
సాక్షి, న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో మరో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ డివైస్ను లాంచ్ చేస్తోంది. ఎక్స్21 యూడి పేరుతో మే 29న ఈ స్మార్ట్ఫోన్ను ప్రారంభించనుంది. ఈ మేరకు లాంచింగ్ ఆహ్వానాలను వివో పంపించింది. దీని ధరను రూ .40,000గా నిర్ణయించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీతో లాంచ్ కానున్న తొలి స్మార్ట్ఫోన్ ఇదేనని తెలిపాయి. చైనా సహా ఇతర అంతర్జాతీయ మార్కట్లోల ఈ ఫోన్ రెండు వెర్షన్లలో ఎక్స్ 21, ఎక్స్ 21 ప్లస్ యూడీ డివైస్లను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఇండియన్ మార్కెట్లో ఏ పేరుతో విడుదల చేయనుందీ స్పష్టత లేదు.
ఎక్స్21 యూడి ఫీచర్లు
6.2 అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్
1080 x 2280 రిజల్యూషన్ (19: 9
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 చిప్సెట్ )
ఆండ్రాయిడ్ ఓరియో 8.1
6జీబీ ర్యామ్, 128 స్టోరేజ్
256 దాకా విస్తరించుకునే సదుపాయం
12+5ఎంపీ రియర్ కెమెరా
12ఎంపీ సెల్ఫ కెమెరా
3200 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ అభివృద్ధిలో తాము మార్గదర్శిగా ఉన్నామని వివో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ ఫెంగ్ చెప్పారు. ఆప్టికల్ ఫింగర్ప్రింట్ సెన్సార్తో వినియోగదారులకి ఈ ఫ్యూచరిస్టిక్ మొబైల్ అనుభవాన్ని అందించడంలో అడుగు ముందుకు వేశామనీ, చాలా త్వరగా వినియోగదారులకు అందుబాటులోకి రావటానికి చాలా సంతోషిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment