international market
-
బంగారు కొండే!..10 గ్రా. @ రూ. 83,750
సాక్షి, బిజినెస్ డెస్క్: బంగారం వెలుగులు విరజిమ్ముతోంది. తగ్గేదేలే అంటూ రోజురోజుకు కొత్త రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీలో తులం మేలిమి బంగారం ధర రూ.83,750కు ఎగబాకింది. ఇది ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తుంటే.. కొత్తగా నగలు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో కనకం ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.ఎందుకీ ర్యాలీ..:అంతర్జాతీయంగా చూస్తే బంగారం ఔన్స్ (31.1 గ్రాములు) ధర ఈ నెల 24న సరికొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయి 2,822 డాలర్లను తాకింది. గత ఏడాది నవంబర్ 5న నమోదైన 2,541 డాలర్ల కనిష్టం నుంచి ఏకంగా 281 డాలర్లు ఎగబాకింది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు మళ్లీ తెర తీస్తారనే భయాలు పెరిగిపోయాయి. అనుకున్నట్లే ముందుగా కెనడా, మెక్సికోలపై దిగుమతి సుంకాల మోత మోగించారు. చైనా, భారత్తోపాటు మరిన్ని దేశాలపైనా సుంకాలు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఇది అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితికి ఆజ్యం పోసింది. ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ఏడాదికాలంగా ఎగబాకుతూనే వస్తోంది. అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారంలోకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత మొదలుపెట్టడం కూడా పసిడి ధరలకు దన్నుగా నిలుస్తోంది. 2024లో వరుసగా మూడుసార్లు పావు శాతం చొప్పున ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు తగ్గించింది. ఈ ఏడాది రేట్ల కోత జోరు తగ్గినా, అక్కడే కొనసాగినా కూడా పసిడికి సానుకూలాంశమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు తగ్గాలని పదేపదే చెబుతున్నారు. అంటే రానున్న కాలంలో అమెరికాలో వడ్డీరేట్లు మరింత దిగొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది కనకానికి మరింత కిక్కిచ్చే అంశం!సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల జోరు...అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్నే నమ్ముకుంటున్నాయి. 2024 నవంబర్లో అవి 53 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, ఇందులో భారత్ వాటా 8 టన్నులు. నవంబర్లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసి రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. పోలాండ్ నేషనల్ బ్యాంక్ 90 టన్నులు కొని టాప్లేపింది. ఇలా సెంట్రల్ బ్యాంకులు ఎడాపెడా పసిడి కొనుగోళ్లకు దిగడం కూడా రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది.మన దగ్గర అంతకు మించి..అంతర్జాతీయంగా పసిడి ధరలకు మించి భారత్లో పుత్తడి జిగేల్మంటోంది. గతేడాది చివర్లో పండుగల సీజన్కు తోడు, పెళ్లిళ్లు కూడా బాగా ఉండటంతో ఆభరణాలు, రిటైల్ కొనుగోళ్లు దూసుకెళ్లాయి. నవంబర్లో భారత్ 10 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం దీనికి నిదర్శనం. అంతర్జాతీయంగా గోల్డ్ రష్కు తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు, డాలర్తో రూపాయి మారకం విలువ అంతకంతకూ దిగజారుతుండటం పసిడి ధరలు జోరందుకోవడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ చెబుతోంది.రూపాయి ఎఫెక్ట్..దేశీయంగా బంగారం ధర జనవరి నెలలోనే 5.5 శాతం (రూ.4,360) ఎగబాకగా.. గత వారం రోజుల్లోనే 2 శాతం (రూ.1,700) జంప్ చేసింది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రూపాయి నేలచూపులే. రోజురోజుకూ బక్కచిక్కతున్న రూపాయి విలువ తాజాగా 86.85 ఆల్టైమ్ కనిష్టానికి జారిపోయింది. ఇందులో ట్రంప్ గెలిచిన రోజు నుంచి చూస్తే రూపాయి విలువ 250 పైసల మేర ఆవిరి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర ఈ నెల 24న ఆల్టైమ్ గరిష్టాన్ని తాకి ప్రస్తుతం 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయినా భారత్లో గత వారం రోజుల్లో పసిడి రేటు పెరుగుతూపోతోంది. డాలరు పుంజుకుని, రూపాయి పడిపోవడం వల్ల బంగారం దిగుమతుల కోసం ఎక్కువ రూపాయలు చెల్లించుకోవాల్సి రావడమే దీనికి కారణం.రేటు పైపైకే...!బంగారం గడిచిన ఏడాది నిజంగా కనకవర్షమే కురిపించింది. అంతర్జాతీయంగా, దేశీయంగా దాదాపు 25–30 శాతం మేర రాబడులు అందించి అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా నిలిచింది. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పసిడి దూకుడు ఈ ఏడాది కూడా ఖాయమేనని బులియన్ నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. కాయిన్ ప్రైస్ బులియన్ విశ్లేషకుల తాజా అంచనా ప్రకారం.. ఈ ఏడాది బంగారం 3,150 డాలర్లను తాకే అవకాశం ఉంది. ఏడాది చివరికల్లా 3,150–3,356 డాలర్ల రేంజ్లో స్థిరపడొచ్చని లెక్కగట్టారు. ఇక మన రూపాయి ఇలాగే పడిపోతూ.. దేశీయంగా ఆభరణాల డిమాండ్ కూడా పెరిగితే తులం బంగారం అక్షరాలా లక్ష రూపాయలను తాకడం ఖాయమనేది మెజారిటీ నిపుణుల అభిప్రాయం!!‘ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, ట్రంప్ సుంకాల మోత భయాలతో ఇన్వెస్టర్లు పసిడి జై కొడుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతకు పాజ్ ఇచ్చినా సరే పుత్తడికి సానుకూలమే’– దేవేయ గగ్లానీ, యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ఒక్కరోజే రూ.910 పెరుగుదలకొనుగోళ్ల డిమాండ్తో బుధవారం (29న) ఒక్కరోజే 99.9 స్వచ్ఛత బంగారం ధర ఢిల్లీలో 10 గ్రాములకు రూ.910 పెరిగి రూ.83,750కి చేరింది. ఈ నెల 1న బంగారం ధర రూ.79,390 వద్ద ఉండగా.. నెల రోజుల్లో 5.5 శాతం మేర (రూ.4,360) ర్యాలీ చేసింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.910 పెరిగి జీవిత కాల గరిష్టం రూ.83,350కి చేరింది. వెండి ధర కిలోకి రూ.1,000 పెరిగి రూ.93,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ రేటు 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కె ట్లు ముగిశాక వెలువడటంతో ఈ ప్రభావం నేడు (2న) దేశీ స్టాక్ మార్కెట్లపై కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడులు, స్థూల ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఈ వారం చివర్లో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో గణాంకాలు నవంబర్ నెలకు ఆటో రంగ గణాంకాలు ఆశావహంగా వెలువడ్డాయి. పెళ్లిళ్ల సీజన్కుతోడు.. ఎస్యూవీలకు డిమాండ్ కొనసాగడంతో వాహన విక్రయాలు సానుకూలంగా నమోదయ్యాయి. దీంతో సోమవారం(2న) ఆటో రంగ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ ఏడాది క్యూ2లో అంచనాలను వమ్ము చేస్తూ జీడీపీ నెమ్మదించడంతో కొంతమేర సెంటిమెంటు బలహీనపడే వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. తయారీ, మైనింగ్తోపాటు వినియోగం తగ్గడం జీడీపీని దెబ్బతీసింది. జీడీపీ మందగమన ప్రభావం ఆర్బీఐ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని మిశ్రా తెలియజేశారు. వడ్డీ రేట్లపై నిర్ణయాలు కీలకంగా నిలవనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ భౌగోళిక అనిశి్చతులు మార్కెట్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్మీనా పేర్కొన్నారు. ప్రధానంగా రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. యూఎస్ తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు, వ్యవసాయేతర రంగంలో ఉపాధి, నిరుద్యోగిత అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పాల్క అరోరా చోప్రా వివరించారు. వీటికితోడు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగం(5న)పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు సంతోష్ మీనా పేర్కొన్నారు. ఆర్థిక గణాంకాలు దేశీయంగా ఈ వారం ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు అరోరా చోప్రా తెలియజేశారు. నవంబర్ నెలకు తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు నేడు వెలువడనున్నాయి. అక్టోబర్లో తయారీ రంగ పీఎంఐ 57.3కు చేరగా.. సరీ్వసుల రంగ పీఎంఐ 59.5గా నమోదైంది. క్యూ2లో దేశ జీడీపీ నీరసించినప్పటికీ ప్రపంచ దేశాలలో వేగవంత వృద్ధిగా నిలవడం ప్రస్తావించదగ్గ అంశమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ వంటి అంశాలూ కీలకమేనని తెలియజేశారు. గత వారమిలా.. పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ నికరంగా 686 పాయింట్లు(0.9 శాతం) జంప్చేసింది. 79,803 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 224 పాయింట్లు(1 శాతం) ఎగసి 24,131 వద్ద స్థిరపడింది.అమ్మకాలవైపే ఎఫ్పీఐలు నవంబర్లో రూ. 21,612 కోట్లు దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత నెల(నవంబర్)లో నికరంగా రూ. 21,612 కోట్ల(2.56 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ మెరుగుపడటం, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం, దేశీ ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే అంతక్రితం నెల(అక్టోబర్)తో పోలిస్తే నవంబర్లో ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ తగ్గింది. అక్టోబర్లో కొత్త చరిత్రను లిఖిస్తూ ఎఫ్పీఐలు దేశీ ఈక్విటీల నుంచి 11.2 బిలియన్ డాలర్లు(రూ. 94,017 కోట్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
కనకం.. పూనకం!
(శివరామకృష్ణ మిర్తిపాటి) : క నకం.. పూనకాలు లోడింగ్ అంటూ బంగారం రోజురోజుకూ రేటు పెరుగుతూ కొనుగోలుదారుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడాది క్రితం రూ.60,000 స్థాయిలో ఉన్న 10 గ్రాముల బంగారం రేటు ఇప్పుడు రూ.78,000ను దాటేసి ‘నగ’ధగలాడిపోతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గించడంతో కాస్త దిగివచ్చిన బంగారం.. చాలా మందిలో ఆశలు రేపింది. మరికొంత తగ్గుతుందేమో కొనుక్కుందామని ఎదురుచూసిన వారికి నిరాశ మిగుల్చుతూ చుక్కలను తాకుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించడంతో.. ప్రపంచవ్యాప్తంగా పుత్తడికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు మన దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్తో డిమాండ్ పోటెత్తుతోంది. రేటెంతైనా తప్పదుకదా అన్నట్టుగా కొనుగోలుదారులు బంగారం దుకాణాలకు క్యూకడుతున్నారు. ⇒ కొండెక్కిన బంగారం కొత్త శిఖరాలతో చుక్కలు చూపిస్తోంది. తాజాగా ప్రపంచ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర 2,700 డాలర్ల పైకి ఎగబాకి ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. దేశీ మార్కెట్లో కూడా 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్) రేటు రికార్డులు బ్రేక్ చేస్తూ రూ.78,300కు ఎగబాకింది. 2023లో మొత్తంగా 20% ఎగబాకిన గోల్డ్ రేటు.. ఈ ఏడాది ఇప్పటికే 29% దూసుకెళ్లడం విశేషం. గడిచిన 14 ఏళ్లలో ఒక ఏడాదిలో ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. అసలే, పండుగ సీజన్కు తోడు వచ్చే 3 నెలల్లో పెళ్లిళ్ల బాజాలు మోగనుండటంతో రేటెక్కువున్నా బంగారం షాపులు కళకళలాడుతున్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో గ్రామీణ డిమాండ్ కూడా జతవుతోందని అంటున్నారు. జూలైలో దిగుమతి సుంకం భారీ కోత నేపథ్యంలో ఆగస్టు నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగి 140 టన్నులకు జంప్ చేయడం మన దగ్గర డిమాండ్ ఏ స్థాయిలో పెరిగిందనేందుకు నిద ర్శనం. కాగా 2023–24లో భారత్ మొత్తం 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 850 టన్ను లకు చేరవచ్చనేది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. వెరసి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద పసిడి దిగుమతిదారుగా భారత్ నిలుస్తోంది.పసిడి కాంతులకు కారణమేంటి?కొన్నేళ్లుగా పసిడి ఉత్పత్తి మందగించి, భూగర్భంలోని నిల్వలు అడుగంటుతు న్నాయి. మరోవైపు ఆభరణాల డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లుచెప్తుండటంతోపాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ వాటాను తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్ జోరందుకుంటోంది. ఆర్థిక అనిశ్చితి, యుద్ధ భయాలతోపాటు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సగటున ఏటా 800 టన్నులు కొనడం గమనార్హం. మన రిజర్వు బ్యాంకు వద్ద కూడా పసిడి నిల్వలు 840 టన్నులకు ఎగబాకాయి.ఇలా ఓవైపు సరఫరా మందగించడం.. మరోవైపుడిమాండ్ విపరీతంగా పెరిగిపోవడమే గోల్డెన్ రన్కు ప్రధాన కారణం. ఇక ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు కనబడకపోగా.. ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడుల తో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ’అణు‘ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనిశ్చితిలో ఆదుకునే సురక్షిత సాధనాల్లో కి, బంగారంలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. తాజా గా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత అంచనాలను మించి అర శాతం వడ్డీరేట్ల కోత విధించడంతో బంగారానికి మరింత బూస్ట్ ఇచ్చినట్ల యింది. ఫిబ్రవరిలో 2,000 డాలర్లకు అటూఇటుగా ఉన్న ఔన్స్ బంగారం ఇప్పుడు 2,708 డాలర్లను తాకింది.ఈ పరుగు ఎందాకా?ఫెడ్ రేట్ల కోత ఇప్పుడే ప్రారంభమైందని.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మరో ముప్పావు శాతం తగ్గే అవకాశం ఉందని.. దీనివల్ల పసిడి పరుగులకు ఢోకా ఉండదని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ చెబుతోంది. వచ్చే ఏడాది మధ్య నాటికి బంగారం రేటు 2,900 డాలర్లకు చేరవచ్చని తాజాగా అంచనా వేసింది. ‘‘అమెరికాలో వాస్తవ వడ్డీరేట్లు ఇంకా తగ్గుముఖం పట్టనున్నాయి. భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలతో పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ జోరందుకోనుంది. సీజనల్గా ఆభరణాల కొనుగోళ్లు కూడా పుంజుకోనున్నాయి. సెంట్రల్ బ్యాంకుల బంగారం నిల్వలు ఇంకా ఎగబాకవచ్చు.దీంతో రాబోయే 6–12 నెలల్లో పసిడి రేట్లు భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’అని యూబీఎస్ పేర్కొంది. యూఎస్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ సైతం సమీప భవిష్యత్తులోనే పసిడి ఔన్స్ ధర 3,000 డాలర్లకు చేరుతుందని లెక్కగట్టింది. వీటి ప్రకారం చూస్తే.. దేశీయంగా 10 గ్రాముల రేటు (24 క్యారెట్) రూ.85,000కు చేరే చాన్సుంది. అంటే పాత తులం (11.7 గ్రాములు) అక్షరాలా లక్ష రూపాయలను తాకుతుంది. రూపాయి విలువ గనుక ఇంకా బక్కచిక్కితే పసిడి మరింత కాంతులీనడం ఖాయమంటున్నారు విశ్లేషకులు!వన్నె తగ్గని పెట్టుబడి..పసిడి పగ్గాల్లేకుండా పరుగులు తీస్తుండటంతో పెట్టుబడులూ జోరందుకుంటున్నాయి. నిజానికి పెట్టుబడి కోసమైనా కూడా మన దగ్గర ఆభరణాల రూపంలో కొనేవారే ఎక్కువ. దీనివల్ల తరుగు, మజూరీ నష్టాలు అదనం. కాబట్టి పెట్టుబడి కోసం కాయిన్లు, బార్ల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని కొనడం బెటర్. కానీ ఇందులోనూ అదనపు చార్జీల భారం ఉంటుంది. పైగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బాదుడు తప్పదు. ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో కొని దాచుకోవడం రిస్కు కూడా.దీనికి ప్రత్యామ్నాయం సార్వ¿ౌమ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీలు), గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) తదితర రూపాల్లో లభించే డిజిటల్ గోల్డ్. ఎనిమిదేళ్ల క్రితం గ్రాము రూ.3,100 పెట్టి కొన్న గోల్డ్ బాండ్లపై ప్రస్తుతం 150 శాతంపైగా రాబడి లభిస్తోంది. అయితే బంగారం భగభగలతో ప్రభుత్వం ఇప్పుడు వీటి జారీని నిలిపేసింది. సెకండరీ మార్కెట్లోనే దొరుకుతున్నాయి. ఈటీఎఫ్లు, ఎస్జీబీలను షేర్ల లాగే నచ్చినప్పుడు విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఏ రూపంలో కొన్నాసరే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కనీసం 10–15 శాతాన్ని బంగారానికి కేటాయించడం మంచిదని, ప్రతి నెలా కొద్ది్దకొద్దిగా (సిప్ రూపంలో) ఇన్వెస్ట్ చేయాలనేది నిపుణుల సలహా!సుంకం కోతతో తగ్గినా.. రూపాయి వాతతో! మోదీ సర్కారు జూలైలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి ఎకాయెకిన 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో బంగారం రేటు ఒక్కసారిగా రూ.5 వేల వరకు తగ్గి.. రూ.66 వేల స్థాయికి దిగొచ్చింది. దీనితో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కానీ అంతర్జాతీయంగా బంగారం రేటు నాన్స్టాప్గా పరుగులు తీయడంతో మన మార్కెట్లో కూడా పుంజుకోవడం మొదలైంది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత (సెపె్టంబర్ 18న)తో ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.గత 10 రోజుల్లో 100 డాలర్లకు పైగా (మన దగ్గర 10 గ్రాములకు దాదాపు రూ.3,000) పెరిగింది. అంటే సుంకం కోత లేకుంటే.. ధర ఇప్పుడు రూ.83,000 కింద లెక్క. మరోవైపు రూపాయి విలువ అంతకంతకూ పడిపోతూ పసిడి ధరను దేశీయంగా మరింత ఎగదోస్తోంది. రెండేళ్ల క్రితం డాలర్తో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉంది. అదే స్థాయిలో ఉండుంటే.. ప్రస్తుత పసిడి ధర రూ.74,000 (6 శాతం దిగుమతి సుంకంతో కలిపి) ఉండేది. కానీ రూపాయి 83.60కి దిగజారడంతో రేటు 78,000 స్థాయికి చేరింది. అంటే రూపాయి పతనం వల్ల మనం మరో రూ.4,000 అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోందన్నమాట!రిస్కు పూజ్యం.. రాబడి ఘనం!ప్రపంచంలో ఏ అసెట్ (ఆస్తి)కూ లేనంత స్టోర్ ఆఫ్ వేల్యూ బంగారం సొంతం. స్టోర్ ఆఫ్ వేల్యూ అంటే మన దగ్గర ఏదైనా అసెట్ (కరెన్సీ, బంగారం, భూమి, ఇళ్లు, షేర్లు ఇతరత్రా) ఉంటే.. ఎన్నాళ్లయినా దాని విలువ పెరగడమే కానీ ఆవిరైపోకుండా ఉండటం అన్నమాట. భూమి వంటివాటికి స్టోర్ ఆఫ్ వేల్యూ ఉన్నా.. బంగారంలా వెంటనే సొమ్ము చేసుకోవడం (లిక్విడిటీ) కష్టం. అంటే అసలుకు మోసం రాకుండా, లిక్విడిటీ ఎక్కువ ఉండేది బంగారమే. దానికితోడు మంచి రాబడి కూడా. పసిడి ధర ఐదేళ్లలో రెండింతలకుపైగా పెరిగింది. స్టాక్ మార్కెట్ల (షేర్ల)లో ఇంతకు మించి లాభాలొచ్చే వీలున్నా.. అది చాలా రిస్్కతో కూడుకున్నది.ధర ఇంతగా పెరుగుతుందనుకోలేదు రెండు నెలల క్రితం బంగారం ధర తగ్గినప్పుడు చాలా ఆనందించాం. ఇంకా తగ్గుతుందేమో అవసరమైన నగలు కొనుక్కోవచ్చని అనుకున్నాం. కానీ ఇంతగా పెరుగుతుందనుకోలేదు. రేట్ చూస్తుంటే భయమేస్తోంది. భవిష్యత్తులో బంగారం కొనగలుగుతామా? అనిపిస్తోంది. – శిరీష, మోతీనగర్, హైదరాబాద్ఎంత పెరిగినా కొనాల్సిందే..బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతుందో అర్థం కావడం లేదు. నేను అమెరికా నుంచి వచ్చాను. అక్కడివారికి బంగారంపై మక్కువ లేకపోయినా మనవారికి మాత్రం ఎనలేని ఇష్టం. ఎంత పెరిగినా ఎంతో కొంత కొనాల్సిందే. – నేహా, హైదరాబాద్ఇలాగైతే బంగారం కొనడం కలే.. ప్రభుత్వం బంగారంపై సుంకం తగ్గించినప్పుడు చాలా ఆనందించాం. బంగారం రేటు పెరుగుతుందనుకోలేదు. ఇలాగైతే బంగారం కొనడం కల గానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం బంగారం కొనాలంటే.. చాలా పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టాల్సి వస్తుంది. – నిషా, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 2,01,296 టన్నులు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం భూమిపై ఉన్న మొత్తం బంగారం (ఆభ రణాలు, పెట్టుబడులు, ప్రభుత్వాల వద్ద, పారిశ్రామిక వినియోగంతో కలిపి) దీని విలువ 17.4 ట్రిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో రూ.1,455 లక్షల కోట్లు!53,000 టన్నులు ⇒ భూగర్భంలో ఇంకా మిగిలి ఉన్న కచ్చితమైన బంగారు నిక్షేపాలు.⇒ 21.8 క్యూబిక్ మీటర్లు ప్రపంచంలో ఇప్పటిదాకా వెలికితీసిన బంగారం అంతా కరిగించి ముద్ద చేస్తే.. 21.8 మీటర్లుండే క్యూబ్లో పట్టేస్తుందట!⇒ 13% ప్రపంచ పసిడి నిల్వల్లో భారతీయుల వాటా ఇది. ⇒ 25,000 టన్నులు మన దేశంలో ప్రభుత్వం, దేవాలయాలతోపాటు ఆభరణాలు, ఇతర రూపాల్లో ప్రజల వద్ద ఉన్న మొత్తం బంగారం అంచనా. -
అలా అయితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను తగ్గించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనిపై పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ స్పష్టతనిచ్చారు.ముడి చమురు ధర కనిష్ట స్థాయి వద్ద స్థిరంగా కొనసాగితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల సవరణకు అవకాశం ఉంటుందన్నారు. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర మంగళవారం 70డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. 2021 డిసెంబర్ తర్వాత ఇంత కనిష్టానికి రావడం ఇదే మొదటిసారి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు సరఫరాపై హరీకేన్ ఫ్రాన్సిన్ ప్రభావం చూపించడంతో చమురు ధర గురువారం మళ్లీ 71 డాలర్లకు ఎగిసింది. ఈ ఏడాది కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించడం తెలిసిందే. అంతకుముందు రెండేళ్లుగా ధరల్లో ఎలాంటి సవరణ చేయలేదు. ఢిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో పంకజ్ జైన్ ఈ అంశంపై మాట్లాడారు. అంతర్జాతీయ చమురు ధరలు కనిష్టాల వద్ద స్థిరపడితే అప్పుడు ఆయిల్ కంపెనీలు ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నాయని.. రేట్లపై నిర్ణయానికి ముందు మరికొంత కాలం పాటు ఇదే విధానం కొనసాగాలని కోరుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే రేట్లను తగ్గిస్తే.. మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతే నష్టపోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో ఆయిల్ కంపెనీలు కొంత కాలం పాటు వేచి చూసే ధోరణిని అనుసరించాలనుకుంటున్నట్టు చెప్పాయి. మహారాష్ట్ర ఎన్నికల ముందు? ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రేట్లను తగ్గించొచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఓ నివేదికలో తెలిపింది. ‘‘రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలియం రేట్లను తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మేము కూడా దీన్ని తోసిపుచ్చడం లేదు. జమ్మూ కశ్మీర్, హర్యానాకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. దీంతో దీపావళి లేదా మహారాష్ట్ర ఎన్నికల ప్రవర్తా నియమావళి అమల్లోకి రావడానికి ముందు రేట్లను తగ్గించొచ్చు. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 వరకు తగ్గించొచ్చు. వచ్చే నెల రోజుల పాటు ఆయిల్ కంపెనీలు అసాధారణ మార్కెటింగ్ మార్జిన్లను సంపాదిస్తాయి. ఎల్పీజీపై నష్టాలను కూడా భర్తీ చేసుకోగలుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మార్కెటింగ్ మార్జిన్ లీటర్ పెట్రోల్/డీజిల్పై రూ.4.7/3.8 గా ఉంటే, జూలై–సెప్టెంబర్ కాలంలో మార్కెటింగ్ మార్జిన్లు లీటర్ పెట్రోల్/డీజిల్పై రూ.9.7/8గా ఉండొచ్చు’’అని ఎమ్కే గ్లోబల్ వివరించింది. దేశ చమురు అవసరాల్లో 85 % దిగుమతులపైనే ఆధారపడడం తెలిసిందే. -
బలహీనత కొనసాగొచ్చు
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలకు తోడు దేశీయంగా ట్రేడింగ్ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో దలాల్ స్ట్రీట్ బలహీనంగా కదలాడొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ‘‘కార్పొరేట్ తొలి త్రైమాసిక ఫలితాల మాదిరిగానే దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఆగస్టు పీఎంఐ తయారీ, సేవా రంగ డేటా, ఆటో అమ్మకాలు మెప్పించలేపోయాయి. ఈ పరిణామాలతో అప్రమత్తత వాతావరణం నెలకొని ఉంది. అధిక వాల్యుయేషన్ల కారణంగా పీఎస్యూ బ్యాంకుల షేర్లు రాణించలేపోతున్నాయి. కమోడిటీ ధరలు తగ్గడంతో మెటల్ షేర్లూ నష్టాలు చవిచూస్తున్నాయి. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 24,500–24,400 పరిధిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,400 వద్ద మరో మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల గతవారంలో సెన్సెక్స్ 1,182 పాయింట్లు, నిఫ్టీ 384 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెపె్టంబర్ 11న, దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జూలై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెపె్టంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మే వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి.ఈ వారం ఐపీఓల పండుగ దలాల్ స్ట్రీట్లో ఐపీఓల వారం మళ్లీ వచి్చంది. మెయిన్ బోర్డు విభాగంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్తో సహా నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అందులో పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, టొలిన్స్ టైర్స్, క్రాస్ కంపెనీలు ఉన్నాయి. తద్వారా ఆయా కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. అలాగే తొమ్మిది సంస్థలు ఎస్ఎంఈ సెగ్మెంట్లో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించనున్నాయి. ‘‘సెబీ నిబంధల ప్రకారం కంపెనీలు సమరి్పంచిన ముసాయిదా పత్రాల్లోని ఆర్థిక గణాంకాలు ఆరు నెలలలోపు అయి ఉండాలి. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ నుంచి అనుమతులు పొందిన ఐపీఓలకు ఈ సెపె్టంబర్ చివరి నెల కావడంతో కంపెనీలు ఇష్యూ బాట పట్టాయి’’ అని ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలిపారు. తొలివారంలో రూ.11వేల కోట్ల కొనుగోళ్లు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–6 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,600 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రికార్డులు
న్యూయార్క్: అంతర్జాతీయంగా న్యూయార్క్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర కొత్త రికార్డు స్థాయిలను చూసింది. చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రా) ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోల్చితే 40 డాలర్లు పెరిగి 2,534 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 2,538 డాలర్లనుసైతం చూసింది. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు కోత అంచనాలకుతోడు భౌగోళిక ఉద్రిక్తతలు ప్రత్యేకించి పశి్చమాసియా పరిణామాలు దీనికి నేపథ్యం. -
భారీగా తగ్గిన పసిడి ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, భారీగా పెరిగిన ధర వద్ద లాభాల స్వీకరణ పసిడి ధరపై తాజాగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశంలో బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.1,450 తగ్గి రూ.72,200కు దిగివచ్చింది. కేజీ వెండి ధర రూ.2,300 తగ్గి, రూ.83,500కు చేరింది. కాగా ఆర్థిక రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్చత ధరలు వరుసగా రూ.1,277, రూ.1,272 తగ్గి రూ.71,598, 71,311కు దిగివచ్చాయి. వెండి కేజీ రూ.1,547 మైనస్తో రూ.80,007కు తగ్గింది.కాగా పసిడి ఫ్యూచర్ మార్కెట్లలో సైతం క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాల్లో ట్రేడవుతోంది. -
రికార్డులను తిరగరాస్తున్న బంగారం ధరలు
న్యూఢిల్లీ: బంగారం ధర గత వారం రోజులుగా ఏరోజుకారోజు కొత్త రికార్డులకు చేరుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర రూ.350 పెరిగి 71,700కు చేరింది. అంతర్జాతీయంగా కూడా ధరలు సరికొత్త రికార్డులను తాకడం దీనికి నేపథ్యం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర జూన్తో ముగిసే కాంట్రాక్ట్ ఒక దశలో భారీగా క్రితం ముగింపుతో పోల్చితే 27 డాలర్లు పెరిగి 2,372డాలర్లపైకి ఎగసింది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి పరుగునకు కారణమవుతున్నాయి. 2024లో దేశంలో పసిడి 10 గ్రాములకు రూ.7,700 పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో పసిడి విలువ 10 గ్రాములకు ఏకంగా రూ.71,080కి ఎగసింది. సోమవారం ఈ వార్త రాసే సమయానికి క్రితం ముగింపుతో పోలి్చతే రూ.158 లాభంతో రూ.70,794 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా... ఇదిలావుండగా, వెండి కూడా న్యూఢిల్లీలో కొత్త గరిష్టాలను చూసింది. సోమవారం కేజీకి రూ.800 ఎగసి రూ.84,000 స్థాయిని చూసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కేజీ ధర (మే కాంట్రాక్ట్) ఒక దశలో 82,109ని తాకింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయానికి ధర రూ.942 ఎగసి రూ.81,805 వద్ద ట్రేడవుతోంది. -
పరిమిత శ్రేణిలో ఒడిదుడుకుల ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్ మూడు రోజులే జరిగే ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్, ఆర్థి క సంవత్సరం గడువు ముగింపు అంశాలు ట్రేడింగ్ ప్రభావితం చేయచ్చని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముఖ్యంగా అమెరికా జీడీపీ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని అంచనా. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. హోలీ సందర్భంగా నేడు (సోమవారం), గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులు జరగుతుంది. అయితే ఈ రెండు సెలవు రోజుల్లో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్లో యథావిధిగా పనిచేస్తాయి. ‘‘ఈ వారం ఆర్థిక సంవత్సరం (2023–24) ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్లు, దేశీయ సంస్థాగత సంస్థలు లాభాలు లేదా నష్టాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ మూడు రోజులే కావడంతో ఎక్సే్చంజీల్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండొచ్చు. అయితే టి+0 సెంటిల్మెంట్ ప్రారంభం, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు నేపథ్యంలో సూచీల ఊగిసలాట ఉండొచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 21,700 తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. గత వారం ప్రథమార్థంలో అమ్మకాలతో చతికిలపడిన స్టాక్ సూచీలు ఫెడరల్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన వైఖరి, సంస్థాగత ఇన్వెస్టర్ల బలమైన కొనుగోళ్లతో కారణంగా ద్వితీయార్థంలో బౌన్స్బ్యాక్ అయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 189 పాయింట్లు, నిఫ్టీ 74 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు రాణించిన రికవరీకి తమ వంతు సాయం చేశాయి. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచనల మేరకు ట్రేడింగ్ జరిగిన రోజే సెటిల్మెంట్(టి+0) విధానాన్ని ఎక్సే్చంజీలు గురువారం(మార్చి 28) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నాయి. అన్ని షేర్లకు టి+0 విధానం అమలు చేయడానికి ముందుగా 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. ప్రయోగ పనితీరు ఫలితాలను బట్టి టి+0 అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి వస్తుంది. తక్షణ సెటిల్మెంట్ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. అలాగే భారత స్టాక్ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది. గురువారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(మార్చి 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆప్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ వివ రాలు, అమెరికా గృహ అమ్మకాలు సోమవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసెస్ సెంటిమెట్, వినియోగదారుల వి శ్వాస గణాంకాలు బుధవారం వెల్లడి కాను న్నాయి. బ్రిటన్ క్యూ4 జీడీపీ వృద్ధి, కరెంట్ ఖాతా, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి డేటా గురువారం విడుదల అవుతుంది. చైనా కరెంట్ ఖాతా, జపాన్ నిరుద్యోగ రేటు, అమెరికా పీసీఈ ప్రైజ్ ఇండెక్స్ డేటా వివరాలు శుక్రవారం వెల్లడి అవుతాయి. విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరి భారతీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వర కు (మార్చి 22 నాటికి) రూ. 38,000 కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీల్లో పెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాను కూల పరిణామాలు, భారత ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలు ఎఫ్ఐఐలను ఆక ట్టుకుంటున్నాయి. ‘‘భారత జీడీపీ వృద్ధి, ఆర్బీ ఐ అంచనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో కీలక వడ్డీ రేట్లు 20–50 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చనే నిపుణుల అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా అంతకుముందు జనవరిలో రూ. 25,743 కోట్ల భారీ పెట్టుబడుల తర్వాత గత నెల ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల షేర్లను విక్ర యించారు. ఈ ఏడాదిలో ఇప్పటివర కు ఎఫ్పీఐలు రూ. 13,893 కోట్లు ఈక్విటీల్లోకి, రూ. 55,480 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. -
పొగాకు రైతు ఇంట సిరుల పంట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో వర్జీనీయా పొగాకు డిమాండ్ పెరగడంతో పొగాకు పంట ఈ ఏడాది రైతు ఇంట సిరులు కురిపించింది. ఈ ఏడాది పొగాకు వేలంలో కేజీ పొగాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. బ్రైట్ గ్రేడ్, లోగ్రేడ్ అన్న తేడా లేకుండా అన్ని గ్రేడ్లకు రికార్డు ధరలు రావడంతో కేజీ పొగాకు సరాసరి ధర రూ.214గా నమోదైంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డుపై ప్రత్యేక ఒత్తిడి తెచ్చి పొగాకు ముక్క (స్క్రాప్)ను వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కలి్పంచడం, అదనపు పొగాకు పంట అమ్మకాలపై జరిమానాలు రద్దు చేయడంతో రైతుల ఆదాయం రెట్టింపు అయింది. భారీగా పెరిగిన ఉత్పత్తి .. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. వీటిలో కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డిసి పల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉండగా, ఒంగోలు–1, ఒంగోలు–2, పొదిలి, కనిగిరి, కొండెపి, వెల్లంపల్లి, టంగుటూరు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిని ఎస్బిఎస్ (సదరన్ బ్లాక్ సాయిల్), ఎస్ఎల్ఎస్ (సదరన్ లైట్ సాయిల్)గా విభజించారు. వీటిలో ఎస్బిఎస్ పరిధిలో 5 వేలం కేంద్రాలుంటే, ఎస్ఎల్ఎస్ పరిధిలో 6 వేలం కేంద్రాలున్నాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో 2022–23 పంట సీజన్కు సంబంధించి 89.35మిలియన్ కేజీల పొగాకును అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. కాని ఇప్పటికే 122.34మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. పలు వేలం కేంద్రాల్లో ఈ నెలాఖరు వరకు వేలం జరిగే అవకాశం ఉండడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది దిగుబడులు అధికంగా వచ్చినట్లు అర్ధమవుతుంది. రికార్డు ధరలు ఈ ఏడాదే.. గత రెండేళ్ల నుంచి రికార్డు «పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉన్నా.. ఈ ఏడాదిలోనే మార్కెట్లో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఒంగోలు రీజియన్ పరిధిలో ఈ సీజన్లో బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు అత్యధిక రూ. 288 పలికినా ప్రస్తుతం స్థిరంగా రూ. 280 ధర వస్తుంది. అయితే ఈ ఏడాది గ్రేడ్లతో సంబంధం లేకుండా దాదాపు అన్ని గ్రేడ్లకు రేట్లు పెరగడంతో సరాసరి రేట్లు మొదటిసారి డబుల్ సెంచరీ దాటాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో ప్రస్తుతం కేజీ పొగాకు సరాసరి ధర రూ 214.47గా నమోదైంది. అంటే క్వింటా పొగాకు సరాసరిన రూ 21,300 వరకు ధర రావడం గమనార్హం. రెండింతలైన బ్యారన్ కౌలు.. ఈ ఏడాది పొగాకు సాగులో వచి్చన లాభాలతో మరోసారి రైతులు పొగాకు పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో పొలాలు, బ్యారన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గతేడాది రూ.15వేలు ఉన్న పొలం కౌలు ప్రస్తుతం రూ.30వేల వరకు చెల్లించేందుకు వెనుకాడడం లేదు. అదే సందర్బంలో గతేడాది రూ.1లక్ష ఉన్న బ్యారన్ కౌలు ఈ ఏడాది రూ.2లక్షలు పలుకుతుంది. ఈ ఫొటోలోని పొగాకు రైతు పేరు రావూరు వెంగళరెడ్డి. ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ళకు చెందిన ఆయన గత 13 సంవత్సరాలుగా పొగాకు పండిస్తున్నాడు. రెండు బ్యారెన్లు పంట సాగు చేస్తే గతేడాది పెద్దగా మిగిలిందేమీ లేదు. ఈ క్రమంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకు సొంతంగా ఉన్న బ్యారెన్తో పాటు మర్రిపాడు మండలం డీసీపల్లిలో మరో ఆరు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. ఇందుకోసం రూ.70 లక్షలు బ్యాంకుల వద్ద, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. అంతకు ముందే అతనికి రూ. 70 లక్షల అప్పు ఉంది. అయితే ముందెన్నడూలేని విధంగా పొగాకు ధరలు పెరగడంతో గతంలో తనకున్న అప్పులన్నీ తీరి మరో పాతిక లక్షల రూపాయల ఆదాయం మిగిలిందని రైతు వెంగళరెడ్డి ఆనందంతో చెప్పాడు. మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన ఈ రైతు పేరు గోపిరెడ్డి రమణారెడ్డి. 30 ఏళ్లకుపైగా పొగాకు సాగు చేస్తున్నాడు. మూడు దశాబ్దాలకుపైగా పొగాకు సాగు చేస్తున్నా కుటుంబ అవసరాలు తీర్చడానికే తప్ప ఆరి్థకంగా పెద్దగా ఆదాయం మిగలలేదు. ఈనేపథ్యంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకున్న ఒక్క బ్యారెన్తో పాటు మరో మూడు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు పంట సాగు చేశారు. ఈ ఏడాది వేలంలో ధరలు అమాంతం పెరిగిపోవడంతో అన్ని ఖర్చులు పోను రూ.60 లక్షలకుపైగా ఆదాయం మిగిలిందని సంతోషంగా చెప్పాడు. పొగాకు రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. పొగాకు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ రైతులకు మేలు చేసింది. మార్కెట్లో డిమాండ్ లేని సమయంలో రైతులను ఆదుకునేందుకు 2020–21 సీజన్లో నేరుగా మార్క్ఫెడ్ని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయించింది. ఈ ప్రభావంతో 2021–22 సీజన్ నుంచి పొగాకు మార్కెట్లో ఊహించని ధరలు రైతులకు లభిస్తున్నాయి. ప్రస్తుతం 2022–23 సీజన్ అయితే రికార్డు ధరలతో అదరగొట్టింది. ఇదిలా ఉంటే బోర్డుపై ఒత్తిడి తేవడంతో అదనపు అమ్మకాలపై విధించే 5శాతం ఫెనాల్టీ ని రద్దు చేశారు. ఇప్పటి వరకు అదనపు పొగాకును అమ్ముకోవాలంటే 5శాతం ఫెనాల్టీ చొప్పున అంటే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు బోర్డుకు చెల్లించాల్సి వచ్చేది. దీని వల్ల ఒక్కొక్క రైతుకు సరాసరిన రూ 40వేల నుంచి 60వేల వరకు లబ్ధి జరిగింది. ఇక స్క్రాప్(పొగాకు ముక్క)ను ఈ ఏడాది నేరుగా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా పొగాకు ముక్కను కూడా వ్యాపారులు కేజీ రూ 150 వరకు వెచి్చంచి కొనుగోలు చేశారు. -
చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి : చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చిరుధాన్యాలను ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఉందని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో.. దేశం నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1,69,049.22 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను ఎక్కువగా ఐదు దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది.ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు 17.8 శాతం, సౌదీ అరబ్కు 13.7 శాతం, నేపాల్కు 7.4 శాతం, బంగ్లాదేశ్కు 4.9 శాతం, జపాన్కు 4.4 శాతం ఎగుమతి చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఇతర దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడంతో పాటు స్థానిక వినియోగం, ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని వివరించింది. ఇందులో భాగంగా అగ్రికల్చరల్–ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) చిరుధాన్యాల ఎగుమతిని ప్రోత్సహించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు ఎగుమతుదారులకు సహాయం అందిస్తుందని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం.. ఇక ప్రపంచ మార్కెట్లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించడానికి స్టార్టప్లు, అకడమిక్–రీసెర్చ్ సంస్థలు, భారతీయ మిషన్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్ (ఈపీఎఫ్)ను ఏర్పాటుచేసినట్లు కూడా తెలిపింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణపై దృష్టిసారించాయని పేర్కొంది. ఉత్పత్తి, వినియోగం పెంపు.. అలాగే, స్థానికంగా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్తో పాటు అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడానికి రాష్ట్ర మిల్లెట్ మిషన్లను అమలుచేస్తున్నాయని కేంద్రం తెలిపింది. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత రాయబార కార్యాలయాలు చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పలు చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే, ప్రభుత్వోద్యోగులు, అధికారుల్లో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాల్లో మిల్లెట్ స్నాక్స్ను, డిపార్ట్మెంటల్ క్యాంటీన్లలో మిల్లెట్ ఆధారిత ఆహార పదార్థాలను చేర్చాలని సూచించినట్లు కేంద్రం పేర్కొంది. -
నష్టాల నుంచి.. లాభాల్లోకి
ముంబై: ఆరంభ నష్టాలను భర్తీ చేసుకున్న స్టాక్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్ షేర్లు రెండు శాతం రాణించాయి. ఉదయం సెన్సెక్స్ నాలుగు పాయింట్ల స్వల్ప నష్టంతో 66,156 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 19,666 వద్ద మిశ్రమంగా మెదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 65,999 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 19,598 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. తదుపరి ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో సూచీలు నష్టాలను భర్తీ చేసుకొని లాభాలను ఆర్జించగలిగాయి. చివరికి సెన్సెక్స్ 367 పాయింట్లు పెరిగి 66,528 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,754 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్, విద్యుత్ షేర్లకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.701 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,488 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.29 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోమవారం బీఎస్ఈలో రూ.2.50 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.306.66 లక్షల కోట్లకు చేరింది. ► దేశీయ అత్యంత విలువైన రెండో సంస్థగా టీసీఎస్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు 2% లాభపడి రూ.3,421 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.51 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఈ జూలై 20న రెండో స్థానానికి చేరుకున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు(0.38%) రూ.12.45 లక్షల కోట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కాగా ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రూ.17.23 లక్షల కోట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ► జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 5% పెరిగి రూ.50.80 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ సరి్టఫికెట్ పునరుద్ధరించినట్లు జలాన్ – కల్రాక్ కన్సార్షియం తెలపడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. ఎల్అండ్టీ రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ తమ షేర్హోల్డర్లకు రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. చైర్మన్ ఏఎం నాయక్.. ఆరు దశాబ్దాలుగా గ్రూప్నకు నిరంతరాయంగా సేవలు అందిస్తుండటాన్ని పురస్కరించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి ఆగస్టు 2 రికార్డు తేదీ కాగా ఆగస్టు 14లోగా డివిడెండ్ చెల్లిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా భారత కార్పొరేట్ చరిత్రలో నాయక్ పేరు చిరస్థాయిగా నిలి్చపోతుందని ఉద్యోగులకు రాసిన లేఖలో ఎల్అండ్టీ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలకు గాను గౌరవ సూచకంగా షేర్హోల్డర్లకు ప్రత్యేక డివిడెండ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగస్టు 9న జరిగే సిల్వర్ జూబ్లీ ఏజీఎంలో నాయక్ పాల్గోనున్నట్లు పేర్కొన్నారు. -
భారత్ నుంచి వాల్మార్ట్ మరిన్ని ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో దిగ్గజ రిటైల్ సంస్థ వాల్మార్ట్ ఉంది. ఆటబొమ్మలు, సైకిళ్లు, పాద రక్షలను భారత సరఫరా దారుల నుంచి సమీకరించుకోవాలని చూస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్, కన్జ్యూమబుల్, హెల్త్, వెల్నెస్, అప్పారెల్, హోమ్ టెక్స్టైల్ విభాగాల్లో భారత్ నుంచి కొత్త సరఫరాదారులను ఏర్పాటు చేసుకోవడంపైనా దృష్టిపెట్టింది. భారత్ నుంచి ఎగుమతులను 2027 నాటికి 10 బిలియన్ డాలర్లకు (రూ.82,000 కోట్లు) పెంచుకోవాలన్న లక్ష్యాన్ని ఈ సంస్థ లోగడే విధించుకుంది. ఈ దిశగా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే భారత్కు చెందిన పలువురు బొమ్మల తయారీదారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. తమకు ఎంత మేర ఉత్పత్తి కావాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయాలను వారికి తెలియజేసింది. ఐకియా సైతం... మరో ప్రముఖ అంతర్జాతీయ రిటైలింగ్ సంస్థ ఐకియా సైతం తన అంతర్జాతీయ విక్రయ కేంద్రాల కోసం భారత్ నుంచి ఆటబొమ్మలను సమీకరిస్తోంది. ఈ చర్యలు ఆట బొమ్మల విభాగంలో పెరుగుతున్న భారత్ బలాలను తెలియజేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశం ఆటబొమ్మల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడేది. చైనా నుంచి చౌక ఆట ఉత్పత్తులు మన మార్కెట్ను ముంచెత్తేవి. కేంద్ర సర్కారు దీనికి చెక్ పెట్టేందుకు దిగుమతి అయ్యే ఆట బొమ్మల నాణ్యతా ప్రమాణాలను పెంచడం, టారిఫ్లను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి ఫలితమిస్తున్నాయి. సరఫరా వ్యవస్థ బలోపేతం ఈ నెల మొదట్లో వాల్మార్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్, సీఈవో డగ్ మెక్మిల్లన్ భారత పర్యటన సందర్భంగా సంస్థ ప్రణాళికలను పునరుద్ఘాటించారు. భారత్లోని వినూత్నమైన సరఫరాదారుల వ్యవస్థ అండతో 2027 నాటికి ఇక్కడి నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సైతం ఆయన కలిశారు. ఆ తర్వాత సంస్థ లక్ష్యాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధి, సరఫరా వ్యవస్థ బలోపేతం ద్వారా భారత్ను ఆటబొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, ఇతర విభాగాల్లో అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా చేస్తామని ప్రకటించారు. -
రొయ్యల మార్కెట్ను కుదిపేస్తున్న ‘ఈక్వెడార్’
ఆకివీడు: ఈక్వెడార్.. ఓ బుల్లి దేశం. అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్కు పెద్ద దెబ్బే కొట్టింది. మొత్తం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. నాణ్యతతో కూడిన రొయ్యలను తక్కువ ధరకు ఎగుమతి చేస్తుండటంతో ఇతర దేశాల రొయ్యల ధరలు పడిపోయాయి. ఈ ప్రభావం రాష్ట్రంలోని రొయ్యల ఎగుమతులపైనా పడింది. ధరలు తగ్గిపోయి, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తి 5049.5 మెట్రిక్ టన్నులు. ఇందులో ఇండియా వాటా 700 మెట్రిక్ టన్నులు.మన దేశం నుంచి ప్రాసెసింగ్ జరిగిన రొయ్యలు అమెరికా, చైనా, జపాన్, బంగ్లాదేశ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఆ దేశాల్లో ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవలి కాలంలో రొయ్యల సాగులో ఈక్వెడార్ తారాజువ్వలా దూసుకొచ్చింది. గత ఆరు నెలల్లో ఏకంగా 1,150 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసింది. దీనిలో 1,010 మెట్రిక్ టన్నులు వనామి, మిగిలినవి టైగర్ రొయ్య. 2021లో ఈక్వెడార్ ఉత్పత్తులు 1,010 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే, గత ఆరు నెలల్లోనే అక్కడ అంతకు మించి రొయ్యల ఉత్పత్తి జరిగింది. పైగా, ఈక్వెడార్లో వేగంగా యాంత్రీకరణ జరిగి, రొయ్యల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గింది. ఎకరాకు 50 వేల పిల్లలను మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. ఎగుమతుల ఖర్చు తక్కువ. ఆరు నెలల్లోనే కౌంట్కు వస్తున్నాయి. ఈక్వెడార్లో తల్లి రొయ్య నుంచి 3 నుంచి 5 సార్లు మాత్రమే సీడ్ తీస్తారు. దీంతో నాణ్యమైన సీడ్ రైతులకు లభిస్తుంది. ఇది వైరస్లు, వ్యాధులను తట్టుకుంటుంది. దీంతో ఉత్పత్తి నాణ్యత ఎక్కువగా ఉంది. మన దేశంలో తల్లి రొయ్య నుంచి 10 నుంచి 15 సార్లు సీడ్ తీస్తున్నారు. దీంతో నాసిరకం, ఇమ్యూనిటీ లేని రొయ్య సీడ్ వస్తోంది. దీనినే పెంపకందారులకు సరఫరా చేస్తున్నారు. ఇటువంటి రొయ్యలు వ్యాధులు, వైట్గట్ తదితర వైరస్ల బారిన పడుతున్నాయి. 30, 40, 50 కౌంట్ రొయ్యల పెంపకానికి మన దేశంలో.. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో రూ.250 పైబడి ఖర్చవుతుంది. దీంతో పోలిస్తే ఈక్వెడార్లో అన్ని కౌంట్ రొయ్యలు రూ.100 తక్కువకు లభిస్తున్నాయి. దీంతో మన దేశం రొయ్యలకు ఆర్డర్లు తగ్గిపోయాయి. చైనా, అమెరికా దేశాల నుంచి ఆర్డర్లు రావడంలేదని బయ్యర్లు వాపోతున్నారు. మంచి ధర లభించేలా ప్రభుత్వ చర్యలు.. రొయ్య రైతులను ఆదుకునేందుకు గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రొయ్య ధరలు తగ్గకుండా చూసేందుకు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులతో సంప్రదింపులు జరిపేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన సాధికార కమిటీని నియమించింది. నిపుణుల కమిటీని వేసి పరిశీలన జరుపుతోంది. సాధికార కమిటీ నిత్యం రొయ్యల మార్కెట్ను సమీక్షిస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. మేత ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా నాణ్యమైన రొయ్య ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. దీనివల్ల కొద్ది రోజుల్లోనే మన రాష్ట్రంలోని రొయ్యలకు కూడా మంచి డిమాండ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ.. నాణ్యత ఎక్కువ అంతర్జాతీయ రొయ్యల మార్కెట్లో ఈక్వెడార్ విపరీతంగా పోటీనిస్తోంది. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ. నాణ్యత ఎక్కువ. పోటీని తట్టుకునేందుకు మన దేశంలో నాణ్యమైన రొయ్య సీడు రైతులకు అందజేయాలి. మేత, మందుల ధరలను నియంత్రించాలి. ఉత్పత్తి వ్యయం బాగా తగ్గాలి. ఆధునిక పద్ధతులు వినియోగించాలి. ప్రభుత్వ సబ్సిడీలు కొనసాగించాలి. ఆక్వా రైతులకు తర్ఫీదు ఇవ్వాలి. ఈ ఏడాది చివరి నాటికి ఈక్వెడార్ ఉత్పత్తులు రెండువేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. అప్పటికల్లా మనమూ పోటీని తట్టుకొని నిలబడగలగాలి. – గోవిందరావు, ఆక్వా కన్సల్టెంట్, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా ఒడుదుడుకులు తాత్కాలికమే ఆక్వా మార్కెట్లో ఒడుదుడుకులు తాత్కాలికమే. రొయ్య ధరలు తగ్గకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీలను వేసి పరిశీలన చేస్తోంది. ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే రొయ్యలకు మంచి ధర లభిస్తుంది. –కేఎస్వీ నాగ లింగాచారి, జిల్లా మత్స్య శాఖ, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
అంతర్జాతీయ మార్కెట్లో ఎయిరిండియా న్యూ టార్గెట్
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో దేశీ, అంతర్జాతీయ మార్కెట్లలో 30 శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్బెల్ విల్సన్ వెల్లడించారు. కంపెనీకి ఇప్పుడు దేశీయంగా 10 శాతం, అంతర్జాతీయంగా 12 శాతం మార్కెట్ వాటా ఉంది. పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకునే దిశగా ఎయిరిండియా ప్రస్తుతం కసరత్తు చేస్తోందని, మంచి పురోగతి కనిపిస్తోందని విల్సన్ వివరించారు. వచ్చే అయిదేళ్లలో తమ విమానాల సంఖ్యను మూడు రెట్లు పెంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 15 నెలల్లో 5 వైడ్-బాడీ బోయింగ్, 25 ఎయిర్బస్ చిన్న విమానాలను సమకూర్చుకోనున్నట్లు వివరించారు. ఎయిరిండియాను టాటా గ్రూప్ ఈ ఏడాది జనవరిలో టేకోవర్ చేసింది. కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించడానికి విహాన్డాట్ఏఐ పేరిట పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను అమలు చేస్తోంది. -
మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్
సాక్షి, అమరావతి: మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్ అని జర్మనీలో భారత్ రాయబారి పర్వతనేని హరీష్ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఉంటే వాటికి అంతర్జాతీయ మార్కెట్ ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతుల్లో ఏపీకి ఎదురుండదన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన పంటలకు అంతర్జాతీయ జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్) సర్టిఫికేషన్పై దృష్టి పెడితే రెట్టింపు ఎగుమతులు సాధ్యమన్నారు. ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్లపై దృష్టి పెడితే ఏపీ మరింత రాణిస్తుందని చెప్పారు. మత్స్య ఆధారిత ఉత్పత్తులకు విలువ జోడింపు వల్ల రెట్టింపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆ దిశగా ఏపీ ముందడుగు వేయాలన్నారు. ఏపీలో ఆయా ఉత్పత్తుల వ్యర్థాల ద్వారా బయో మీథేన్.. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని వివరించారు. అలాగే రాష్ట్రం నుంచి జర్మనీకి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల ప్రదర్శనను హరీష్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎగుమతులపై చర్చించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. ఇప్పటిదాకా ఏపీలో 1,006 భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.2,35,152 కోట్ల పెట్టుబడులు, 4,66,738 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. దేశం నుంచి సరుకుల ఎగుమతుల్లో గతేడాది ఏపీ నాలుగో స్థానంలో నిలిచిందని వివరించారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఏపీ ఉందన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన లీడ్స్–2022 ర్యాంకుల్లో తీర ప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి ర్యాంకు దక్కించుకుందని తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్రం సాధించిన పురోగతిని తెలిపే వివిధ అంశాలపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. గత మూడేళ్ల కాలంలో 106 యూనిట్లు ప్రారంభించడం ద్వారా రూ.44,802 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా 68,418 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సింగిల్ డెస్క్ పోర్టల్లో 90 రకాల ఆన్లైన్ సేవలను పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాష్ట్రానికి దేశంలో పోటీ లేదన్నారు. అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువు ఏపీలో అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువుగా ఉంటుందని ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సావరపు తెలిపారు. ఎలక్ట్రానిక్, సోలార్, ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, బొమ్మలు, ఫర్నీచర్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్లు వెల్లడించారు. 2050 కల్లా పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అవతరించేలా, లాజిస్టిక్ హబ్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మొత్తం 1,362 అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ‘మిషన్ అమృత్ సరోవర్’పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా చేనేత, జౌళి వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. పెడనలో తయారయ్యే కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలా చేరాయన్నారు. నార్వే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేయగలిగే ఉత్పత్తుల జాబితాపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. పండ్లు, చేపల ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారిందని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో ఉల్లిపాయలు, అనంతపురంలో దానిమ్మ, విజయనగరంలో ఒక రకమైన ఎరుపు, పసుపు రంగు మామిడిపండ్లు, గుంటూరు మిర్చి, ఏలూరులో బాదం, నెల్లూరులో నిమ్మ, శ్రీకాకుళం జీడిపప్పు, కోనసీమ కొబ్బరి వంటివాటితో ఏపీ ప్రత్యేకత సంతరించుకుందన్నారు. వీటిలో రెట్టింపు ఎగుమతులు సాధించే దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. -
గిరి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్
సాక్షి, పాడేరు : గిరిజన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ లక్ష్యంగా కృషిచేయాలని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. శనివారం సాయంత్రం పాడేరులోని వెలుగు కార్యాలయం సమీపంలోని వన్ధన్ యోజన మార్కెటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఐటీడీఏ పీవో పాడేరు డివిజన్ పరిధిలోని డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులన్నింటిని పరిశీలించారు. వెలుగు కార్యాలయం సమీపంలో విశాలమైన స్థలం ఉందన్నారు. అక్కడ మార్కెటింగ్ విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే చిరుధాన్యాల ఉత్పత్తుల ద్వారా డుంబ్రిగుడ మండలంలోని డ్వాక్రా మహిళలు సత్తా సాధించారని, అదే స్ఫూర్తితో డివిజన్లోని అన్ని మండలాల డ్వాక్రా సంఘాలు స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. రోడ్డు పక్కనే ఉన్న సుండ్రుపుట్టు వెలుగు కార్యాలయం ద్వారా అన్ని అటవీ, వ్యవసాయ గిరిజన ఉత్పత్తులన్నింటికి రిటైల్ మార్కెటింగ్ జరపాలన్నారు. వన్ధన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వ సాయంతో అమలవుతున్న అన్ని వ్యాపార ఉత్పత్తులను రిటైల్గా అమ్మకాలు జరిపి ఆ లాభాలను డ్వాక్రా సంఘాలకు వర్తింపజేయాలన్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడీ మురళి, డీపీఎం సత్యం నాయుడు, వెలుగు ఏపీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు. (చదవండి: పోలీసులకు చిక్కిన హుండీల దొంగ) -
రికార్డు గరిష్టానికి విమాన ఇంధనం ధర.. కొత్తగా ఎంత పెరిగిందంటే?
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా ఏటీఎఫ్ ధరను 5.2 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం నిర్ణయించాయి. రెండు నెలల్లో ధరల పెంపు (ఈ ఏడాది) ఇది నాలుగో విడత కావడం గమనార్హం. కానీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కిలోలీటర్ ఏటీఎఫ్కు రూ.4,482 మేర పెరిగింది. దీంతో ఒక కిలోలీటర్ ఏటీఎఫ్ విక్రయ ధర రూ.90,520కు చేరింది. 2008 ఆగస్ట్లో ఏటీఎఫ్ గరిష్ట ధర రూ.71,028గా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు విడతల్లో కలిపి చూస్తే కిలోలీటర్కు 16,497 మేర పెరిగినట్టయింది. గత డిసెంబర్లో రెండు విడతల్లో ఏటీఎఫ్ ధర తగ్గించడం గమనార్హం. అప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కొంత తగ్గడం కలిసొచ్చింది. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతూ వెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటు ధరల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు ఐటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి. -
Space Tourism: వినువీధిలో విహారయాత్రలు
వినువీధిలో విహారయాత్రల సందడి మొదలవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఇటీవల చేపట్టిన వ్యోమ విహారయాత్ర విజయవంతమైంది.మరికొన్ని సంస్థలు కూడా ఇదే బాటలో సన్నాహాలు చేసుకుంటున్నాయి.డబ్బు, ధైర్యం, దారుఢ్యం, ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజం ప్యాకేజీల రూపకల్పనపై కసరత్తులు చేసుకుంటున్నాయి.స్పేస్ టూరిజం సూపర్ లగ్జరీ పరిశ్రమగా ఎదిగే అవకాశాలపై అంతర్జాతీయ మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్పేస్ టూరిజం కథా కమామిషు కాస్త తెలుసుకుందాం.. ‘వర్జిన్ గ్రూప్’ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ ప్రైవేటు సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఇటీవల జరిపిన వ్యోమ విహారయాత్ర వార్తల్లో సందడి చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన వర్జిన్ గెలాక్టిక్ బృందంలో తెలుగు యువతి శిరీష బండ్ల ఉండటంతో ఈ సంఘటనకు మన జాతీయ మీడియాలో, మరీ ముఖ్యంగా మన తెలుగు మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం లభించింది. ఒక పర్యాటక బృందం వినువీధిలో జరిపిన తొలి విహారయాత్ర ఇదే అయినా, అంతరిక్షానికి చేరుకున్న తొలి ప్రైవేటు సంస్థ మాత్రం వర్జిన్ గెలాక్టిక్ కాదు. అమెరికన్ సంస్థ ‘స్కేల్డ్ కాంపోజిట్స్’ తయారు చేసిన ‘స్పేస్వన్’ వ్యోమవిమానం పద్దెనిమిదేళ్ల కిందటే ఈ ఘనత సాధించింది. అయితే, అందులో పైలట్ తప్ప యాత్రికులెవరూ లేరు. ‘స్పేస్వన్’ వ్యోమవిమానంలో పైలట్ సహా ముగ్గురు ప్రయాణించేందుకు వీలు ఉన్నా, 2003 డిసెంబరు 17న పైలట్ బ్రియాన్ బిన్నీ ప్రయోగాత్మకంగా అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చాడు. ఆ తర్వాత ‘స్పేస్వన్’ 2004 సెప్టెంబరు–అక్టోబరులో రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు భూకక్ష్య నుంచి వందమీటర్ల ఎత్తుకు ప్రయాణించింది. ఈ రెండు యాత్రల్లో ఒకసారి మైక్ మెల్విల్, మరోసారి బ్రియాన్ బిన్నీ పైలట్లుగా ‘స్పేస్వన్’ విమానాన్ని అంతరిక్షం వరకు తీసుకుపోయి, అక్కడ చక్కర్లు కొట్టి విజయవంతంగా భూమ్మీదకు వచ్చారు. ఈ ఘనత సాధించినందుకు ‘స్కేల్డ్ కాంపోజిట్స్’ సంస్థ పది మిలియన్ డాలర్ల (రూ.74.45 కోట్లు) ‘ఎక్స్ ప్రైజ్’ గెలుచుకుంది. ‘స్పేస్వన్’ ప్రయోగాలు విజయవంతమైన తర్వాతి నుంచే స్పేస్టూరిజం దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రిచర్డ్ బ్రాన్సన్ బాటలోనే తాజాగా ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా వ్యోమ విహారయాత్రకు సమాయత్తం అవుతున్నారు. బెజోస్ ఆధ్వర్యంలోని ‘బ్లూ ఆరిజిన్’ జూలై 20న చేపట్టనున్న ఈ యాత్రలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు మార్క్, అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ శిక్షణలో ఉత్తీర్ణులైన 13 మంది మహిళల్లో ఒకరైన వ్యాలీ ఫంక్తో పాటు ‘బ్లూ ఆరిజిన్’ తొలి వ్యోమయాత్రలో పాల్గొనేందుకు వేలంలో 28 మిలియన్ డాలర్లకు (రూ.208 కోట్లు) టికెట్టు దక్కించుకున్న ఒక అజ్ఞాత యాత్రికుడు కూడా పాల్గొననున్నారు. అపరకుబేరుడు ఎలాన్ మాస్క్కు చెందిన ‘స్పేస్ఎక్స్’ కూడా స్పేస్టూరిజం దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ‘స్పేస్ఎక్స్’ ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) విజయవంతంగా వ్యోమగాములను, కార్గోను చేరవేసింది. ఊరకే అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చేయడం కాకుండా, త్వరలోనే చంద్రుడి మీద విహారయాత్ర నిర్వహించేందుకు ‘స్పేస్ఎక్స్’ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సంస్థ 2023లో జపానీస్ శతకోటీశ్వరుడు యుసాకు మేజావాను చంద్రుడి మీదకు తీసుకువెళ్లనుంది. యుసాకుతో పాటు ఈ యాత్రలో మరో ఎనిమిది మంది ఔత్సాహిక యాత్రికులు కూడా పాల్గొననున్నారు. ఇరవై ఏళ్ల కిందటే తొలి వ్యోమపర్యటన స్పేస్ టూరిజం ఆలోచనలు గడచిన శతాబ్ది చివరినాళ్లలోనే మొదలయ్యాయి. ప్రైవేటు సంస్థలు ఈ దిశగా ప్రయత్నాలకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే సరిగా ఇరవయ్యేళ్ల కిందట– 2001 ఏప్రిల్ 28న అమెరికన్ వ్యాపారవేత్త డెన్నిస్ టిటో రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ‘సోయుజ్ టీఎం–32’ వ్యోమనౌకలో శాస్త్రవేత్తల బృందంతో కలసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకుని, అక్కడ ఎనిమిది రోజులు గడిపి వచ్చి, ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యోమ పర్యాటకుడిగా రికార్డులకెక్కాడు. టిటో తన అంతరిక్ష ప్రయాణానికి 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.150 కోట్లు) చెల్లించాడు. భూమ్మీదకు తిరిగి వచ్చాక ఈ పర్యటన తన కంపెనీకి, వ్యాపారానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పాడు. టిటో తర్వాత 2002లో దక్షిణాఫ్రికాకు చెందిన పారిశ్రామికవేత్త మార్క్ షటిల్వర్త్, 2005లో అమెరికన్ వ్యాపారవేత్త గ్రెగరీ ఆల్సెన్ కూడా డబ్బులు చెల్లించి ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి వచ్చారు. వీరి తర్వాత ఇరాన్లో జన్మించిన అమెరికన్ వ్యాపారవేత్త అనోషే అన్సారీ 2006లో డబ్బు చెల్లించి ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి వచ్చి, తొలి మహిళా అంతరిక్ష పర్యాటకు రాలిగా రికార్డులకె క్కారు. తర్వాత అమెరికన్ వాణిజ్యవేత్త చార్లెస్ సిమోన్యి 2007లో ఒకసారి, 2009లో ఒకసారి ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి వచ్చాడు. అమెరికన్ వీడియో గేమ్ డెవలపర్ రిచర్డ్ గేరియట్ 2008లో ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి, అంతరిక్షయానం చేసిన రెండోతరం అమెరికన్గా రికార్డు సృష్టించాడు. రిచర్డ్ గేరియట్ తండ్రి ఆవెన్ గేరియట్ ‘నాసా’ తరఫున రెండుసార్లు అంతరిక్షయానం చేశాడు. రిచర్డ్ గేరియట్ తర్వాత కెనడియన్ వ్యాపారవేత్త గై లాలిబెర్టె 2009లో ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లాడు. వీళ్లందరూ రష్యన్ ప్రభుత్వానికి చెందిన ‘సోయుజ్’ వ్యోమనౌకల్లోనే అంతరిక్ష పర్యటనలు చేశారు. ‘స్పేస్ అడ్వెంచర్స్’ కంపెనీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుని, ఈ యాత్రల్లో తన పర్యాటకులను ‘సోయుజ్’ ద్వారా అంతరిక్షానికి తీసుకువెళ్లింది. ‘స్పేస్వన్’ ప్రయోగం విజయవంతమైన దరిమిలా ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో దూసుకుపోవడానికి ముమ్మరంగా సన్నాహాలు మొదలుపెట్టాయి. 2021–2022 స్పేస్టూర్లు ఈ ఏడాది ద్వితీయార్ధంలో, వచ్చే ఏడాది ప్రారంభంలో పర్యాటకులతో మరో నాలుగు స్పేస్టూర్లు నిర్వహించేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు టూర్లు, వాటిలో పాల్గొనే వారి వివరాలు... ► ‘నాసా’ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’ (సీసీపీ) కింద ‘స్పేస్ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్ రీసైలెన్స్’ ఈ ఏడాది సెప్టెంబరు 15న నలుగురు పర్యాటకులతో మూడురోజుల అంతరిక్ష యాత్ర చేపట్టనుంది. ఇది అంతరిక్షం చేరుకుని, భూమి చుట్టూ చక్కర్లు కొట్టి తిరిగి వస్తుంది. ఈ వ్యోమయాత్రలో అమెరికన్ వ్యాపారవేత్త జేర్డ్ ఇసాక్మెన్, కాలేజీ ప్రొఫెసర్ సియాన్ ప్రోక్టర్, పిల్లల ఆస్పత్రికి చెందిన పారామెడికల్ ఉద్యోగి హేలీ ఆర్సెనాక్స్, అమెరికన్ ఎయిర్ఫోర్స్ మాజీ ఉద్యోగి క్రిస్టఫర్ సెంబ్రోస్కి పాల్గొననున్నారు. ► రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్కాస్మోస్’ ఈ ఏడాది ప్రైవేటు పర్యాటకులకు అవకాశం కల్పిస్తూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) రెండు యాత్రలు చేపట్టనుంది. ఈ ఏడాది అక్టోబర్ 5, 16 తేదీలలో ‘సోయుజ్ ఎంఎస్–18, ఎంఎస్–19’ వ్యోమనౌకల ద్వారా చేపట్టనున్న 12 రోజుల యాత్రలో రష్యన్ సినీ దర్శకుడు క్లిమ్ షిపెంకో, రష్యన్ నటి యూలియా పెరెసిల్ద్ పాల్గొననున్నారు. ► ‘రాస్కాస్మోస్’ ఈ ఏడాది డిసెంబర్ 8, 19 తేదీలలో ఐఎస్ఎస్కు సోయుజ్–20 వ్యోమనౌక ద్వారా చేపట్టనున్న 12 రోజుల యాత్రలో జపానీస్ వ్యాపారవేత్త యుసాకు మేజావా, ఆయన సహాయకుడు యోజో హిరానో పాల్గొననున్నారు. ► ‘నాసా’ ఆధ్వర్యంలో ‘స్పేస్ఎక్స్’కు చెందిన ‘క్రూ డ్రాగన్ రీసైలెన్స్’ వచ్చే ఏడాది జనవరిలో ఐఎస్ఎస్కు పదిరోజుల యాత్ర నిర్వహించనుంది. ఇందులో ఇజ్రాయెల్కు చెందిన మాజీ పైలట్, వ్యాపారవేత్త ఐటాన్ స్టిబ్బె, అమెరికన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ల్యారీ కానర్, కెనడియన్ వ్యాపారవేత్త మార్క్ ప్యాథీ పాల్గొననున్నారు. ఈ యాత్రలో పాల్గొనే ఒక్కొక్కరి వద్ద 55 మిలియన్ డాలర్లు (రూ.410 కోట్లు) వసూలు చేస్తున్నట్లు ‘స్పేస్ఎక్స్’ ప్రకటించింది. ‘రాస్కాస్మోస్’ మాత్రం తన ధరలను అధికారికంగా ప్రకటించకపోయినా, ఇందుకోసం 30 మిలియన్ డాలర్లు (రూ.224 కోట్లు) వసూలు చేస్తున్నట్లు అనధికారిక వార్తలు వెలువడ్డాయి. అమిత సంపన్నుల ఆటవిడుపు ప్రస్తుతానికైతే ‘స్పేస్ టూరిజం’ అమిత సంపన్నుల ఆటవిడుపుగా మాత్రమే కనిపిస్తోంది. దండిగా డబ్బు, అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో గడపగలిగే శారీరక దారుఢ్యం, అక్కడి వరకు వెళ్ల గలిగే గుండెధైర్యం ఉంటే చాలు, ఎవ్వరైనా వెళ్లవచ్చు. ప్రపంచంలోని ధనిక, పేద దేశాల మధ్య అంతరాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో స్పేస్ టూరిజం పేరిట కొద్ది గంటలు లేదా కొద్ది రోజుల ఆనందం కోసం అమిత సంపన్నులు భారీ మొత్తంలో డబ్బు వృథాగా ఖర్చు చేయడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శాస్త్ర పరిశోధనల కోసం, శాస్త్ర సాంకేతిక పురోగతి కోసం వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థలు జరిపే వ్యోమయాత్రలను అర్థం చేసుకోవచ్చు గాని, కేవలం పర్యటన కోసం అంతరిక్ష యాత్రల పేరిట డబ్బు ఖర్చు చేయడాన్ని సమర్థించలేమని పలువురు అంతర్జాతీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ‘అంతరాలు గల ప్రపంచంలో మనం ఉంటున్న నేపథ్యంలో నాకున్న సామాజిక అభిప్రాయాల ప్రకారం కేవలం కొద్దిమంది సంపన్నులకే పరిమితమయ్యే వ్యోమయాత్రలను సమర్థించలేను’ అని యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు గంటెర్ వెర్హ్యూజెన్ అభిప్రాయపడ్డారు. స్పేస్ టూరిజంపై విమర్శలు ఎలా ఉన్నా, ఇది శరవేగంగా ఎదుగుతున్న పరిశ్రమ అని, 2030 నాటికి 3 బిలియన్ డాలర్ల (రూ.22,360 కోట్లు) వార్షిక టర్నోవర్ సాధించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రచారానికి పుట్టుకొచ్చిన సంస్థలు స్పేస్ టూరిజం మరింతగా పుంజుకునేలా ప్రచారం కల్పించేందుకు పలు సంస్థలు పుట్టుకొచ్చాయి. ‘స్పేస్ టూరిజం సొసైటీ’, ‘స్పేస్ ఫ్యూచర్’, ‘హాబీ స్పేస్’ వంటి సంస్థలు స్పేస్ టూరిస్టులుగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే వారి కోసం వివిధ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. స్పేస్ టూరిజం కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సవివరమైన సమాచారాన్ని అందించేందుకు ‘యూని గెలాక్టిక్ స్పేస్ ట్రావెల్ మ్యాగజైన్’ అనే ద్వైమాసపత్రిక కూడా ప్రారంభమైంది. ‘జంక్’ జటిలం! అంతరిక్ష విహారయాత్రలపై సామాజిక విమర్శలను పక్కనపెడితే, వీటిపై శాస్త్రవేత్తల బృందాల్లో మరో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శాస్త్ర పరిశోధనల కోసం జరిపిన అంతరిక్ష యాత్రల కారణంగా పునర్వినియోగానికి పనికిరాని పరికరాల శకలాలు, అంతరిక్ష ప్రమాదాల కారణంగా ముక్క ముక్కలైన ఉపగ్రహాల శకలాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర వ్యర్థాలు అంతరిక్షంలో భారీగా పేరుకుపోయాయి. అంతరిక్ష ప్రయోగాలు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యర్థాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యర్థాలనే ‘స్పేస్ జంక్’ అంటున్నారు. వీటిని అక్కడి నుంచి తొలగించడం లేదా, అక్కడికక్కడే నాశనం చేసేయడం వంటి చర్యలు చేపట్టేందుకు తగిన పరిజ్ఞానం, పద్ధతులు ఇంతవరకు అభివృద్ధి చెందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్ర సాంకేతిక ప్రయోజమేదీ లేకుండా, కేవలం సంపన్నుల వినోదం కోసం, విలాసం కోసం అంతరిక్ష యాత్రలు చేపడితే ‘స్పేస్ జంక్’ సమస్య మరింత జటిలం కాగలదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘స్పేస్ జంక్’లో దాదాపు 0.4–4 అంగుళాల పరిమాణంలో ఉన్న 5 లక్షలకు పైగా శకలాలు భూమికి దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ శకలాలు గంటకు దాదాపు 36 వేల కిలోమీటర్ల వేగంతో చక్కర్లు కొడుతుంటాయి. ఇంత శరవేగంగా చక్కర్లు కొట్టే ఈ శకలాలు పొరపాటున భూమిపై నుంచి కొత్తగా ప్రయోగించే ఉపగ్రహాలకు గాని, రాకెట్లకు గాని తాకితే పెనుప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో పేరుకున్న ‘స్పేస్ జంక్’ను అక్కడికక్కడే నాశనం చేసేందుకు జపానీస్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’ ఒక ‘ఎలక్ట్రానిక్ స్పేస్ విప్’ (అంతరిక్ష కొరడా) రూపొందించి, దీని పనితీరుపై పరీక్షలు జరుపుతోంది. ‘స్పేస్ జంక్’ సమస్యకు సరైన పరిష్కారం ఇంకా లభించక ముందే స్పేస్ టూరిజం కోసం వాణిజ్య సంస్థలు పోటీ పడటం సరికాదని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. టూరిస్టులకు ‘నాసా’ అవకాశం స్పేస్ టూరిజం దిశగా ప్రైవేటు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ కూడా తన అంతరిక్ష యాత్రలలో పర్యాటకులకు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘నాసా’ ప్రైవేటు పర్యాటకులకు అవకాశం కల్పించనున్న తన ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’ (సీసీపీ) కింద ప్రత్యేకంగా రూపొందించిన ‘బోయింగ్ స్టార్లైనర్’ క్యాప్సూల్ ద్వారా యాత్రలు నిర్వహించనుంది. ‘బోయింగ్ స్టార్లైనర్’ జరిపే ఒక్కో అంతరిక్ష యాత్రలో ఒక్కో ప్రైవేటు పర్యాటకునికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీనికి టికెట్ ధరను ఇంకా నిర్ణయించలేదు. ‘సోయుజ్’ ద్వారా అంతరిక్ష యాత్రలకు రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్కాస్మోస్’ వసూలు చేసే తాజా ధరను పరిగణనలోకి తీసుకుని, తమ ధరను నిర్ణయించనున్నట్లు ‘బోయింగ్’ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. చంద్రమండలానికి టికెట్ రూ.1,119 కోట్లు ‘స్పేస్ఎక్స్’ కంటే చాలా ముందుగానే అమెరికన్ స్పేస్ టూరిజం కంపెనీ ‘స్పేస్ అడ్వెంచర్స్’ 2005లో చంద్రమండలానికి యాత్రా ప్యాకేజీని ప్రకటించింది. దీనికి టికెట్ ధరను కళ్లు చెదిరే రీతిలో100 మిలియన్ డాలర్లుగా (రూ.745 కోట్లు) నిర్ణయించింది. ‘డీప్ స్పేస్ ఎక్స్పెడిషన్– ఆల్ఫా’ (డీఎస్ఈ–ఆల్ఫా) పేరిట ‘సోయుజ్’ వ్యోమనౌక ద్వారా చేపట్టనున్న ఈ యాత్రలో ఏకకాలంలో ఇద్దరు పర్యాటకులకు అవకాశం ఉంటుందని తెలిపింది. అమ్మకానికి పెట్టిన రెండు టికెట్లలో ఒక టికెట్ 150 మిలియన్ డాలర్లకు (రూ.1119 కోట్లు) అమ్ముడుపోయినట్లు 2011లో ‘స్పేస్ అడ్వెంచర్స్’ వ్యవస్థాపకుడు ఎరిక్ ఆండర్సన్ ప్రకటించారు. ఐఎస్ఎస్ మీదుగా చంద్రమండలానికి సాగే ఈ యాత్ర 9–21 రోజులు సాగుతుందని వెల్లడించారు. తొలుత ఈ యాత్రను 2015లో నిర్వహించనున్నట్లు ప్రకటించినా, తర్వాత దీనిని 2018 నాటికి వాయిదా వేస్తున్నట్లు ‘స్పేస్ అడ్వెంచర్స్’ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు ఈ యాత్రను నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహించేదీ కూడా ఇంతవరకు స్పష్టతనివ్వలేదు. తాజా పరిస్థితులను గమనిస్తే, ‘స్పేస్ అడ్వెంచర్స్’ తన కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నట్లే భావించవచ్చు. అంతరిక్ష యాత్రలపై టూరిస్టుల అభిరుచులు పర్యాటకుల కోసం అంతరిక్ష విహారయాత్రలు నిర్వహించడానికి సిద్ధపడు తున్న సంస్థలు తమ వినియోగదారుల అభిరుచులపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నాయి. టూరిస్టుల అభిరుచులకు అనుగుణంగా తమ భవిష్యత్ ప్రణాళికలకు రూపకల్పన చేసుకుంటున్నాయి. ఒక ఆన్లైన్ సర్వే ప్రకారం స్పేస్ టూరిస్టుల అభిరుచులు ఇలా ఉన్నాయి: ► అంతరిక్షంలో రెండువారాలు లేదా అంతకంటే తక్కువ కాలం గడపాలనుకుంటున్న వారు– 70 % మంది ► వ్యోమనౌకలో చక్కర్లు కొట్టడంతో సరిపెట్టుకోకుండా, స్పేస్వాక్ చేయాలనుకుంటున్న వారు– 88% మంది ► స్పేస్వాక్ కోసం అవసరమైతే అదనంగా 50 % వరకు చెల్లించాలనుకుంటున్న వారు– 14% మంది ► అంతరిక్ష యాత్రలో భాగంగా స్పేస్ స్టేషన్ లేదా హోటల్లో గడపాలనుకుంటున్న వారు– 21% మంది. సొంత వాహనాలతో సిద్ధమవుతున్న ప్రైవేటు సంస్థలు ‘స్పేస్ అడ్వెంచర్స్’ గత ఇరవయ్యేళ్లుగా పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రలు నిర్వహించినా, ఆ సంస్థ ఇప్పటి వరకు సొంత వాహనాన్ని రూపొందించుకోలేకపోయింది. వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి సంస్థలు తమ తమ సొంత వాహనాలతో పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు పోటాపోటీగా ముందుకొస్తున్నాయి. ► ‘వర్జిన్ గెలాక్టిక్’ టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు (రూ.1.86 కోట్లు). ఇప్పటికే 58 దేశాలకు చెందిన ఆరువందల మంది ఈ టికెట్లు కొనుక్కుని, అంతరిక్షంలో చక్కర్లు కొట్టేందుకు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టికెట్లు కొనుక్కున్న వారిలో పోటీ సంస్థ ‘స్పేస్ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉండటం విశేషం. ► ‘బ్లూ ఆరిజిన్’ తన తొలి అంతరిక్ష యాత్ర కోసం వేలంలో టికెట్ను అమ్మినా, రెగ్యులర్ టూర్ల కోసం ఇంకా టికెట్ ధరను ప్రకటించలేదు. అయితే, ఈ ధర 2 లక్షల డాలర్ల (1.49 కోట్లు) వరకు ఉండవచ్చని ‘బ్లూ ఆరిజిన్’ ఉద్యోగి ఒకరు ‘రాయ్టర్స్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ► ‘వర్జిన్ గెలాక్టిక్’, ‘బ్లూ ఆరిజిన్’ సంస్థలు నిర్వహించే టూర్ ప్యాకేజీలు పర్యాటకులను అంతరిక్షంలో చక్కర్లు కొట్టించి, తిరిగి భూమ్మీదకు తేవడానికి మాత్రమే పరిమితమైతే, ‘స్పేస్ఎక్స్’ ఏకంగా ఐఎస్ఎస్లో ఎనిమిది రోజులు గడపడానికి వీలుగా పర్యాటకుల కోసం ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఒకేసారి నలుగురు పర్యాటకులు పాల్గొనేందుకు వీలుంటుంది. నలుగురికి కలిపి 55 మిలియన్ డాలర్లు (రూ.410) టికెట్ ధరగా నిర్ణయించింది. ‘స్పేస్ఎక్స్’ ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ‘డ్రాగన్2’ వ్యోమనౌకను రూపొందించుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లనుంది. ఐఎస్ఎస్లో గడపడానికి సిద్ధపడిన పర్యాటకులకు తగిన శిక్షణ, ఐఎస్ఎస్లో వారు గడపడానికి అవసరమైన స్లీప్సూట్స్ వంటి సామగ్రి సరఫరా, ఆహార పానీయాలు, లైఫ్ సపోర్ట్, వైద్యసేవలు వంటివన్నీ కల్పిస్తుండటం వల్లనే స్పేస్ఎక్స్ తన టికెట్ ధరను భారీగానే నిర్ణయించింది. అంతరిక్షంలో ‘అరోరా’ హోటల్! అమెరికాకు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్ కంపెనీ ఆరియాన్ స్పాన్ ‘అరోరా స్పేస్ స్టేషన్’ పేరిట భూమి చుట్టూ పరిభ్రమించేలా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు 2018లో ప్రకటించింది. దీనిని సూపర్ లగ్జరీ హోటల్గా తీర్చిదిద్ది, అంతరిక్ష పర్యాటకులకు అత్యంత విలాసవంతమైన వినూత్నమైన అనుభూతిని అందించనున్నట్లు తెలిపింది. హూస్టన్లో దీని నిర్మాణం చేపట్టనున్నట్లు ‘ఆరియాన్ స్పాన్’ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ బంగర్ ప్రకటించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇందులోకి పాసింజర్లను రిసీవ్ చేసుకోవడం ప్రారంభిస్తామని తెలిపారు. ఇందులో సిబ్బంది కాకుండా, మరో ఆరుగురు యాత్రికులు బస చేసేందుకు వీలుంటుంది. ఈ హోటల్లో గడపదలచిన వారు తప్పనిసరిగా మూడు నెలల శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. ఇందులో పన్నెండు రోజుల బస కోసం ప్రకటించిన టూర్ ప్యాకేజీ ధరను ‘ఆరియాన్ స్పాన్’ 9.5 మిలియన్ డాలర్లుగా (రూ.70.18 కోట్లు) నిర్ణయించింది. ‘అరోరా’ స్పేస్స్టేషన్ హోటల్లో ఫైవ్స్టార్ హోటళ్లలో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇందులో బసచేసే యాత్రికులు యథేచ్ఛగా ఇందులో సంచరించవచ్చు. దీనిలోని కిటికీల గుండా అంతరిక్షంలోని వింతలను, అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించవచ్చు. దీనిలోని హోలోగ్రామ్ డెక్పై ఆటలాడవచ్చు. అయితే, ఇది అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందా లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని నిర్మాణం ఇంతవరకు ప్రారంభం కాలేదని కథనాలు వెలువడ్డాయి. నిర్మాణ పనులను నిలిపివేసి, ఇప్పటి వరకు సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించేశామని ఆరియాన్ స్పాన్ సంస్థ వెబ్సైట్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. అయితే, ఈ సంస్థ ప్రతినిధులు మాత్రం, వచ్చే ఏడాది పాసింజర్లను రిసీవ్ చేసుకుంటామని చెబుతున్నారు. -
అంతర్జాతీయ మార్కెట్కు ఆర్గానిక్ చేనేత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ చేనేత వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్కు వెళ్లబోతున్నాయి. ఈ దిశగా రాష్ట్ర అధికారులు, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(హెచ్ఈపీసీ) అధికారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మాట్లాడుతూ.. ఎంతో నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు సహజ సిద్ధమైన రంగులు, నూలు ద్వారా కళాత్మకమైన డిజైన్లు రూపొందిస్తున్నారని హెచ్ఈసీపీ అధికారులకు వివరించారు. విస్తృతమైన ప్రచారం, మార్కెటింగ్ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగు పెట్టలేకపోతున్నారని చెప్పారు. రసాయనాలు వినియోగించని పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరించిన రంగులను వినియోగించి చేనేత వస్త్రాలను నేయిస్తున్నట్టు హెచ్ఈపీసీ అధికారులకు వివరించారు. వీటి వల్ల చర్మ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు రావని.. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు. శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ తదితర దేశాలకు ఏపీ చేనేత వస్త్రాలను ఎగుమతి చేయాలని కోరారు. తద్వారా రాష్ట్ర చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆర్గానిక్ వస్త్రాలకు విశేష ఆదరణ.. హెచ్ఈపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. ఏపీలో ఆర్గానిక్ చేనేత వస్త్రాలను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి వీటిని తీసుకువస్తే విశేష ఆదరణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ చేనేత వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చేతితో నేసిన ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ జరగనుందని చెప్పారు. అలాగే ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్సి పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 11 వరకు అంతర్జాతీయ వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆప్కో డీఎంవో ప్రసాద్ రెడ్డి, చెన్నై ఆప్కో మెగా షోరూం మేనేజర్ ఎన్.కోటేశ్వరరావు, బండారు ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. -
స్టార్టప్స్లోకి నిధుల ప్రవాహం..
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్స్లోకి పెట్టుబడుల ప్రవాహం మరింత జోరందుకుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ వెంచర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే.. అంకుర సంస్థల్లోకి సుమారు 12.1 బిలియన్ డాలర్ల మేర వెంచర్ క్యాపిటల్ (వీసీ) నిధులు రావడం ఇందుకు నిదర్శనం. గతేడాది ఇదే వ్యవధిలో స్టార్టప్ సంస్థల్లోకి సుమారు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ప్రస్తుతం దానికి రెట్టింపు స్థాయిలో నమోదు కావడం గమనార్హం. ఇటీవలే ట్యాక్సీ సేవల సంస్థ ఓలా 500 మిలియన్ డాలర్లు, సోషల్ కామర్స్ అంకుర సంస్థ డీల్షేర్ 144 మిలియన్ డాలర్లు, ఫిన్టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్ 315 మిలియన్ డాలర్లు సమీకరించాయి. 2020 మొత్తం మీద దాదాపు 11 స్టార్టప్లు మాత్రమే యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్) హోదా పొందగా ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా 16 అంకుర సంస్థలు యూనికార్న్ వేల్యుయేషన్ దక్కించుకున్నాయి. అంకుర సంస్థల్లోకి వచ్చిన వీసీ పెట్టుబడుల్లో సింహభాగం ఇన్వెస్ట్మెంట్స్కి సెకోయా క్యాపిటల్ ఇండియా, టైగర్ గ్లోబల్, యాక్సెల్ ఇండియా తదితర సంస్థలు సారథ్యం వహించాయి. విలీనాలు.. కొనుగోళ్లు.. కేవలం పెట్టుబడులను ఆకర్షించడానికే పరిమితం కాకుండా స్టార్టప్స్ విభాగంలో భారీగా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాల డీల్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా యూనికార్న్ హోదాను దక్కించుకున్న ఫార్మ్ఈజీ ఇటీవలే .. లిస్టెడ్ కంపెనీ అయిన డయాగ్నొస్టిక్ సర్వీసుల సంస్థ థైరోకేర్లో మెజారిటీ వాటాలను రూ. 4,546 కోట్లకు కొనుగోలు చేసింది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ దిగ్గజం బైజూస్ ఏకంగా 1 బిలియన్ డాలర్లు వెచ్చించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను దక్కించుకుంది. కొత్తగా యూనికార్న్ స్థాయికి ఎదుగుతున్న అప్గ్రాడ్ .. ఇలాంటి కొనుగోళ్ల డీల్స్ కోసం 250 మిలియన్ డాలర్లు పైగా కేటాయించింది. మరోవైపు, పలు అంకుర సంస్థలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) సందడికి కూడా సిద్ధమవుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ సర్వీసుల సంస్థ జొమాటో అన్నింటికన్నా ముందుగా వస్తోంది. ఐపీవో ద్వారా రూ. 9,375 కోట్లు సమీకరిస్తోంది. జూలై 14న పబ్లిక్ ఇష్యూ ప్రారంభమవుతోంది. ఇక ఫిన్–టెక్ దిగ్గజం పేటీఎం సైతం నవంబర్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు సన్నాహాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి.. సాధారణంగా అంకుర సంస్థలకు దేశీయంగా టాప్ 20–30 నగరాలకు కార్యకలాపాలు విస్తరించిన తర్వాత వృద్ధి అవకాశాలు పెద్దగా ఉండటం లేదని మార్కెట్ పరిశీలకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పుష్కలంగా వస్తున్న నిధుల తోడ్పాటుతో ఇకపై చాలామటుకు స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ల వైపు దృష్టి సారించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. లిమిటెడ్ పార్ట్నర్స్, మైక్రో వెంచర్ క్యాపిటల్ సంస్థలు తదితర కొత్త తరహా ఇన్వెస్టర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో స్టార్టప్ సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం ఇకపైనా కొనసాగే అవకాశం ఉందని పరిశీలకులు వివరించారు. కన్సల్టెన్సీ సంస్థ ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ నివేదిక ప్రకారం 2025 నాటికి అత్యంత సంపన్న భారతీయ ఇన్వెస్టర్లు .. టెక్నాలజీ స్టార్టప్ సంస్థల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనున్నట్లు అంచనా. -
మళ్లీ కరోనా కల్లోలం, కుప్పకూలిన స్టాక్ మార్కెట్
ముంబై: కరోనా రెండో దశ విజృంభణతో సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కోవిడ్ వ్యాక్సిన్ కొరత వార్తలు కలవరపెట్టగా.., లాక్డౌన్ భయాలు వెంటాడాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. రూపాయి వరుస పతనం సెంటిమెంట్ను దెబ్బతీసింది. దేశీయ మార్కెట్లో ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం కూడా ప్రతికూలాంశంగా మారింది. అలాగే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి ట్రేడింగ్ చేశారు. కార్పొరేట్ సంస్థల నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా సూచీలు ఫిబ్రవరి 26 తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,708 పాయింట్లను కోల్పోయి 47,883 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 524 పాయింట్ల పతనంతో 14,311 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు చెందిన షేర్లు పెద్ద ఎత్తున విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ మొదలు ముగిసేంతవరకు ట్రేడర్లు అమ్మేందుకే ఆసక్తి చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 1898 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 587 పాయింట్లను కోల్పోయింది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఒక్క డాక్టర్ రెడ్డీస్ తప్ప, మిగిలిన అన్ని షేర్లు నష్టాల నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్లోని 50 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,746 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.233 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలే... జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 634 పాయింట్ల క్షీణతతో 48,957 వద్ద, నిఫ్టీ 189 పాయింట్లు పతనంతో 14,645 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. కేవలం పావు గంట వ్యవధిలోనే సుమారు 190 షేర్లు లోయర్ సర్క్యూట్ తాకాయి. అలాగే బీఎస్ఈలో లిస్టయిన షేర్ల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది. భారీ నష్టాలతో ప్రారంభమైన నేపథ్యంలో సూచీలు కాస్తయినా కోలుకుంటాయని ఆశించిన ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూ మరింత క్షీణించసాగాయి. ఏ ఒక్క రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 1898 పాయింట్ల నష్టపోయి 47,693 వద్ద, నిఫ్టీ 587 పాయింట్లు పతనమై 14,248 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేశాయి. మిడ్సెషన్ సమయంలో యూరప్ మార్కెట్ల నష్టాలతో మొదలు కావడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ‘‘కరోనా ఉధృతి, లాక్డౌన్ భయాలతో స్టాక్ మార్కెట్ నెలరోజు కనిష్టానికి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గి, ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టేంత వరకు మార్కెట్లో అస్థిరత కొనసాగుతుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్–ఆధారిత ట్రేడింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నిమిషానికి రూ.2,321 కోట్ల నష్టం సూచీల మూడున్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.8.77 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇంట్రాడే ట్రేడింగ్లో ప్రతి నిమిషానికి రూ.2321 కోట్ల నష్టాన్ని చవిచూశారు. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్లకు దిగివచి్చంది. నష్టాలకు నాలుగు కారణాలు... కరోనా కేసుల ఉధృతి, లాక్డౌన్ భయాలు... కరోనా కేసుల ఉధృతి, లాక్డౌన్ భయాలు స్టాక్ మార్కెట్ను కుదిపేశాయి. దేశవాప్తంగా ఆదివారం ఒక్కరోజే 1.68 లక్షల కేసుల నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులు రోజు కో నూతన గరిష్టాన్ని నమోదు చేస్తున్న తరుణంలో లాక్డౌన్ భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో లాక్డౌన్ విధించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. వ్యాక్సిన్ కొరత... దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కోవిడ్ వ్యాక్సిన్ కొరత వార్తలు మార్కెట్ సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. వ్యాక్సిన్లు లేక రాష్ట్ర ప్రభుత్వాలు టీకా కేంద్రాలను మూసేశాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు రోజుల టీకా ఉత్సవ్ మందకొడిగా సాగడం మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. గణాంకాల వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత టెక్ దిగ్గజం టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో దేశీయ కార్పొరేట్ రంగంలో ఫలితాల సందడి మొదలవుతుంది. కంపెనీల నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ పలు కంపెనీల షేర్లలో ముందస్తు లాభాల స్వీకరణ చేశారని స్టాక్ నిపుణులు తెలిపారు. అలాగే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గారు. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు... అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై సానుకూల వైఖరికే మొగ్గుచూపవచ్చనే అంచనాలతో అమెరికా బాండ్ ఈల్డ్స్ మళ్లీ పుంజుకున్నాయి.అలాగే అమెరికాలోనూ ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి ఇన్వెస్టర్లు కూడా అప్రమత్త వైఖరి అనుసరిస్తున్నారు. -
బుల్ మళ్లీ రంకెలేసింది..
ముంబై: భారత్ స్టాక్ మార్కెట్లో మళ్లీ బుల్ రంకెలేసింది. అంతర్జాతీయ మార్కెట్ల అండతో దేశీయ మార్కెట్... విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో దూసుకెళ్లింది. పెరుగుతున్న కరోనా కేసులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు పరుగును ఆపలేకపోయాయి. అమెరికాలోని హెడ్జ్ ఫండ్ డిఫాల్ట్తో తడబడలేదు. ప్రపంచవ్యాప్తంగా పుంజుకుంటున్న బాండ్ ఈల్డ్స్ భయాలను బేఖాతరు చేసింది. కరిగిపోయిన రూపాయితోనూ కలవరపడలేదు. వెరసి రెండు వారాల గరిష్టస్థాయి వద్ద స్థిరపడింది. ఆర్థిక, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1,128 పాయింట్లు లాభపడి 50,137 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పెరిగి 14,845 వద్ద నిలిచింది. గడిచిన రెండు నెలల్లో ఇరు సూచీలకూ అత్యధిక లాభాలు ఇవే కావడం విశేషం. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండు నెలల కనిష్టానికి పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఏడాది స్థాయికి చేరుకోవడంతో మెటల్ షేర్లు మెరిశాయి. కిందటి వారంలో నష్టాలను చవిచూసిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. అయితే రియల్టీ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 1260 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించగలిగింది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు, నిఫ్టీ ఇండెక్స్లోని 50 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. ‘‘రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రారంభంతో పాటు కార్పొరేట్ కంపెనీ క్యూ4 ఫలితాల విడుదల నేపథ్యంలో రిటైల్ కొత్త ఇన్వెస్టర్లు, అధిక సంఖ్యలో కొనుగోళ్లను చేపట్టి ఉండొచ్చు. నిఫ్టీ చివరి ట్రేడింగ్ సెషన్లో కీలకమైన 14,500 మద్దతు స్థాయిని ఛేదించగలగడం కూడా సాంకేతికంగా కలిసొచ్చింది. ఇప్పటికీ మార్కెట్ అంతర్గతంగా బలహీనంగా ఉంది. ట్రేడర్లు అప్రమత్తత వహించాలి’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. ఆరంభం నుంచి దూకుడుగానే ... మూడురోజుల విరామం తర్వాత దేశీయ మార్కెట్ లాభాలతో మొదలైంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు సూచీల గ్యాపప్ ప్రారంభానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ 323 పాయింట్ల లాభంతో 49,331 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 14,628 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనసాగిన పర్వంతో సూచీలు దూసుకెళ్లాయి. మిడ్ సెషన్లో కాస్త వెనక్కి తగ్గినా.., యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,260 పాయింట్లు లాభపడి 50,268 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించి 14,876 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్, ఇంధన షేర్లు జోరుతో సూచీలు ఈ స్థాయిలో లాభాలను మూటగట్టుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►ఎన్హెచ్ఏఐ నుంచి భారీ కాంట్రాక్టు దక్కించుకోవడంతో దిలీప్ బిల్డ్కాన్ 5% లాభంతో రూ.586 వద్ద ముగిసింది. ►బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకోవడంతో ఇక్రాన్ ఇంటర్నేషనల్ షేరు ఎనిమిది శాతం లాభంతో రూ.87 వద్ద స్థిరపడింది. ►అధిక వ్యాల్యూమ్స్తో ట్రేడైన యస్ బ్యాంక్ షేరు చివరికి 17% లాభంతో రూ.16 వద్ద స్థిరపడింది. -
అంతర్జాతీయ మార్కెట్కు ఉలవపాడు మామిడి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, పెద్ద ఎత్తున వాటిని ఎగుమతి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమైంది. ఉలవపాడు మామిడి తోటల అభివృద్ధికి ప్రత్యేకించి జాతీయ హార్టీకల్చర్ బోర్డు కూడా తన వంతు సహకారం అందించనుంది. ప్రధాన క్లస్టర్గా ఉలవపాడు ఉలవపాడు మామిడికాయ దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దీని రుచి అమోఘం. ఈ కాయ బరువు కేజీ కేజీన్నర కూడా ఉంటుంది. నాణ్యతతో పాటు తీయదనానికి ఇది మారు పేరు. దీనిని అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది దానిని ఆచరణలో పెడుతున్నారు. దీనిలో భాగంగా ఉలవపాడును ఒక ప్రధాన క్లస్టర్గా అభివృద్ధి చేసి పండ్ల ఉత్పత్తి, ఎగుమతికి చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం జాతీయ హార్టీకల్చర్ బోర్డు సహకారం తీసుకోవడంతో పాటు, ఉపాధి హామీ పథకం నిధులను కూడా వినియోగించుకోనున్నారు. 8 వేల హెక్టార్లలో ఇక్కడ మామిడి తోటలున్నాయి. సేంద్రీయ విధానాన్ని అవలంభించేలా ప్రభుత్వం ఇక్కడి రైతులను ప్రోత్సహిస్తోంది. ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. వాటిపై క్షేత్ర స్థాయిలో ఇక్కడి రైతులకు పూర్తి అవగాహన కలిగించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఉలవపాడు ఉన్నందున నీటి వసతికి అంతగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ నీటి కుంటల ఏర్పాటుతో పాటు, ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి భూగర్భ జలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని రైతులకు ఉద్యాన శాఖ సూచించింది. ఇప్పటికే మామిడి పండ్ల ఉత్పత్తి, ఎగుమతిలో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. పండ్లను నిల్వ చేసేందుకు సరిపడా గిడ్డంగులు, ప్రయోగశాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విజయనగరం, గోపాలపురం, నూజివీడు, తిరుపతి ప్రాంతాల నుంచి వివిధ రకాల మామిడి పండ్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతున్నాయి. కాయల్ని ఎలా ప్యాక్ చేయాలో శిక్షణ ఇస్తున్నాం.. ఉలవపాడు మామిడి కాయల నాణ్యతకు ఎటువంటి ఢోకా లేకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆ ప్రాంత రైతులకు ప్రస్తుతం వైఎస్సార్ తోటబడి కార్యక్రమం కింద శిక్షణ ఇస్తున్నాం. చీడపీడల నివారణపై వారిని చైతన్య పరుస్తున్నాం. ముదురు తోటల్ని పునరుజ్జీవింపజేసేందుకు హెక్టార్కు రూ.17 వేలు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నాం. ఎగుమతిదారులు, కమీషన్ ఏజెంట్లకు కూడా శిక్షణ ఇచ్చి.. కాయల్ని ఎలా ప్యాకింగ్ చేయాలో, విదేశాలలో నిబంధనలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాం. – రవీంద్రబాబు, వ్యవసాయశాఖ డీడీ, ప్రకాశం జిల్లా -
అంతర్జాతీయ విపణిలో వెంకటగిరి జరీ
వెంకటగిరి.. చేనేత జరీ చీరలను చూస్తే మగువల మనస్సులు పురివిప్పుతాయి. మేను పులికించిపోతోంది. సంప్రదాయం, ఆధునీకత కలబోతల వర్ణ రంజితమైన చేనేతల అద్భుత కళాఖండాలు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి జరీ చీరలు దేశీయంగా మార్కెట్లో ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోవడం, సరైన మార్కెటింగ్ లేకపోవడంతో ఈ రంగం దశాబ్దాల కాలంగా చతికిల పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం లభించనుంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకానికి వెంకటగిరి జరీ చీరలు ఎంపికయ్యాయి. సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి జరీ, పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. జిల్లాలోనే కాకుండా దేశీయంగా పలు రాష్ట్రాల్లోని బ్రాండెడ్ షోరూమ్స్లకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున చీరల ఎగుమతులు జరుగుతున్నాయి. స్థానికంగానూ ఏటా రూ.కోట్ల రిటైల్ వ్యాపారం జరుగుతోంది. వెండి జరీ, ఆఫ్ఫైన్ జరీతో వివిధ రకాల డిజైన్లతో ఇక్కడ చీరలు నేస్తున్నారు. ఎంతో నైపుణ్యంతో చీరను నేయడంతో మన రాష్ట్రంలోనే కాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వెంకటగిరి చీరలకు భలే డిమాండ్ ఉంది. విదేశీ మహిళలు సైతం వెంకటగిరి చీరలపై మోజు పెంచుకుంటున్నారు. ఆధునిక డిజైన్లతో చీరలను నేస్తుండడంతో వెంకటగిరి చీరలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయి. వెంకటగిరి చీరల్లో జిందానీ వర్క్కు మంచి డిమాండ్ ఉంది. రెండు వైపులా ఒకే డిజైన్ కనబడడం జాందనీ వర్క్ ప్రత్యేకత. చీరల తయారీలో ఇటువంటి నైపుణ్యత మరెక్కడా కనపడదు. విశిష్ట మహిళలకు వెంకటగిరి చీరలను బహుమతిగా ఇవ్వడం ప్రస్తుతం ట్రెండ్గా మారింది. మార్కెట్ సౌకర్యం విస్తృతం మగువలకు అందాన్నిచ్చే వెంకటగిరి జరీ చీరలకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. జిల్లా, రాష్ట్రీయంగానే కాక దేశీయంగానూ మార్కెట్లో వెంకటగిరి చీరలకు డిమాండ్ ఉండడంతో ఏటా రూ.150 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు సౌకర్యం లభిస్తే విక్రయాలు పెరిగి, రెట్టింపు ఉత్పత్తి సాధ్యమవుతుందని స్థానిక మాస్టర్ వీవర్లు, నేత కార్మికుల అంచనా. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ నేతన నేస్తం’ పథకం అమలు చేసి ఇప్పటికే రెండు దఫాలుగా ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల వంతున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. చేనేతకు మరింత లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో ఆ రంగంలోని యువతను ప్రోత్సహించి, ఎగుమతిదారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అంతర్జాతీయ మార్కెట్లో వెంకటగిరి చీరల విక్రయానికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు కల్పించింది. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ వసతికి మార్గం సుగమం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకం’ ద్వారా జిల్లా నుంచి వెంకటగిరి జరీ చీరలను ఎంపిక చేశారు. చేనేత కార్మికులున్న అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత చీరలు, గుంటూరు జిల్లా మంగళగిరి నేత కార్మికులు తయారు చేసే చీరలు, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ జిందానీ చీరలను సైతం ఈ పథకం పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కసరత్తు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ఇవ్వనుంది. -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా సరికొత్త శిఖరాలతో వెలుగులు విరజిమ్మిన బంగారం... ఇప్పుడు కొండ దిగుతోంది!! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు తొలిసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలతో పుత్తడి ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశంలో పసిడి ధర పతనం అవుతోంది. దేశీయ స్పాట్ ప్రధాన మార్కెట్– న్యూఢిల్లీలో శుక్రవారం (ఆగస్టు 7వ తేదీ) 10 గ్రాములు స్వచ్చత ధర రికార్డు స్థాయిలో రూ.57,008 చూస్తే, బుధవారం నాటికి రూ.52,946కు దిగివచ్చింది. అంటే కేవలం మూడు రోజుల్లో రూ.4,062 తగ్గిందన్నమాట. మూడు రోజులుగా పసిడి ప్రతిరోజూ ఇక్కడ రూ.1,200కుపైగా తగ్గుతూ వచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగా పతనం అవుతుండడం గమనార్హం. 7వ తేదీన ఇక్కడి స్పాట్ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ.77,840కి చేరిన కేజీ వెండి ధర బుధవారానికి రూ.67,584కు చేరింది. మూడు రోజుల్లో వెండి రూ.10,256కు తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. 7వ తేదీ వరకూ వరుసగా 16 రోజులు ఏరోజుకారోజు దేశీయంగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన విషయం గమనార్హం. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 9.30 గంటలు) దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర రూ.52,292 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ శుక్రవారం రికార్డు స్థాయిలో ధర రూ.55,850 చేరిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఈక్విటీ మార్కెట్ పెరుగుదల ధోరణి నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ (ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో) దాదాపు స్థిరంగా ఉంది. బుధవారం ధర 74.83 వద్ద ఉంది. రూపాయికి ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). పరుగుకు రష్యా ‘వ్యాక్సిన్’ బ్రేకులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో బంగారం అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) గత శుక్రవారం (7వ తేదీ) ఒక దశలో చరిత్రాత్మక రికార్డుస్థాయి 2,078 డాలర్లకు చేరింది. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత కేవలం 10 రోజుల్లోనే పసిడి ఈ స్థాయికి చేరడం గమనార్హం. అయితే ఈ స్థాయి వద్ద భారీ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు దిగారు. దీనితో శుక్రవారం (7వ తేదీ) ట్రేడింగ్ చివర గంటల నుంచీ పసిడి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. దీనికితోడు కరోనా వ్యాక్సిన్ విడుదల చేసినట్లు స్వయంగా దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం పసిడి ధరకు మరింత ప్రతికూలం అయ్యాయి. బుధవారం ఈ వార్త రాసే 9.30 గంటల సమయానికి చరిత్రాత్మక గరిష్ట స్థాయిల నుంచి (2,078 డాలర్ల) చూస్తే, ధర 128 డాలర్లు పతనమై, 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 202 డాలర్లు పడిపోయి ఏకంగా 1,876 డాలర్లు చూడ్డం గమనార్హం. అయితే ఈ స్థాయిని చూసిన కేవలం కొద్ది గంటల్లోనే ధర కీలక నిరోధ స్థాయి (1,911 డాలర్లు)ని మళ్లీ దాటి, మంగళవారం ముగింపుకన్నా 12 డాలర్ల లాభంతో 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
సెన్సెక్స్కు కీలక స్థాయి 37,415
కరోనావైరస్ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒకేవారంలో ఎన్నడూ చూడనంత పెద్ద పతనం అంతర్జాతీయ మార్కెట్లలో సంభవించింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్...వడ్డీ రేట్ల కోత, ఇతర ఉద్దీపన చర్యలకు సిద్ధంగా వున్నట్లు గత శుక్రవారం ప్రకటించడంతో ఆరోజున అమెరికా స్టాక్ సూచీలు కనిష్టస్థాయి నుంచి చాలావరకూ కోలుకున్నప్పటికీ, ఈ ఉద్దీపన ప్రకటన ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా అన్నది అనుమానమే. చైనా కేంద్ర బ్యాంకు గత పదిరోజుల్లో ఇటువంటి ఎన్నో ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ దేశపు సూచీలు ఇంకా పతనబాటలోనే వున్నాయన్నది గమనార్హం. వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఫిబ్రవరి 28తో ముగిసినవారంలో 38,220 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 2,873 పాయింట్ల భారీనష్టంతో 38,297పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు భారీ కదలికల రీత్యా, ఈ వారం సైతం సెన్సెక్స్ ఎటువైపైనా వేగంగా ప్రయాణించవచ్చు. గతేడాది అక్టోబర్ 9నాటి ‘స్వింగ్ లో’ అయిన 37,415 స్థాయి ఈ వారం సెన్సెక్స్కు ముఖ్యమైన తక్షణ మద్దతు. ఈ మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగినా, గ్యాప్అప్తో మొదలైనా.... క్రితంవారపు భారీ కరెక్షన్కు కౌంటర్ట్రెండ్ ర్యాలీ జరిగి 39,090 పాయింట్ల వద్దకు వెంటనే చేరగలదు. అటుపై 39,420 పాయింట్ల వరకూ ఎగిసే అవకాశం వుంటుంది. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 39,950–40,255 పాయింట్ల శ్రేణిని సైతం చేరే ఛాన్స్ వుంటుంది. అయితే తొలి మద్దతుస్థాయిని వదులుకుంటే డౌన్ట్రెండ్ మరింత వేగవంతమై 36,720 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున ముగిస్తే 35,990 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. 11,090 వద్ద మద్దతు పొందితే నిఫ్టీ సేఫ్... గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,175 పాయింట్ల వరకూ పతనమై చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 879 పాయింట్ల భారీనష్టంతో 11,202పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లానే నిఫ్టీకి సైతం గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 11,090 పాయింట్ల స్థాయి కీలకమైనది. ఈ స్థాయిని పరిరక్షించుకున్నా, గ్యాప్అప్తో మొదలైనా వేగంగా 11,385 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ స్థాయిని అధిగమిస్తే 11,535 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 11,660–11.780 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. తొలి మద్దతుస్థాయిని కోల్పోతే వేగంగా 10,930 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. 2018 అక్టోబర్ 23నాటి 10,004 పాయింట్ల నుంచి ఈ ఏడాది జనవరి 20 నాటి 12,430 పాయింట్ల రికార్డుస్థాయివరకూ జరిగిన ర్యాలీకి ఈ 10,930 పాయింట్లు...61.8 శాతం ఫిబోనకి రిట్రేస్మెంట్ స్థాయి. ఈ స్థాయిని సైతం వదులుకుంటే ప్రస్తుత కరెక్షన్ మరెన్నో వారాలు కొనసాగే ప్రమాదం వుంటుంది. ఈ వారం ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 10,670 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. -
ధర ‘తేజం’.. రైతుకు ఉత్తేజం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మిర్చి రైతులకు మంచి రోజు వచ్చి వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ పొందే ‘తేజ’రకం మంచి ధర పలుకుతోంది. ఇక సాధారణ రకం కూడా ఊరటనిచ్చే విధంగా ఉండటంతో మిర్చి రైతులు సంబరపడుతున్నారు. ‘మిర్చి’ధర దారుణంగా పతనమై 2017 లో రైతులు ఖమ్మం మార్కెట్ యార్డులో చేపట్టిన ఆందోళన, ఆగ్రహం, విధ్వంసం, అరెస్టులకు గురైన సంఘటన వారిని అప్పట్లో కలచి వేసింది. ఆ సంఘటన తర్వాత అదే ఖమ్మం మార్కెట్లో ఈ ఏడాది రైతులకు ఎంతో ఉపశమనం లభించింది. సాధారణం కంటే... సాధారణ రకానికి ప్రస్తుతం మార్కెట్లో రూ. 17 వేలకు పైగా ఉండగా, తేజ రకం మిర్చికి రూ. 21,300 పలికింది. గతేడాది గరిష్టంగా రూ. 10 వేలలోపు మాత్రమే ధర ఉండేది. బుధవారం ఖమ్మం మార్కెట్లో క్వింటాలుకు రూ. 21,300 పలకడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అయ్యింది. అంతర్జాతీయ స్థాయి డిమాండ్తోనే... రాష్ట్రంలో ఖరీఫ్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1.84 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 1.12 లక్షల (61%) ఎకరాల్లోనే సాగైంది. పంట సమయంలో వచి్చన భారీ వర్షాలకు అక్కడక్కడ దెబ్బతిన్నా, మొత్తంగా మంచి నాణ్యమైన పంట పండింది.దేశంలో ఇతర ప్రాంతాల్లో అధిక వర్షాలతో భారీగా దెబ్బతినిపోయింది. అలాగే మలేసియా, థాయ్లాండ్, సింగపూర్లలోనూ మిర్చి దెబ్బతిని పోయిందని వ్యాపారులు చెబుతున్నారు.దీంతో ‘తేజ’రకం మిర్చికి చైనా, సింగ పూర్, థాయ్లాండ్, అరబ్ దేశాల్లో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. 50 రోజుల్లో దాదాపు రూ. 6 వేలు అధికం... 50 రోజుల నుంచి మిర్చి పంట మార్కెట్కు వస్తోంది. నవంబర్ 18న తేజ రకం మిర్చికి రూ. 15,811 ధర పలికింది. 50 రోజుల వ్యవధిలో అది రూ. 6 వేల వరకు పెరిగి రూ. 21,300కు చేరుకుంది.గత నెల 26న ఆ రకం మిర్చి ధర రూ. 19,200 పలుకగా, 27న రూ. 400 పెరిగి రూ. 19,600కు చేరింది. అదే నెల 30 నాటికి మరో రూ. 421కు పెరిగి రూ.20,021కు చేరింది. 31వ తేదీన రూ. 20,021 పలికింది. ఈ నెల2న రూ. 21 వేలు పలికింది. ఇప్పుడు రూ. 21,300లకు చేరింది. -
ఆరో రోజూ పెరిగిన పెట్రోలు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరలు పెరిగాయి. మంగళవారం వరుసగా ఆరో రోజు కూడా పెరిగాయి. అటు గత సెషన్లుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరగడం వల్ల ధరలు ప్రభావితమయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగాయి, చెన్నైలో లీటరుకు 16 పైసలు పెరిగాయి. హైదరాబాద్ : పెట్రోలు ధర రూ. 78.96, డీజిల్ ధర 71.85 విజయవాడ : పెట్రోలు ధర రూ. 78.17 , డీజిల్ ధర 70.81 ఢిల్లీ : పెట్రోలు ధర రూ. 74.20, డీజిల్ ధర 65.84 కోలకతా: పెట్రోలు ధర రూ. 76.89, డీజిల్ ధర 68.25 చెన్నై : పెట్రోలు ధర రూ. 77.13 డీజిల్ ధర 69.59 ముంబై : పెట్రోలు ధర రూ. 79.86, డీజిల్ ధర 69.06 -
భారీగా తగ్గిన బంగారం!
న్యూయార్క్, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారత్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్–నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా)కు 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా–చైనా మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నా యనే ఊహగానాలు పసిడి నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కారణమన్నది విశ్లేషణ. సహజంగా భౌగోళిక ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడి సురక్షితమైనదిగా భావిస్తారు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు వాస్తవ వృద్ధికి దోహదపడే అసెట్స్వైపు తమ ఇన్వెస్ట్మెంట్లను మళ్లిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర గురువారం రాత్రి ఇదే విధంగా బలహీనంగా ముగిస్తే, భారత్ దేశీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర భారీగా పతనమయ్యే అవకాశం ఉంది. -
పటిష్టంగా పసిడి..
బంగారం అనూహ్యరీతిలో పటిష్టస్థాయిలో ఉంది. అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో 28వ తేదీతో ముగిసిన మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,400 డాలర్లపైనే కొనసాగింది. వారం ప్రారంభంలో 1,404 డాలర్ల వద్ద ప్రారంభమైన పసిడి ధర, వారం మధ్యలో (జూన్ 25వ తేదీ) 1,442 డాలర్లను చూసింది. అయితే అదేరోజు 1,433 డాలర్ల వద్ద ముగిసింది. ఈ రెండు స్థాయిలూ పసిడికి ఆరు సంవత్సరాల గరిష్టం కావడం గమనార్హం. వారం చివరి ట్రేడింగ్ సెషన్లో వారంవారీగా దాదాపు 24 డాలర్ల లాభంతో 1,428 డాలర్ల వద్ద ముగిసింది. రెండేళ్లలో కీలకమైన 1,360 డాలర్ల స్థాయిని దాటిన తర్వాత పసిడి మరో కీలక నిరోధం 1,400 డాలర్లపైన ట్రేడవుతోంది. దిగువస్థాయికి వెళ్లాలంటే ఈ రెండు మద్దతులనూ పసిడి కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే పసిడిది బులిష్ ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, భౌగోళిక ఉద్రికత్తలతో పసిడిలోకి పెట్టుబడులు మారుతున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఇక భారత్లో కూడా పసిడి పటిష్టంగానే కొనసాగే వీలుంది -
ఆగని పసిడి పరుగులు..!
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్లో బంగారం ధర పరుగులు పెడుతోంది. మంగళవారం ఒక దశలో ఔన్స్ (31.1గ్రా) ధర 1,442.15 డాలర్లను తాకింది. ఇది ఆరు సంవత్సరాల గరిష్టస్థాయి. ఈ వార్త రాసే సమయం– రాత్రి 10.30కి 1,428 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. వారం క్రితం పసిడి 1,350 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అంటే గరిష్టాన్ని చూస్తే, వారం రోజుల్లో దాదాపు 92 డాలర్లు పెరిగిందన్నమాట. కారణాలు చూస్తే... కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు సహా కొన్ని దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణం. ప్రపంచ వృద్ధిపై ప్రత్యేకించి అమెరికా వృద్ధి స్పీడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు, దీనితో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 2.25–2.50 శ్రేణి) సమీపకాలంలోనే పావుశాతం తగ్గే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు, దీనితో డాలర్ ఇండెక్స్ బలహీనత (95.50) కూడా పసిడి ధరలను ఎగదోస్తున్నాయి. భారత్లోనూ దూకుడే... అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో భారత్లోనూ పసిడి పరుగులు పెడుతోంది. ఢిల్లీ స్పాట్మార్కెట్లో 10 గ్రాముల ధర(24 క్యారెట్లు) రూ.470 పెరిగి, రూ.35,330కి చేరింది. దేశ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో ధర రాత్రి 10.30 గంటల సమయంలో 10 గ్రాముల ధర రూ.134 పెరిగి రూ.34,575 వద్ద ట్రేడవుతోంది. -
ముడిచమురు @ 75 డాలర్లు
లండన్: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు మంటలు మొదలయ్యాయి. గురువారం ట్రేడింగ్లో బ్రెంట్క్రూడ్ ధర 75 డాలర్ల పైన ఆరునెలల గరిష్ఠస్థాయిని తాకింది. ఇరాన్పై ఆంక్షలతో చమురు సరఫరా అతలాకుతలం అవుతుందన్న ఆందోళనలు చమురు ధరల్లో కాక పెంచాయి. గురువారం ఇంట్రాడేలో బ్రెంట్ క్రూడ్ 75.60 డాలర్లను తాకింది. గత అక్టోబర్ తర్వాత ఈ స్థాయి చూడడం ఇదే తొలిసారి. మరోవైపు డబ్లు్యటీఐ క్రూడ్ సైతం ఆరునెలల గరిష్టం 66.16 డాలర్లను చేరింది. ఇరాన్పై గతంలోనే ఆంక్షలు విధించిన అమెరికా అప్పట్లో ఎనిమిది దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజాగా ఈ మినహాయింపును కొనసాగించేది లేదని యూఎస్ స్పష్టం చేసింది. మే2తో మినహాయింపుల గడువు ముగియనుంది. ఇరాన్ సరఫరా కొరతను దృష్టిలో ఉంచుకొని ఒపెక్ తన ఉత్పత్తి కోతలను తగ్గించుకుంటుందా, లేక కొనసాగిస్తుందా? అని నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు చమురు ఉత్పత్తి పెంచే ఆలోచనేమీ లేదని ఒపెక్ పెద్దన్న సౌదీ బుధవారం ప్రకటించింది. ఆంక్షల ప్రభావం ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా చమురు ఇన్వెంటరీల్లో మంచి పెరుగుదలే నమోదవుతోందని, అందువల్ల ఇప్పుడే ఉత్పత్తి కోతను తగ్గించాలని అనుకోవడం లేదని సౌదీ ఎనర్జీ మంత్రి ఖలీద్ అల్ఫలీహ్ చెప్పారు. ఒపెక్, రష్యాలు తీసుకున్న ఉత్పత్తి కోత నిర్ణయాలే ఈ ఏడాది చమురు ధరల్లో రికవరీకి కారణం. ప్రస్తుతం ఇరాన్, వెనుజులా, లిబియాల్లో ఉత్పత్తి, సరఫరా సంక్షోభంలో పడినందున ఒపెక్ కోతలు ఇలాగే కొనసాగితే ముడిచమురు ధరలకు రెక్కలు వస్తాయని అంచనా. ఆంక్షలు అక్రమం యూఎస్ తమపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్ అధిపతి ఆయతుల్లా ఖొమైనీ డిమాండ్ చేశారు. తమ చమురు సరఫరాపై ఆంక్షల విధింపు అక్రమమని, ఇందుకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ ఎంత కావాలంటే అంత, ఎవరికి కావాలంటే వాళ్లకి చమురు సరఫరా చేయగలదన్నారు. 2015లో ఇరాన్తో ప్రపంచ అగ్రదేశాలు కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఆంక్షలను విధించారు. అయితే ముందస్తు ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని ఎనిమిది దేశాలకు ఈ ఆంక్షల నుంచి కొంతకాలం మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే మినహాయింపులు పొందిన ఎనిమిది దేశాల్లో ఐదు దేశాలు(గ్రీస్, ఇటలీ, జపాన్, సౌత్కొరియా, తైవాన్) ఇరాన్ చమురు దిగుమతులను సాధ్యమైనంతవరకు తగ్గించుకున్నాయి. చైనా, ఇండియాలు మాత్రం మినహాయింపుల కొనసాగింపు కోసం చివరి వరకు యత్నించాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా రష్యా నుంచి పొలండ్, జర్మనీకి జరిగే చమురు సరఫరా సాంకేతిక కారణాలతో నిలిచిపోవడం కూడా ముడిచమురు డిమాండ్ పెరిగేందుకు కారణమైంది. ఈ పరుగు తాత్కాలికమేనా? ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బ్రెంట్ధర దాదాపు 40 శాతం ర్యాలీ జరిపింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగిస్తోందన్న ఆందోళనలు పెరిగిపోతున్న తరుణాన, బ్రెంట్ క్రూడ్ ధరల పెరుగుదల తాత్కాలికమేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మందగమన ప్రభావంతో మార్కెట్లో చమురు నిల్వలు పెరిగిపోతున్నాయని, సరఫరా ఎక్కడా దెబ్బతినలేదని యూఎస్ ప్రత్యేక ప్రతినిధి బ్రైన్హుక్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి రష్యా, సౌదీ, ఇరాక్లు తగ్గించిన ఉత్పత్తి ఇరాన్ చమురు సరఫరాకు దాదాపు సమానమని ఎనర్జీ కన్సెల్టెన్సీ రైస్టాడ్ఎనర్జీ వెల్లడించింది. ఈ దేశాలు కోతలను ఆపేస్తే చమురు సరఫరా యథాత«థంగా ఉంటుందని, అందువల్ల ధరలు విపరీతంగా పెరగకపోవచ్చని పేర్కొంది. యూఎస్ షేల్ గ్యాస్ ఉత్పత్తి బలంగా పెరుగుతున్నది, దీంతో ప్రపంచంలో సౌదీ, రష్యాలను తోసిరాజని అమెరికా చమురు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగిస్తోందని, అందువల్ల ఈ ఏడాది చమురు ధరల్లో డౌన్ట్రెండ్ ఉండొచ్చని క్యాపిటల్ ఎకనామిక్స్ అంచనా వేసింది. ఇందుకు తగ్గట్లే సౌత్కొరియా ఎకానమీ తొలి త్రైమాసికంలో అనూహ్యంగా తరుగుదల నమోదు చేసింది. చైనా సైతం మందగమన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మందగమన భయాలతో పలు దేశాల కేంద్రబ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపు సహా పలు చర్యలను ప్రకటిస్తున్నాయి. -
రూపాయి75 పైసలు డౌన్!
ముంబై: నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచీ వరుసగా లాభాల బాటన పయనిస్తూ వచ్చిన రూపాయి మళ్లీ నష్టాల బాట పట్టింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం ఒకేరోజు డాలర్ మారకంలో 75పైసలు నష్టపోయి, 70.18 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆరు దేశాల కరెన్సీలపై డాలర్ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు, బలహీన వస్తు సేవల పన్ను వసూళ్లు రూపాయి సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. మంగళవారం రూపాయి 34 పైసలు లాభంతో 69.43 వద్ద ముగిసింది. అయితే బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 69.60 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.23ను సైతం తాకింది. తగ్గిన క్రూడ్ ధరలే ప్రస్తుతం రూపాయి సెంటిమెంట్ కొంత బలంగా ఉండడానికి కారణం. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వస్తోంది. -
రూపాయికి ‘ఇంధనం’...
ముంబై: భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే క్రూడ్ ధరలు భారీ పతనం, దీనితో కరెంట్ అకౌంట్ లోటుపై (ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) తగ్గిన ఆందోళనలు రూపాయి సెంటిమెంట్ను బలోపేతం చేస్తున్నాయి. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 69 పైసలు రికవరీతో 69.70 వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (2.25–2.5 శాతం) పెంచినా కూడా రూపాయి బలపడటానికి ప్రధాన కారణం క్రూడ్ ధరలు దిగిరావడమేనని విశ్లేషణ. రూపాయి వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచీ రికవరీ అవుతూ వస్తోంది. ఈ రోజుల్లో 220 పైసలు బలపడింది. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు స్పీడు తగ్గుతుందన్న విశ్లేషణలు అటు డాలర్నూ కిందకు నెట్టడం గమనార్హం. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు చూస్తే... అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు అనూహ్యంగా భారీగా పతనం అయ్యాయి. రెండు నెలల క్రితం ఉన్న గరిష్ట స్థాయిల నుంచి 30 డాలర్లకుపైగా కిందకు దిగాయి. న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్సే్చంజ్లో ట్రేడయ్యే లైట్ స్వీట్ బేరల్ ధర గురువారం ఒక దశలో 45.83ను తాకింది. ఈ వార్త రాసే 7 గంటల సమయంలో 46 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాదిన్నర కనిష్ట స్థాయి. రెండు నెలల క్రితం ఈ ధర 76.90 డాలర్ల వద్ద ఉంది. ఈసీబీపై ఆర్బీఐ పరిమితులు ఇదిలాఉండగా, విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ)కు సంబంధించి ఆర్బీఐ తాజాగా నియంత్రణలు విధించింది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో)లో ఈసీబీల పరిమాణం 6.5 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. దీని ప్రకారం, ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి ఈసీబీలు 160 బిలియన్ డాలర్లు దాటకూడదు. సెప్టెంబర్ 30 నాటికి ఈసీబీలు 126 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
చమురు సెగలో రూపాయి
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర స్థాయిలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు (బ్రెంట్ 80 డాలర్ల స్థాయి), డాలర్ ఇండెక్స్ పటిష్టత (94 స్థాయి) భారత్ రూపాయిపై పెను భారాన్ని మోపుతున్నాయి. ఇంట్రా బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం ఒక్కరోజే రూపాయి 38పైసలు బలహీనపడింది. 68.42 వద్ద ముగిసింది. రూపాయి ఈ స్థాయికి రావడం గడచిన 18 నెలల్లో ఇదే తొలిసారి. గడచిన మూడు వారాల్లో రూపాయి దాదాపు మూడు రూపాయలు నష్టపోయింది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఈ కమోడిటీ ప్రధాన దిగుమతి దేశంగా భారత్పై పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇప్పటికే వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం)పై ఆందోళనలను సృష్టిస్తోంది. ఇక దేశంలో ధరల పెరుగుదల భయాలు ఉండనే ఉన్నాయి. దీనివల్ల ఆర్బీఐ రెపో రేటు పెంపు, వృద్ధిపై ప్రభావం వంటి ఆందోళనలు నెలకొన్నాయి. ఆ స్థూల ఆర్థిక సవాళ్లన్నీ కలిసి రూపాయి జారుడుకు కారణమవుతున్నాయి. ఆయా అంశాలు కార్పొరేట్లు, దిగుమతిదారుల నుంచి డాలర్ కోసం డిమాండ్నూ పెంచుతోంది. మరోవైపు క్యాపిటల్ అవుట్ఫ్లోస్తో ఈక్విటీ మార్కెట్లూ నష్టాలకు గురవుతుండడం గమనార్హం. -
‘హ్యాట్రిక్’ మోత...
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల మోత మళ్లీ మోగుతోంది. చమురు సంస్థలు 19 రోజుల విరామం తర్వాత మళ్లీ విజృంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రోజువారీ ధరల సవరణ జోలికి వెళ్లని దేశీయ మార్కెటింగ్ సంస్థలు పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి రోజువారీ ధరల సవరణకు దిగాయి. మూడు రోజులుగా రోజుకు పెట్రోల్పై 15 నుంచి 22 పైసలు, డీజిల్పై 21 నుంచి 26 పైసలు పెరిగాయి. రోజువారీ ధరల సవరణ అనంతరం దేశంలోనే హైదరాబాద్లో డీజిల్ ధర ఆల్టైమ్ రికార్డు సృష్టిస్తుండగా... పెట్రోల్ ధర రెండో స్థానంలో రికార్డుగా నమోదైంది. మూడు రోజుల్లో.. మూడు రోజుల్లో హైదరాబాద్లో పెట్రోల్పై 51 పైసలు, డీజిల్పై 75 పైసలు పెరిగింది. ముంబైలో పెట్రోల్పై 46 పైసలు, డీజిల్పై 68 పైసలు, ఢిల్లీలో పెట్రోల్పై 47 పైసలు, డీజిల్పై 64 పైసలు, బెంగళూరులో పెట్రోల్పై 49 పైసలు, డీజిల్పై 67 పైసలు పెరిగాయి. ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణలతో చమురు సంస్థలు సైలెంట్గా బాదేస్తున్నాయి. -
రూపాయికి చమురు సెగ!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బేరల్కు 75 డాలర్లు దాటడం... డాలర్ ఇండెక్స్ పరుగు... దీనితో డాలర్ మరింత పెరిగిపోతుందేమోనని చమురు దిగుమతి కంపెనీల ఆందోళన... దీనితో పెద్ద ఎత్తున ఆ దేశం కరెన్సీ కొనుగోళ్లు... వెరసి డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో ఏకంగా 26పైసలు పడిపోయింది. స్టాక్ మార్కెట్ లాభాలు కూడా రూపాయి బలాన్ని ఇవ్వలేకపోయాయి. రూపాయి విలువ 67 స్థాయిని దాటిపోయి, 67.13 వద్ద ముగిసింది. ఇది 15 నెలల కనిష్ట స్థాయి. క్రూడ్ ఆయిల్ పరుగు... వాణిజ్యలోటు తీవ్రత, క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అవకాశాల వంటి సందేహాలకు దారితీస్తోందని ఇది రూపాయి పతనానికి కారణమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్ పెరిగినా, ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల్లో నికర అమ్మకందారులుగానే కొనసాగుతుండడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్లో మొత్తం భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.15,500 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
ధర పెరిగి తగ్గింది!
పెద్దపల్లి: చేలలో పత్తి తగ్గుతుండగా మార్కెట్లో ధర డిమాండ్ పెరుగుతుండేది. ఇది గతంలో ఎన్నో ఏళ్లుగా రైతులు చూసిన అనుభవం. నవంబర్లో రూ.4200 ధర పలికితే ఫిబ్రవరిలో 5 వేలకు పైగా పలికేది. పత్తి మార్కెట్లో ధరల ఆటుపోటు ఇలా ఉండగా, ప్రస్తుతం గతంలో కంటే ధరలు తగ్గుతూ రావడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 65వేల హెక్టార్లలో సాగు జిల్లాలో 65వేల పత్తి సాగుబడి కాగా, ఆశించిన దానిలో సగం కూడా దిగుబడి రాకపోవడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి ప్రాంతంలో రికార్డు స్థాయిలో పత్తి దిగుబడి వచ్చేది. ఒక్కో ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి అవుతుండగా, ఈ ఏడాది 4 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. తీరా మార్కెట్కు వెళితే నిన్నటి ధర కంటే నేడు మరో రూ. 50 తగ్గుతూ విక్రయాలు కొనసాగిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. తగ్గిన ధర పెద్దపల్లి పత్తి మార్కెట్లో గత నెల 5200 క్వింటాల్ ధర పలికితే ప్రస్తుతం 4600 మేరకే పత్తి విక్రయాలు కొనసాగుతున్నాయి. కనిష్ట ధర రూ. 2500, సాధారణ ధర రూ. 4300గా నమోదవుతోంది. ఇది గతంతో పోలిస్తే పూర్తిగా దెబ్బతిన్న రికార్డుగానే చెప్పుకోవచ్చు. రైతులు తగ్గుతున్న ధరలను చూసి ఆవేదనకు గురవుతున్నారు. గడిచిన 15 రోజులుగా పత్తి ధరలు రోజుకు రూ. 100 నుంచి 50 తగ్గుతున్న సందర్భాలే ఎక్కువగా నమోదవు తున్నాయి. కనిష్ట ధర గురువారం రూ. 2500 మాత్రమే పలికితే శుక్రవారం కూడా అంతే పలికింది. ఇక సాధారణ ధర తగ్గుతూ రావడం ఇంట్లో పత్తి దాచుకున్న రైతులు మార్కెట్కు తీసుకువచ్చేందుకు వెనకంజ వేసేలా చేస్తోంది. దాచుకుంటే ధర పెరిగేది.. చిన్న, సన్నకారు రైతులు తమ అవసరాల కోసం ఏరోజుకారోజు పత్తిని మార్కెట్ను తరలిస్తూ విక్రయించేవారు. సంపన్నులైన రైతులు మాత్రం మార్కెట్ ధరల పరిస్థితిని గమనిస్తూ అమ్మకాలు చేపట్టేవారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పత్తి ధరలకు రెక్కలు వచ్చేవి. అప్పటివరకు పత్తి అమ్ముకున్న రైతులు ఆ తర్వాత పెరుగుతున్న ధరలను చూసి దిగులుపడేవారు. ప్రస్తుతం పరిస్థితి తలకిందులై గతంలో కంటే క్వింటాల్కు రూ. 500కు పైగా ధర తగ్గి విక్రయాలు చేపట్టడం రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ వ్యత్యాసాన్ని పూడ్చివేయడానికి మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. బేళ్లకూ ప్రభావమే.. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో బేల్ ఖరీదు రూ. 42వేలు పలికేదని, ప్రస్తుతం రూ. 41వేలకు ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే పత్తి విత్తనాలకు టన్నుకు రూ. 22వేలు ఉండేదని, ప్రస్తుతం రూ. 19వేలకు ధర పడిపోవడంతో ఆ ప్రభావం పత్తి మార్కెట్పైన కొనసాగుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు పంట దిగుబడితోపాటు ధరల రాబడి కూడా పడిపోతుందని అంటున్నారు. -
టార్గెట్.. సేంద్రియ సాగు
♦ 2017–18 వ్యవసాయ ప్రణాళికలో లక్ష్యాల ప్రకటన ♦ సన్నచిన్నకారు రైతుల్లో వ్యవసాయ యంత్రాల ప్రోత్సాహం సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సేంద్రియ వ్యవసాయాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులను చైతన్యపరచాలని యోచిస్తోంది. ఈ సీజన్లో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను 2017–18 ప్రణాళికలో వ్యవసాయశాఖ వెల్లడించింది. త్వరలో విడుదల కానున్న ఆ ప్రణాళిక అనేక లక్ష్యాలను ప్రకటించింది. సేంద్రియ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సన్నచిన్నకారు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. అందుకోసం 2017–18లో రూ. 436 కోట్లు కేటాయించింది. కింది అంశాలపై ఫోకస్... భూసార పరీక్ష కేంద్రాల బలోపేతం. ప్రతీ ఏవో పరిధిలో మినీ భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమాఖ్యల ఏర్పాటు. పంటల ఉత్పత్తి టెక్నాలజీని వ్యవసాయ సిబ్బందికి తెలియజేస్తారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులనే పండిస్తా రు. అందుకు రైతులను సన్నద్ధం చేస్తారు. పంట రుణాలను బ్యాంకుల ద్వారా అందిం చే ఏర్పాటు. ఇంటర్నెట్ను వినియోగించుకుని ఎరువులు, విత్తనాల సరఫరా, మార్కెటింగ్ విధానాల ను తెలియపరుస్తారు. 4.5 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు ఈ ఏడాది వానాకాలం, యాసంగిలకు కలిపి 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ తన లక్ష్యంగా పేర్కొంది. దీని కోసం ప్రభుత్వం రూ. 176.15 కోట్లు కేటాయించింది. అలాగే వానాకాలంలో 16.20 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, యాసంగిలో 12 లక్షల మెట్రిక్ టన్నులను సరఫరా చేయాలని నిర్ణయించారు. -
డాలర్ బలం – బంగారం బలహీనం
అంతర్జాతీయ మార్కెట్లో 23 డాలర్లు డౌన్ దేశీయంగానూ ఇదే ప్రభావం న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా డాలర్ బలపడటం అంతర్జాతీయంగా బంగారం ధరను పడగొట్టింది. న్యూయార్క్ కమోడిటీ నైమెక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్ ధర శుక్రవారంతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే ఔన్స్కు (31.1గ్రా)– 23 డాలర్లు తగ్గి, 1,234 డాలర్ల వద్ద ముగిసింది. ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. డాలర్ ఇండెక్స్ అప్ అండ్ డౌన్స్... అమెరికా డాలర్ ఇండెక్స్ సోమవారం నాడు 101.09 వద్ద ప్రారంభమయినా, గురువారం నాటికి భారీగా 102.16 డాలర్లకు చేరింది.అయితే శుక్రవారం ట్రేడింగ్ చివరికి 101.34 డాలర్లకు తగ్గి ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్న కారణంగా రేటు పెంపు ఖాయమన్న ప్రకటన ఫెడ్ చీఫ్ యెలెన్ నుంచి వెలువడుతుందన్న అంచనాలు డాలర్ బలోపేతానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వారం దూకుడు లేకపోవచ్చు... 15 వరకూ అనిశ్చితి ఫెడ్ అంచనాలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన గణాంకాలు వంటి అంశాలు ఉంటే మార్చి 14–15 తేదీల్లో ఫెడ్ రేటు పెంపునకు తగిన అవకాశాలు ఉంటాయని శుక్రవారం యెలెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా పసిడి ధరల దూకుడు కొనసాగకపోవచ్చన్న విశ్లేషణలున్నాయి. మార్చి 15 వరకూ ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంబించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా వారంలో రూ. 160 డౌన్.. ‘ఫ్యూచర్స్’లో అంతకు మించి ఇక అంతర్జాతీయంగా ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో ధర వారం వారీగా 10 గ్రాములకు రూ.623 తగ్గి, రూ.29,020కి చేరింది. దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.160 తగ్గి రూ.29,295కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.29,145కు పడింది. వెండి కేజీ ధర రూ.405 తగ్గి రూ.42,850కి పడింది. క్రూడ్పైనా డాలర్ ప్రభావం.. మూడు వారాల కనిష్టం... డాలర్ పెరుగుదల ఎఫెక్ట్ గురువారం క్రూడ్ ధరపైనా కనిపించింది. నైమెక్స్ లైట్ స్వీట్ బ్యారల్ ధర గురువారం మూడు వారాల కనిష్ట స్థాయి 52.55 డాలర్లకు పడిపోయింది. శుక్రవారం డాలర్ తిరిగి కొంత బలహీనపడడంతో తిరిగి 53.23 డాలర్ల వద్ద ముగిసింది. -
విద్యుత్ కేంద్రాల్లో భారీ కుంభకోణం
- అంచనా వ్యయాలు రూ.2500 కోట్లు పెంచారు - అస్మదీయుల కోసం నిబంధనల మార్పు: బుగ్గన సాక్షి, హైదరాబాద్ : ఏపీలో కృష్ణపట్నం (నెల్లూరు), ఇబ్రహీంపట్నం (విజయవాడ) విద్యుత్ కేంద్రాల నిర్మాణం కాంట్రాక్టుల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుందని, వాటిని వెంటనే రద్దు చేసి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలని పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డిమాండ్చేశారు. ఆయన బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యవసరమైన విద్యుత్ అవసరాలు అంతగా లేకపోయినా అతి ఎక్కువ వ్యయానికి విద్యుత్ ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. గత రెండు మూడేళ్లుగా బొగ్గు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సగానికి సగం తగ్గినందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని, విభజనతో ఏపీకీ విద్యుత్ కలిసి వచ్చిందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం కృష్ణపట్నం , ఇబ్రహీంపట్నంల వద్ద వేర్వేరుగా 800 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టుల నిర్మాణాన్ని తనకు కావాల్సిన కంపెనీలకు అధిక మొత్తాలకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. ఎన్టీపీసీ నిబంధనలు తుంగలో తొక్కారు కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం ప్లాంట్లలో బీటీజీ (బాయిలర్ టర్బయిన్ జనరేటర్)ల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు ఒక మెగావాట్కు రూ 2.88 కోట్ల వ్యయంతో ఇవ్వడం సరైనదేనని బుగ్గన తెలిపారు. బీఓపీ (బ్యాలన్స్ ఆఫ్ది ప్రాజెక్టు) పనులను ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ కంపెనీకి ఒక మెగావాట్కు రూ 2.97 కోట్లకు, కృష్ణపట్నంలో టాటా కంపెనీకి ఒక మెగావాట్కు రూ.3.42 కోట్లకు ఇవ్వడం దారుణమన్నారు. ఇబ్రహీంపట్నంలో బీటీజీ, బీఓపీ కలిపి మెగావాట్ ఒక్కింటికి రూ 5.85 కోట్లు, కృష్ణపట్నంలో రెండూ కలిపి మెగావాట్ ఒక్కింటికి రూ 6.33 కోట్ల వ్యయంతో ఇచ్చేయడమేమిటన్నారు. తెలంగాణలోని కొత్తగూడెం విద్యుత్ ప్రాజెక్టులో రూ 4.76 కోట్లు, యాదాద్రి ప్రాజెక్టులో రూ 4.48 కోట్లు, గుజరాత్లో వనక్భోరిలో రూ 4.3 కోట్లు, మధ్యప్రదేశ్లోని బరేతిలో ఎన్టీపీసీ చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులో రూ 3.94 కోట్లతో ఒక్కో మెగావాట్ను నిర్మిస్తుండగా... ఏపీలో అంచనా వ్యయాన్ని భారీగా పెంచి దోపిడీకి తెరలేపారన్నారు. మొత్తానికి అంచనా వ్యయం 2,500కోట్లకు పెంచేశారన్నారు. -
ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్.. కీలకం
రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు నేడు విడుదల... * 14న టోకు ధరల ద్రవ్యోల్బణం... * 15న ఫెడ్ పాలసీ సమీక్ష నిర్ణయం న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ గణాంకాలు, రుతుపవనాల విస్తరణ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం... అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు కీలకమని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్తో రూపాయి మారకం గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, గత శుక్రవారం వెలువడిన ఐఐపీ గణాం కాలు, ఆదివారం వెలువడిన చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. గణాంకాలతో ఒడిదుడుకులు అంతర్జాతీయ అంశాలతో పాటు మార్కెట్ సెంటిమెంట్ను రుతుపవనాల విస్తరణ నిర్దేశిస్తుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మే నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు సోమవారం(ఈ నెల 13న), టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు మంగళవారం(ఈ నెల14న)న వెలువడుతాయని, ఇవి తగిన ప్రభావం చూపుతాయని వివరించారు. ద్రవ్యోల్బణ గణాంకాల కారణంగా మార్కెట్ ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా ఈ వారం స్టాక్ మార్కెట్పై ఉంటుంది. యంత్ర పరికరాల తయారీ, తయారీ రంగ కార్యకలాపాలు మందగించడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్లో పారిశ్రామికోత్పత్తి మైనస్ 0.8 శాతానికి తగ్గింది. గత మూడు నెలల్లో ఇదే తొలి క్షీణత కావడం గమనార్హం. అందరి చూపు ఫెడ్ వైపే.... ఈ నెల 15న వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫలితం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నిపుణులంటున్నారు. రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఫెడ్ నిర్ణయించవచ్చని అంచనాలున్నాయి. బ్రిక్జిట్ ఫలితం(యూరోపియన్ యూనియన్లో కొనసాగాలా వద్ద అనే విషయంలో బ్రిటన్లో ఈ నెల 23న రెఫరెండమ్ జరగబోతోంది) ఎలా ఉండబోతోందోనన్న అంచనాల కారణంగా యూరోప్ మార్కెట్ల కదలికలు మన మార్కెట్పై ఒకింత ప్రభావం చూపుతాయని మనీపామ్ సీఈఓ నిర్దోశ్ గౌర్ చెప్పారు. రెండు వారాల వరుస లాభాలకు గత వారంలో బ్రేక్ పడింది. స్టాక్ సూచీలు ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. సెన్సెక్స్ గత వారంలో 207 పాయింట్లు (0.8 శాతం) తగ్గి 26,636 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 0.6 శాతం క్షీణించి 8.170 వద్ద ముగిశాయి. బుధవారం(ఈ నెల14)న బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్నది. ఇక గురువారం (ఈ నెల15న) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనున్నది. విదేశీ కొనుగోళ్లు జోరు.. భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. కంపెనీల క్యూ4 ఫలితాలు సానుకూలంగా ఉండటం, వర్షాలు విస్తారంగా కురుస్తాయని, ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ.3,700 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. అంతకు ముందటి మూడు నెలల్లో(మార్చి-మే) విదేశీ ఇన్వెస్టర్లు రూ.32,000 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేశారు. అంతకు ముందటి నాలుగు నెలల్లో(గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ) విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
తీవ్ర హెచ్చుతగ్గులుంటాయ్..
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం * క్యూ4 ఫలితాలపై చూపు న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ తదితర బ్లూచిప్ కంపెనీల నుంచి వెలువడే క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తుందని, అయితే డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా మన సూచీల కదలికల్ని శాసిస్తాయని వారన్నారు. అలాగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతుందని వారు వివరించారు. ఫెడ్ సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనున్నది. ఈ వారం యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, భారతి ఎయిర్టెల్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని ప్రకటించనున్నాయి. రిలయన్స్ ఫలితాల ఎఫెక్ట్... గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలకు స్పందించడం ద్వారా ఈ సోమవారంనాటి ట్రేడింగ్ ఆరంభమవుతుందని, తద్వారా తదుపరి సూచీల దిశ నిర్దేశితమవుతుందని ట్రేడ్స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. 8 ఏళ్లలో రికార్డుస్థాయి క్వార్టర్లీ నికరలాభాన్ని రిలయన్స్ ప్రకటించింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ మార్జిన్ల జోరు దీనికి ప్రధాన కారణం. అయితే రానున్న త్రైమాసికాల్లో ఈ స్థాయి మార్జిన్లను కంపెనీ సాధించగలుగుతుందా, లేదా అనే అంచనాలతో రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయని విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. పార్లమెంటు సమావేశాలపై దృష్టి... సోమవారం నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశాల్ని కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ సమావేశాల్లో దివాలా బిల్లు, జీఎస్టీ బిల్లులు ఆమోదానికి నోచుకోవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. బోర్డ్ మీటింగ్స్ ఈ వారం.. 25-సోమవారం: ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్పాంజ్ ఐరన్, వెల్స్పన్ ఇండియా ఏబీబీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 26-మంగళవారం: యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, మారుతీ సుజుకీ, రేమండ్ 27-బుధవారం: భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, యస్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 28-గురువారం: హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐడియా సెల్యులర్, ఏసీసీ, అంబుజా సిమెంట్, 29 -శుక్రవారం: ఐసీఐసీఐ బ్యాంక్, ఇండిగో, ఐడీఎఫ్సీ, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ -
ద్రవ్యోల్బణం డేటా కీలకం..
దేశీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ కదలికలకు కీలకమని విశ్లేషకులు అంటున్నారు. సోమవారంనాడు వెలువడే ఫిబ్రవరి నెల రిటైల్, టోకు ద్రవ్యోల్బణం,ఆర్బీఐ రేటు నిర్ణయం వంటి అంశాలపై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ సింఘానియా చెప్పారు. ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడే సంకేతాలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు, క్రూడ్ ధరల చలనం వంటి అంశాలు సమీప భవిష్యత్తులో మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తాయని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ గాడియా తెలిపారు. అమెరికా ఫెడ్ 15-16 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే సమావేశం ట్రేడింగ్ను ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు. స్వల్పకాలిక కరెక్షన్!: గత అంచనాలకు భిన్నంగా ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్గా మారింది. వివిధ రంగాల షేర్లపై ఈ సెంటిమెంట్ ప్రభావం కన్పిస్తోంది. బాగా బుల్లిష్ సెంటిమెంట్ నెలకొన్నందున, స్వల్పకాలికంగా చిన్నపాటి కరెక్షన్ జరిగే అవకాశం లేకపోలేదని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ చెప్పారు. అయితే అంతర్లీనంగా మార్కెట్ పటిష్టంగానే వుంటుందని, తదుపరి ట్రెండ్ నెలకొనేముందు, సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఆయన అంచనావేశారు.వరుసగా రెండోవారం దేశీయ సూచీలు పెరుగుదలతో ముగిసాయి. రెపోను తగ్గించవచ్చన్న అంచనాలతో ఎఫ్పీఐలు ఈక్విటీ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 8,000 కోట్లు నికరంగా పెట్టుబడి చేశారు. -
పసిడి వెనకడుగు!
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్లో బలహీన ధోరణి, దేశీయంగా కొనుగోళ్ల మద్దతు తగ్గడం వంటి కారణాలతో పసిడి సోమవారం వెనకడుగు వేసింది. కడపటి సమాచారం అందే సరికి నెమైక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర క్రితం ధరతో పోల్చితే 21 డాలర్ల నష్టంతో 1,210 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 15 డాలర్ల పైనే ట్రేడవుతున్నా... నష్టాల్లోనే ఉంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్- మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా కడపటి సమాచారం అందే సరికి పసిడి 10 గ్రాముల ధర క్రితంతో పోల్చితే భారీగా రూ.535 క్షీణించి రూ.28,980 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా కేజీకి రూ.534 నష్టంతో రూ.36.983 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే... మంగళవారం స్పాట్ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. కాగా సోమవారం ముంబై స్పాట్ మార్కెట్లో సైతం పసిడి 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ. 445 తగ్గి రూ.28,650కి చేరింది. 99.5 ప్యూరిటీ ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,500కు చేరింది. వెండి కేజీ ధర రూ.655 తగ్గి రూ.37,035కు చేరింది. -
ఎవరికెంత లాభం?
అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు విపరీతంగా తగ్గాయి. ఏడాదిన్నర కిందటితో (జూన్ 2014) పోలిస్తే ఏకంగా 70 శాతం పతనమయ్యాయి. పదకొండేళ్ల కనిష్టానికి పడిపోయి... ఈ వారం బ్యారెల్ (159 లీటర్లు) ముడి చమురు ధర 36 డాలర్లకు పతనమైంది. చమురు దిగుమతి బిల్లులు తగ్గడం మూలంగా భారత్కు ఆర్థికంగా బాగా కలిసి వస్తోంది. దీంట్లో జనం కంటే ఎక్కువగా ప్రభుత్వమే లబ్దిపొందింది. మోర్గాన్ స్టాన్లీ మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎవరికెంత లాభమో అంకెల్లో చూద్దాం... 3,10,000 కోట్లు 2012లో భారత్ చమురు దిగుమతి బిల్లు రూ. 7,12,000 కోట్లు. 2015లో ఇది రూ. 4,02,600 కోట్లకు పడిపోయింది. అంటే అంతర్జాతీయంగా చమురు ధరల పతనం మూలంగా భారత్కు ప్రతియేటా దాదాపు 3 లక్షల కోట్లు ఆదా అవుతోంది. 1,78,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి మిగిలిన మొత్తం. చమురు బిల్లు తగ్గడంతో కేంద్రంపై 1,78,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. అంటే ఈ మేరకు పెట్రో దిగుమతులపై వెచ్చించే మొత్తం తగ్గిందన్నమాట. 2014 నుంచి ఇప్పటిదాకా (ఏడాదికాలంలో) ఎక్సైజ్ డ్యూటీ పెంపు ద్వారా 92,400 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరాయి. 79,200 కోట్లు చమురు, దాని సంబంధిత ముడిపదార్థాలను ఉపయోగించుకొనే పరిశ్రమలపై 79,200 కోట్ల భారంతగ్గింది. 52,800 కోట్లు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 70 శాతం మేర పతనమైనా... భారత ప్రజలకు దీని లాభాలు పూర్తిగా చేరడం లేదు. పెట్రోలు, డీజిల్ ధరలు 20 శాతం మేరకే తగ్గాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పన్నులు పెంచడం ద్వారా తమ పెట్రో ఆదాయం తగ్గకుండా చూసుకుంటున్నాయి. ధరల తగ్గుదల మూలంగా జనానికి మిగిలింది 52,800 కోట్లు మాత్రమే. 70 % జూన్ 2014- బ్యారెల్ 115 డాలర్లు డిసెంబరు 2015- బ్యారెల్ 36 డాలర్లు -సెంట్రల్ డెస్క్ -
పసిడి ధర పెరుగుదల తాత్కాలికమే!
* అంతర్జాతీయ మార్కెట్పై నిపుణులు న్యూయార్క్: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు పెంచడం దాదాపు ఖాయం కావడం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బెంచ్మార్క్ డిపాజిట్ రేటు తగ్గించడం వంటి ప్రతికూల వార్తల నడుమ అంతర్జాతీయ మార్కెట్లో జరిగిన షార్ట్ కవరింగతో తాజాగా పసిడి ధర కొంత బలపడింది. అయితే ఇది తాత్కాలిక ధోరణేనని ఫ్రాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బులియన్ బ్యాంక్ కటిక్సిస్ పేర్కొంది. ఫెడ్ ఫండ్ రేటు పెరిగిన తర్వాత ధర మళ్లీ క్రమేపీ క్షీణించవచ్చని బ్యాంక్ అంచనావేస్తోంది. ఫెడ్ రేటు పెంపు తర్వాత ఔన్స్ (31.1గా) ధర వెయ్యి డాలర్ల దిగువకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని సంస్థ 2016 అవుట్లుక్ పేర్కొంది. వడ్డీ రేట్లు పెరిగితే గోల్డ్ హోల్డింగ్స్ వ్యయాలు పెరిగిపోయే ప్రమాదమే దీనికి కారణమని విశ్లేషించింది. క్రమీణా 950 డాలర్లకు పడిపోయే వీలుందని బ్యాంక్ విలువైన లోహాల విశ్లేషకుడు బెర్నాండ్ దహ్బాద్ పేర్కొన్నారు. 2016లో సగటు ధర 970 డాలర్లుగా ఉంటుందని అంచనా. ఏడవ వారమూ డౌన్... ఇక వారంవారీగా.. వరుసగా ఏడవ వారమూ నష్టాన్నే చవిచూశాయి. వారం వారీగా 4వ తేదీ శుక్రవారం రూ. 145 నష్టంతో రూ.25,140 వద్ద ముగిసింది. 99.9 ప్యూరిటీ ధర కూడా ఇంతే మొత్తం తగ్గి, రూ. రూ.25,290 వద్ద ముగిసింది. ముంబై మార్కెట్లో శనివారం ధర లభ్యం కాకున్నా... ఢిల్లీసహా పలు బులియన్ మార్కెట్లలో శనివారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ జోరు సోమవారం ముంబైలో కనిపించే వీలుంది. అంతర్జాతీయంగా న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ డెలివరీ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం వారం ముగింపు 1,056 డాలర్లతో పోల్చితే 28 డాలర్ల లాభంతో 1,084 డాలర్ల వద్ద ముగిసింది. -
అంతర్జాతీయ మార్కెట్పై దృష్టి
బాలిస్టిక్ సేఫ్టీ సిస్టమ్స్ డెరైక్టర్ పురుషోత్తం వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ల వంటి భద్రత ఉపకరణాల తయారీలో ఉన్న బాలిస్టిక్ సేఫ్టీ సిస్టమ్స్ టెక్నాలజీ (బీఎస్ఎస్టీ) విదేశీ మార్కెట్లపై దృష్టి పెట్టింది. జర్మనీతోపాటు భారత్లోనూ ప్లాంటు ఉన్న ఈ సంస్థ... అంతర్జాతీయ ప్రమాణాలతోభద్రత ఉపకరణాలను రూపొందిస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ పురుషోత్తం మహావాది తెలియజేశారు. విక్రయానికి అంతర్జాతీయ మార్కెట్లే ఉత్తమమని, అక్కడి రక్షణ సంస్థలు ఖర్చుకు వెనుకాడవని వెల్లడించారు. డిఫెన్స్, ఏరోస్పేస్ సదస్సులో భాగంగా సోమవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. యునిసెఫ్ శాంతి దళాలు, ఖజకిస్తాన్ సైన్యం, కొచ్చిన్ షిప్యార్డ్, రిలయన్స్ తమ క్లయింట్ల జాబితాలో ఉన్నాయన్నారు. 2ప్లాంట్లకు కలిపి ఇప్పటి వరకు రూ.230 కోట్లకుపైగా ఖర్చు చేశామన్నారు. ప్రపంచంలో తొలిసారి స్మార్ట్ సెన్సార్స్తో కూడిన బాలిస్టిక్స్ హెల్త్ మానిటర్స్ను కంపెనీ రూపొందించింది. ప్రస్తుతం దీని పేటెంట్ పెండింగ్లో ఉందని కంపెనీ ప్రతినిధి ఎం.కృష్ణ మోహన్ తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ ఏ మేరకు రక్షణ కల్పిస్తుందో ఈ సెన్సార్స్ గుర్తించి అలర్ట్ చేస్తాయని చెప్పారు. రక్షణ రంగంలో ఉన్న మహిళల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను భారత్లో తొలిసారిగా తయారు చేశామన్నారు. ఫ్యాబ్ సిటీ వద్ద ఉన్న ప్లాంటుకు ఏటా 30 వేల జాకెట్లు, 30 వేల హెల్మెట్లు, 50 వేల బ్లాంకెట్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. -
మద్దతు శ్రేణి 26,750-26,670
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేస్తుందన్న అంచనాలు బలంగా ఏర్పడటం, చైనా మార్కెట్ నిలదొక్కుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, లోహాల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో కమోడిటీ షేర్లు ప్రపంచవ్యాప్తంగా ర్యాలీ సాగిస్తున్నందున, అన్ని దేశాల మార్కెట్ సూచీలు గతవారం వేగంగా కోలుకున్నాయి. ఈ ట్రెండ్లో భాగంగా భారత్ మార్కెట్లో ఆయిల్, మెటల్ షేర్ల ర్యాలీ ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఆరువారాల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ తరుణంలో కార్పొరేట్ ఫలితాల సీజన్ వచ్చేసింది. ఇక నుంచి ఆయా కంపెనీల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు అక్టోబర్ 9తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 26,200 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపి, చివరకు 859 పాయింట్ల భారీ లాభంతో 27,080 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్టైమ్ రికార్డు స్థాయి 30,025 పాయింట్ల నుంచి సెప్టెంబర్ 8నాటి 24,833 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ జరిగిన 5,192 పాయింట్ల నష్టంలో 38.2 శాతం ప్రస్తుతం జరుగుతున్న రిట్రేస్మెంట్ ర్యాలీలో పూడ్చుకోగలిగింది. అలాగే ఆగస్టు 24 నాటి గ్యాప్ డౌన్ శ్రేణిని కూడా గత శుక్రవారం పూడ్చుకున్నది. కానీ ఆ లోపున ముగిసినందున, ఈ వారం సెన్సెక్స్ 27,130 పాయింట్లపైన స్థిరపడితేనే తదుపరి ర్యాలీ కొనసాగే చాన్స్ వుంటుంది. అలా స్థిరపడితే 50 శాతం రిట్రేస్మెంట్ స్థాయి అయిన 27,429 స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 200 డీఎంఏ అయిన 27,686 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం హఠాత్తుగా క్షీణత మొదలైతే 26,750-26,670 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 26,380 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 26,050-25,900 పాయింట్ల శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. నిఫ్టీ మద్దతు శ్రేణి 8,130-8,095 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాంగంలో సూచించిన రీతిలో సోమవారం గ్యాప్అప్తో ప్రారంభమైన తర్వాత క్రమేపీ ర్యాలీ సాగించి కీలకమైన 8,225 పాయింట్ల స్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 239 పాయింట్ల లాభంతో 8,190 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం వారం గరిష్టస్థాయి అయిన 8,230 పాయింట్లను తాకడం ద్వారా ఆగస్టు 24నాటి భారీ సందర్భంగా ఏర్పడిన గ్యాప్ను నిఫ్టీ పూడ్చగలిగింది. ఈ కారణంగా సమీప భవిష్యత్తులో ఈ స్థాయిపైన స్థిరపడితేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిపైన క్రమేపీ 8,329 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన కీలకమైన 200 డీఎంఏ స్థాయి అయిన 8,382 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం 8,230 స్థాయిపైన నిలదొక్కుకోలేకపోతే 8,130-8,095 పాయింట్ల శ్రేణి మధ్య నిఫ్టీకి తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 8,005 స్థాయికి క్షీణించవచ్చు. ఆ లోపున అమ్మకాల ఒత్తిడికి లోనైతే 7,925-7,875 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావొచ్చు. - పి. సత్యప్రసాద్ -
పుత్తడి హెచ్చుతగ్గులు.. మరోవారం నష్టాలు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్కు అనుగుణంగా గతవారం దేశీయ మార్కెట్లో బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల విక్రయాల ఫలితంగా మరోవారం పుత్తడి ధర తగ్గింది. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడటం వంటి అంశాలతో ఇటీవల బంగారం ధర క్షీణిస్తూ వస్తోంది. అయితే గత శుక్రవారం వెలువడిన అమెరికా ఆర్థిక గణాంకాలు బలహీనంగా వుండటంతో వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరగకపోవొచ్చన్న అంచనాలతో ఆ రోజు బంగారం ధర పెరిగింది. వెరసి వారమంతా ధర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. న్యూయార్క్లో ఔన్సు బంగారం ధర 9 డాలర్ల పెరుగుదలతో 1,095 డాలర్ల వద్ద ముగిసింది. స్థానికంగా ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి 10 గ్రాములకు రూ. 105 క్షీణించి రూ. 25.040 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛతగల బంగారం ధర అంతేమొత్తం తగ్గుదలతో రూ. 24,890 వద్ద క్లోజయ్యింది. -
గోల్డ్‘లోనే’ అయోమయం!
♦ తగ్గుతున్న ధరపై రుణ కంపెనీల ఆందోళన ♦ కొత్త రుణాల కంటే పాక్షిక రుణ వసూళ్లపై దృష్టి ♦ గ్రాముకు రూ. 300 నుంచి రూ.400 తగ్గిన రుణ మొత్తం ♦ ధర సమీక్ష గడువు వారానికి కుదింపు ♦ నేల చూపులు చూస్తున్నగోల్డ్ లోన్ కంపెనీల షేర్లు తగ్గుతున్న షేర్ల ధరలు తగ్గుతున్న బంగారం ధరలు కంపెనీల లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఈ రంగంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్ల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత పది రోజుల్లో ఎన్బీఎఫ్సీ షేర్లు 15 నుంచి 20 శాతం నష్టపోయాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేరు 19 శాతం, మణప్పురం 17 శాతం, ఐఐఎఫ్ఎల్ 15 శాతం చొప్పున నష్టపోయాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడుతుండటమే కాక... ఇంకా తగ్గుతాయన్న అంచనాలు గోల్డ్ లోన్ వ్యాపారస్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే దేశీ మార్కెట్లో ఇంకా అంతగా తగ్గలేదు. అయితే మరింత తగ్గవచ్చనే విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా... ఆభరణాలను తనఖా పెట్టుకొని అప్పులిచ్చే సంస్థలు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కొత్తగా ఇచ్చే రుణాల్లో లోన్ టు వేల్యూ (ఎల్టీవీ) విలువను భారీగా తగ్గించేశాయి. గతంలో ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే గ్రాముకు రూ.300 నుంచి రూ.400 అదనంగా ఇచ్చిన ప్రైవేటు సంస్థలు ఇప్పుడు ఆ ప్రీమియాన్ని తగ్గించేశాయి. మొన్నటి వరకు 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన గ్రాము బంగారంపై రూ.2,000 నుంచి రూ. 1,900 వరకు రుణమిచ్చే వారమని, ఇప్పుడు గరిష్టంగా రూ.1,650కి మించి ఇవ్వడం లేదని ప్రైవేటు గోల్డ్లోన్ సంస్థల ప్రతినిధులు చెప్పారు. బంగారం విలువలో 75 శాతానికి మించి ఇవ్వకూడదన్న నిబంధనను తు.చ. తప్పకుండా పాటించాలని ప్రైవేటు సంస్థలు దిగువ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేశాయి. అంతేకాకుండా ఇప్పటికే అధిక మొత్తానికి రుణాలిచ్చిన వారి నుంచి విలువ తగ్గిన మేరకు పాక్షికంగా కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఖాతాదారులకు సమాచారమివ్వడమే కాకుండా తగ్గిన విలువను కట్టించుకున్నట్లు ప్రైవేటు గోల్డ్లోన్ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. గతంలో నెల రోజులకు ఒకసారి ఎల్టీవీ విలువను లెక్కించే వారమని, మారిన పరిస్థితుల్లో ఇప్పుడు వారానికి ఒకసారి లెక్కిస్తున్నామని వారు తెలియజేశారు. అలాగే కొత్త రుణాలను చాలా స్వల్పకాలానికే మంజూరు చేస్తున్నట్లు ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం ఇంత వరకు ఎల్టీవీ విలువను సవరించలేదు. పీఎస్యూ బ్యాంకులు గ్రాముకు రూ. 1,600 నుంచి రూ. 1,700 వరకు మాత్రమే ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గడంతో త్వరలోనే ఎల్టీవీ విలువను సవరించనున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
ఫలితాలు, పార్లమెంటుపై దృష్టి
ఈ వారం మార్కెట్పై నిపుణుల అంచనా ♦ జాబితాలో ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల ఫలితాలు ♦ పార్లమెంటు ముందు కీలక బిల్లులు.. న్యూఢిల్లీ : బ్లూచిప్ కంపెనీలైన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల ఫలితాలు, కీలక బిల్లులపై వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో జరిగే చర్చల ఆధారంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. ఈ అంశాలే కాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రీతి, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు, చమురు ధర తదితర అంశాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారన్నారు. ముఖ్యంగా జూన్తో ముగిసిన తొలి త్రైమాసిక ఫలితాలు ట్రెండ్పై ప్రభావాన్ని చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వికాస్ సింఘానియా చెప్పారు. హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, లుపిన్, విప్రో, యాక్సిస్ బ్యాంక్ల ఫలితాలు సైతం ఈ వారమే వెల్లడికానున్నాయి. వచ్చే ఏడాదికి ఆయా కంపెనీలు ప్రకటించే గెడైన్స్పై ఇన్వెస్టర్ల దృష్టి అధికంగా వుంటుందన్నారు. 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఏర్పడే రాజకీయ పరిణామాల్ని, ప్రధానంగా భూసేకరణ బిల్లు, జీఎస్టీ బిల్లుల భవితవ్యాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. భూసేకరణ, జీఎస్టీ బిల్లుల్ని పార్లమెంటు ఆమోదిస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో వున్నాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన సంస్కరణలకంటే ఇవి రెండూ అత్యంత కీలకమని ఆయన అన్నారు. గతవారం మార్కెట్: ప్రపంచ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 802 పాయింట్ల పెరుగుదలతో 28,463 పాయింట్ల వద్దకు చేరింది. ప్రధానంగా ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎఫ్ఎంసీజీ షేరు ఐటీసీల అప్ట్రెండ్ ఫలితంగా స్టాక్ సూచీలు మూడు నెలల గరిష్టస్థాయికి చేరాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు బిలియన్ డాలర్లు ఈ నెలలో ఇప్పటివరకూ భారత్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు చేసిన పెట్టుబడులు బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా విదేశీ పెట్టుబడుల పరిమితిని సరళీకరించడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్లో జూలై 1-17 తేదీల మధ్య 4,953 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 1,547 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. దీంతో వారి మొత్తం పెట్టుబడుల విలువ రూ. 6,500 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
పసిడి దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు...
న్యూఢిల్లీ : పసిడి, వెండి టారిఫ్ విలువను కేంద్రం గురువారం తగ్గించింది. 10 గ్రాముల పసిడి టారిఫ్ విలువ 382 డాలర్ల నుంచి 376 డాలర్లకు తగ్గింది. కేజీ వెండి టారిఫ్ విలువ 516 డాలర్ల నుంచి 498 డాలర్లకు తగ్గింది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువనే ప్రాతిపదికగా తీసుకుంటారు. అంతర్జాతీయ ధరల థోరణికి అనుగుణంగా కేంద్రం 15 రోజులకు ఒకసారి టారిఫ్ విలువపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1 గ్రా) ధర 1,146 డాలర్ల దగ్గర ఉంది. -
ఊగిసలాట..
♦ 28 పాయింట్ల నష్టంతో 27,933కు చేరిక ♦ 6 పాయింట్ల నష్టంతో 8,454కు నిఫ్టీ వినియోగదారుల ద్రవ్యోల్బణం(జూన్ నెల) పెరగడంతో కీలక రేట్ల కోత ఆశలు సన్నగిల్లి, వడ్డీరేట్ల ప్రభావిత షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 27,933 పాయింట్ల వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 8,454 పాయింట్ల వద్ద ముగిశాయి. వాహన, రియల్టీ, బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. అయితే వరుసగా ఎనిమిదో నెల కూడా టోకుధరల ద్రవ్యోల్బణం మైనస్లోనే నమోదు కావడం స్టాక్ మార్కెట్కు కొంత ఊరటనిచ్చింది. ఆయిల్, ఫార్మా షేర్ల జోరు... ఇరాన్పై ్రఆంక్షలు తొలగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. దీంతో హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీల షేర్లు 3 శాతం వరకూ పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా, అలెంబిక్ ఫార్మా, ఫోర్టిస్ హెల్త్కేర్ కంపెనీల షేర్లు కొత్త రికార్డ్ స్థాయిలను తాకాయి. ఇతర ఫార్మా షేర్లు ఎల్డర్ ఫార్మా, టీటీకే హెల్త్కేర్, సువెన్ లైఫ్ సెన్సైస్, వివిమెడ్ ల్యాబ్స్, అర్తి డ్రగ్స్, మార్క్సన్స్ ఫార్మా, క్లారిస్ లైఫ్ సెన్సైస్ 2-8 శాతం రేంజ్లో పెరిగాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,907 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.14,948 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,83,942 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.270 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.131 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. -
మూడు నెలల కనిష్టానికి పసిడి
ముంబై : బంగారం ఇక్కడ ప్రధాన బులియన్ మార్కెట్లో బుధవారం 3 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. మంగళవారం ముగింపుతో పోల్చితే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.155 తగ్గి రూ.26,100కు చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర అదే స్థాయిలో తగ్గి రూ.25,950కి పడింది. వెండి కూడా భారీగా రూ.1,130 తగ్గి రూ.35,115కు జారింది. కారణాలు : అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకుల ధోరణి నేపథ్యంలో స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు స్పాట్ మార్కెట్లో పసిడి నష్టాలకు కారణమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమల నుంచి డిమాండ్ తగ్గడం పసిడి ధరపై ప్రతికూలత చూపుతోందనీ విశ్లేషిస్తున్నాయి. చైనా వృద్ధిపై అనుమానాలు.. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు... ఈ నేపథ్యంలో డాలర్ బలపడ్డం వంటి అంశాలు విలువైన మెటల్స్ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ధర ఔన్స్కు (31.1 గ్రా) 1,160 డాలర్ల స్థాయిలో తిరుగుతుండగా, వెండి విషయంలో ఈ రేటు 15 డాలర్లుగా ఉంది. -
లాభాల స్వీకరణ.. నష్టాలు
రెండు ట్రేడింగ్ సెషన్ల స్టాక్ మార్కెట్ లాభాలకు మంగళవారం బ్రేక్పడింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్లో బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 37 పాయింట్ల నష్టంతో 28,172 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 8,511 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆయిల్, ఎఫ్ఎంసీజీ, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. పదివారాల గరిష్ట స్థాయిని తాకి... లాభాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్ కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో 28,335 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది పదివారాల గరిష్ట స్థాయి. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో 28,084 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. వర్షాలు సాధరణం కంటే ఎక్కువ స్థాయిలోనే కురుస్తుండటంతో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారని, గ్రీస్ రుణ సంక్షోభాన్ని పట్టించుకోలేదని బ్రోకర్లు చెప్పారు. చమురు లాభాలు...వర్షాలు సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో కురుస్తుండటంతో రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో పెయింట్, టైర్, విమానయాన, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పెరిగాయి. ఏషియన్ పెయింట్స్, శాలిమర్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, జెట్ ఎయిర్వేస్, స్పైస్జెట్, అపోలో టైర్స్ షేర్లు 5-8 శాతం రేంజ్లో పెరిగాయి. బీపీసీఎల్, ఐఓసీ, హెచ్పీసీఎల్ షేర్లు 0.1 శాతం నుంచి 3 శాతం రేంజ్లో పెరిగాయి. కోల్ ఇండియాతో సహా 143 షేర్లు బీఎస్ఈలో ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. -
ఎగుమతుల్లో ఎంపెడా రికార్డు స్థాయి వృద్ధి
సాక్షి, విశాఖపట్నం : సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఎగుమతుల్లో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5,511.12 మిలియన్ అమెరికా డాలర్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసి ఈ ఆల్టైమ్ హై రికార్డును సొంతం చేసుకుంది. రూ.33,441.61 కోట్ల విలువైన 10,51,243 మెట్రిక్ టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే సరకు పరిమాణంలో 6.86 శాతం, రూపాయల్లో 10.69 శాతం వృద్ధిని సాధించ గలిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 9,83,756 టన్నులను ఎగుమతి చేయగా 2014-15లో 6.86 శాతం వృద్ధితో 10,51,243 టన్నులకు పెరిగింది. అలాగే 2013-14లో ఎగుమతుల విలువ రూ.3,02,132.60 కోట్లుండగా, 2014-15లో రూ. 3,34,416 కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో సంభవించిన పరిణామాలతో ఈ వృద్ధి సాధ్యమయిందని ఎంపెడా గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ ఎగుమతుల్లో రొయ్యలదే (34.01 శాతం) అగ్రభాగమని పేర్కొంది. మొత్తం 3,57,505 టన్నుల రొయ్యలను ఎగుమతి చేసింది. 2014-15లో ఆక్వా ఉత్పత్తుల పెరుగుదల (30.63 శాతం) కూడా గణనీయంగానే ఉందని వివరించింది. మొత్తం ఆక్వా ఉత్పత్తులు 4,34,558 టన్నుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచే 2,79,727 టన్నుల ఎగుమతి జరిగింది. 29.44 శాతం పెరుగుదలతో చేపలు రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో కటిల్ఫిష్ (20.09 శాతం) ఉంది. -
ఏపీ సర్కార్ ‘కోల్’మాల్
♦ విదేశీ బొగ్గు సరఫరాలో ఖజానాకు రూ.500 కోట్ల నష్టం ♦ అంతర్జాతీయంగా బొగ్గు ధర తగ్గినా పాత ధరే చెల్లింపు ♦ అవసరం లేకున్నా భారీగా బొగ్గు దిగుమతులు ♦ ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీజెన్కో)కు విదేశీ బొగ్గు వ్యవహారంలో భారీ కొనుగోల్మాల్ జరిగినట్టు తెలుస్తోంది. ఆరు నెలలకు టెండర్లు పిలిచి రెండేళ్లపాటు భారీ స్థాయిలో బొగ్గు దిగుమతి చేసుకోవడతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.500 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఓ రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ముందుపెట్టి ప్రభుత్వ పెద్దలు కథ నడిపిస్తుంటే, అధికారులు వారికి చేయూతనిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు 70 శాతం స్వదేశీ బొగ్గును, 30 శాతం విదేశీ బొగ్గును వాడతారు. విదేశీ బొగ్గును సరఫరా చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఓపెన్ టెండర్ల ద్వారా దక్కించుకుంటాయి. విదేశీ బొగ్గు సరఫరా కోసం 2013 జూన్ 28న పిలిచిన టెండర్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీఈసీ లిమిటెడ్ (న్యూఢిల్లీ), ఎంఎస్టీసీ లిమిటెడ్ (కోల్కతా) చేజిక్కించుకున్నాయి. ఆ మేరకు విజయవాడలోని థర్మల్ కేంద్రాలకు టన్ను రూ. 4,970 చొప్పున ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు, ముద్దనూరు ఆర్టీపీపీకి మెట్రిక్ టన్ను రూ. 5,150 చొప్పున నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేయాలి. ఈ కాంట్రాక్టు గడువు 2013 డిసెంబర్తో ముగిసింది. నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, ఎవరు తక్కువ ధరకు సరఫరాచేస్తే వారికే కాంట్రాక్టు ఇవ్వాలి. కానీ ఏపీ జెన్కో ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వలేదు. 2013 డిసెంబర్ 20 నుంచి ఏడుసార్లు టెండర్లు పిలిచి, ఆ తర్వాత రద్దు చేసేసింది. 2014 ఏప్రిల్ 22వ తేదీన మరోసారి టెండర్లు పిలిచినా... ఏపీ జెన్కో పెట్టిన సవాలక్ష నిబంధనలవల్ల ఎవరూ అర్హత పొందలేదు. ఈ నేపథ్యంలో 2014 ఆగస్టు 25న మరోసారి 3.4 మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచింది. ఎంఎస్టీసి ఒక్కటే టెండర్ వేయడంతో దీన్నీ రద్దు చేశారు. ఈ సంస్థల్లోని వ్యక్తులు ప్రభుత్వ పెద్దల అక్రమాలకు అన్నివిధాలుగా సహకరిస్తున్నందువల్ల... ఇప్పటివరకూ సరఫరా చేస్తున్న సంస్థలు మాత్రమే అర్హత పొందేలా, ఇతర సంస్థలేవీ అర్హత సాధించకుండా ఉండేలా నిబంధనలు పొందుపరిచినట్లు తెలుస్తోం ది. ఇలా వివిధ కారణాలతో టెండర్లు ఖరారు చేయకుండా.. 2013లో టెండర్లు దక్కించుకున్న ఎంఎంటీసీ, పీఈసీ లిమిటెడ్ సంస్థలు పాత ధరలకే బొగ్గు దిగుమతి చేసేందుకు మార్గం సుగమం చేశారు. బొగ్గు ధర తగ్గినా పాత రేటుకే సరఫరా 2013లో అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర టన్ను 69.15 డాలర్లుగా ఉంది. ఇది 2015 నాటికి 52.40 డాలర్లకు తగ్గింది. అయినప్పటికీ ఏపీ జెన్కో టన్నుకు 69.15 డాలర్లు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటనేది అర్థం కాని విషయం. పైగా 2013 ఒప్పందం ప్రకారం 12 లక్షల టన్నులు సరఫరా చేయగా.. కాంట్రాక్టు గడువు పొడిగించిన తర్వాత 19.5 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సమయంలో స్వదేశీ బొగ్గు సమృద్ధిగా లభిస్తోంది. ఏపీ జెన్కో విద్యుత్ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదు. అయినా పెద్ద మొత్తంలో విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవడం ఆర్థిక ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. 2013తో పోలిస్తే ఏపీ జెన్కో 165 శాతం విదేశీ బొగ్గు కోసం వెచ్చించినట్టు కన్పిస్తోంది. దీని విలువ రూ. 1,100 కోట్లని లెక్కగట్టారు. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత 10 లక్షల టన్నులు అవసరంకాగా 20 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఫలితంగా రూ. 200 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. టెండర్లను ఖరారు చేసి, వాస్తవ వినియోగం ప్రకారం బొగ్గును దిగుమతి చేసుకుని ఉంటే... సుమారు రూ. 500 కోట్ల మేర ఖర్చు తగ్గేదని నిపుణులు చెబుతున్నారు. అడ్డగోలుగా హ్యాండ్లింగ్ ఛార్జీలు విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును ఓడరేవులనుంచి థర్మల్ ప్రాజెక్టులకు చేర్చినందుకు ఏపీ జెన్కో కొంతమొత్తం చెల్లిస్తుంది. బొగ్గు సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సరుకు రవాణాకు సబ్కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తాయి. అలా ఎంపికైన అదానీ, మహేశ్వరి కోల్ కంపెనీలు మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నులను రవాణా చేశాయి. అయితే కృష్ణపట్నం పోర్టుకు, థర్మల్ ప్రాజెక్టుకు దూరం కేవలం ఏడు కిలోమీటర్లే. కాబట్టి ఎలాంటి హ్యాండ్లింగ్ ఛార్జీలు దీనికి వర్తించవనే నిబంధనలున్నాయి. కానీ ఏపీ జెన్కో ఉదారంగా హ్యాండ్లింగ్ ఛార్జీలకింద రూ. 100 కోట్లు చెల్లించి వారికి లబ్ధి చేకూర్చిందన్న ఆరోపణలున్నాయి. టెండర్లు రద్దు చేశాం: జెన్కో వర్గాలు ఇప్పటివరకూ గడువు పొడిగిస్తూ వచ్చిన సంస్థల టెండర్లు రద్దు చేస్తూ ఏపీ జెన్కో బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హతగల సంస్థలు ముందుకు రాకపోవడంవల్లే ఇంతకాలం టెండర్లు పిలవలేదని పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర తగ్గినప్పటికీ, డాలర్ విలువ పెరిగిందనీ, దీంతోపాటు రైల్వే రవాణా ఛార్జీలు పెరిగాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో సరఫరా చేస్తున్న విదేశీబొగ్గుకు చెల్లించే మొత్తం ఒక్కపైసా కూడా ఎక్కువ ఉండదని పేర్కొన్నాయి. 69.15 డాలర్లు: 2013లో అంతర్జాతీయ మార్కెట్లో టన్ను బొగ్గు ధర 12 లక్షల టన్నులు: టెండర్ల ప్రకారం సరఫరా చేయాల్సిన విదేశీ బొగ్గు 52.40 డాలర్లు: 2015లో అంతర్జాతీయ మార్కెట్లో టన్ను బొగ్గు ధర 19.5 లక్షల టన్నులు: గడువు తర్వాత సరఫరా చేసిన విదేశీ బొగ్గు 1,100 కోట్లు: గడువు ముగిశాక సరఫరా చేసిన బొగ్గు విలువ 100 కోట్లు: హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో చెల్లించింది -
రెండు నెలల కనిష్టస్థాయికి పుత్తడి
గ్రీసు పరిణామాల నేపథ్యంలో గతవారం దేశీయ మార్కెట్లో పుత్తడి ధర రెండు నెలల కనిష్టస్థాయికి తగ్గింది. ముంబాయి బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గి, రూ. 26,535 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి అంతేమొత్తం క్షీణించి రూ. 26,385 వద్ద ముగిసింది. బంగారం తగ్గడానికి నిధులు ఈక్విటీ మార్కెట్లోకి మళ్లడం కూడా ఒక కారణమని బులియన్ ట్రేడర్లు చెప్పారు. పుత్తడికి డిమాండ్ తగ్గించేదిశగా ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ ప్రవేశపెట్టాలని యోచించడం కూడా సెంటిమెంట్పై ప్రభావం చూపిందని వారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2.4 శాతం క్షీణించి 1173 డాలర్లకు పడిపోయింది. ఈ స్థాయి మూడు వారాల కనిష్టం. -
ఎగుమతికి మామిడేది..?
పంట లేక ఈ ఏడాది 30 శాతం తగ్గనున్న ఎగుమతులు ⇒ యూరోప్ నిషేధం ఎత్తేసినా దక్కని ప్రయోజనం ⇒ అంతర్జాతీయంగా తగ్గిన ధరలూ కారణమే ⇒ హుద్హుద్, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి యూరప్తో సహా పలు దేశాలు మామిడి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసినా ఆ అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట దిగుబడి బాగా తగ్గిపోయిందని, దీంతో ఎగుమతి నాణ్యత ఉన్న కాయలు దొరకడం లేదని ఎగుమతిదారులు వాపోతున్నారు. ఈ నిషేధం ఎత్తివేయడం వల్ల ఎగుమతులు పెరగాల్సింది పోయి గతేడాదితో పోలిస్తే 30 శాతం తగ్గే అవకాశాలున్నాయంటున్నారు. గతేడాది సుమారుగా 42,000 టన్నుల మామిడి పళ్లను ఎగుమతి చేయగా ఈసారి ఈ లక్ష్యం అందుకోవడం కష్టమేనని అపెడా వర్గాలు పేర్కొంటున్నాయి. నాణ్యమైన పండు లభ్యత తక్కువగా ఉండటంతో పాటు, పెరిగిన ధరలు విదేశీ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోవడం కారణంగా పేర్కొంటున్నారు. యూరోప్ నిషేధం తొలగించి నాలుగు నెలలు కావస్తున్నా.. ఆ దేశ ప్రమాణాలకు అనుగుణంగా మామిడి పండ్లను సరఫరా చేసే మౌలిక వసతులు లేకపోవడం పెద్ద గుదిబండగా ఉంది. అమెరికాకు రేడియేషన్ చేసి పంపాలని, అదే యూరప్కి అయితే వేడి నీటి ట్రీట్మెంట్ చేసి ప్యాకేజీ చేయాలని కానీ వీటికి తగిన సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందిగా ఉందన్నారు. చివరి నిమిషంలో నిషేధం ఎత్తివేయడం వల్ల ఈ సీజన్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ఎగుమతులు 50 శాతం పెరుగుతాయన్న ఆశాభావాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఇటీవల వ్యక్తంచేశారు. స్థానికంగా అదే పరిస్థితి.. దేశీయ మామిడి ఉత్పత్తిలో 25 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పంట దిగుబడి 50 శాతం క్షీణించినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హుద్హుద్ తుపాన్ వల్ల చెట్లు ధ్వంసంకావడంతో ఆంధ్రప్రదేశ్లో, అకాల వర్షాల వల్ల తెలంగాణలో మామిడి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. గత కొన్నేళ్లుగా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా అధికాదాయం పొందే వాడినని, కానీ ఈసారి ఒక టన్ను కూడా పంపలేని పరిస్థితిలో ఉన్నట్లు రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు మురళి వాపోయారు. అకాల వర్షాల వల్ల 15 ఎకరాల మామిడి తోటలో దిగుబడి 80% పడిపోవడంతో ఈసారి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీనికితోడు ఈసారి సీజన్ ఇరవై రోజులు ఆలస్యంగా మొదలయ్యిందని, ఇప్పుడిప్పుడే ఎగుమతి నాణ్యత ఉన్న కాయలు రావడం మొదలైనట్లు ఎగుమతిదారులు చెపుతున్నారు. జూన్ నెలాఖరు వరకు ఎగుమతులు జరుగుతాయని, ఈ నెలరోజుల్లోనైనా మార్కెట్ మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని ఎస్డీ ఫ్రూట్ మర్చెంట్ ప్రతినిధి పేర్కొన్నారు. గతేడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1,000 టన్నుల మామిడి కాయలను ఎగుమతి చేశామని, ఈ ఏడాది కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోగలమన్న ధీమాను అపెడా హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టి. సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు బంగినపల్లి మామిడి పండ్లు ఎగుమతి చేయడానికి అనుమతి మంజూరు చేయగా, యూరోప్కు రెండు రాష్ట్రాల నుంచి రెండు సంస్థలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. పెరిగిన ధరలు.. మన దేశం నుంచి మామిడి పండ్లు ప్రధానంగా యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, బ్రిటన్ దేశాలకు ఎగుమతి అవుతాయి. అరబ్ దేశాల్లో ఆంక్షలు తక్కు వగా ఉండటంతో ఎగుమతుల్లో 80% ఈ దేశాలకే జరుగుతున్నాయి. కానీ ఈ ఏడాది దిగుబడి తగ్గి నాణ్యమైన కాయ లభించక ధర పెరిగింది. గతేడాది 12 మామిడి కాయలు రూ. 250కి లభిస్తే ఈ ఏడాది రూ. 350-450 వరకు పెరిగినట్లు ఎగుమతిదారులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ప్యాకేజింగ్, రవాణా వ్యయాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధర మరింత పెరుగుతోంది. దీంతో పాకిస్తాన్ వంటి దేశాల నుంచి పోటీ తట్టుకోవడం కష్టంగా ఉందని హైదరాబాద్కు చెందిన ఎగుమతిదారుడు వాపోయాడు. -
ఫోర్బ్స్ జాబితాలో మనవి 56 కంపెనీలు
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన, శక్తిమంతమైన 2,000 కంపెనీల జాబితాలో భారత్కి చెందిన 56 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. 2015 సంవత్సరానికి గాను ‘గ్లోబల్ 2000’ పేరిట ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ లిస్టును విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా, చైనా కంపెనీల ఆధిపత్యాన్ని ప్రతిబింబించే విధంగా ఇది ఉంది. ఈ రెండు దేశాలకే చెందిన సంస్థలు వరుసగా రెండో ఏడాదీ టాప్ టెన్లో నిల్చాయి. మొత్తం 579 కంపెనీలతో అమెరికా, 232 భారీ సంస్థలతో చైనా వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. జపాన్ను చైనా అధిగమించడం ఇదే తొలిసారి. 218 కంపెనీలతో జపాన్ మూడో స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే భారత్ లిస్టులో మరో రెండు కంపెనీలు కొత్తగా జతయ్యాయి. 42.9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ గల రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాది 135వ స్థానంలో ఉండగా ఈసారి 142వ స్థానానికి తగ్గింది. 33 బిలియన్ డాలర్ల మార్కెట్ వేల్యూతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 152వ స్థానంలో ఉంది. ఓఎన్జీసీ (183), టాటా మోటార్స్ (263), ఐసీఐసీఐ బ్యాంక్ (283), ఇండియన్ ఆయిల్ (349) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. -
కినోవాపై కినుకెందుకు?
అత్యధిక పోషకాలతోపాటు అంతర్జాతీయ మార్కెట్ ఉన్న చిరుధాన్యపు పంట కినోవా. బడుగు రైతు కుటుంబాలకు పోషకాహార హామీతోపాటు ఆదాయ భద్రతనివ్వగల ఈ పంటపై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఒకర్ని చూసి మరొకరు సాగు చేస్తున్నారు. సాగు విస్తీర్ణం ఈ ఏడాది వెయ్యి ఎకరాలు దాటుతుందని అంచనా. అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందుబాటులోకి తెచ్చే బాధ్యత ప్రభుత్వం, శాస్త్రవేత్తలదేనంటున్నారు డాక్టర్ కె. శ్రీనివాస రావు. కినోవా పండించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నా అంచనా ప్రకారం కినోవా పంట గత ఏడాది వందల ఎకరాలలో పండించగా, ప్రస్తుత సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి వెయ్యి ఎకరాలు దాటింది. భారతదేశంలో 10.74 కోట్ల ఎకరాల్లో వరి, 7.32 కోట్ల ఎకరాల్లో గోధుమను పండిస్తున్నారు. కానీ ఈ పంటలను సాగు చేస్తున్న రైతులు గిట్టుబాటు కాక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయ రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కినోవా ప్రాధాన్యం విస్మరించలేనిది. మొత్తం సాగు భూమి విస్తీర్ణంలో ఒక్క శాతంలో పండించినా సుమారు 18 లక్షల ఎకరాలలో ఈ పంట సాగవుతుంది. లక్షల మంది రైతులకు ఈ పంట పండించడం, మార్కెటింగ్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించవలసిన బాధ్యత శాస్త్రవేత్తలు, ప్రభుత్వంపై ఉంది. పండించాలి.. తినాలి.. మిగిలింది అమ్మాలి ఈ పంటను ఖరీఫ్, రబీల్లో ఆరుతడి పంటగా సాగుచేయవచ్చు. తోటకూర జాతికి చెందిన ఈ మొక్క చాలా సున్నితమైనది. రసాయన ఎరువులు వేయకుండా, క్రిమిసంహారకాలు వాడకుండా నీమాస్త్రం వంటి సేంద్రియ ఎరువులతో మేము పండించాం. సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించి సాగు చేస్తే ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. ఇతర పంటలతో పోల్చితే కినోవా పంటకు లభించే ధర ఎక్కువే. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉన్నా ముందు ముందు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. కినోవాను పండించే రైతు తన కుటుంబానికి అవసరమైన పరిమాణంలో ఉంచుకొని మిగిలిన పంటను అమ్ముకోవాలి. తద్వారా రైతు కుటుంబానికి ఆరోగ్యం, ఆర్థిక బలం కూడా సమకూరుతుంది. వివిధ పంటల్లో పోషకాల పట్టికను గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది. సపోనిన్తో జాగ్రత్త సుమీ.. కినోవా గింజపై పొరలో సపోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శీకాయి వలే చాలా చేదుగా ఉంటుంది. గింజ బరువులో ఈ పదార్థం సుమారు 6 శాతం ఉంటుంది. సపోనిన్ పూర్తిగా పోయే దాక కడిగిన తర్వాత మాత్రమే తినాలి. దీన్ని తొలగించడానికి బొలీవియాలో ఆధునిక యంత్రాలను వాడుతున్నారు. ఈ మిల్లు ఏర్పాటు చేయటానికి రూ. 5 కోట్ల వరకు ఖర్చవుతుంది. అయితే బొలీవియా గ్రామాల్లో ప్రజలు మాత్రం కినోవాను వేయించి, దంచి, కడిగి, ఆరబెట్టి తింటున్నారు. ఈ పద్ధతిలో అధిక శ్రమ, సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. మన రైతులు కొందరు కినోవా ధాన్యాన్ని దంచి, కడిగి, ఆరబెట్టి అమ్ముతున్నారు. కినోవా గింజ నీటిలో పడిన కొన్ని నిమిషాలలో మొలకెత్తుతుంది. తడిసిన గింజ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. బూజు క్రిముల తాకిడికి గురవుతుంది. చింతలు తీర్చే చిన్న మిల్లు సపోనిన్ పొరను పూర్తిగా తీసివేసేందుకు ఒక చిన్న మిల్లును బొలీవియాలో వాడుతున్నారు. దానిని తెప్పించి, అవసరమైన మార్పులు చేసి మన రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్నాటక, ఒరిస్సా, బీహార్, రాజస్థాన్, పంజాబ్లలో కూడా రైతులను కినోవా సాగు దిశగా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాం. కినోవా సాగుపై విశాఖలో మే నెలలో అందరి సహకారంతో సదస్సు నిర్వహించబోతున్నాం. వరి, గోధుమ పంటల్లో కూడా గత అరవయ్యేళ్ల కిందట దిగుబడులు తక్కువగా వచ్చేవి. శాస్త్రవేత్తల పరిశోధనల వల్ల దిగుబడి, పోషక విలువలు పెరిగాయి. నేడు మనం తింటున్న అధిక దిగుబడి వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, బొలీవియా, పెరూ దేశాలలో కినోవాపై పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకే భారతదేశంలో కూడా పుష్కలంగా పోషకాలని కలిగి ఉండి, అధిక దిగుబడి నిచ్చే కినోవా వంగడాలు రైతులకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాను. (వ్యాసకర్త కినోవాపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త (098850 74764. srao123@gmail.com) -
రూపాయి, ద్రవ్యోల్బణంపై దృష్టి
ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు ⇒ అడ్వాన్సు ట్యాక్స్ చెల్లింపులు ⇒ పార్లమెంటు సమావేశాల్లో పరిణామాలు ⇒ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం న్యూఢిల్లీ: ఫిబ్రవరి నెల టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, పార్లమెంటు సమావేశాల్లో జరగబోయే పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తాయంటూ విశ్లేషకులు అంచనాల్ని వెల్లడించారు. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, రూపాయి మారకపు విలువ కదలికలు కూడా మార్కెట్కు కీలకమని వారు వ్యాఖ్యానించారు. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 3.21 శాతం పడిపోయింది. ఒకవారంలో సూచీ ఇంతగా క్షీణించడం ఈ ఏడాది ఇదే ప్రధమం.రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకంటే అధికంగా నమోదుకావడంతో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్ల కోత ప్రక్రియకు బ్రేక్వేస్తుందన్న భయాలతో క్రితం వారం మార్కెట్ పడిపోయింది. ఇక ఈ సోమవారం వెల్లడయ్యే ఫిబ్రవరి టోకు ద్రవ్యోల్బణం డేటా కోసం ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. కార్పొరేట్ల అడ్వాన్సు ట్యాక్స్ చెల్లింపుల డేటా కూడా ఈ వారం తెలుస్తుంది. అడ్వాన్సు పన్ను చెల్లింపుల్ని బట్టి మార్చి త్రైమాసికంలో ఆయా కంపెనీలు సాధించబోయే లాభనష్టాలపట్ల ఇన్వెస్టర్లకు అంచనాలు ఏర్పడతాయి. తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మార్చి 20తో ముగియనున్నందున, ఈ సభల్లో జరిగే పరిణామాల పట్ల మార్కెట్ ఆసక్తి కనపరుస్తోందని మాంగ్లిక్ వివరించారు. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి మార్చి 17-18 తేదీల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ జరిపే సమావేశం కీలకమైనదని ఆయన వివరించారు. ఫెడ్ వడ్డీ రేట్లను ఎప్పట్నించి పెంచవచ్చన్న సంకేతాల కోసం ఈ సమావేశంపై దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. సమీప భవిష్యత్తులో దేశీ మార్కెట్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మరికొంతమంది విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ వారం మార్కెట్ అటూఇటూ కదిలినా, బుల్లిష్గానే వుండవచ్చని బొనంజా పోర్ట్ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ చెప్పారు. రూ. 72,000 కోట్లకు విదేశీ పెట్టుబడులు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్లో ఈ ఏడాది ఇప్పటివరకూ చేసిన పెట్టుబడుల మొత్తం రూ. 72,000 కోట్లకు చేరింది. ఈ మార్చి నెల తొలి రెండు వారాల్లో వారు ఈక్విటీ మార్కెట్లో రూ. 9,134 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 4,567 కోట్లు పెట్టుబడి చేయడంతో ఈ పక్షంరోజుల్లో వారి పెట్టుబడుల మొత్తం రూ.13,706 కోట్లకు పెరిగినట్లు సెంట్రల్ డిపాజిటరీ డేటా వెల్లడిస్తున్నది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ.71,958 కోట్లకు చేరాయి. -
మళ్లీ పెట్రో మోత
నెల్లూరు(రెవెన్యూ): అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై లీటర్ రూ 3.18, డీజల్పై లీటర్ రూ 3.09 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పన్నులు అదనం. పాత ధర రూ.66.48 కాగా పెరిగిన ధరతో రూ.70.43 అవుతుంది. డీజిల్ పాతధర రూ.55.12 పెరిగిన ధరతో 58.61 అవుతుంది. పెరిగిన ధరలు శనివారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. గత నెలలో పెట్రోల్, డీజల్పై వ్యాట్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలరోజులు గడవక ముందే మళ్లీ పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. పెట్రో ధరల పెంపుతో జిల్లావాసులపై నెలకు రూ.13 కోట్ల వరకు అదనపుభారం పడనుంది. అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 300లకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. జిల్లాలో రోజుకు 4 లక్షల లీటర్ల పెట్రోల్, 9 లక్షల లీటర్ల డీజల్ను వినియోగిస్తారు. పెట్రోల్పై వినియోగదారులకు రోజుకు రూ. 12.72 లక్షల అదనపు భారం పడనుంది. అంటే నెలకు రూ.4 కోట్లపైనే.. అలాగే రోజుకు 9 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. వినియోగదారులకు డీజల్పై రోజుకు రూ.28 లక్షల అదనపు భారం పడునుంది. నెలకు సుమారు రూ.9 కోట్లకు పైగా అవుతుంది. పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిత్యావసర ధరలతోపాటు బస్సు, ఆటో చార్జీలు పెరిగే అవకాశం ఉంది. -
డాలర్తో రూపాయి విలువ ఎలా నిర్ణయిస్తారు?
వ్యాపార సంబంధమైన లావాదేవీలు చర్చకు వచ్చినప్పుడు కచ్చితంగా వచ్చే ప్రస్తావన డాలర్. బిజినెస్కు సంబంధించిన లాభాలు, నష్టాలు వేటినైనా డాలర్తోనే పోలుస్తారు. డాలర్తో రూపాయి విలువ మారకాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం..! అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న నష్టాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు భద్రత ఉన్న దేశాల్లో తమ పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపడంతో డాలర్ విలువ పెరుగుదల కనపడుతోంది. ఆర్థిక విధానం ప్రభుత్వం అమలు చేసే ఆర్థిక విధానాలు, ప్రభుత్వ రుణం, ప్రభుత్వ పన్నుల విధానంలో పాటిస్తున్న నియమాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వ విధానాలు కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ వాణిజ్యం దేశీయంగా ఎగుమతులు తక్కువ స్థాయిలో ఉండటం, దిగుమతులు ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల మనం చెల్లించాల్సిన మొత్తం ద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతుంది. భారతదేశంలో అమలవుతోన్న పన్నుల విధానం, వాణిజ్య ప్రభావమూ దీనిపై ఉంటుంది. స్పెక్యులేషన్ దేశీయ మార్కెట్లలో పెట్టుబడుల ప్రవాహం కూడా రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తుంది. వడ్డీరేటు విధానం ప్రభుత్వ ఆర్థిక విధానాలు మార్కెట్లలో పెట్టుబడులు పెంచే విధంగా, విదేశీ మారకాన్ని స్వాగతించేలా ఉంటే విదేశీ మారకం దేశంలోకి ప్రవహించడం ద్వారా రూపాయి విలువలో పెరుగుదల అవకాశం ఉంటుంది. ఉన్నత సంస్థల ప్రభావం దేశంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ సంస్థ తీసుకునే విధానాలు కూడా దేశీయ కరెన్సీపై ప్రభావితం చూపిస్తాయి. మన దేశంలో ఉన్నత స్థాయి సంస్థ రిజర్వు బ్యాంకు తీసుకునే విధానాలు రూపాయి మారకం విలువలో పెరుగుదల, తరుగుదలకు దోహదపడే అవకాశాలున్నాయి. -
జీసీసీకి పూర్వవైభవం
వ్యాపార విస్తరణకు ప్రణాళికలు మరిన్ని అవుట్లెట్ల ఏర్పాటుకు సన్నాహాలు అంతర్జాతీయ మార్కెట్లోకి సంస్థ ఉత్పత్తులు గిరిజనుల అభ్యున్నతికి విశాఖపట్నం కేంద్రంగా 54 ఏళ్ల క్రితం ఏర్పడిన గిరిజనసహకార సంస్థ(జీసీసీ) సహకార రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయమార్కెట్లో తన దైన ముద్ర వేసుకునేందుకు అడుగులేస్తోంది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎమ్డీ ఏఎస్పీఎస్ రవిప్రకాష్ జీసీసీ ఉత్పత్తులకు గుర్తింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విశాఖపట్నం: ఏజెన్సీలో గిరిజనులు సేకరించే ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తోంది. సంస్థకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 15కు పైగా ఉన్న తయారీ, ప్యాకింగ్ యూనిట్లలో వాటిని మార్కెటింగ్కు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఏటా రిటైల్ మార్కెటింగ్ ద్వారా రూ.23.55 కోట్ల లావాదేవీలు సాగిస్తున్న సంస్థ రానున్న ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.40 కోట్లు వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఏపీలో 25 సొసైటీల ద్వారా 541 షాపులను ఏర్పాటు చేసి గిరిజనులకు నిత్యావసరాలను సరఫరా చేస్తున్నది. అలాగే రాష్ర్ట వ్యాప్తంగా వందకు పైగా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వెయ్యికి పైగా రిటైల్ అవుట్ లెట్లలో గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించింది. పుణ్యక్షేత్రాల్లో జీసీసీ అవుట్లెట్స్ జిల్లా కేంద్రాలతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో మరో రెండు నెలల్లోనే ప్రత్యేక అవుట్లెట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. అలాగే రాష్ర్ట వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవస్థానాల్లో అవుట్లెట్ల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈమేరకు అనుమతులకు దేవాదాయశాఖ కమిషనర్కు జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రవిప్రకాష్ లేఖ రాశారు. కమిషనర్ నుంచి అనుమతులు రాగానే తమ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అన్ని దేవస్థానాల్లో కౌంటర్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా రానున్న గోదావరి పుష్కరాల్లో రాజమండ్రితో పాటు పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవుట్లెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇలా వ్యాపారాన్ని విస్తరించు కునేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయమార్కెట్లోకి జీసీసీ ఉత్పత్తులు ఇప్పటికే జిల్లాలో ఆన్లైన్సేల్స్ ప్రారంభించిన జీసీసీ త్వరలో అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అనుభవం ఉన్న సర్వీస్ ప్రొవైడర్ల అన్వేషణ ప్రారంభించింది. వీరికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని జీసీసీ అందించనుంది. వీరి ద్వారా ఈ కామర్స్లో వ్యాపారం చేసే ప్లిప్కార్ట్, ఎమజాన్, ఈ-బే, స్నాప్డీల్, సాత్విక్షాప్ తదితర ఆన్లైన్ ఏజెన్సీలతో టైఅప్ పెట్టు కుని జీసీసీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించనుంది. సర్వీస్ ప్రొవైడర్ల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. మరో పదిహేను రోజుల్లో ఇవి ఖరారు అవుతాయి. సర్వీస్ ప్రొవైడర్లు వారు చేసే వ్యాపారాన్ని బట్టి పర్సంటేజ్ ఇవ్వాలని జీసీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నం విజయవంతం అయితే గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించిన కార్పొరేషన్గా ఖ్యాతి గడించనుంది. వ్యాపార విస్తరణే లక్ష్యం గిరిజను సేకరించే అటవీ ఉత్పత్తులకు మంచిధరతో కొనుగోలు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు..ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా జీసీసీ కృషి చేస్తున్నది. అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ఉత్పత్తులన్నీ కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నాం. అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయంతో వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. -ఏఎస్పీఎస్ రవిప్రకాష్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, జీసీసీ మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు ఇప్పటికే తేనె, చింతపండు, షికాకాయి, కుంకుడుకాయ, ఉసిరి ఫౌడర్స్,రాజ్మా, అలోవిరా, టెర్మరిక్, నీమ్, హనీసోప్స్, డ్రైచిల్లీ ఫౌడర్, సోయాబీన్ ఫౌడర్,సోయా బీన్ మిల్క్ మేకింగ్, కాఫీ ఫౌడర్ వంటి 25రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి జీసీసీ ప్రవేశపెట్టింది. త్వరలో షికా కాయి షాంపు, కుంకుడుకాయ షాంపు, జాస్మిన్ సోప్స్, త్రిపులచూర్ణం, త్రిపుల జ్యూస్ వంటి మరో ఐదు ఉత్పత్తులను త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు జీసీసీ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల నుంచే ఈ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
రూ. 30కే లీటర్ పెట్రోల్!
పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ కోలారులో వినూత్నంగా నిరసన తెలిపిన వైనం కోలారు : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించకపోవడంపై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 30కే లీటర్ పెట్రోల్ చొప్పున మంగళవారం విక్రయాలు సాగించి కోలారులో నిరసన వ్యక్తం చేసింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆందోళన కారులు మాట్లాడుతూ... పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించక పోతే రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షాహిద్ షహజాద్, అజంపాషా, ప్రతాప్, మంజునాథ్, వెంకటస్వామి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, రూ. 30కే లీటర్ పెట్రోల్ ఇస్తున్నట్లు తెలుసుకున్న వాహనదారులు ఆందోళన శిబిరం వద్ద బారులు తీరారు. అయితే నిరసన తెలిపేందుకు 30 లీటర్ల పెట్రోల్ను మాత్రమే తీసుకురావడంతో వాహనదారుల్లో నిరాశ వ్యక్తమైంది. -
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ముంబై: వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధరపై రూ.2.42 తగ్గగా, లీటర్ డీజిల్ పై రూ. 2.25 తగ్గినట్లు చమురు కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. గత నెల్లో పెట్రోల్ పై రూ. 2.42, డీజిల్పై రూ. 2.25 తగ్గిన సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచీ లెక్కిస్తే.. మొత్తంమీద పెట్రోల్ ధర రూ. 17.01 తగ్గగా, డీజిల్ ధర రూ. 12.96 పైసలు వరకూ తగ్గింది. -
గ్యాస్ మాయ
ధర తగ్గినా పెరగని సబ్సిడీ కంపెనీలకే లాభం.. ప్రజలకు శఠగోపం మండిపడుతున్న ప్రజాసంఘాలు విజయవాడ : అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు తగ్గుతున్నా వినియోగదారులకు ఒక్క రూపాయి కూడా ప్రయోజనం కనిపించడం లేదు. ధరలు తగ్గిన మేరకు వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తగ్గిన ధరలను చమురు కంపెనీల వాటాలో జమచేసి, వినియోగదారుడికి మొండిచేయి చూపుతోందని ప్రజాసంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. గత ఏడాదిలో రూ.1,350 నుంచి రూ.778 వరకు గ్యాస్ ధర తగ్గినా సబ్సిడీ మాత్రం పెరగకపోవటంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను తగ్గించింది. గత జనవరిలో డొమెస్టిక్ సిలెండర్ ధర రూ.778 ఉండగా, ఫిబ్రవరిలో రూ.668కి చేరింది. రూ.778 చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న వినియోగదారుకు బ్యాంకుఖాతాలో రూ.336.50 జమ అయ్యేది. వినియోగదారు సిలిండరుకు రూ.441.50 భరించాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో రూ.668కి గ్యాస్ సిలిండర్ ధర తగ్గగా, ఆ మొత్తం చెల్లించిన వినియోగదారుకు బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.226.50 జమ పడుతోంది. వినియోగదారులు సిలిండరును రూ.441.50కే కొనుగోలు చేయాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండరు ధర తగ్గినా.. వినియోగదారులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రయోజనం కల్పించలేదని తేటతెల్లమవుతోంది. తగ్గించిన గ్యాస్ ధర చమురు కంపెనీలకే మేలు చేస్తోందని ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఆధార్ అనుసంధానం కాకుంటే 14 నుంచి సబ్సిడీ గల్లంతే... ఈ నెల 14 నుంచి ఆధార్ నంబర్ గ్యాస్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాకపోతే గ్యాస్ సబ్సిడీ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కటాఫ్ డేట్ ఈ నెల 13తో ముగుస్తోంది. ఆధార్ నంబర్ గ్యాస్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాని వినియోగదారులు ఈ నెల 14 నుంచి గ్యాస్ సిలిండర్ పూర్తి మొత్తం చెల్లించి కొనుగోలు చేయాలి.. 13 వరకు కూడా ఆధార్ అనుసంధానం చేసుకోనివారికి పార్కింగ్ పిరియడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు చివరి అవకాశం ఇచ్చింది. అది 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూడు నెలల్లో ఆధార్ను అనుసంధానం చేసుకుంటే సబ్సిడీ మొత్తం వెనక్కి ఇస్తారు. -
రికార్డ్ స్థాయికి ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారక ద్రవ్య(ఫారెక్స్) నిల్వలు దాదాపు నాలుగేళ్ల తర్వాత రికార్డ్ స్థాయికి చేరాయి. ఈ నెల 16తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 32,213 కోట్ల డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీ పతనం వల్ల దిగుమతుల బిల్లు తగ్గడం, మరోవైపు విదేశీ నిధుల ప్రవాహం జోరుగా ఉండడం, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, ఆర్బీఐ డాలర్లను కొనుగోలు చేయడం... ఈ కారణాల వల్ల మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డ్ స్థాయికి చేరాయని ఫస్ట్ర్యాండ్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ హరిహర్ కృష్ణమూర్తి వివరించారు. ఈ నెల 16తో ముగిసిన వారానికి ఈ నిల్వలు 266 కోట్ల డాలర్లు పెరిగాయని ఆర్బీఐ పేర్కొంది. 2011, సెప్టెంబర్2తో ముగిసిన వారానికి విదేశీ మారక ద్య్ర నిల్వలు తొలిసారిగా 32,000 కోట్ల డాలర్ల మార్క్ను అధిగమించాయి. ఈ నెలలో ఇప్పటివరకూ భారత మార్కట్లలో విదేశీ ఇన్వెస్టర్లు 344 కోట్ల డాలర్ల నిధులు కుమ్మరించారు. ఈసీబీ ప్యాకేజీ కారణంగా 2,500 కోట్ల డాలర్ల విదేశీ నిధులు భారత్లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ శుక్రవారం ఒక నివేదికలో పేర్కొంది. -
దిల్ ‘మ్యాంగో’ మోర్..!
⇒ మళ్లీ మామిడి ఎగుమతుల జోరు ⇒ ఈయూ నిషేధం ఎత్తివేత ఫలితం ⇒ మామిడికి ధరలు పెరిగే అవకాశం ⇒ రైతుల్లో చిగురించిన ఆశలు సాక్షి, చిత్తూరు/మచిలీపట్నం: భారత్ మామిడి పండ్ల దిగుమతిపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో మామిడి ఎగుమతులు మళ్లీ జోరందుకోనున్నాయి. దీంతో మామిడికి ధరలు పెరిగే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. భారత్ నుంచి దిగుమతి అవుతున్న మామిడి పండ్లలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ గత ఏడాది మే ఒకటి నుంచి 2015 డిసెంబర్ వరకు యూరోపియన్ యూనియన్ మామిడి దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే మామిడి పండ్ల ఎగుమతులు, నాణ్యతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ మామిడి దిగుమతులపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. మామిడితోటల ఆరోగ్య పరిస్థితి, నిర్వహణ, సర్టిఫికేషన్ విధానంలో కీలకమైన మార్పులను తాజాగా చేపట్టడంతో ఈ ఏడాది మార్చి నుంచి ఇతర దేశాలకు మామిడి ఎగుమతులకు మార్గం సుగమమైంది. యూరోపియన్ యూనియన్ నిషేధంతో 2014 మామిడి సీజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప తదితర జిల్లాల నుంచి విదేశాలకు మామిడి ఎగుమతులు తగ్గాయి. పశ్చిమగోదావరి జిల్లాలో హోతా కంపెనీ గత ఏడాది అన్ని జాగ్రత్తలు తీసుకుని 200 టన్నుల మామిడి కాయలను మాత్రం ఎగుమతి చేయగలిగింది. కృష్ణాజిల్లా నుంచి విదేశాలకు దాదాపు ఎగుమతులు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసే అంశంపై ఇంకా విధివిధానాలు వెలువడాల్సి ఉందని, ఎగుమతులపై నిషేధం తొలగిస్తే రైతులకు మేలు జరుగుతుందని ఉద్యానశాఖ కృష్ణాజిల్లా అధికారి సుజాత తెలిపారు. రూ.60-80 వేలకు ధర... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 92,913 హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడ పండించే రకాల్లో ఖాదర్, బంగినపల్లె, బేనిషా రకాలను యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. మామిడి పండ్లతో పాటు మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతి అవుతోంది. జిల్లావ్యాప్తంగా ఏడాదికి ఆరు లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతుండగా,. ఇందులో పల్ప్ లక్ష టన్నులు, మామిడి పండ్లు 50వేల టన్నుల వరకు ఎగుమతి అవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2011 నుంచి క్రమేపీ పెరుగుతూ వచ్చిన ఎగుమతి రకాల టన్ను ధర గతేడాది రూ. 20 వేలకు పడిపోయింది. క్రితం ఏడాది ఎగుమతులపై నిషేధం ఉండడంతో జాతీయ మార్కెట్లోనూ మామిడి ధరలు తగ్గిన విషయం విదితమే. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతులపై నిషేధం తొలగించడంతో మామిడి పండ్లకు మంచి ధర లభించే అవకాశమున్నట్లు రైతు, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానికంగా గత సంవత్సరంలో టన్ను రూ.20 వేల వరకు ఉన్న ధర... అంతర్జాతీయ ఎగుమతుల నేపథ్యంలో ఈ ఏడాది టన్ను రూ.60 వేల నుంచి 80 వేల వరకు పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. జిల్లాలో మే నెల రెండవ వారం నుంచి మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఎగుమతి రకాలు ఖాదర్, బేనిషా, బంగినపల్లె జూన్ నెల రెండవ వారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి. -
తెలంగాణలో వ్యాట్తో వాత
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం లీటర్కు రూ. 2 పెంచుతూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలు చేసిన సర్కారు నెలకు రూ. 80 కోట్ల వరకు పెరగనున్న ఆదాయం దేశవ్యాప్తంగా రూ. 2.50 వరకు పెట్రో ధరలు తగ్గినా.. రాష్ట్రంలో మాత్రం 50 పైసల్లోపే ఎక్సైజ్ సుంకం పెంపుతో కేంద్రం కూడా అదే బాట అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా వినియోగదారులకు దక్కని ప్రయోజనం సాక్షి, హైదరాబాద్:‘సందట్లో సడేమియా’ అన్నట్లుగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టింది! ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న సర్కారుకు పెట్రో ధరలపై విధించే పన్ను అయాచిత వరంగా కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునే పేరుతో ‘వ్యాట్’తో బాది మరీ రాష్ర్ట ప్రజల నడ్డి విరిచింది. అంతర్జాతీయ చమురు ధరలు తీవ్రస్థాయిలో పడిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రో ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. నిజానికి పెట్రోలు ధర లీటర్కు రూ. 4.42, డీజిల్పై రూ. 4.25 తగ్గినప్పటికీ.. పనిలోపనిగా కేంద్రం కూడా ఎక్సైజ్ సుంకాన్ని రెండు రూపాయలు పెంచుకుని తన ఖజానా నింపుకొన్నది. దీంతో వినియోగదారునికి మాత్రం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ. 2.42, రూ. 2.25 వరకే ప్రయోజనం చేకూరింది. గత శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే రాష్ర్టం కూడా అదే బాటను అనుసరించింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్ను ఉన్నపళంగా లీటర్కు రెండు రూపాయలు పెంచేసింది. శుక్రవారం అర్ధరాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ర్టంలోని వినియోగదారులకు పెట్రో ధరల తగ్గింపు ప్రయోజనం పైసలకే పరిమితమైంది. కానీ వాహనదారుల జేబుల్లోకి వెళ్లాల్సిన డబ్బును లాక్కున్న రాష్ర్ట ప్రభుత్వానికి మాత్రం ఏటా దాదాపు రూ. 960 కోట్లు సమకూరనున్నాయి. అంటే నెలకు రూ. 80 కోట్ల అదనపు ఆదాయమన్నమాట! మొత్తానికి అంతర్జాతీయంగా చమురు ధరలు అంతకంతకూ పడిపోతున్నా.. ఆ ప్రయోజనాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలే సొమ్ము చేసుకుంటున్నాయి. చమురు ధరలు పెరిగినప్పుడు వెంటవెంటనే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచేసిన ప్రభుత్వాలు.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు కూడా తమ ఖజానా నింపుకోడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఒకేసారి భారీ మోతకే నిర్ణయం కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని కొంతమేర పెంచుతూ వస్తోంది. ఈ నెల 2న కూడా ధరలు పడిపోయినప్పుడు అంతమేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుని వినియోగదారుడికి మొండిచేయి చూపింది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ మీద రెండు శాతం వ్యాట్ పెంచాలని భావించింది. ప్రస్తుతం పెట్రోల్ మీద 31 శాతం, డీజిల్ పై 22.25 శాతం వ్యాట్ను వసూలు చేస్తోంది. ఈలోగానే మళ్లీ ధరలు తగ్గడంతో రాష్ర్ట ప్రభుత్వం లెక్కలేసుకుంది. రెండు శాతం వ్యాట్ పెంచడం వల్ల పెట్రోల్ మీద రూ. 1.50 మేర, డీజిల్పైరూపాయిలోపే ఆదాయం పెరిగే అవకాశముంది. దీనివల్ల పన్ను పెంచిన పేరే తప్ప ఆదాయం సమకూరదని సర్కారు భావించింది. దీంతో కనీసం రెండు రూపాయలు పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నెల రోజుల్లో దాదాపు రూ. 78 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆమోదంతో రాత్రికి రాత్రే జీవో నంబర్ 3ను జారీ చేశారు. ఈ పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్టు నుంచి ఆదాయంలో తగ్గుదల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయంలో ఎక్సైజ్ తర్వాత పెట్రోల్, డీజిల్ వాటానే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 90 వేల కిలో లీటర్ల పెట్రోల్, 3 లక్షల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంటుందని అంచనా. దీని ప్రకారం నెలకు రూ. 500 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అయితే పెట్రో ధరల తగ్గుదల నేపథ్యంలో ఆగస్టు నుంచి నెలనెలా రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు వ్యాట్ ఆదాయంలో కోత పడుతోంది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాట్ కింద రూ. 3,921 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా, దాదాపు రూ. 700 కోట్ల లోటు ఏర్పడింది. దీన్ని పూడ్చుకోడానికి వినియోగదారులపై భారం మోపడం తప్పలేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సుంకం పెంపు శోచనీయం సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలు విధించడం శోచనీయమని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా కేంద్రం ధరలు తగ్గించకుండా ప్రతీ లీటర్పై రూ.2 సుంకాన్ని విధించడం సహేతుకం కాదని, వెంటనే పెంచిన సుంకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. చమురు ధరలు పెరిగితే మధ్యతరగతి, ఇతర వర్గాల ప్రజలపై జీవనవిధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు దొడ్డిదారిన ప్రజలపై పన్నుల భారాన్ని మోపేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పెట్రోల్, డీ జిల్ధరలపై రెండుశాతం వ్యాట్ విధించడం తగదన్నారు. పెంచిన సుంకాన్ని ఎత్తేయాలి సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసి. వినియోగదారులకు వెసులుబాటు కలిగించాలని సీపీఎం తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర లు తగ్గుతున్నా, దానికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెం చడాన్ని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. గత ఏడాది జూన్లో 115 డాలర్లున్న గ్యాలన్ ముడిచమురు ధర నేడు 46 డాలర్లకు పడిపోయిందని, అందువల్లే పెట్రోల్,డీజిల్ ధరలను రూ.రెండుకు పైగా తగ్గించారన్నారు. అయితే సందట్లో సడేమియాగా కేంద్రం ఎక్సైజ్ సుంకం లీటర్కు పెట్రోల్పై రూ.7.96, డీజి ల్పై రూ.8.95 పెంచిందని విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయని పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రభుత్వం, ఈ ధరలు తగ్గినపుడు కూడా ధర లు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
క్రూడ్ ఆయిల్కు అనుగుణంగా పెట్రోలు ధరలు తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. పార్టీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి తగ్గినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ రేట్లను ఆ మేరకు తగ్గించడం లేదని తప్పు పట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడ్డం లేదని వారన్నారు. గత జూన్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 115 డాలర్లుగా ఉంటే అది సగానికంటే తక్కువగా ప్రస్తుతం 47.5 డాలర్లకు పడిపోయిందనీ కానీ భారత దేశంలో ఆ మేరకు ధరలు తగ్గలేదని అన్నారు. ఒక బ్యారెల్ 115 డాలర్లుగా ఉన్నపుడు ఇక్కడ లీటరు పెట్రోలు ధర రు 80లుగా ఉండేదన్నారు. 47.5 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో ఒక లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య ఉండాలనీ అయితే అదింకా రు67- 68 మధ్యే ఉందన్నారు. సార్క్ దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్లో కూడా భారత్ కంటే పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని వారు ప్రస్తావించారు. కేంద్రం మొక్కుబడిగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిందే తప్ప నిష్పత్తి ప్రకారం ధరలను తగ్గించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్పై పన్నులు వేసి వాళ్ల ఆదాయాన్ని పెంచుకుంటోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు భారత్లో పెట్రోలు, డీజిల్పై ఎక్కువగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎందుకు కోరడం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఇవే ధరలకు ముడిపెట్టి, ఆర్టీసీ, రైల్వే చార్జీలను అమాంతం పెంచేశారని, ఇపుడు తగ్గుతున్న ధరలను బట్టి వాటిని కూడా ఎందుకు తగ్గించడం లేదని వారు ప్రశ్నించారు. పెట్రో ధరల పేరు చెప్పి నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు కూడా ఆకాశానికి అంటాయని ఇపుడు వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్పై రూ. 2.42, డీజిల్పై రూ. 2.25 తగ్గింపు న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఆరేళ్ల కనిష్టానికి తగ్గడంతో పెట్రోల్పై రూ. 2.42, డీజిల్పై రూ. 2.25 తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నిజానికి అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలను పరిగణనలోకి తీసుకుంటే.. లీటరు పెట్రోలుపై రూ. 4.42, లీటరు డీజిల్పై రూ. 4.25 తగ్గాల్సి ఉంది. అయితే, పెట్రోలు, డీజిల్పై లీటరుకు ఎక్సైజ్ పన్నును మరో రెండు రూపాయలు పెంచుతూ శుక్రవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారుడికి దక్కాల్సిన ప్రయోజనంలో ఆ రెండు రూపాయలు కోత పడింది. గత ఆగస్టు నుంచి పెట్రోల్ ధరను వరుసగా తొమ్మిదోసారి, డీజిల్ ధరను ఐదోసారి తగ్గించారు. ఆగస్టు నుంచీ లెక్కిస్తే.. మొత్తంమీద పెట్రోల్ ధర రూ. 14.69, డీజిల్ ధర రూ. 10.71 తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్ గత జూన్లో 115 డాలర్లుండగా, ప్రస్తుతం అది 46 డాలర్లకు పడిపోయింది. తగ్గింపు అనంతరం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 67.02 నుంచి రూ. 64.37కు, డీజిల్ ధర రూ. 55.02 నుంచి రూ. 52.57కు తగ్గింది. ప్రభుత్వానికి 20 వేల కోట్ల ఆదాయం.. గత నవంబర్ నుంచి ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును పెంచడం నాలుగోసారి. జనవరి 2వ తేదీనే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్లపై ఎక్సైజ్ పన్నును రూ. 2 పెంచింది. రెండు వారాలు తిరగకముందే మరో రెండు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు కూడా పెట్రోలు, డీజిల్పై నవంబర్ 12, డిసెంబర్ 2న ఎక్సైజ్ పన్నును పెంచింది. ఈ పెంపుల వల్ల మొత్తంమీద వినియోగదారులు లీటరుకు పెట్రోల్పై రూ. 7.75, డీజిల్పై రూ. 6.50ల ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. అలాగే, ఈ పెంపుల మూలంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 20 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోంది. ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి తగ్గించాలన్న లక్ష్యానికీ చేరువవుతోంది. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: కాంగ్రెస్ ఎక్సైజ్ పన్నును పెంచి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గిన ఫలితం వినియోగదారుడికి చేరడం లేదని, ఇది అన్యాయమని కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్ విమర్శించారు. -
రూపాయి పతనం... బతుకు భారం
రూపాయి విలువ తగ్గితే అది మన ఎగుమతులకు మంచిదేనని ఒక వాదన. నిజానికి 2004-08 కాలంలో రూపాయి విలువ స్థిరంగానూ, బలంగానూ ఉన్నప్పుడు మన దేశ ఎగుమతులు భారీగా పెరిగాయి. గత మూడేళ్లలో రూపాయి విలువ బాగా తగ్గింది. కానీ నేడు మన ఎగుమతులు కుదేలయ్యాయి. గడచిన మూడు నాలుగేళ్ల కాలంలో మన రూపాయి విలువ గణనీయంగా పతన మైంది. మొదటగా 2011లో, తర్వాత 2013 మే నుంచి, ప్రస్తుతం 2014 డిసెంబర్ ఆరంభం నుంచీ రూపాయి విలువ మూడు దఫాల పతన దశలను చూసింది. మొదటగా 2011లో దేశీయ స్థూలజాతీయ ఉత్పత్తి పతనం, ద్రవ్యో ల్బణంతో పాటుగా పలు అంతర్జాతీయ కారణాల దృష్ట్యా నాడు రూపాయి విలువ పడిపోయింది. మన షేర్ మార్కెట్ సూచీలు పతనం అయ్యాయి. విదేశీ మదుపుదారులు తమ పెట్టుబడులను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడమే దీనిక్కారణం. అంటే, ఈ మదుపుదారులు తమ పెట్టుబడులను అమ్మివేయడం ద్వారా మన మార్కెట్లో రూపాయలను పొందుతారు. కానీ వారు అంతర్జాతీయ మార్కెట్లో తిరిగి తమ డబ్బును మదుపు చేసుకోవాలంటే దానిని డాలర్ల వంటి రూపంలోకి మార్చుకోవాలి. దీని కోసం వారు వాటాల అమ్మకంలో తమకు లభించిన రూపాయలను అమ్మి వేసి, డాలర్లను కొనుగోలు చేస్తారు. అంటే వారు రూపా యిని వదిలివేస్తున్నారు. డాలర్ను స్వీకరిస్తున్నారు. దీనర్థం రూపాయికి డిమాండ్ తగ్గడం, డాలర్కు డిమాం డ్ పెరగడం అని గమనించాలి. తద్వారా డిమాండ్ తగ్గిన (అమ్మకమవుతున్న) రూపాయి విలువ పడిపో యింది. డిమాండ్ పెరిగిన (కొనుగోలు అవుతున్న) డాలర్ విలువ పెరిగింది. అదీ కథ. ఇక 2013 మే మాసం నుంచీ రూపాయి పతన కార ణం కాస్త భిన్నమైనది. అమెరికా ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస్థకు ఇస్తోన్న నెలవారీ 85 బిలియన్ డాలర్ల ఉద్దీప నను త్వరలో విరమించుకోనున్నామని, నాటి అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ బెన్ బెర్నాంకే 2012 చివరలో ప్రకటించడం ఈ పతనానికి కారణమైంది. అమెరికా ఇస్తోన్న ఈ ఉద్దీపన పథకం తాలూకు డబ్బు నాటి వరకూ ప్రపంచంలోని అభివృద్ధి చెందుతోన్న దేశాల షేర్ మార్కెట్లలోకి భారీగా ప్రవహించింది. ఫలితంగా ఆ దేశాల మార్కెట్ సూచీలు పెరిగాయి. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు భారీగా వివిధ దేశాల కరెన్సీలను కొనుగోలు చేశారు. అలాగే మన మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు వారు రూపాయలను కొనుగోలు చేశారు. అంటే, రూపాయికి డిమాండ్ ఏర్పడింది. దానితో అన్ని కరెన్సీల విలువ లతో పాటు రూపాయి విలువ కూడా పెరిగింది. కాగా, అమెరికా గనుక ఉద్దీపనను ఆపివేస్తే వివిధ షేర్ మార్కె ట్లలోకి డాలర్ల ప్రవాహం ఆగిపోతుంది. అలాగే డాలర్ల చలామణి కూడా తగ్గుముఖం పడుతుంది. అంటే డాలర్ల సరఫరా తగ్గి డాలర్ విలువ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో బెర్నాంకే ప్రకటన అనంతరం, పెర గనున్న డాలర్ విలువపై ఆశతో ప్రపంచ మార్కెట్ల లోని మదుపుదారులు విపరీతంగా డాలర్లను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఈ స్థితిలోనే వారు అభి వృద్ధి చెందుతోన్న దేశాల కరెన్సీలను అమ్మివేసి డాల ర్లను కొనుగోలు చేయసాగారు. ఇదే పరిస్థితి మన రూపాయికే ఎదురైంది. దాంతో నాడు రూపాయి విలువ భారీగా పతనమైంది. ఒక స్థితిలో డాలరుకు 70 రూపా యల అంచుకు చేరుకుంది. కాగా, ఈ ఉద్దీపన పథక విర మణ 2014 అక్టోబర్ వరకు మెల్లమెల్లగా మాత్రమే జర గడంతో, వివిధ అభివృద్ధి చెందుతోన్న దేశాల కరెన్సీల విలువలతో పాటు మన రూపాయి విలువ కూడా తిరిగి పుంజుకుంది. పైగా దేశీయ రిజర్వు బ్యాంక్ చైర్మన్గా కొత్తగా పదవిని స్వీకరించిన, రఘురామ్ రాజన్ తీసు కున్న కొన్ని చర్యల వల్ల కూడా మన రూపాయి విలువ నిలదొక్కుకుంది. మరీ ముఖ్యంగా 2014 పార్లమెంటరీ ఎన్నికల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంపై విశ్వాసంతో మన షేర్ మార్కెట్ సూచీలు భారీగా పెరి గాయి. దాంతో, రూపాయి విలువ గణనీయంగా పుంజు కుని ఒక డాలరుకు దరిదాపు 58-59 రూపాయలకు బలపడింది. ఈ పరిస్థితి గత 5 నెలల కాలం పాటు కొనసాగింది. అయితే, మోదీ అధికారంలోకి వచ్చినప్పటికే నిజ ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులు లేకపోవడం, అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచీలు, దేశీయ డిమాండ్లు బల హీనపడటం వంటివీ, దానితో పాటుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వలన అక్కడ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఏర్పడటం-వంటివన్నీ కలగలిసి రూపాయి విలువ మరలా ఒడిదుడుకులకు లోనవుతోం ది. 2015 జనవరి 12 నాటికి రూపాయి విలువ డాల రుతో పోలిస్తే రూ. 62.13లకు పతనం అయ్యింది. కాగా, రూపాయి ఇకముందు కూడా మరింత పతనం అయ్యే సూచనలే కనపడుతున్నాయి. నేడు పతనమవుతోన్న రూపాయి విలువ దేశీ యంగా ప్రజల కొనుగోలుశక్తిని పరోక్షంగా దెబ్బ తీస్తుంది. మనం దిగుమతి చేసుకునే పలు సరుకుల ఖరీదు పెరిగి పోవడం దీనికి ఒక కారణం. కాబట్టి మన దేశ ప్రయోజనాల దృష్ట్యా రూపాయి విలువ బలంగా ఉండటం మనకు అవసరం. లేని పక్షంలో దేశ ప్రజల కడగళ్లు మరింత ఉధృతమవుతాయి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 9866179615 -
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై: కొత్త ఏడాదిలో రెండో రోజు శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 380.36 పాయింట్లు లాభపడి 27,887.90 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 111.45 పాయింట్లు ఎగిసి 8,395.45 ముగిసింది. ప్రధానంగా సెన్సెక్స్ షేర్లు రిలయన్స్, టాటా మోటర్స్, హెచ్ డీ ఎఫీ సీ , ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. గురువారం అంతర్జాతీయ మార్కెట్లలో సెలవుల కారణంగా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో కొత్త ఏడాది ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. కాగా శుక్రవారం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా ఇదే జోరు కొనసాగింది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లకు ఎగసి 27, 723 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 8,300 పాయింట్లను దాటింది. ఈ రోజు నిఫ్టీ 60కు పైగా పాయింట్లను లాభపడింది. ప్రధానంగా సెన్సెక్స్ షేర్లు రిలయన్స్, టాటా మోటర్స్, హెచ్ డీ ఎఫీ సీ , ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. గురువారం అంతర్జాతీయ మార్కెట్లలో సెలవుల కారణంగా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో కొత్త ఏడాది ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సెన్సెక్స్ 27,395-27,546 కనిష్ట, గరిష్టా స్థాయిల మధ్య ట్రేడైంది. చివరికి 8 పాయింట్ల లాభంతో 27,508 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1 పాయింట్ లాభపడి 8,284 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఐదో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ఐదు సెషన్లలోనూ సెన్సెక్స్ 299 పాయింట్లు లాభపడింది.