అమ్మకాల ఒత్తిడిలో ప్రధాన సూచీలు
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీలు బుధవారం నాటి ట్రేడింగ్ లో ఒడిదుడుకులతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ మధ్యాహ్నం సమయానికి 11 పాయింట్ల పతనంతో 26764 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 8009 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్ యూఎల్, కోల్ ఇండియా, విప్రో, ఐటీసీ, ఇన్పోసిస్ కంపెనీలు లాభాలతో కొనసాగుతున్నాయి. పీఎన్ బీ, బీహెచ్ ఈఎల్, బీపీసీఎల్, టాటా పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీలు రెండు శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.