
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై: కొత్త ఏడాదిలో రెండో రోజు శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 380.36 పాయింట్లు లాభపడి 27,887.90 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 111.45 పాయింట్లు ఎగిసి 8,395.45 ముగిసింది. ప్రధానంగా సెన్సెక్స్ షేర్లు రిలయన్స్, టాటా మోటర్స్, హెచ్ డీ ఎఫీ సీ , ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి.
గురువారం అంతర్జాతీయ మార్కెట్లలో సెలవుల కారణంగా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో కొత్త ఏడాది ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. కాగా శుక్రవారం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా ఇదే జోరు కొనసాగింది.