ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధ్యయన బృందంలో రాజన్ | World Economic Forum 2016: How Arun Jaitley and Raghuram Rajan tempered big expectations | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధ్యయన బృందంలో రాజన్

Published Wed, Jan 27 2016 12:58 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధ్యయన బృందంలో రాజన్ - Sakshi

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధ్యయన బృందంలో రాజన్

దావోస్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అధ్యయనానికి ఏర్పాటయిన ప్రత్యేక కర్తవ్య నిర్వహణా బృందంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సభ్యునిగా నియమితులయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది.  ఈ బృందంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ బ్యాంకర్లు, విధాన నిర్ణేతలు ఉన్నారు. ఈ మేరకు జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డబ్ల్యూఈఎఫ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల పాత్ర, ఆర్థిక రెగ్యులేటరీ సంస్కరణలు వంటి అంశాలపై చర్చిస్తుంది. తమ సమగ్ర అధ్యయన నివేదికను ఈ బృందం  2017 జనవరిలో జరిగే డబ్ల్యూఈఎఫ్ 47వ వార్షిక సదస్సులో సమర్పిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement