకాలు ఇప్పటి నుంచే ఊపందుకున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి. మెటా కంపెనీ(ఫేస్బుక్) ఈమధ్యే భారీ వేతనాలను ఎరగా వేసి 100 మంది ఇంజినీర్లను యాపిల్ నుంచి నియమించుకున్న సంగతి తెలిసిందే. కౌంటర్గా యాపిల్ కూడా దాదాపు అదే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ రెండు కంపెనీలు పోటాపోటీ ఆఫర్లతో ఉద్యోగుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీ స్టాక్ బోనస్లతో ఉద్యోగులను ఎటూ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంజినీర్లు, సాఫ్ట్వేర్-ఆపరేషన్స్ గ్రూప్కు చెందిన ఉద్యోగులకు 50వేల డాలర్ల నుంచి లక్షా 80వేల డాలర్లు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది(మన కరెన్సీలో 37 లక్షల రూపాయల నుంచి దాదాపు కోటిన్నర రూపాయల దాకా). ఈ రివార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. స్టాక్ బోనస్ ఫస్ట్ టైం బ్లూమరాంగ్ నివేదిక ప్రకారం.. యాపిల్ బోనస్లు ఇవ్వడం కొత్తేం కాదు. కానీ, ఈ తరహా స్టాక్ బోనస్లు.. అదీ ఈ రేంజ్లో ఆఫర్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. పర్ఫార్మెన్స్ల ఆధారంగా వీటిని అందజేయనున్నట్లు తెలిపింది. యాపిల్ విపరీతమైన లాభాల్లో ఉన్న విషయం తెలిసిందే. షేర్లు కిందటి ఏడాదిలో 36 శాతం పెరుగుదలను రీచ్ కావడంతో పాటు మార్కెట్క్యాప్ను 3 ట్రిలియన్ డాలర్ల మార్క్ను అందుకుంది కూడా. మెటా పెంపు మంత్రం మరోవైపు మెటా కంపెనీ ఉద్యోగులను చేజారిపోనివ్వకుండా జీతాలు పెంచుతోంది. ముఖ్యంగా ఏఐ బేస్డ్ అగుమెంటెడ్ రియాలిటీ ‘మెటావర్స్’ ప్రకటన తర్వాత ఈ పెంపు భారీగా ఉంటోంది. యాపిల్లో వలసలు.. ఓవైపు మెటా నుంచి భారీ ఆఫర్ల కారణంగా యాపిల్లో ఉద్యోగులు ఆగడం లేదు. పైగా ఇతర టెక్ దిగ్గజాలతో పోలిస్తే.. యాపిల్ తన ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. వర్క్ఫ్రమ్ హోం విషయంలోనూ సడలింపులు తక్కువగా ఇస్తోంది. దీంతో అసంతృప్తికి గురవుతున్న ఉద్యోగులు.. కంపెనీని వీడుతున్నారు. ఈ తరుణంలో భారీ స్టాక్ ప్యాకేజీలు వాళ్లను వెళ్లకుండా అడ్డుకుంటాయేమో చూడాలి. చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..! -
Airtel: ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారిఫ్తో పాటు డేటా ధరల్ని పెంచింది. ప్రీపెయిడ్ టారిఫ్ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్ అప్ ప్లాన్ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ఈ పెరిగిన కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ సెలెక్టెడ్ ప్లాన్స్పై ప్రతిరోజూ 500ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఆ ప్లాన్స్ ఇలా ఉన్నాయి ప్రతిరోజు ఎయిర్టెల్ అందిస్తున్న 500 ఎంబీ డేటా ఉచితంగా పొందాలంటే సంబంధిత ప్రీపెయిడ్ ప్లాన్స్ను రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ నంబర్పై రూ.265, రూ. 299, రూ. 719, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా 500ఎంబీ డేటాను పొందవచ్చు. అయితే ఇది అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు వర్తించదని ఎయిర్ టెల్ తన ప్రకటనలో తెలిపింది. రూ. 265 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా, రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ 2 జీబీ డేటా 28 రోజులు, 84 రోజులకు రోజువారీ డేటాను అందిస్తుంది. రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5జీబీ డేటాను 84 రోజుల పాటు పొందవచ్చు. అయితే ఉచిత డేటాను పొందాలంటే పైన ఎంపిక చేసిన ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ పెంచిన ధరలు ♦ఎయిర్ టెల్ పెంచిన రూ. 79గా ఉన్న ప్లాన్ రేటు రూ. 99కి చేరింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ, రూ. 99 విలువ చేసే టాక్టైమ్, 200 ఎంబీ డేటా, సెకనుకు పైసా వాయిస్ టారిఫ్ ఉంటుంది. ♦ అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో రూ. 149 ప్లాన్ ధర రూ. 179కి పెంచింది. అలాగే రూ. 2,498 ప్లాన్ రూ. 2,999గా మారింది. . ♦ డేటా టాప్ అప్ రూ. 48 ప్లాన్ ఇకపై రూ. 58కి (3 జీబీ డేటాతో), రూ. 98 ప్లాన్ కొత్తగా రూ. 118కి (12 జీబీ డేటా) మారింది. ♦ రూ. 251 డేటా టాప్ అప్ ప్లాన్ రేటు ఇకపై రూ. 301కి (50 జీబీ డేటా) కి చేరింది. చదవండి: హ్హ..హ్హ..హ్హ!..హీరో అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్బుల్ హాయిగా నిద్రపోతున్నాడే -
వాయిదా పద్దతుల్లో విమాన టికెట్లు
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్జెట్ కొత్తగా ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. విమాన టికెట్ల చార్జీలను సులభ వాయిదాల్లో (ఈఎంఐ) కట్టే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం మూడు, ఆరు లేదా 12 వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఎటువంటి అదనపు భారం (వడ్డీ భారం) లేకుండా మూడు నెలల ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ స్కీమును ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు తమ పాన్ నంబరు, ఆధార్ నంబరు వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్–టైమ్ పాస్వర్డ్తో ధృవీకరించాల్సి ఉంటుంది. ఏకీకృత చెల్లింపు విధానానికి సంబంధించిన యూపీఐ ఐడీ ద్వారా మొదటి వాయిదా చెల్లించాలి. అదే యూపీఐ ఐడీ నుంచి తదుపరి ఈఎంఐలు డిడక్ట్ అవుతాయి. ఈఎంఐ స్కీమును ఉపయోగించుకోవడానికి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను సమర్పించనక్కర్లేదు. -
అథర్ బంపర్ ఆఫర్.. ఏ స్కూటర్కైనా ఛార్జింగ్ ఫ్రీ
ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు అంటూ ఇటు ప్రభుత్వం నుంచి అటు అటోమొబైల్ ఇండస్ట్రీ వరకు ప్రకటనలు గుప్పిస్తోన్నారు. అయితే ఈవీలకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్ సమస్యను తీర్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తాజాగా గ్రిడ్ లోకేషన్ పేరుతో ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ముందుకు వచ్చింది అథర్ సంస్థ. గ్రిడ్ లోకేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ స్టార్టప్ అథర్ సంస్థ 450 , 450 ఎక్స్ పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్లో రిలీజ్ చేసింది. తొలుత బెంగళూరు, చెన్నైలో మొదలైన స్కూటర్ల అమ్మకాలు ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూనే, అహ్మదాబాద్ ఇలా మొత్తం పదమూడు నగరాల్లో స్కూటర్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంటి దగ్గర ఛార్జింగ్ పాయింట్స్ కాకుండా ఈ స్కూటర్లు బయట ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా గ్రిడ్ లోకేషన్ పేరుతో ఛార్జింగ్ పాయింట్లను అథర్ ఏర్పాటు చేసింది. డబుల్ సెంచరీ క్రాస్ బెంగళూరులో పది, చెన్నైలో మూడింటితో గ్రిడ్ లోకేషన్ ఛార్జింగ్ పాయింట్లను అథర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఒక్కో నగరంలో ఈ పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో పది వరకు గ్రిడ్ లోకేషన్ పాయింట్లు ఉన్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా డబుల్ సెంచరీ మార్కుని అథర్ అందుకుంది. బంపర్ ఆఫర్ ఇప్పటి వరకు అథర్ ఛార్జింగ్ స్టేషన్లలో కేవలం ఈ కంపెనీకి చెందిన 450 సిరీస్ స్కూటర్ల ఛార్జింగ్కే అవకాశం ఉండేంది. అయితే తాజాగా 200ల గ్రిడ్ లోకేషన్ (పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్)ను దాటిన శుభసందర్భంలో అథర్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ గ్రిడ్ లోకేషన్లలో అథర్ సంస్థతో పాటు ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అథర్ ప్రకటించింది. 2021 డిసెంబరు 31 వరకు ఈ ఉచిత సౌకర్యం వినియోగించుకోవచ్చని అథర్ ట్వీట్టర్లో తెలిపింది. We just crossed 200 Ather Grid locations! 🥳 If this tweet gets 200 RTs, we'll offer free charging on all Ather Grids until December 31st, 2021. pic.twitter.com/csgKHjUeEU — Ather Energy (@atherenergy) September 17, 2021 విస్తరణ బాటలో గ్రిడ్ లోకేషన్ ఛార్జింగ్ పాయింట్లను కస్టమర్లకు అనువుగా ఉండేలా ఆఫీసులు, పబ్లిక్ పార్కులు, కేఫేలు, మాల్స్లలో అథర్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ప్రతీ నెల 45 కొత్త గ్రిడ్లు ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 500 గ్రిడ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అథర్ స్కూటర్లు లభించే నగరాల్లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆ కంపనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఛార్జింగ్ పాయింట్లో ఒక నిమిషం పాటు ఛార్జింగ్ చేస్తే 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంది. చదవండి : ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్ను సొంతం చేసుకోవచ్చు! -
హర్రర్ సినిమాలు చూసే దమ్ముందా?.. రూ.లక్ష సొంతం!!
Horror Movies Challange: నయనతార నటించిన మయూరి(మాయా) సినిమా గుర్తుందా?. తాను తీసిన హర్రర్ సినిమాను ఒంటరిగా, భయపడకుండా చూస్తే.. నగదు బహుమతి ఇస్తానంటూ అందులో డైరెక్టర్ క్యారెక్టర్ ఓ ప్రకటన ఇస్తుంది. అంతేకాదు సినిమా చూస్తున్నంత సేపు హార్ట్-పల్స్బీట్ను పరిశీలిస్తుంటారు కూడా. దాదాపు లక్ష రూపాయల ప్రైజ్ మనీతో అలాంటి ప్రకటననే జారీ చేసింది ఓ కంపెనీ. కాకపోతే అది మనదేశంలో కాదులేండి. హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఎంతమంది ఉంటారో.. దానిని చూడడానికి అంతే కష్టపడేవాళ్లు అంతేమంది ఉంటారు. కానీ, అమెరికాలో ఓ కంపెనీ.. హర్రర్ సినిమాల్ని చూసేవాళ్లకు లక్ష దాకా ప్రైజ్ మనీ ఇస్తుందట. అమెరికాలోని ఫైనాన్స్బజ్ అనే ఫైనాన్స్ కంపెనీ ఈ నొటిఫికేషన్ను రిలీజ్ చేసింది. అక్టోబర్ నెలలో వాళ్లు ఎంపిక చేసిన పదమూడు హాలీవుడ్ హర్రర్ సినిమాల్ని పదిరోజుల్లో చూసేయాలి. అదీ రేప్పేయకుండా.. భయంతో వణికిపోకుండా!. చాలెంజ్లో గెలిస్తే 1,300 డాలర్లకిపైగా(దాదాపు లక్ష దాకా) ప్రైజ్మనీ ఇస్తారు. అయితే 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనే కండిషన్ పెట్టారు. త్వరలో హాలీవుడ్లో కొన్ని హర్రర్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ తరుణంలో హైబడ్జెట్.. లోబడ్జెట్ హర్రర్ సినిమాల్లో ఏవి ఎక్కువగా భయపెడతాయి అనేది తెలుసుకునేందుకు ఫైనాన్స్బజ్ ఈ ప్రయత్నాన్ని చేస్తోంది. లిస్ట్లో ‘సా, ఎమిటీవిల్లే హర్రర్, ఏ క్వైట్ ప్లేస్, ఏ క్వైట్ ప్లేస్-2, క్యాండీమ్యాన్, ఇన్సైడియస్, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, సిన్స్టర్, గెట్ అవుట్, ది పర్గే, హలోవీన్(2018), పారానార్మల్ యాక్టివిటీ, అన్నాబెల్లె’ సినిమాలు ఉన్నాయి. సెప్టెంబర్ 26 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఇక ఒంటరిగా ఈ సినిమాలు చూస్తున్నంత సేపు ఫిట్బిట్ సాయంతో హార్ట్, పల్స్ రేట్ను మానిటర్ చేయబోతున్నారు. ఏమైనా తేడాలు అనిపిస్తే.. ఆ వ్యక్తిని సినిమా చూడడం ఆపేయమని డిస్క్వాలిఫై చేస్తారు. ఇక ఈ ఫిట్బిట్ను ఫైనాన్స్బజ్ కంపెనీ వాళ్లే అందిస్తారు. అంతేకాదు సినిమాలు చూడడానికి 50 డాలర్ల రెంటల్ డబ్బును కూడా చెల్లిస్తున్నారు. ఇంతకీ ఈ ఉద్యోగానికి పెట్టిన పేరేంటో తెలుసా.. ‘హర్రర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్’. చదవండి: మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్లు -
ఆ కారుపై లక్ష వరకు బెనిఫిట్ ఆఫర్స్ !
Nissan Compact SUV Kicks: అమెరికా కంపెనీలు ఇండియా మార్కెట్ నుంచి వైదొలుగుతుండటంతో ఇతర కార్ల తయారీ కంపెనీలు ఇండియాలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా జపాన్ కార్ మేకర్స్ కంపెనీ నిస్సాన్ సరికొత్త బెనిఫిట్ ఆఫర్స్తో ముందుకు వచ్చింది. కాంపాక్ట్ ఎస్యూవీ స్టో అండ్ స్టడీ అండ్ విన్ ది రేస్ అనే నానుడి నిజం చేస్తోంది నిస్సాన్ ఆటో. అమ్మకాల పరంగా మెరుపులు లేకపోయినా నిస్సాన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో నిలదొక్కుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఆకర్షణీయమై మోడళ్లను రిలీజ్ చేస్తోంది. ఆ ఒరవడిలో కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో కిక్స్ను రిలీజ్ చేసింది. తాజాగా ఈ మోడల్ ప్రమోషన్లో భాగంగా పలు బెనిఫిట్ ఆఫర్స్ ప్రకటించింది. సెప్టెంబరు 30 వరకు కొనుగోలు చేసే కార్లపై ఈ బెనిఫిట్ ఆఫర్ వర్తిస్తుంది. కిక్స్ ఫీచర్స్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రెల్ ఇంజన్తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్పీతో 254 ఎన్ఎమ్ టార్క్ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్పీతో 142 ఎన్ఎం టార్క్ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది. బెనిఫిట్ ఆఫర్స్ ఇలా 1.3 లీటర్ టర్బో వేరియంట్పై - క్యాష్ బెనిఫిట్ రూ. 15,000 - ఆన్లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000 - ఎక్సేంజీ బోనస్ రూ.70,000 - సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000 - స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం 1.5 లీటర్ వేరియంట్పై - క్యాష్ బెనిఫిట్ రూ. 10,000 - ఆన్లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000 - ఎక్సేంజీ బోనస్ రూ.20,000 - సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000 - స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం చదవండి : సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
పది రోజులు సెలవు తీసుకోండి, పండగ చేస్కోండి! ఆ కంపెనీ వినూత్న నిర్ణయం
ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, ప్రశాంతతే లక్ష్యంగా ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉల్లాసంగా, ఉత్సాహాంగా గడపండంటూ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇచ్చింది. అంతేకాదు ఈ సెలవులు స్పెషల్గా ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రెండు నెలల ముందే హాలిడే షెడ్యూల్ సైతం ప్రకటించింది. పది రోజుల సెలవులు సోషల్కామర్స్ రంగంలో స్టార్టప్గా మొదలై యూనికార్న్ కంపెనీగా ఎదిగింది మీషో సంస్థ. ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పని చేయడంతో అనతి కాలంలోనే ఈ సంస్థ మార్కెట్ వాల్యూ అనూహ్యంగా పెరిగింది. దీంతో తమ కంపెనీ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను యాజమాన్యం తీసుకుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని భావించింది. దీంతో కంపెనీ ఉద్యోగులందరికీ ఒకేసారి పది రోజుల పాటు సామూహికంగా సెలవులు ప్రకటించింది. ఎప్పుడంటే గత రెండు నెలలుగా కరోనా సంక్షోభ సమయంలోనూ తమ కంపెనీ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడినట్టు మీషో యాజమాన్యం ప్రకటించింది. దీనికి తోడు రాబోయే దసరా, దీపావళి సీజన్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కూడా ముందే తెలిపింది. ఎంతో ఒత్తిడిలో సంస్థ అభివృద్ధికి పాటుపడిన ఉద్యోగులకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పీక్ సీజన్ ముగిసిన తర్వాత 2021 నవంబరు 4 నుంచి 14 వరకు సంస్థలోని ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు ఆ పది రోజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపండి అంటూ ఉద్యోగులకు సూచించింది. మీషో ప్రస్థానం విదిత్ ఆత్రేయ్ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త 2016లో మీషోను ప్రారంభించారు. చిన్న కళాకారులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా మీషోను వేదికగా మార్చారు. బయ్యర్లు, అమ్మకం దార్ల మధ్య మీషోను ప్లాట్ఫామ్గా చేశారు. కేవలం ఐదేళ్లలోనే ఈ మీషో స్టార్టప్ నుంచి యూనికార్న్గా ఎదిగింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో మీషో ఎల్లప్పుడు జాగ్రత్తగానే ఉంటుందనే పేరుంది. ఈ కంపెనీ అంతకు ముందు 64 ఆప్షనల్ హలిడేస్ను ఉద్యోగుల కోసం ప్రకటించింది. Meesho is going on a company-wide break from November 4-14th. Yes, you read that right. We are going to completely unplug from work — right after our busy and frenetic festive sale season, so that we are back to doing what we love — relaxed and rejuvenated. (1/2)#Meesho pic.twitter.com/CGusDZZyfw — Life@Meesho (@meeshoapp) August 30, 2021 చదవండి : ఫిట్గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
అమెజాన్ కొత్త ఆఫర్... కొద్ది మందికే అవకాశం!
ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్, స్టార్టప్ కంపెనీ అఫిర్మ్ సంస్థలు సంయుక్తంగా కొత్త ఆఫర్ను అందుబాటులోకి తెచ్చాయి. పైలట్ ప్రాజెక్టుగా ప్రస్తుతం కేవలం అమెరికాలో కొద్ది మందికే ఆఫర్ను వర్తింప చేస్తున్నారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు ఈ ఆఫర్ను వర్తింప చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి అనే పాలసీని ఇప్పుడు అన్ని కంపెనీలు అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్ సంస్థ ఈ తరహా ఆఫర్ను అమల్లోకి తేగా తాజాగా అమెజాన్ సైతం అదే బాట పట్టింది. దీని కోసం అమెరికాకే చెందిన అఫిర్మ్ సంస్థతో జత కట్టింది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ను ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరికి ప్రాధాన్యం పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల వారు అమెజాన్ కస్టమర్ బేస్లో ఉన్నారు. అయితే వీరిలో యూత్ , పార్ట్టైం జాబ్ చేసే వాళ్లు లక్ష్యంగా ఈ బయ్ నౌ పే లేటర్ ఆప్షన్ను అందుబాటులోకి తేనున్నారు. ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరం, ఆసక్తి ఉన్నా ఒకే సారి కొనేందుకు డబ్బులు చాలక క్రెడిక్ కార్డులు లేక ఇబ్బందులు పడే వారికి ఈ ఆఫర్లో ప్రాథాన్యత ఇవ్వనున్నారు. ఆఫిర్మ్దే బాధ్యత ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి పథకానికి సంబంధించి షాపింగ్ చేసేది అమెజాన్ సైట్లో అయినా సొమ్ము చెల్లింపు వ్యవహారం సజావుగా జరిగేలా చూసుకునే బాధ్యత అఫిర్మ్ స్టార్టప్దే. ఇప్పుడు బాధ్యతగా ఉండే యూత్కి ఈ ఆఫర్ అందివ్వడం ద్వారా బలమైన కస్టమర్ బేస్ను ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో ఆఫిర్మ్ సంస్థ ఈ కాన్సెప్టును అందుబాటులోకి తెచ్చింది. ఉపయోగాలు ప్రస్తుతం ఇకామర్స్ సైట్లలో రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నా అందులో నూటికి తొంభైశాతం ఆఫర్లు ప్రత్యేకంగా ఏ ప్రొడక్టుకు ఆ ప్రొడక్టు అన్నట్గుగానే ఉంటాయి. అయితే ఈ కొత్త ఆఫర్లో వివిధ కేటగిరీలకు చెందిన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత వచ్చిన మొత్తం బిల్లును తర్వాత చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది. తర్వాత చెల్లింపులు పేరు చెప్పి అధిక వడ్డీలు, హిడ్డెన్ ఛార్జీలు ఏమీ విధించమని ఆ సంస్థ అంటోంది. ఈ ఆప్షన్ ద్వారా యాభై డాలర్ల వరకు విలువైన వివిధ వస్తువులను ఒకేసారి కొనుగోలు చేసి ఆ తర్వాత చెల్లింపులు చేయవచ్చు. మన దగ్గర బయ్ నౌ పే లేటర్ ఆఫర్ను ప్రస్తుతం అమెరికాలోనే అందిస్తున్నారు. అది కూడా అమెజాన్ కస్టమర్ బేస్లో ట్రాక్ రికార్డు బాగున్న వారికే అందుబాటులోకి తెచ్చారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టే ఈ పథకం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దగ్గర క్రెడిక్ కార్డు ఈఎంఐలే అందుబాటులో ఉన్నాయి. చదవండి : Boutique Business: లాభసాటి బిజినెస్, మోడ్రన్ డ్రెస్సింగ్కు కేరాఫ్గా బొటిక్ -
అపర కుబేరుడికి ‘అడల్ట్’ సినిమాల ఆఫర్!
స్మార్ట్ ఫోన్లు-ఇంటర్నెట్ వాడకం పెరిగాకే.. అడల్ట్ కంటెంట్ జనాలకు ఎక్కువగా రీచ్ అవుతోంది. ఈ తరుణంలో బిజినెస్ పెంచుకోవడం కోసం అడల్ట్ సైట్లు భారీ ఆఫర్లతో సెలబ్రిటీలను ఆకర్షిస్తుండగా.. సినిమా అవకాశాల కోసం ఈ రొంపిలోకి దిగుతున్న జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కొందరు. ఈ తరుణంలో క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసే ప్రపంచ కుబేరుడికి పో* సినిమాల్లో నటించే అవకాశం దక్కడం విశేషం. టెస్లా సీఈవోగా నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఎలన్ మస్క్. క్రిప్టో కరెన్సీలు బిట్కాయిన్, డోజ్కాయిన్ల విలువను కేవలం ట్వీట్లతోనే శాసిస్తున్నాడు మస్క్. ఇది చాలదన్నట్లు ఆమధ్య అడల్ట్ థీమ్డ్ క్రిప్టో కరెన్సీలను సైతం ప్రమోషన్ చేసి.. వాటి విలువను అమాంతం పెంచాడు. ఈ నేపథ్యంలో నాఫ్టీ అనే కంపెనీ మస్క్కు బంపరాఫర్ ప్రకటించింది. అడల్ట్ సినీ పరిశ్రమకు ఫైనాన్స్ సమకూర్చే నాఫ్టీ.. సుమారు 6.9 మిలియన్ డాలర్ల విలువైన సొమ్ము, నాఫ్టీ టోకెన్లను ఇచ్చేందుకు మస్క్కు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మన కరెన్సీలో వాటి విలువ 51 కోట్ల రూపాయలకు పైనే. పైగా నచ్చిన టైంలో, నచ్చిన ప్లేసులో, తనకు నచ్చిన వాళ్లతో నటించే బంపరాఫర్ ప్రకటించింది. చదవండి: ఆకాశమే హద్దుగా! ఏం చేయబోతున్నాడంటే.. ఆయన అడల్ట్ కాయిన్ల కోసం ఆయన చేసే ప్రమోషన్.. ఈ పరిశ్రమ పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. అందుకే నటించడం లేదంటే డైరెక్ట్ చేసే అవకాశం ఆయనకు ఇస్తున్నాం అంటూ నాఫ్టీ సీఈవో రాబ్ కెమెనిఫై వెల్లడించాడు. మరి చావును మార్స్పై కోరుకునే ఈ ‘మూర్ఖపు మేధావి’ .. ఈ బంపరాఫర్పై ఎలా స్పందిస్తాడో చూడాలి. -
JioMart: మరో రెండు రోజులే... పైసా వసూల్ స్పెషల్ ఆఫర్
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోమార్ట్ పైసా వసూల్ పేరుతో సరికొత్త ఆఫర్ని అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు పైసా వసూల్ అనేలా అచ్చమైన, స్వఛ్చమైన తగ్గింపు ధరలతో మెగాసేల్ను ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి 18 తేది వరకు ఈ మెగా సేల్ నిర్వహిస్తోంది. ఈ మధ్య ఈ కామర్స్ సంస్థలు రకారకాల పేర్లతోని సేల్స్ని నిర్వహిస్తున్నాయి. అద్భుతమైన ఆఫర్లు అంటూ ఊదరగొడుతున్నాయి. ఇలాంటి ఆఫర్ ఇక్కడ తప్ప మరెక్కడా దొరకదు అన్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయిదే ఇందులో ఏదీ అసలైన ఆఫరో, ఏదీ కేవలం ప్రచార అర్భాటమో తేల్చుకోవడం కస్టమర్లకు ఓ సమస్యగా మారింది. ఇలా అవసరానికి మించి ఆర్భాటం లేకుండా మీ పర్సుపై భారం తగ్గించేలా తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు అందించేందుకు మెగా సేల్ అందుబాటులోకి జియోమార్ట్ అందుబాటులోకి వచ్చింది. మెగాసేల్ ఆఫర్లు - 300 గ్రాములు ఆపై ఎక్కువ బరువు ఉండే పెద్ద బిస్కట్ ప్యాకెట్లపై 33 నుంచి 50 శాతం వరకు తగ్గింపు - 240 గ్రాములు ఆపైన ఎంపిక చేసిన నూడుల్స్పై 33% తగ్గింపు - సాఫ్ట్ డ్రింక్ విభాగంలో అన్ని రకాల కోక్ ఉత్పత్తులు, మజాపై 33 శాతం తగ్గింపు - చాక్లెట్ ప్యాకెట్స్ 33 నుంచి 50 శాతం వరకు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి - రూ .1049లకే దావత్ దేవాయ బాస్మతి రైస్ 5 కేజీల ప్యాకేట్, 5 లీటర్ల ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ కాంబో అందుబాటులో ఉంది. - అన్ని రకాల మసాలా దినుసులపై 33 శాతం తగ్గింపు - ఎంపిక చేసిన మల్టీ ప్యాక్ సబ్బులపై 33 శాతం తగ్గింపు - 4 కేజీలు ఆపై ఉన్న డిటర్టెంట్లపై 30 శాతం వరకు తగ్గింపు - ఎంపిక చేసిన షాంపూలపై 50 శాతం డిస్కౌంట్ - ఎంపిక చేసిన టూత్పేస్ట్లపై 50 శాతం తగ్గింపు ఎస్బీఐ కార్డుపై క్యాష్బ్యాక్ జియోమార్ట్ మెగా సేల్లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్కార్డు చెల్లింపులపై 10 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. (అడ్వటోరియల్) -
బంపర్ ఆఫర్.. టీకా వేసుకుంటే ఆపిల్ ఎయిర్పాడ్స్ ఫ్రీ
కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ కీలకమని వైద్యులేగాక ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. అయితే పలు కారణాల వల్ల ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదనే చెప్పాలి. దీంతో అందదూ వ్యాక్సిన్ వేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు కొత్త ఐడియాలు, గిఫ్ట్లతో ప్రజల ముందుకు వస్తున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచేందుకు అక్కడి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా ఆ ప్రాంత మేయర్ టీకా వేసుకున్న టీనేజర్లకు బంఫర్ ఆఫర్లు ప్రకటించారు. వ్యాక్సిన్ వేసుకుంటే.. ఆపిల్ ఎయిర్పాడ్స్ ఫ్రీగా ఇవ్వడంతోపాటు అదృష్టం కలిసొస్తే 25 వేల డాలర్ల స్కాలర్షిప్ అందచేస్తామని లేదా ఐప్యాడ్ కూడా దక్కే అవకాశం ఉందంటూ వాషింగ్టన్ డీసీ మేయర్ మేయర్ మురియల్ బౌజర్ ప్రకటించారు. వాషింగ్ట్న్తో పాటు చుట్టుపక్కల ఉన్న టీనేజర్లు తొలి డోసు తీసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. కాగా.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి, డీసీ యువత (12-17) ఎవరైతే బ్రూక్లాండ్ ఎంఎస్, సౌసా ఎంఎస్, జాన్సన్ ఎంఎస్లలో వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్లకు ఎయిర్పాడ్స్ ఇస్తాం. అంతేకాదు 25 వేల డాలర్ల స్కాలర్షిప్, ఐప్యాడ్ గెలుచుకునే అవకాశం కూడా వాళ్లకు ఉంటుంది అని బౌజర్ ట్వీట్ చేశారు. మీరు స్టూడెంట్ అయి ఉండి.. వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ ట్వీట్లో తెలిపారు. -
సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే
ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇంటస్ట్ర్ రేట్లు ఒక్కో బ్యాంక్ను బట్టి ఒక్కోలా ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇంట్రస్ట్ రేట్లు తగ్గుతున్నప్పటికీ కొన్ని బ్యాంక్ లు మాత్రం మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7.25 శాతం ఇంట్రస్ట్ ను చెల్లిస్తున్నట్లు 'బ్యాంక్ బజార్' తన డేటాలో వెల్లడించింది. . ఇప్పుడు మనం ఎఫ్డీపై అత్యుత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్స్ కోసం మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష రూపాయల మొత్తం మూడు సంవత్సరాలలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్ రూ.1,000. డీసీబీ బ్యాంక్, ఎస్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7 శాతం వడ్డీని అందిస్తాయి. రూ .1 లక్ష డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.23 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్ రూ. 10,000. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 6.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది. ఆర్బిఎల్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు కోసం మూడు సంవత్సరాల ఎఫ్డిలపై 6.80 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష పెట్టుబడి మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది. -
‘ఆభార్’ కలెక్షన్ను లాంఛ్ చేసిన రిలయన్స్ జువెల్స్
ముంబై: రిలయన్స్ జువెల్స్ 14 వ వార్షికోత్సవ సందర్బంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్ను లాంచ్ చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న జువెలరీ కలెక్షన్కు ‘ఆభార్’ ను ఎక్స్టెన్షన్గా లాంచ్ చేసింది. ఈ కలెక్షన్ లాంచ్తో కస్టమర్లకు, ఉద్యోగులకు, కళాకారులకు రిష్తోన్కాధాగా అనే థీమ్తో కంపెనీ కృతజ్ఞతలను ప్రకటించింది. ఆభార్ కలెక్షన్లో భాగంగా సరికొత్త జువెలరీ కలెక్షన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. ఈ కలెక్షన్లో అద్బుతమైన బంగారం, వజ్రాల ఇయర్ రింగ్స్ కొత్త డిజైన్లు కస్టమర్లకు లభించనున్నాయి. రిలయన్స్ జువెల్స్ జూలై 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 20 శాతం మేర స్పెషల్ యానివర్సరీ తగ్గింపును ప్రకటించింది. #RishtonKaDhaga అనే మల్టీ మీడియా క్యాంపెన్తో రిలయన్స్ జువెల్స్ తమ కస్టమర్లకు, ఉద్యోగులకు సందేశాన్ని ఇచ్చింది. ఈ సందర్బంగా రిలయన్స్ జువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ జువెల్స్ను ఆదరిస్తోన్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆభార్ కలెక్షన్తో రిలయన్స్ జువెల్స్కు, కస్టమర్లకు ఉన్న బంధం మరింత బలపడుతుందనీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
‘వ్యాక్సిన్ ఆఫర్’.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ !
దేశవ్యాప్తంగా తమ సినియా థియేటర్లు, మల్టీప్లెక్సులు జులై 30 నుంచి తెరుచుకుంటాయని మల్టీప్టెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్స్కి వచ్చే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘జాబ్ ఆఫర్’ను ప్రకటించింది. బొమ్మపడింది దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో క్రమంగా సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా తెరుచుకునేందుకు ఉత్సాహంగా ఉండగా కోవిడ నిబంధనల కారణంగా మల్టీప్లెక్స్లు కొంచెం తటపటాయిస్తున్నాయి. అయితే వందశాతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఆధీనంలో ఉన్న మల్టీప్లెక్సులు జులై 30 నుంచి ఓపెన్ చేశామని పీవీఆర్ ప్రకటించింది. అందరికీ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను వంద శాతం తప్పక పాటిస్తామని పీవీఆర్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్సులలో పని చేసే సిబ్బంది అందరికీ కో\విడ్ వ్యాక్సిన్ అందించామని తెలిపింది. ప్రేక్షకులు ఎటువంటి సందేహాలు లేకుండా సినిమాలను ఎంజాయ్ చేయవచ్చని చెప్పండి వ్యాక్సిన్ ఆఫర్ మల్టీప్లెక్సుల ఓపెనింగ్ సందర్భంగా వ్యాక్సిన్ ఆఫర్ని ప్రకటిచింది పీవీఆర్ సినిమాస్. వ్యాక్సిన్ తీసుకుని పీవీఆర్ సినిమాస్కి వచ్చిన వారికి ఎంపిక చేసిన కంటెంట్ (సినిమా)పై ఒక టికెట్ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ఫుడ్ అండ్ బేవరేజెస్ సెక్షన్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ మల్టీప్లెక్సులు ఓపెన్ చేసిన ఒక వారం పాటు అమల్లో ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఎంపిక చేసిన కంటెంట్ ఏమిటనే దానిపై కచ్చితమైన వివరణ ఇవ్వలేదు. ఆయా మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే సినిమాలు, ఇతర కంటెంట్ను బట్టి ఇది మారే అవకాశం ఉంది. -
Sate Bank Day: డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు మంచి ఆఫర్ ప్రకటించింది. టైటన్ వాచెస్ పై 20 శాతం తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్గా తీసుకొచ్చిన ఈ తగ్గింపు ధరలు ఈ నెల 7 వ తేదీవరకు అందుబాటులో ఉంటాయి. తన యోనో యాప్ ద్వారా కాంటాక్ట్ లెస్ కొనుగోళ్లు చేయాలని కస్టమర్లకు పిలుపునిచ్చింది. కాగా ఎస్బీఐ నేడు ఫౌండేషన్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన ప్రస్తానాన్ని గుర్తు చేసుకుంటూ ఒకవీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అలాగే తమకు అండగా నిలిచిన వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. (State Bank Day: హ్యపీ, ఇన్క్రెడిబుల్ జర్నీ) Get Flat 20% OFF* on all TITAN PAY watches through YONO. Make fast, contactless and secure transactions via Titan Pay. Download now: https://t.co/FpPOSnsD5V #StateBankDay #TitanPay #Titan #ContactlessPayment #TitanWatch #Watch #YONOSBI pic.twitter.com/gTDf05Ndqr — State Bank of India (@TheOfficialSBI) July 1, 2021 -
గుడ్ న్యూస్: టీవీఎస్ అపాచీ బైక్ పై భారీ ఆఫర్
మీరు కొత్తగా బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ తన అపాచీ ఆర్టీఆర్ 200 4వి బైక్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్టీఆర్ 200 4విని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.5,000 క్యాష్బ్యాక్తో అందిస్తుంది. అదేవిధంగా ఈ బైక్ను ఫైనాన్స్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ.10 వేల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ 2021 జూన్ 30 వరకు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ మోటారుసైకిల్ విభాగంలో రెండు వేరియంట్లు అమ్మకానికి ఉన్నాయి. రైడ్ మోడ్లతో సింగిల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్, డ్రైవింగ్ మోడ్లతో డ్యుయల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్. సింగిల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్ మోటార్ సైకిళ్ ధర ఉంటే,1.29 లక్షలు, డ్యుయల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్ ధర రూ.1.34 లక్షలు(ఎక్స్ షో-రూమ్)గా ఉంది. ఇందులో 8,500 ఆర్పీఎమ్ వద్ద 20.54 హెచ్పీ, 7,000 ఆర్పీఎమ్ వద్ద 18.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 198 సీసీ ఫోర్-వాల్వ్, ఆయిల్-కూల్డ్ సీంగిల్ సీలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్బాక్స్ కలిగి ఉంది. డ్రైవింగ్ మోడ్ను బట్టి పవర్ అవుట్పుట్ మారుతుంది. ఈ బైక్ గరిష్ఠ వేగం వచ్చేసీ గంటకు 127 కి.మీ. టీవీఎస్ భారతదేశంలో టీవీఎస్ ఎన్టోర్క్ 125 స్కూటర్ కోసం కొత్తగా “నో-కాస్ట్” ఈఎంఐ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కస్టమర్ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లావాదేవీ చేస్తే మాత్రమే ఆఫర్ చెల్లుతుంది. చదవండి: ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్! -
ఈ ఫోన్ కొంటే.. 1 టెరా బైట్ క్లౌడ్ స్టోరేజీ ఉచితం
వెబ్డెస్క్: వన్ టెరా బైట్ క్లౌడ్ స్టోరేజీని ఆఫర్గా ప్రకటించింది వన్ప్లస్ సంస్థ. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న వన్ప్లస్ నార్డ్ CE 5జీ ప్రమోషన్లో భాగంగా ఈ ఆఫర్ అమల్లోకి తెచ్చింది. గూగుల్ క్లౌడ్ స్టోరేజీ నిబంధనల్లో మార్పులు తెచ్చిన ప్రస్తుత తరుణంలో 1 టెరా బైట్ క్లౌడ్ స్టోరేజీ ఆఫర్ మార్కెట్లో సంచలనంగా మారింది. ఈ ఫోన్ యూజర్లు వేలాది ఫోటోలు, వందలాది వీడియో కంటెంట్ని నిశ్చింతగా భద్రపరుచుకోవచ్చు. జూన్ 16న జూన్ 16 నుంచి అమెజాన్లో సేల్కి రానున్న ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 22,999గా ఉంది. హెడ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుపై రూ. 1000 తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు మొదటి రెండు రోజులు ఆర్డర్ చేసిన కారికి రూ. 500 క్యాష్బ్యాక్ అమెజాన్ ప్రకటించింది. అంతేకాకుండా వన్ టెరాబైట్ క్లౌడ్ స్టోరేజీని కూడా అందిస్తోంది. అయితే జులై 31వరకు కేవలం రెడ్ కేబుల్ కేర్ యూజర్స్కి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని వన్ప్లస్ పేర్కొంది. హై ఎండ్ ఫీచర్స్ హై ఎండ్ ఫీచర్స్ విత్ లో బడ్జెట్ మొబైల్ వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫోన్ కోసం టెక్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జూన్ 16న మార్కెట్లోకి రాబోతున్న ఈ ఫోన్కు అమెజాన్లో ఇప్పటికే ఆర్డర్లు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఈ ఫోన్కి సంబంధించి బిల్ట్ క్వాలిటీ, ఫీచర్స్, కెమెరా, ర్యామ్ మేనేజ్మెంట్ అత్యుత్తమంగా ఉందని రివ్యూయర్లు అభిప్రాయపడుతున్నారు. స్నాప్డ్రాగన్ 750జీ 5జీ టెక్నాలజీతో వచ్చన తొలి హై ఎండ్ బడ్జెట్ ఫోన్గా వన్ ప్లస్ నార్డ్ జీఈ నిలిచింది. ఈ ఫోన్లో న్యూ ఏజ్ ప్రాసెసరైన స్నాప్డ్రాగన్ 750 జీ ప్రాసెసర్ ఉపయోగించారు. 90 హెర్జ్ అమోల్డ్ డిస్ప్లే పొందు పరిచారు. హై ఎండ్ ఫోన్లకు తగ్గరీతిలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ అందిస్తోందని రివ్యూయర్లు చెబుతున్నారు. డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్ విషయంలో వన్ప్లస్ తనకు సాటైన అత్యుత్తమ ప్రమాణాలు మరోసారి పాటించింది. 30 టీ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు ఏకంగా 4500 మిల్లీయాంప్ పవర్ బ్యాటరీని అందించింది. దీంతో ఎక్కువ సేపు వీడియో కంటెంట్ చూసేందుకు ఈ ఫోన్ అనువుగా ఉందంటున్నారు నిపుణులు. చదవండి : Asus ROG Phone 3 : చేతిలో ఇమిడిపోయే గేమింగ్ ఫోన్ -
క్రేజీమెంటాలిటీ: కేఎఫ్సీ.. సీకేజీ
కేఎఫ్సీ చికెన్ను ఇష్టపడని మాంసాహారులు అరుదు. ఆ క్రేజీ చికెన్ను ఆరునెలల పాటు ఫ్రీగా తిన్నాడు. చైనాలోని 23 ఏళ్ల ఓ యువకుడు. పబ్లిసిటీ కోసం చాలా కంపెనీలు ఫ్రీ కూపన్లను అందిస్తుంటాయి కదా! అలాంటి ఫ్రీ కేఎఫ్సీ కూపన్లను వివిధ యాప్స్ ద్వారా సంపాదించటం మొదలుపెట్టాడు ఆ యువకుడు. వాటిని ఆన్లైన్లో అమ్ముతూ సుమారు రూ. రెండు లక్షల వరకు ఆర్జించాడు కూడా. అక్కడితో ఆగలేదు. తన పేరుతో ఉన్న కూపన్లను ఎవరో వాడుకున్నారంటూ ఫిర్యాదు చేసి మరికొన్ని కూపన్లనూ పొందాడు. ఇలా ఆరునెలల పాటు ఫ్రీగా చికెన్ తింటూ ఎంజాయ్ చేశాడు. హఠాత్తుగా పోలీసులు అతని నోటి కాడి చికెన్ను లాగేశారు. ఆ యువకుడి మోసాన్ని తెలుసుకొని. నిరూపించి రెండేళ్ల జైలు శిక్షనూ ఖరారు చేయించారు. సీకేజీ.. చిప్పకూడు గతి పట్టించారు. ప్చ్.. అత్యుత్సాహంతో ఆ యువకుడు తన ఫ్రీ చికెన్ సీక్రెట్ను ఫ్రెండ్స్తో పంచుకోకపోయుంటే బాగుండేది. -
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్
గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై పేటీఎం భారీ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు అందుబాటులో ఉంది. దేశంలో 14 కిలోల గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.808-850 వరకు ఉంది. అయితే పేటిఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ. 10 నుంచి రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. మీకు కనుక అదృష్టం ఉంటే గ్యాస్ ఉచితంగానే లభించవచ్చు. అయితే, ఈ ఆఫర్ మొదటి సారి పేటీఎం నుంచి గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. పేటీఎం ద్వారా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్ పొందాలంటే మీరు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మొదట మీరు మీ మొబైల్ ఫోన్లో పేటీఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్, ఇండెన్ గ్యాస్ ఆప్షన్ లలో మీ డీలర్ షిప్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వంట గ్యాస్ ప్రొవైడర్, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ నంబర్లను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లావాదేవీల కోసం వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత 48 గంటలోపు స్క్రాచ్ కార్డు లభిస్తుంది. స్క్రాచ్ కార్డు ఓపెన్ చేసి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మొదటి సారి గ్యాస్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే అని మరిచిపోవద్దు. మీకు రూ.10 నుంచి రూ.800 వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావొచ్చు. మీరు స్క్రాచ్ కార్డును వారం రోజులోగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కార్డు ఎక్స్పైరీ అవుతుంది. -
బంపర్ ఆఫర్ : ఈ స్మార్ట్ఫోన్ ధర భారీ తగ్గింపు
సాక్షి,ముంబై: ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్జీ వింగ్ స్మార్ట్ఫోన్నుఇపుడు తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుంది. 40వేల తగ్గింపుతో 29,999 రూపాయలకు ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లో లభ్యం కానుంది. భారతదేశంలో మాత్రమే ఏప్రిల్ 13 నుండి అందుబాటులో ఉండనుంది. అరోరా గ్రే, ఇల్యూజన్ స్కై కలర్ ఆప్షన్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. కాగా, ఆకర్షణీయమైన ఫీచర్లతో ల్జీ వింగ్ స్మార్ట్ఫోన్ను 69,990ధర వద్ద గత ఏడాది అక్టోబర్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగనున్నట్టు ఇటీవల ఎల్జీ అధికారంగా ప్రకటించింది. స్టాక్ ఉన్నంత వరకు తన ఉత్పత్తులను విక్రయిచనుంది. అయితే ఈ నేపథ్యంలో భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించింది. ఈ సంవత్సరం జూలై 31 నాటికి పూర్తిగా మొబైల్ మార్కెట్నుంచి వైదొలగాలనేది కంపెనీ వ్యూహం. ఎల్జీ వింగ్ ఫీచర్లు 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 2440 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 765జి ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 64+13+12 మెగాపిక్సల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెండు గంటల్లో డెలివరీ: బిగ్ బజార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న బిగ్ బజార్ ఇన్స్టాంట్ హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన రెండు గంటల్లోనే ఉత్పత్తులను కస్టమర్ ఇంటికి చేరుస్తారు. ఫ్యాషన్, ఫుడ్, ఎఫ్ఎంసీజీ, హోం విభాగాల్లో ఉత్పత్తులను సమీపంలోని బిగ్ బజార్ స్టోర్ నుంచి సరఫరా చేస్తారు. మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా వినియోగదార్లు కనీసం రూ.500 విలువ చేసే వస్తువులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ విలువ రూ.1,000 దాటితే డెలివరీ చార్జీలు ఉచితం. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా ఇతర నగరాలకూ విస్తరిస్తామని ఫ్యూచర్ గ్రూప్ ఫుడ్, ఎఫ్ఎంసీజీ ప్రెసిడెంట్ కమల్దీప్ సింగ్ తెలిపారు. 45 రోజుల్లో 21 నగరాలకు, ఆరు నెలల్లో అన్ని బిగ్ బజార్ స్టోర్ల నుంచి ఈ సేవలు ఉంటాయని చెప్పారు. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ ప్రమోట్ చేస్తున్న బిగ్ బజార్ దేశవ్యాప్తంగా 150 నగరాలు, పట్టణాల్లో 285 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఫ్యూచర్ రిటైల్ ఖాతాలో హైపర్సిటీ, ఫుడ్హాల్, ఎఫ్బీబీ, ఫుడ్ బజార్, ఈజీడే క్లబ్, హెరిటేజ్ ఫ్రెష్ సైతం ఉన్నాయి. -
పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దివి?
సొట్ట బుగ్గల సుందరి, బిగ్బాస్ కంటెస్టెంట్ దివి వైద్యకు ఓ క్రేజి ఆఫర్ వరించింది. పవర్స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటితో కలిసి నటిస్తోన్న మల్టీ స్టారర్ మూవీలో దివి ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ క్రేజీ మల్టీ స్టారర్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు పవన్, ఇటు రానా అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. క్రేజీ కిల్లర్ కాంబో అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇంత హైప్ ఉన్న ఈ సినిమాలో దివికి మంచి రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. (రానా మరో జర్నీ బిగిన్స్ : కిల్లర్ కాంబో ) మరోవైపు మెగాస్టార్ చిరంజీవి బిగ్బిస్ ఫినాలే రోజునే తన సినిమాలో నటించేందుకు దివికి అవకాశం ఇచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్టు చిరు ప్రకటించారు. తమిళ్లో అజిత్ హీరోగా సూపర్హిట్గా నిలిచిన ‘వేలాయుధం’ సినిమాకు రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత సీజన్ కంటెస్టెంట్లతో పోలిస్తే బిగ్బాస్ సీజన్-4లో పాల్గొన్న కంటెస్టెంట్లకు మంచి ఆఫర్లు వరిస్తున్నాయి. ఇప్పటికే సోహైల్, అభిజీత్, మోనాల్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నారు. (బాయ్ఫ్రెండ్, పల్లెటూరుకు రమ్మన్నాడు: దివి) -
జియో కస్టమర్లకు న్యూ ఇయర్ కానుక
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారుల కోసం ఇతర్ నెట్వర్క్కు ఫ్రీ వాయిల్స్ కాల్స్ను మళ్లీ అందిస్తోంది. జనవరి 1, 2021 నుండి జియో మరోసారి తన నెట్వర్క్లో ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్ను ఉచితంగా చేస్తామని గురువారం ప్రకటించింది. టెలికాం రెగ్యులేటర్ ఆదేశాల ప్రకారం, జనవరి 1, 2021 నుండి దేశంలో 'బిల్ అండ్ కీప్' విధానం అమల్లోకి రానుంది. దీంతో జియో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయం ప్రకారం జియో చందారులు దేశంలోని ఏమొబైల్ నెట్వర్క్కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నిమిషానికి 6 పైసలు వసూలు చేసేది. దీంతో మరోసారి ప్రత్యర్థి కంపెనీలకు పోటీ తప్పదని ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన రెండు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతుల ఉద్యమం ప్రభావంతో కూడా జియో ఉచిత సేవలను పునః ప్రారంభించిందని పేర్కొంటున్నారు. జియో టు జియో ఉచిత కాలింగ్ సదుపాయాలను అందిస్తున్న రిలయన్స్ జియో గత ఏడాది దేశీయంగా ఇతర నెట్వర్క్వాయిస్ కాల్స్కు ఇంటర్కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయూసీ) బాదుడు షురూ చేసిన సంగతి తెలిసిందే. -
ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్
సాక్షి, ముంబై: ఈ దీపావళికి ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకోసం మంచి అవకాశం సిద్ధమవుతోంది. టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు ఆపిల్ ఈ పండుగ సందర్భంలో తన అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 11 కొనుగోలు చేసిన వారికి భారతదేశం అంతటా ఎయిర్పాడ్ ఉచితంగా అందించనుంది. కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ స్టోర్ లేదా ఆపిల్ ఇండియా వెబ్సైట్ ద్వారా ఐఫోన్ 11 కొనుగోలు చేసిన వినియోగదారులకు 15 వేల రూపాయల ఎయిర్పాడ్స్ను ఉచితంగా అందించనుంది. (ఐపోన్ 12 : ఆపిల్ ఈవెంట్ పై క్లారిటీ) ఈ పరిమిత సమయం ఆఫర్ అక్టోబర్ 17 నుండి ప్రారంభమవుతుంది. 64 జీబీ వేరియంట్ ఐఫోన్ 11 ఆపిల్ ఆన్లైన్ స్టోర్లో రూ .68,300 ధర వద్ద లభిస్తుంది. ఎయిర్పాడ్స్ 14,990 రూపాయలకు విక్రయిస్తోంది. అయితే ఆపిల్ అందించే తాజా ఉచిత ఎయిర్పాడ్స్ ఆఫర్తో ప్రస్తుతం ఐఫోన్ 11 ధర రూ. 53,310 దిగి వచ్చినట్టే. ఆపిల్ వినియోగదారులు గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆపిల్ ఉత్పత్తులపై డీల్స్ సాధారణంగా ఎక్కువ సమయం ఉండవు. సో.. ఆపిల్ ప్రేమికులు..త్వర పడండి!! (అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : ఐఫోన్ 11పై ఆఫర్) కాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా 50వేల రూపాయల లోపు ధరకే ఐఫోన్ 11ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. అటు మరో దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 16-21వరకు బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలకు తెరతీయనున్న సంగతి తెలిసిందే. -
జియోఫై బంపర్ ఆఫర్
ముంబై: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదు నెలల పాటు ఉచిత 4జీ డేటా, జియో-జియో ఫ్రీ ఫోన్ కాల్స్ను ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది జియోఫై 4జీ వైర్ లెస్ హాట్స్పాట్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. జియోఫై రూ.1,999లకు జియో స్టోర్లో కానీ, ఆన్లైన్లో కానీ లభిస్తుంది. అది కొన్న తరువాత జియోఫైకి సంబంధించిన ప్లాన్లలో ఏదో ఒక దానితో సిమ్ను యాక్టివేట్ చేయించుకోవాలి. ఒకసారి సిమ్ యాక్టివేట్ అయిన తరువాత దానిని జియోఫైలో వేసి ఉపయోగించుకోవచ్చు. సిమ్ యాక్టివేట్ అయ్యిందో లేదో అన్న విషయాన్ని మై జియో యాప్లో చెక్ చేసుకోవచ్చు. రూ. 199, రూ 249, రూ. 349 ఆఫర్లతో సిమ్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. వీటిలో అత్యంత చౌకైన ఆఫర్ రూ. 199, దీని ద్వారా 28 రోజుల వాలిడిటితో ప్రతిరోజూ 1.5GB డేటాను పొందవచ్చు. దీనికి అదనంగా జియో ప్రైమ్ సభ్యత్వం పొందటానికి రూ.99లో రిచార్జ్ చేయించుకుంటే 28 రోజులకు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత జియో- జియో కాల్స్, 1000 జియో నుంచి ఇతర మొబైల్ నెట్వర్క్ నిమిషాలు, 140 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్ఎంఎస్లను పొందవచ్చు. రెండవ ఆఫర్ రూ. 249, ఇది 28 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటాను అందిస్తుంది. ఇక్కడ కూడా మీరు అదనంగా రూ. జియో ప్రైమ్ సభ్యత్వానికి 99 రీఛార్జ్ చేయిస్తే రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత జియో-జియో కాల్స్, 28 రోజుల పాటు 1000 జియో నుంచి ఇతర మొబైల్ నెట్వర్క్ నిమిషాలు, 112 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్ఎంఎస్లను పొందవచ్చు. మూడవ ఆప్షన్ రూ. 349, ఇది మీకు 28 రోజుల పాటు ప్రతిరోజూ 3జీబీ డేటాను అందిస్తుంది. రూ. 99 అదనపు, జియో ప్రైమ్ సభ్యత్వంతో 28 రోజుల పాటు మీకు రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత జియో-జియో కాల్స్, 1,000 నిమిషాల జియో - ఇతర మొబైల్ నెట్వర్క్ కాల్స్, 84 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్ఎంఎస్లు లభిస్తాయి. చదవండి: అంబానీ సంచలన నిర్ణయం -
జియో ఫైబర్ ఆఫర్ : జీ5 ప్రీమియం ఉచితం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన జియోఫైబర్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. కంపెనీ సెట్-టాప్ బాక్స్ను ఉపయోగిస్తున్న వారికి జీ 5 ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందించనుంది. మొత్తం 12 భాషల్లో, 1.25 లక్షల ఆన్-డిమాండ్ కంటెంట్ , 100 కి పైగా లైవ్టీవీ చానెల్ల ప్రీమియం కంటెంట్ మొత్తం లైబ్రరీకి యాక్సెస్ లబిస్తుంది. సిల్వర్ త్రైమాసిక, ఆపై ప్లాన్లలో జియో ఫైబర్ వినియోగదారులు జీ 5 ప్రీమియం కంటెంట్కు అర్హులు. జీ5 కాంప్లిమెంటరీ యాక్సెస్ కొత్త , ఇప్పటికే ఉన్న జియో ఫైబర్ వినియోగదారులు, గోల్డ్ ప్లాన్ తోపాటు, త్రైమాసిక లేదా వార్షిక సిల్వర్ ప్రణాళికతో రీఛార్జ్ చేస్తే డిఫాల్ట్గా జీ 5 ప్రీమియం కంటెంట్కు ప్రాప్యత లభిస్తుంది. నెలవారీ సిల్వర్ ప్లాన్లో కొత్త జియోఫైబర్ వినియోగదారుల కోసం, ప్రీమియం కంటెంట్ మొదటి మూడు రీఛార్జ్లకు అందుబాటులో ఉంటుంది. మరింత ప్రీమియం కంటెంట్ కోసం చూస్తున్న వినియోగదారులు ప్రీమియం ఓటీటీ సేవలు, అధిక వేగం, ఎక్కువ బ్రాడ్బ్యాండ్ డేటాను అందించే గోల్డ్ ప్లాన్ను ఎంచుకోవచ్చు అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. జియో గోల్డ్ ప్లాన్ 250 ఎంబీపీఎస్ వరకు డేటా వేగం అన్లిమిటెడ్ ఇంటర్నెట్ (నెలవారీ 1,750 జీబీ డేటా వరకు) అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ జీ 5, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్స్టార్, సోనీలైవ్, సన్నెక్స్ట్, వూట్, ఆల్ట్బాలాజీ, లయన్స్గేట్, హోయిచోయ్, షెమరూమ్, జియో సినిమా, జియోసావ్న్ లాంటి ప్రీమియం ఓటీటీ సేవలను పొందవచ్చు. అన్లిమిటెడ్ వీడియో కాలింగ్ అండ్ కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ కూడా ఉంది) జియో అనువర్తనాలకు అపరిమిత ప్రాప్యత -
పాత బంగారంపై జోయ్ అలుక్కాస్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘జోయ్ అలుక్కాస్’.. హాల్ మార్క్ కలిగిన పాత బంగారాన్ని గరిష్టవిలువకు మార్పిడి చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త బంగారాన్ని మార్చుకోవడం.. లేదంటే, తక్షణ క్యాష్ ఇస్తున్నట్లు వివరించింది. కోవిడ్–19 వైరస్ దృష్ట్యా తమ అన్ని షోరూంలను ప్రభుత్వం, ఆరోగ్య విభాగం ఇచ్చిన సూచనల మేరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. కస్టమర్లు ఆన్లైన్లోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని, కేవలం 10 శాతం మొత్తానికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు వివరించింది. -
యప్టీవీ స్మార్ట్ టీవీ ఆఫర్ విజేతలు వీరే..
హైదరాబాద్ : ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం యప్టీవీ ఇటీవల ప్రవేశపెట్టిన స్మార్ట్ టీవీ (55 ఇంచెస్) ఆఫర్ విజేతలను ప్రకటించింది. తమ వార్షిక ప్యాకేజ్లను కొనుగోలు చేసిన వారిలో లక్కీ కస్టమర్లను ఎంపిక చేసి జూన్ తొలివారం విజేతలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని భారతీయులకు 12కి పైగా భాషల్లో భారత టీవీ ఛానెల్స్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. గత పదేళ్లుగా ఈ సేవలను అందిస్తున్న యప్టీవీ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫాంలలో ఒకటిగా నిలిచింది. యప్ టీవీపై వీక్షకులు ప్రస్తుతం హిందీ, తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ సహా ఇతర భారతీయ భాషల్లో వినోదాన్ని కేవలం కొద్ది డాలర్లు వెచ్చించి ఆస్వాదించవచ్చని సంస్థ పేర్కొంది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో రెండు నెలల పాటు తమిళ, మళయాళం వంటి కొన్ని భాషల్లో తాజా కంటెంట్ కొరవడిన క్రమంలో ప్రస్తుతంతాజా కంటెంట్ అందుబాటులోకి రాగా, తెలుగు, బెంగాలీ, హిందీ చానెల్స్ త్వరలోనే అన్ని షోలు, కార్యక్రమాలకు సంబంధించిన తాజా కంటెంట్తో ముందుకు రానున్నాయి. ఇక స్మార్ట్ టీవీ ఆఫర్లో విజేతల వివరాలు చూస్తే..అమెరికా నుంచి పట్టాభిరాజు ముండ్రు (పెన్సిల్వేనియా), శ్రావ్య గొట్టిపాటి (కాలిఫోర్నియా), ఎల్ సుబ్రమణియన్ (వర్జీనియా), రమేష్ టిమకొందు (కనెక్టికట్), ఆర్ముగం పళనిస్వామి (మిచిగాన్), బ్రిటన్ నుంచి హనుమంతరావు విడదల (లాంక్షైర్), యూరప్ ప్రాంతం నుంచి కిషోర్ రావూరి (స్విట్జర్లాండ్), సమంతా కర్బందా (సింగపూర్), ఆస్ట్రేలియా నుంచి సునీల్ కుమార్ నూతి (న్యూ సౌత్వేల్స్) ఎంపికై స్మార్ట్ టీవీలను గెలుచుకున్నారని యప్టీవీ వెల్లడించింది. చదవండి : ట్రిపుల్ప్లే సేవలు: బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ జోడీ.. -
కోవిడ్-19 రిలీఫ్ : ఎయిర్టెల్ ఆఫర్
ముంబై : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అల్పాదాయ మొబైల్ కస్టమర్లకు ఎయిర్టెల్ భారీ ఊరట కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన క్రమంలో అల్పాదాయ మొబైల్ సబ్స్ర్కైబర్ల కోసం ఏప్రిల్ 17 వరకూ ఇన్కమింగ్ సేవలను కొనసాగించడంతో పాటు రూ 10 టాక్టైమ్ను అందించనున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. దినసరి కార్మికులు, వలస కూలీలకు ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. 8 కోట్ల మంది ఈ తరహా కస్టమర్ల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీని ఈనెల 17వరకూ పొడిగించనున్నట్టు వెల్లడించింది. వారి ప్లాన్ ముగిసినా తమ ఎయిర్టెల్ మొబైల్ నెంబర్లకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్ను వారు రిసీవ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ 10 టాక్టైమ్ను అదనంగా వర్తింపచేస్తామని, దీంతో వారు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో మాట్లాడేందుకు, ఎస్ఎంఎస్లు పంపేందుకు వెసులుబాటు కలుగుతందని తెలిపింది. మరో 48 గంటల్లో ఈ వెసులుబాటు తమ సబ్స్ర్కైబర్లకు అందుబాటులోకి వస్తుందని ఎయిర్టెల్ వెల్లడించింది. చదవండి : మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ -
ఉమెన్స్ డే.. సన్నీ బంపర్ ఆఫర్
ప్రముఖ నటి సన్నీ లియోన్ ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంపై కూడా దృష్టిసారించారు. స్టార్ స్టక్ పేరిట సన్నీ సౌందర్య ఉత్పత్తుల కంపెనీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సన్నీ స్టార్ స్టక్ ప్రొడక్ట్స్ గురించి ప్రచారం చేస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టార్ స్టక్ ప్రొడక్ట్స్పై సన్నీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. ముందుగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సన్నీ.. ఈ అద్భుతమైన రోజున తన స్టార్ స్టక్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. మీ గ్లామర్ కోసం త్వరపడండి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సన్నీ బాలీవుడ్తో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన భర్త, పిల్లలతో సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీ విశేషాలను కూడా సన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారనే సంగతి తెలిసింది. -
ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కంపెనీ ఈ ఆఫర్ను అందుబాటులో ఉంచింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్ మంగళవారం (11న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు కొనసాగే ప్రేమికుల రోజు డిస్కౌంట్లో భాగంగా మొత్తం 10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే ప్రయాణాలపై తాజా డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ వెల్లడించారు. -
రూ. 10కే గర్ల్ఫ్రెండ్ మీ సొంతం.. కండిషన్స్ అప్లై..!
బీజింగ్: ఒంటరిగా వచ్చే కుర్రాళ్ల కోసం చైనాలోని ఓ షాపింగ్ మాల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 10కే గర్ల్ఫ్రెండ్స్ని అద్దెకు పంపుతామంటోంది. దీంతో ఆ షాపింగ్ మాల్కు ఒక్కసారిగా యువకుల తాకిడి పెరిగిపోయింది. షాపింగ్కు వెళ్లే యువకులు అమ్మాయి తోడుగా ఉంటే బాగుండు అని ఫీలవుతుంటారు. ఇలాంటి ఆసక్తిని పసిగట్టిన సదరు షాపింగ్ మాల్ ఒంటరిగా వచ్చే యువకుల కోసం ఈ ఆఫర్ను ప్రకటించింది. మాల్లోకి వెళ్లేముందు 20 నిమిషాలకు రూ. 10 అద్దె చెల్లించి పోడియం వద్దనున్న అమ్మాయిలను తోడుగా తీసుకెళ్లొచ్చు. సమయం దాటితే మాత్రం మనతో వచ్చిన యువతులు వెంటనే పోడియం వద్దకు వచ్చేస్తారు. మనతో ఉన్న సమయంలో ఆ యువతులు షాపింగ్లో ఏవైనా అనుమానాలు వస్తే సాయం చేస్తారు. తోడుగా ఉండటం మాత్రమే కాకుండా షాపింగ్ బ్యాగ్స్ పట్టుకోవడం, పిల్లల్ని ఎత్తుకోవడం వంటి పనులు కూడా చేస్తారు. షాపింగ్ మాల్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లంచ్, డేటింగ్ కోసం కూడా కస్టమర్లు గర్ల్ఫ్రెండ్స్ను తీసుకెళ్లొచ్చు. అందుకోసం రెండు నిబంధనలు పెట్టారు. గర్ల్ఫ్రెండ్గా తీసుకెళ్లినవారిని ముట్టుకోకూడదు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికీ తీసుకెళ్లకూడదంటూ నిబంధనలు కూడా ఉన్నాయి. అన్నీ బానే ఉన్నా షాపింగ్ మాల్ కండిషన్స్ మాత్రం కొందరు యువకుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి. -
టూరిస్టులకు కేంద్రం బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ: టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం భలే ఆఫర్ను ప్రకటించింది. సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ అందించనుంది. ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. కోణార్క్లో ఫిక్కీ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. సంవత్సరం లోపు ఈ టాస్క్ను పూర్తి చేసిన టూరిస్టులను ప్రభుత్వం రివార్డుతో సంత్కరిస్తామన్నారు. టూరిస్టులను మరింత ప్రోత్సాహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్యాటన్ పర్వ్’ కార్యక్రమంలో భాగంగా అతడు /ఆమె 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలి. స్వరాష్టం తప్ప ఇతర రాష్టాల్లో 15 ప్రదేశాలను సందర్శించాలి అనేది ప్రధాన షరతు. ఇందుకు గాను వారికి ప్రోత్సహకక బహుమతిగా ప్రయాణ ఖర్చులను పర్యాటక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. అయితే ఇది నగదు రూపంలో కాకుండా ప్రోత్సాహక బహుమతిగా వుంటుందని స్పష్టం చేశారు. సంబంధిత ఫోటోలను తమ వెబ్సైట్లో పొందు పరుస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తిస్తామన్నారు. త్వరలోనే కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని 'ఐకానిక్ సైట్ల' జాబితాలో చేర్చనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి తెలిపారు. అంతేకాదు టూరిస్టు గైడ్స్గా పనిచేయాలనుకునే అభ్యర్థుల కోసం పర్యాటక మంత్రిత్వశాఖ సర్టిఫికేట్ ప్రొగ్రామ్ కూడా నిర్వహిస్తోంది. కానీ ఈ కార్యక్రమంలో ఒడిశా పాల్గొనడం చాలా తక్కువ, దీనిని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపైందర్ బ్రార్ అన్నారు. మరోవైపు మరిన్ని పర్యాటక ప్రదేశాలను అనుసంధానించడానికి మరిన్ని పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టాలని ఫిక్కీ ఈస్టర్న్ టూరిజం కమిటీ చైర్మన్ సౌభాగ్య మోహపాత్ర కోరారు. -
కరోనా : ఎయిరిండియా, ఇండిగో కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, ప్రయివేటు రంగవిమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రానున్న నెలలో చైనానుంచి వస్తున్న, లేదా చైనాకు వెళుతున్న ప్రయాణికులకు ఒక వెసులుబాటును ప్రకటించింది. ఈ ప్రయాణానాకి సంబంధించి ఇప్పటికే బుక్ చేసుకున్న అంతర్జాతీయ విమాన టికెట్ల తేదీ మార్పును లేదా ఉచిత కాన్సిలేషన్ ఆఫర్ను అందిస్తున్నాయి. జనవరి 24 - ఫిబ్రవరి 24 వరకు ప్రయాణించే అన్ని విమానాల్లో ఈ ఆఫర్ను అమలు చేయనున్నాయి. మాఫీ పెనాల్టీ ఛార్జీలపై మాత్రమే ఉంటుందని వివరించాయి. ఈ వివరాలను ఎయిరిండియా, ఇండిగో ట్విటర్ వేదికగా షేర్ చేశాయి. ఇండిగో ప్రస్తుతం చైనాకు రెండు డైరెక్టు విమానాలను నడుపుతోంది, ఒకటి ఢిల్లీ-చెంగ్డు మార్గంలో, మరొకటి కోల్కతా-గ్వాంగ్జౌ మార్గంలో ఉంది. దీంతోపాటు మార్చి 15 నుండి ముంబై-చెంగ్డు మార్గంలో రోజువారీ విమాన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఎయిర్ ఇండియా ఢిల్లీ-షాంఘై మార్గంలో ఒక డైరెక్ట్ విమానాన్ని నడుపుతోంది. కాగా చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకారం, కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 26 మంది మరణించారు. ఇరవై తొమ్మిది ప్రావిన్సులలో ఈ వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా హుబీ ప్రావిన్స్లో 880 కి పైగా కేసులు నమోదయ్యాయి. శరవేగంగా విస్తరిస్తున్న కరోనాను నిలువరించే చర్యల్లో భాగంగా 13 నగరాల మధ్య రాకపోకలను చైనా ప్రభుత్వం నిలిపివేయడంతో చైనాలో లునార్ నూతన సంవత్సర వేడుకలను భారీగా ప్రభావితం చేస్తోంది.. చదవండి : కేరళకు పాకిన కరోనా? ‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు #FlyAI : In view of #coronovirusoutbreak Reissue/ No-Show/Cancellation and Refund charges for all International tickets for Travel to/from China effective 24.01.2020 to 24.02.2020 is waived off. Waiver is ONLY on the penalty charges. Any fare difference will be additional. — Air India (@airindiain) January 24, 2020 #6ETravelAdvisory: Due to #CoronavirusOutbreak, we're offering change/cancellation fee waiver to passengers travelling to/from #China, effective 24th Jan to 24th Feb, 2020, fare difference if any will be applicable. For assistance contact us on Twitter/Facebook. pic.twitter.com/29HZCpvvEm — IndiGo (@IndiGo6E) January 24, 2020 -
భారీ డిస్కౌంట్.. రూ.899లకే టికెట్!
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 899కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. ‘ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్.. డిసెంబర్ 23 (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్ ఈ నెల 26న రాత్రి 11 గంటల 59 నిమిషాలకు ముగియనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్ వర్తిస్తుంది. విదేశీ ప్రయాణానికి ప్రారంభ టికెట్ ధర రూ. 2,999గా కంపెనీ ప్రకటించింది. ఇండిగో వెబ్సైట్, యాప్ల ద్వారా బుకింగ్ చేసుకుంటే సౌలభ్య రుసుము (కన్వీనియన్స్) లేదని వెల్లడించింది. -
నిస్సాన్ ‘రెడ్ వీకెండ్స్’ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇండియా తాజాగా ‘రెడ్ వీకెండ్స్’ పేరిట సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా నిస్సాన్ కిక్స్ కారు కొనుగోలుపై రూ.1.15 లక్షల మేర ప్రయోజనాన్ని ఇస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 40000, ఎక్సే్ఛంజ్ డిస్కౌంట్ రూ. 40000, కార్పొరేట్ డిస్కాంట్ రూ. 10000, వారెంటీ విలువ రూ. 20500 ఉన్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ మోడల్తో పాటు డాట్సన్ కార్లను కేవలం 6.99 శాతం వడ్డీ రేటుకే అందిస్తున్నట్లు వెల్లడించారు. -
యాపీ ఫిజ్ బంపర్ ఆఫర్..
పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రొడక్ట్ యాపీ ఫిజ్ తన వినియోగదారులకు స్మార్ట్ఫోన్లను బహుమతిగా ఇస్తోంది. ప్రమోషన్లో బాగంగా నాలుగు శాంసంగ్ గెలాక్సీ 10 ప్లస్ స్మార్ట్ఫోన్లను గ్రాండ్ప్రైజ్గా అందివ్వనుంది. నవంబరు 7 నుంచి 22 వరకు ఈ పోటీ అందుబాటులో ఉంటుంది. పోటీలో పాల్గొనాలంటే.. దేశ వ్యాప్తంగా ఆ పోటీ అందుబాటులో ఉంది. ఫీల్ ద ఫిజ్ అధికారిక ఇన్స్టగ్రామ్ను పేజీని ఫాలో కావాలి. యాపీ ఫిజ్తో కలిపి మీకు నచ్చిన ఏ ఆహారాన్ని జతగా తీసుకుంటే బాగుంటుంది? అనే విషయాన్ని ఫోటోలు, వీడియోలతో సహా జతచేయాలి. పోటీలో పాల్గొనాల్సిందిగా మీ స్నేహితులను ఆహ్వానించాలి. తద్వారా మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు. ప్రతి వారం లక్కీ విజేతలు ఆర్టోఫ్ ఫిజ్ మర్చండైజ్ గెలుచుకోవడానికి అర్హులు. అలాగే 4 మంది అదృష్ట విజేతలను ప్రకటిస్తుంది. వీరు శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్ను గెలుచుకోవచ్చు. కాగా దక్షిణ భారతంలో యాపీ ఫిజ్ ప్రచారకర్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్విటర్ ఖాతాలో ఈ కాంటెస్ట్ గురించి పోస్ట్ చేశారు. తన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి, బహుమతులు గెలుచుకోవచ్చని సూచించారు. దీంతో అటు యాపీ ఫిజ్ ఫ్యాన్స్, ఇటు యంగ్టైగర్ ఫ్యాన్స్ ట్విటర్లో ఇమేజ్లు, వీడియోలతో సందడి చేస్తున్నారు. పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు '@iamappyfizz', '#ArtofFizz' హ్యాష్ ట్యాగ్ లను పరిశీలించాలి. What is your favourite food that you'd like to pair with @iamappyfizz ? Let your friends on Twitter know and win cool stuff. Follow @iamappyfizz for more details #ArtofFizz pic.twitter.com/5zMxzS1Uae — Jr NTR (@tarak9999) November 12, 2019 My Caption : #FEELTHEFIZZ #ARTOFFIZZ To have good health we need to take proper meal @iamappyfizz To have good health and Energetic we need to take Proper meal and Fizz drinks.Satisfied meal cannot be satisfied without Appy Fizz.Keep cool and always chill with Appy fizz drink pic.twitter.com/X5vaeL1s4H — Anusuresh (@Anusure40893798) November 11, 2019 -
సెకండ్ దివాలీ : టాటా మోటార్స్ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీదారు టాటా మోటార్స్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా మోటార్స్ ఎస్యూవీని, లేదా పిక్ అప్ ట్రక్ను కొనుగోలు చేసిన వినియోగదారులకు అద్భుతమైన బహుమతిని గెలచుకునే అవకాశాన్ని కల్పించింది. తద్వారా ప్రజలకు మరో దీపావళి వెలుగులునింపనున్నామని టాటా మోటార్స్ తెలిపింది. టాటామోటర్స్ ఎస్యూవీ ని లేదా పిక్ అప్ ట్రక్ను కొనుగోలు చేసిన కస్టమర్లకు (టీవీ, వాషింగ్ మెషీన్, మిక్సీ తదితర) ఒక గిఫ్ట్ను అందివ్వనుంది. అంతేకాదు దీంతో పాటు సుమారు రూ. 5లక్షల విలువైన బంగారాన్ని ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ నవంబరు 1నుంచి 30వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. Ab India manayega is saal ki doosri Diwali. Kharidiye Tata Motors SCV ya Pick-up trucks aur paaiye assured gifts aur mauka 5 lakh tak ka gold voucher jeetne ka. Offer valid from 1st to 30th November 2019. #DoosriDiwali @akshaykumar pic.twitter.com/KlPr2JItPV — Tata Motors (@TataMotors) November 9, 2019 -
జోయ్ అలుక్కాస్లో బంగారం కొంటే వెండి ఫ్రీ
ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయ్ అలుక్కాస్ ‘డబుల్ ద జాయ్’ పేరుతో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. బంగారం కొనుగోలు చేసిన వారికి అదే బరువు ఉండే వెండిని ఉచితంగా ఇస్తోంది. పండుగల సీజన్లో తమ కస్టమర్లు విశేష స్పందన చూసిన నేపథ్యంలో ఆఫర్లను పొడిగించడంలో భాగంగా బంగారాన్ని కొంటే వెండిని ఫ్రీగా ఇస్తున్నట్లు సంస్థ ఎండీ జోయ్ అలుక్కాస్ అన్నారు. పాత బంగారాన్ని సున్నా శాతం తగ్గింపుతో మార్చుకోవచ్చని, ఏడాది ఉచిత బీమా అందిస్తున్నామని వివరించారు. -
30 శాతం రాయితీతో నచ్చిన వాహనం..
ప్రభుత్వ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్నాడు. పలువురిని నమ్మించి 30 శాతం రాయితీతో వాహనాలను విక్రయించాడు. వారు మరికొంత మందికి చెప్పటంతో మోసం మొదలుపెట్టాడు. ఈ నకిలీ పథకం అంతటా వ్యాపించడంతో వ్యాపారం మరింత పెరిగింది. సుమారు 110 వాహనాలను విక్రయించాడు. రూ.కోట్లలో వ్యాపారం సాగింది. ప్రస్తుతం గుట్టు రట్టుకావడంతో సదరు వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళం ,టెక్కలి రూరల్: టెక్కలి బాలాజీనగర్–2లో నివాసముంటున్న జి.హెచ్.రాజా అలియాస్ తిరుపతిరావు (పాస్టర్) గత కొద్ది నెలలుగా టెక్కలితోపాటు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, సారవకోట, నరసన్నపేట, జలుమూరు తదితర మండలాల ప్రజలకు 30 శాతం రాయితీతో నచ్చిన వాహనం విక్రయిస్తానని నమ్మబలికాడు. కొంత కాలం తర్వాత వాహనాలు కావాలనుకునే వారికి నెల రోజల వ్యవధిలో ఇస్తామని చెప్పేవాడు. సుమారు 216 మంది వరకు వాహనాల కోసం డబ్బులు చెల్లించారు. కొంతమందికి వాహనాలు ఇస్తామన్న సమయానికి ఇవ్వకపోడంతో ప్రశ్నించారు. నోయిడాలోని మొయిన్ బ్రాంచ్ నుంచి తన వద్దకు వాహనాలు రాలేదని, వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.3 కోట్ల 20 లక్షల వరకు వసూలు చేశాడని తెలుస్తోంది. ప్రజల వద్ద సేకరించిన డబ్బులతోనే కొన్నొ వాహనాలు కొనుగోలు చేసేవాడు. ఎవరైనా పలుకుబడి ఉన్నవారికి వాహనాలు ఇచ్చి వారిని నమ్మించుకుంటూ వస్తున్నట్లు సమాచారం. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, నూర్పుడి యంత్రాలు వంటివి 30 శాతం తక్కువ రేటుకు ఇస్తామనడంతో పేద, మధ్య తరగతి ప్రజలతోపాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ నకిలీ స్కీం మాయలో పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి హైదారాబాధ్లో కూడా బ్రాంచ్ ఉన్నట్లు సమాచారం. దానిని అక్కడ ప్రశాంత్కుమార్ అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. చల్ల రాజా ప్రవర్తనపై అనుమానం వచ్చిన సంతబొమ్మాళి గ్రామానికి చెందిన సిమ్మ కృష్ణరావు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ కామేశ్వరరావు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టెక్కలిలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయం గుట్టు రట్టు.. రాజా అలియాస్ తిరుపతిరావుది పాతపట్నం మండలం తెంబూరు గ్రామం. పదో తరగతి సైతం ఉతీర్ణత చెందలేదు. గ్రామంలో పాస్టర్గా ఉన్నారు. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్లో ఇల్లు కూలిపోవడంతో టెక్కలికి వచ్చాడు. ఈ సమయంలోనే హైదారాబాధ్లోని ప్రశాంత్కుమార్తో పరిచడం ఏర్పడింది. ఇరువురు కలిసి ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని ఈ నకిలీ వ్యాపారం గుట్టుగా సాగించారు. ప్రజల వద్ద నుంచి మరింత మొత్తం సేకరించి ఆ సొమ్ముతో వచ్చే ఏడాదిలోగా ఉడాయించేందుకు పక్కా ప్రణాళికలు వేసికున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
జాక్పాట్ కొట్టేసిన ఎస్ బ్యాంకు
సాక్షి, ముంబై : వివాదంలో చిక్కుకుని సంక్షోభంలో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు ఎస్బ్యాంకు జాక్ పాట్ కొట్టినట్టు తెలుస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్ ద్వారా భారీ పెట్టుబడులను సాధించనుంది. 1.2 బిలియన్ (సుమారు రూ.8400 కోట్లు) డాలర్ల పెట్టుబడి బైండింగ్ ఆఫర్ అందుకున్నట్లు ఎస్బ్యాంకు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈక్విటీ వాటాల ద్వారా ఈ పెట్టుబడులనుపొందనున్నట్టు తెలిపింది. అయితే ఇది రెగ్యులేటరీ ఆమోదాలు / షరతులతో పాటు బ్యాంక్ బోర్డు, వాటాదారుల ఆమోదాలకు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఈ ప్రకటన తర్వాత ఎస్ బ్యాంకు షేర్లు 35 శాతం జంప్ చేశాయి. హాంకాంగ్కు చెందిన ఎస్పీజీపీ హోల్డింగ్స్ ఈ భారీ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించింది. అలాగే ఇతర దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చలు పురోగతిలో ఉన్నాయని కూడా బ్యాంకు తెలిపింది. నవంరు 1న విడుదల చేయనున్న త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈ డీల్పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా నిధుల సేకరణ కోసం ఇతర ప్రపంచ, దేశీయ పెట్టుబడిదారులతో చర్చలను ముమ్మరం చేసిన నేపథ్యంలో తాజా పెట్టుబడులను సాధించింది. అదనపు మూలధనాన్ని సమీకరించడానికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, వ్యూహాత్మక పెట్టుబడిదారులు చర్చలు జరుపుతున్నట్లు సీఈఓ రవ్నీత్ గిల్ సెప్టెంబర్ 25న ప్రకటించిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: మొబైల్ దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ తగ్గింపు ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 8వేల తగ్గింపుతో గెలాక్సీ ఏ80 స్మార్ట్ఫోన్ను రూ.39.990కే విక్రయిస్తోంది. ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ఫోన్ తరువాత జూలైలో ఇండియాలో విడుదలైంది. అప్పటి దీని ధర (8జీబీ ర్యామ్/128 జిబి స్టోరేజ్) 47,990 రూపాయలు. డబుల్ రియర్ కెమెరా సెటప్తో 48ఎంపీ భారీ కెపాసిటీ రొటేటింగ్ కెమెరా ప్రత్యేక ఫీచర్గా వచ్చిన ఏ80 స్మార్ట్ఫోన్ కెమెరా సెటప్ ను రెండు వైపులా మార్చుకోవడానికి అవకాశం ఉంది. సెల్ఫీల కనుగుణంగా కెమెరాలో సెల్ఫీ మోడ్ను ఎంచుకుంటే ఇది ఆటోమ్యాటిక్ గా తిరుగుతుంది. ప్రస్తుతం శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, అమెజాన్.ఇన్, ఫ్లిప్కార్ట్లో ఈ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ 80 ఫీచర్లు 6.7-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730జీ సాక్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా + 8 ఎంపీ 123డిగ్రీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి : అద్భుత కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ ఏ80 -
అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఈ పండుగల సీజన్లో కస్టమర్లకు భారీ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ‘గ్రేట్ ఇండియాన్ ఫెస్టివల్’ పేరిట ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు భారీ ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ క్యాటగిరీ మెనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసినవారికి 10 శాతం డిస్కౌంట్ ఉంటుదన్నారు. బజాన్ ఫిన్సర్వ్, కార్డుల ద్వారా కొనుగోలుచేసిన వారికి నో–కాస్ట్ ఈఎంఐ ఆఫర్ వర్తిస్తుంది. లక్షలాది సెల్లర్స్ అత్యంత తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమెజాన్లో అందించనున్నారని పేర్కొన్నారు. వేగవంతమైన డెలివరీ, 30–రోజుల మార్పిడి విధానం ఈసారి ప్రత్యేకతలన్నారు. గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్ విభాగాల్లో అమ్మకాలు పెరుగుతున్నాయన్నారు. -
భారీ డిస్కౌంట్లను ప్రకటించిన మారుతీ
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తాజాగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మోడల్ ఆధారంగా రూ. 1.12 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. విటారా బ్రెజా, స్విఫ్ట్, డిజైర్, సియాజ్ కార్లకు ఈ స్థాయి వరకు డిస్కౌంట్ వర్తిస్తుందని వివరించింది. విటారా బ్రెజాకు కస్టమర్ ఆఫర్ రూ. 50,000, ఎక్సే్ఛంజ్ ఆఫర్ రూ. 20,000, కార్పొరేట్ ఆఫర్ రూ. 10,000, ఐదేళ్ల వారెంటీ కలుపుకుని మొత్తంగా రూ. 1.01 లక్షల వరకు డిస్కౌంట్ ఉన్నట్లు తెలియజేసింది. ఇదే తరహాలో అన్ని వాహనాలకు ఆఫర్ ఉన్నట్లు స్పష్టంచేసింది. ఆల్టో, ఆల్టో కే10 పెట్రోల్ వేరియంట్లకు రూ.65,000 వరకు ఆఫర్ ప్రకటించింది. స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్కు రూ. 50,000 డిస్కౌంట్.. డీజిల్ వేరియంట్కు రూ.77,700 డిస్కౌంట్ ఇస్తోంది. డిజైర్ పెట్రోల్ వేరియంట్కు రూ. 30,000 తగ్గింపు.. డీజిల్ వేరియంట్కు రూ. 20,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఈకో సెవన్ సీటర్ డిస్కౌంట్ రూ. 25,000 ఉండగా.. బాలెనో, సియాజ్ కార్లకు ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. -
‘బికినీ’ ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్ రూ.9 కే టికెట్
సాక్షి, న్యూఢిల్లీ : వియత్నాంకు చెందిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. బికినీ ఎయిర్లైన్స్గా పేరొందిన ఈ విమాన సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇండియా-వియత్నాం మధ్య డిసెంబరు నుంచి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించనున్నట్లు వియత్ జెట్ మంగళవారం తెలిపింది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది. హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని సంస్థ వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధర రూ. 9 అంతేకాదు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. త్రి గోల్డెన్ డేస్ పేరుతో స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో "సూపర్-సేవింగ్ టిక్కెట్లను" అందిస్తోంది. విస్తరిస్తున్న నెట్వర్క్లో భారతదేశం తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని వియత్జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్ తన్ సన్ తెలిపారు. కాగా వియత్జెట్ డిసెంబర్ 2011 లో పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు. అంతేకాదు, ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి. మరోవైపు చైనాలో జరిగిన ఆసియా కప్పోటీలకు వియత్నాం అండర్ -23 ఫుట్బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో 'బికినీలు ధరించిన మోడల్స్' ఉన్న కారణంగా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వియత్నాం (సిఎవి) జనవరి 2018 లో వియత్ జెట్కు జరిమానా కూడా విధించింది. -
బెంజ్ కార్లపై బంపర్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో తమ కార్ల అమ్మకాలు పడిపోయిన నేపథ్యంలో, కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లను అందిస్తోంది మెర్సిడెస్ బెంజ్. ముఖ్యంగా దఫల వారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తోంది. ఇంకా సరసమైన ఈఎంఐ సదుపాయం, రెండేళ్ల కాంప్లింమెంటరీ ఇన్సూరెన్స్ లాంటి ఆఫర్లను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై ఈ ఆఫర్లను అందించనున్నమాని బెంజ్ గురువారం ప్రకటించింది. ఈ ఆఫర్లకు తోడు రెండు తమ వాహనాలపై తాజా అప్గ్రేడ్స్ను అదనంగా ఎలాంటి చార్జ్ వసూలు చేయకుండానే అందిస్తామని మెర్సిడెస్ బెంజ్ ప్రకటనలో తెలిపింది. ఆఫర్లలో భాగంగా, ఒక కస్టమర్ వాహనం ఖరీదులో నాలుగింట ఒక వంతు ప్రారంభ చెల్లింపుగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని మూడు సమాన వార్షిక వాయిదాలలో చెల్లించి మెర్సిడెస్ బెంజ్ కారును సొంతం చేసుకోవచ్చు. సి, ఇ, ఎస్-క్లాస్, సీఎల్ఎ, జీఎల్ఎ, జీఎల్సి, జీఎల్ఇ, జీఎల్ఎస్ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది కాకుండా, కస్టమర్ 60 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని కారును కూడా సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు..40 శాతం దాకా తక్కువ ఈఎంఐ ఆఫర్ కూడా అందిస్తోంది. మెయింటెనెన్స్, వారంటీ, కచ్చితమైన బై బ్యాక్ ఆఫర్ కూడా ఇందులో భాగం. దీంతోపాటు రెండేళ్ల కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ ఉచితం. కొనుగోలు విషయంలో వినియోగదారుడికి ఆర్థిక సౌలభ్యాన్ని అందించడం ద్వారా కస్టమర్ విశ్వాసాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో ఈ ఆఫర్లను తీసుకొచ్చామని, భారతీయ వినియోగదారుల నాడిని అర్థం చేసుకున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. అలాగే తమ మొత్తం పోర్ట్ఫోలియో బీఎస్ -6 నిబంధనలకనుగుణంగా క్రమంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 60 శాతం సాధించామని, 2019 సెప్టెంబర్ నాటికి 80 శాతానికి చేరుకుంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్, 2020 కాలపరిమితి కంటే ముందే తమ మొత్తం పోర్ట్ఫోలియో బీఎస్-6 పరివర్తన సాధిస్తామన్నారు. ఆటో పరిశ్రమ 2001 నుండి మందగమనాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది 40 వేల యూనిట్లకు పైగా విక్రయించిన సంస్థ ప్రస్తుత సంవత్సరం జనవరి-జూన్ కాలంలో 3 నుంచి 5 వేల కార్లను విక్రయించింది. -
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శ్రావణ సంబరాలు
ఆషాఢమాసం ఆఫర్లను శ్రవణమాసంలోనూ కొనసాగించాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం నిర్ణయించింది. ఆషాఢమాసంలో కస్టమర్ల నుంచి వచ్చిన విశేష స్పందన నేపథ్యంలో... దక్షిణాది వాసులకు అత్యంత శుభప్రదమైన శ్రావణమాసంలో సైతం ఆఫర్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. షోరూమ్లలో సరికొత్త స్టాక్స్ను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఆషాఢమాసంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తూకం పద్దతిలో ప్రవేశపెట్టిన నంబర్ వన్ కిలో సేల్కు మంచి ఆదరణ లభించిందని తెలిపింది. అన్ని రకాల సరికొత్త స్టాక్పై 66 శాతం వరకూ ఇచ్చిన తగ్గింపు చీరల అమ్మకాన్ని భారీగా పెంచిందని కూడా పేర్కొంది. -
ఫ్రెండ్షిప్ డేకు ‘హాయ్’ రెస్టారెంట్ ఆఫర్లు
సాక్షి, సిటీబ్యూరో: స్నేహితుల దినోత్సవాన్ని(ఆగస్టు 4న) పురస్కరించుకొని బేగంపేట్లోని ‘హాయ్’ రెస్టారెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు రెస్టారెంట్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. బృందాలుగా వచ్చే స్నేహితుల కోసం ఫుడ్, డ్రింక్స్పై ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్న్ చాట్, మసాలా ఫ్రైస్, ఆంధ్రా చిల్లీ చికెన్, హాయ్ ఫ్రైండ్ తందూరి చికెన్ వంటి వంటకాలతో స్పెషల్ మెనూ సిద్ధం చేసినట్టు తెలిపారు. -
చిల్లీ చికెన్కు ఆషాడం ఆఫర్
చెన్నై, టీ.నగర్: ఆషాడం నెలలో వరుసగా వచ్చే మారియమ్మన్ ఆలయాల ఉత్సవాలతో సేలంలో చిల్లి చికెన్కు ఆడి ఆఫర్ ప్రకటించారు. ఆషాడం మాసం ప్రారంభం కావడంతో అమ్మవారి ఆలయాలలో భక్తులు వ్రతం ఉంటున్నారు. దీంతో చికెన్, మటన్ విక్రయాలు తగ్గి రేట్లు కూడా భారీగా రేట్లు తగ్గాయి. సేలంలోని మారియమ్మన్ ఆలయాల్లో 23వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో చిల్లీ చికెన్ విక్రయాల్లో పతనాన్ని తగ్గించుకునేందుకు వ్యాపారుల ఆషాడం ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. దీనిగురించి వ్యాపారులు మాట్లాడుతూ ప్రత్యేక ఆఫర్ ద్వారా చిల్లి చికెన్ విక్రయాలు ఎప్పటిలా సాగుతున్నట్లు వివరించారు. -
ఐసీసీ వరల్డ్ కప్ : జియో బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచ్లు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తూ యూజర్లను సర్ప్రైజ్ చేసింది రిలయెన్స్ జియో. వరల్డ్ కప్లో జరిగే అన్ని మ్యాచ్లను జియో యూజర్లు ఉచితంగా చూడవచ్చు. అంతేకాదు మ్యాచ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. మై జియో యాప్ ద్వారా కొన్ని ఆకర్షణీయమైన బహుమతులను గెల్చుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. అయితే ఈ అల్లిమిటెడ్ క్రికెడ్ సీజన్ ఎంజాయ్ చేయాలంటే క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ రూ.251 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్తో జియో యూజర్లకు రూ.365 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. యూజర్లకు ఇలాంటి ఆఫర్ను తాము తప్ప మరి ఏ ఇతర ఆపరేటర్లు అందించడం లేదని జియో తెలిపింది. జియో టీవీ యాప్ ద్వారా హాట్స్టార్లో లైవ్ క్రికెట్ చూడొచ్చు. జియో యూజర్లందరికీ హాట్స్టార్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ రీచార్జ్ చేసుకున్న యూజర్లకు జియో టీవీ యాప్ ఓపెన్ చేయగానే హాట్స్టార్కు రీడైరెక్ట్ అవుతుంది. రూ.251 జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకున్న వారికి 51 రోజుల పాటు రోజుకు 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. స్కోర్స్, మ్యాచ్ షెడ్యూల్స్, రిజల్ట్స్ తెలుసుకోవడంతో పాటు కాంటెస్ట్లో పాల్గొనొచ్చు. ఈ గేమ్ జియో, నాన్ జియో సబ్స్క్రైబర్లకు అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మైజియో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ బాల్, ప్రతీ ఓవర్, ప్రతీ మ్యాచ్కు ఏం జరుగుతుందో కాంటెస్ట్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా పాయింట్లు గెలుచుకోవచ్చు. ఎక్కువ పాయింట్స్ గెలిచినవారికి బహుమతులు ఉంటాయి. -
కస్టమర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై : ప్రముఖ మొబైల్ ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటీటీ ప్లాట్ఫా జీ5లో ఉచిత ఆఫర్ను అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్గా ఈ కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా తమ ప్లాటినమ్ పోస్ట్ పేయిడ్ కస్టమర్లకు అపరిమిత జీ5 కాంప్లిమెంటరీ యాక్స్సెస్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే రూ.499, అంతకంటే ఎక్కువ ప్లాన్ కలిగిన పోస్ట్ పేయిడ్ కస్టమర్లు దీనికి అర్హులు. మై ఎయిర్టెల్ యాప్ ద్వారా వినియోగదారులు ఈ ఆఫర్ను పొందవచ్చు. ఎయిర్టెల్ ఇప్పటికే నెట్ఫ్లిక్స్ మూడు నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 12 నెలల పాటు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్టెల్ ప్లాటినమ్ కస్టమర్లు తాజాగా జీ5 విస్తృతమైన డిజిటల్ కంటెంట్ను ఉచితంగా పొందవచ్చు.ఇందులో జీ5 ఒరిజినల్స్, మూవీస్, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు, లైఫ్ స్టైల్ షోలు, కిడ్స్ షోలు, ప్లేస్ ఉంటాయి. ఎయిర్టెల్ థ్యాంక్స్ కు అద్భుతమైన స్పందన వచ్చిందని , ఈ సందర్భంగా జీ5 ఆఫర్ అందివ్వడం సంతోషంగా ఉందని భారతి ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శాశ్వత్ శర్మ వెల్లడించారు. ఎగ్జిస్టింగ్ ప్లాటినమ్ కస్టమర్లకు జీ5 అందిస్తుండటం సంతోషకరమైన విషయమని చెప్పారు. ఎయిర్టెల్ ప్లాటినం కస్టమర్లకు ఉచిత ఆఫర్ జీ5తో తమ స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ మరింత దృఢమవుతుందని భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. వినియోగదారులకు మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ అందించడంలో ఇది కీలక అడుగు అని జీ 5 బిజినెస్ హెడ్ మనీష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. -
జియో, ఎయిర్టెల్కు కౌంటర్ : వొడాఫోన్ సూపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశం తరువాత నుంచి జోరందుకున్న టారిఫ్ల వార్ కొనసాగుతోంది. తాజాగా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, జియోకు షాకిచ్చేలా వొడాఫోన్ అద్భుత ఆఫర్ ప్రకటించింది. తాజాగా, వొడాఫోన్ తన యూజర్లకోసం సూపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీబ్యాంక్ భాగస్వామ్యంతో సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ను తీసుకొచ్చింది. ఇది వోడాఫోన్ ఎగ్జిస్టింగ్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్ లాంటి ప్రయోజనాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఇందులో సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ప్యాకేజీలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత ఫోన్ కాల్స్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది. ఇది కేవలం వొడాఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. వొడాఫోన్ వెబ్సైట్ ద్వారా సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఇప్పటికే వోడాఫోన్ యూజర్ అయి ఉండాలి. (ఫస్ట్ టైమ్ వోడాఫోన్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు) . సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన నెల రోజుల్లోనే క్రెడిట్ కార్దు ద్వారా ఒకేసారి లేదా దఫ దఫాలుగా రూ.4,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. వోడాఫోన్ లేదా ఐడియా వెబ్సైట్ ద్వారాగానీ, ఎక్కడైనా ఖర్చు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ మొత్తం ఖర్చు చేసిన అనంతరం ఆటోమేటిక్గా వొడాఫోన్ ఆఫర్కు యూజర్ అర్హుడవుతారు. ఇందుకు సంబంధించిన బెనిఫిట్స్ 45 రోజుల్లో వొడాఫోన్కు క్రెడిట్ అవుతాయి. ఆ తర్వాత నుంచి రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు పంపించుకునే సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆఫర్ వాలిడిటీ సంవత్సరం (365) రోజులు. అయితే ఈ ఆఫర్ కొన్ని సర్కిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది ఈ కొత్త ప్రీపెయిడ్ ఆఫర్ పరిమిత సర్కిళ్లకు మాత్రమే అంటే..ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరు, వడోదర, చండీగఢ్, సికింద్రాబాద్, కోల్కతా, చెన్నై, పుణే నగరాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని సర్కిల్స్లో ఈ ఆఫర్ను విస్తరిస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వోడాఫోన్ వెబ్సైట్ ప్రకారం ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు ఉంది. మరిన్ని వివరాలు వొడాఫోన్ వెబ్సైట్లో కాగా ఎయిర్టెల్ తరహాలోనే వొడాఫోన్ కూడా 1699 రూపాయల వార్షిక ప్లాన్ను ఇప్పటికే లాంచ్ చేసింది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్తోపాటు రోజుకు 100ఎస్ఎంఎస్లు, 1 జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
చీరల @ రూ.10.. ఎగబడ్డ మహిళలు.. తొక్కిసలాట
-
రూ.10కే చీర.. తొక్కిసలాట
సాక్షి, సిద్ధిపేట: ఆఫర్ల పేరుతో సిద్ధిపేట పట్టణంలో ఓ వస్త్ర దుకాణం మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. పది రూపాయలకే చీర అని ప్రకటించడంతో సీఎంఆర్ షాపింగ్ మాల్కు మహిళలు భారీగా తరలివచ్చారు. సిద్ధిపేట చుట్టుపక్కల నుంచి కూడా మహిళలు తరలిరావడంతో వీరిని అదుపు చేయడం దుకాణం నిర్వాహకులకు కష్టంగా మారింది. చవక ధరలో లభ్యమయ్యే చీరలను దక్కించుకునేందుకు మహిళలు పోటీ పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మహిళలకు గాయాలయ్యాయి. కొంతమంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఓ మహిళ నుంచి దుండగులు 5 తులాల బంగారం చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, సరైన ఏర్పాట్లు చేయకుండా తమను ఇబ్బంది పెట్టిన షాపింగ్ మాల్ నిర్వాహకులపై మహిళలు మండిపడుతున్నారు. మీ వ్యాపారం కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.101లకే వివో స్మార్ట్ఫోన్
సాక్షి,ముంబై: కొత్త సంవత్సరం సందర్భంగా చైనా మొబైల్ కంపెనీ వివో బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూఫోన్, న్యూ ఆఫర్ పేరుతో కేవలం రూ.101 చెల్లించు అంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ డిసెంబర్ 20నుంచి జనవరి 21, 2019 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ ద్వారా ఆన్ నెక్స్, వి11 ప్రొ, వి11, వై 95, వై 83, వై 81(4జీ) స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. మొదట 101రూపాయలు చెల్లించి నిర్దేశిత స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్ విలువ మొత్తాన్ని ఆరు సులభ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీబీ, క్యాపిటల్ ఫస్ట్ లాంటి సంస్థల ద్వారా ఫైనాన్సింగ్ సదుపాయం ఉంది. #NewPhoneNewYou Pay just INR 101 and own a new Vivo smartphone. Start this new year on the right note - with the right phone. Know more https://t.co/wzYDFH67Bg pic.twitter.com/ifZJsEzUwv — Vivo India (@Vivo_India) December 24, 2018