వొడాఫోన్‌ రంజాన్‌ ఆఫర్‌, ఓన్లీ వారికే.. | Vodafone launches Rs 509 Ramzan plan | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌ రంజాన్‌ ఆఫర్‌, ఓన్లీ వారికే..

May 24 2018 5:34 PM | Updated on May 24 2018 5:34 PM

Vodafone launches Rs 509 Ramzan plan - Sakshi

న్యూఢిల్లీ : పండుగొచ్చిదంటే చాలు.. టెలికాం కంపెనీలు కూడా కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను హోర్రెత్తిస్తుంటాయి. తాజాగా రంజాన్‌ పవిత్ర మాసాన్ని పురష్కరించుకుని టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 509 రూపాయలతో ‘రంజాన్‌ సే ఈద్‌ ఉల్‌ జుహా తక్‌’ అనే రీఛార్జ్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 1.4జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ను 90 రోజుల పాటు ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ కేవలం కర్ణాటకకు మాత్రమే అందుబాటులో ఉంది. 

రంజాన్‌ మాసం ప్రారంభమైనప్పటి నుంచి అంటే 2018 మే 16 నుంచి ఆగస్టులో ఈద్‌ ఉల్‌ జుహా వరకు కర్ణాటకలోని వొడాఫోన్‌ కస్టమర్లు అపరిమిత ఉచిత కాలింగ్‌, రోజుకు 1.4జీబీ డేటాను పొందవచ్చని వొడాఫోన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా కస్టమర్లు వొడాఫోన్‌ ప్లే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, మక్కా అండ్‌ మదీనా లైవ్‌లను వీక్షించవచ్చని తెలిపింది. 509 రూపాయల ప్లాన్‌తో పాటు, వొడాఫోన్‌ 569 రూపాయలతో, 511 రూపాయలతో మరో రెండు ప్లాన్లను కూడా లాంచ్‌ చేసింది. 569 రూపాయల ప్లాన్‌ కింద రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ను 84 రోజుల పాటు పొందవచ్చని వొడాఫోన్‌ పేర్కొంది. అదేవిధంగా 511 రూపాయల ప్లాన్‌ కింద రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ను 84 రోజుల పాటు అందించనున్నామని చెప్పింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement