నల్లధనంపై సెబీ యుద్ధం | SEBI on black money war | Sakshi
Sakshi News home page

నల్లధనంపై సెబీ యుద్ధం

Published Fri, Aug 21 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

నల్లధనంపై సెబీ యుద్ధం

నల్లధనంపై సెబీ యుద్ధం

 59 సంస్థలపై నిషేధ
 
 న్యూఢిల్లీ : పన్ను ఎగవేత కోసం స్టాక్ మార్కెట్లను ఉపయోగించుకున్నందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 59 సంస్థలపై నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలు  ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలను నిర్వహించవు. నిషేధానికి గురైన వాటిల్లో హెచ్‌ఎన్‌ఐ, రిద్దిసిద్ధి బులియన్స్, వుడ్‌ల్యాండ్ రిటైల్స్, మహా కాళేశ్వర్ మైన్స్, శ్రీ కమోడిటీస్ తదితర సంస్థలు ఉన్నాయి. అలాగే ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఆదాయ పన్ను శాఖను కోరింది. బీఎస్‌ఈలో స్టాక్ ఆప్షన్ల ద్వారా కొన్ని సంస్థలు ఎప్పుడూ నష్టాలను, మరికొన్ని ఎప్పుడూ లాభాలను గడిస్తున్నట్లు సెబీ గుర్తించింది.

ఇది ఏవిధంగా జరుగుతోంది తెలపాలని సెబీ ఆ సంస్థలను కోరినప్పుడు అవి సరైన సమాధానం ఇవ్వలే దు. దీంతో సెబీ వాటిపై నిషేధం విధించింది. సెబీ గతంలో దాదాపు 950 సంస్థలను నిషేధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement