Study Centre
-
హైదరాబాద్ స్టడీ హాల్స్లో భద్రత కరువు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే ఢిల్లీ వెళ్లేవారు. కానీ కొన్నేళ్లుగా హైదరాబాద్.. ముఖ్యంగా అశోక్నగర్ పరిసర ప్రాంతాలు సివిల్స్ ప్రిపరేషన్కు అడ్డాగా మారింది. సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్–1, 2, 3 వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కానీ దినదిన గండంగా అభ్యర్థులు గడుపుతున్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు యమ పాశాల్లా స్టడీ హాల్స్ చుట్టూ విద్యుత్ వైర్లు.. అగ్గిపెట్టెల్లాంటి గదులు.. ఆకతాయిల వేధింపులు.. పుస్తకాలతో పాటు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటే కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ స్టడీ హాల్ నీటమునిగి విద్యార్థులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో ఇక్కడి స్టడీ హాళ్ల పరిస్థితులపై చర్చ జరుగుతోంది. అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో.. స్టడీ హాల్స్లో చదువుకుంటే ఏకాగ్రత ఉండదేమోనన్న బెంగతో లైబ్రరీ, స్టడీ సెంటర్లలో చాలా మంది చేరుతుంటారు. ఇదే అదునుగా వారి ఆశలను క్యాష్ చేసుకునేందుకు వీధివీధినా మూడు, నాలుగు స్టడీ హాల్స్ వెలిశాయి. అగ్గిపెట్టెల మాదిరిగా ఉన్న గదుల్లో ఇరుకుగా, గాలి వెలుతురు లేకుండా ఒక్కరిద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు, నలుగురిని కూర్చోబెడుతున్నారు. ఎండాకాలం వస్తే అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. ఏసీ స్టడీ హాల్స్ పేరిట అదనపు చార్జీలు వేస్తూ అభ్యర్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంటారు. ఫైర్ సేఫ్టీ పాటించేదెవరు? చాలా స్టడీహాల్స్ లోపలికి ఇరుకైన మెట్ల ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి స్టడీ హాల్స్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. ప్రమాదం జరిగితే తప్పించుకునే పరిస్థితులే కానరావట్లేదు. అలాంటి ప్రాంతాల్లో అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. విద్యుత్ వైర్లకు దగ్గరగా.. చాలా స్టడీ హాల్స్ లేదా లైబ్రరీలను నివాస సముదాయాల్లోనే ఏర్పాటు చేశారు. ఎక్కువగా రెండో అంతస్తులో వీటిని నడుపుతున్నారు. సాధారణంగా నివాస సముదాయాల్లో ఇలాంటి వ్యాపార కార్యకలాపాలు నడపడం చట్ట విరుద్ధం. కొన్నింటికి ఎలాంటి బోర్డులు పెట్టకుండా, జీఎస్టీ చెల్లించకుండా గుట్టుగా నడిపించేస్తున్నారు. ఈ భవనాలకు దగ్గరి నుంచే ప్రమాదకరంగా హై వోల్టేజీ ఉన్న ఎక్స్టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. ప్రమాదవశాత్తూ ఎవరికైనా ఆ వైర్లు తగిలితే ఎవరు బాధ్యత వహించాలన్నది పెద్ద ప్రశ్న. ఇక, కొన్ని ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను వైన్ షాపుల పక్కనే ఏర్పాటు చేశారు. అదీ మెయిన్ రోడ్డుపైనే ఇలా ఏర్పాటు చేస్తే పట్టించుకున్న వారే లేరు. వీధి లైట్లు లేక ఇబ్బందులు.. అభ్యర్థులు పొద్దుపోయే వరకు స్టడీ హాల్స్, లైబ్రరీల్లో చదువుకుని హాస్టల్ లేదా వారి గదులకు వెళ్తుంటారు. వెళ్లే దారిలో చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు లేక యువతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకతాయిలు రోడ్లపై అడ్డాలు వేసుకుని, వచ్చి పోయే అమ్మాయిలపై కామెంట్స్ చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. బైక్లపై వారి ముందు స్టంట్లు చేస్తున్నారు. అమ్మాయిల భద్రత గాలికి.. హాస్టళ్లలో అమ్మాయిల భద్రత గాలికొదిలేశారు. ఇటీవల ఓ అమ్మాయిల హాస్టల్లోకి దర్జాగా ఓ దుండగుడు ప్రవేశించి, అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే తమ చదువులకు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు, హాస్టల్కు చెడ్డ పేరు వస్తుందని యాజమన్యం మిన్నకుండి పోయింది. ఇక, కొత్తగా నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్ పై నుంచి పక్కనే ఉన్న భవనాల్లోకి మద్యం తాగి బాటిళ్లను విసిరేసే వారని మరికొందరు వాపోయారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో చదివేకంటే ఇంటికి వెళ్లిపోవడమే ఉత్తమమని, చాలామంది అమ్మాయిలు సొంతూళ్లకు వెళ్లిపోయారు.జోరుగా గంజాయి అమ్మకాలు అశోక్ నగర్, గాంధీనగర్, హిమాయత్నగర్, చిక్కడపల్లిలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే చదువుకునే వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం ఆకతాయిలకు అవకాశంగా మారింది. ఆంధ్ర కేఫ్ రోడ్డు, ప్యారడైజ్ పరిసర ప్రాంతాల్లో చాలా డ్రగ్స్, గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇక, షీ టీమ్స్కు సమాచారం ఇచ్చేందుకు స్టడీహాళ్ల మధ్య ఎస్వోఎస్ బూత్ పోల్స్ను అమర్చాలని కోరుతున్నారు. దీంతో వెంటనే ఫిర్యాదు చేసి, సహాయం పొందేందుకు వీలుంటుందని చెబుతున్నారు.టౌన్ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలం.. నగరాల్లో తక్కువ విస్తీర్ణంలో నాలుగైదు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. సెల్లార్ను పార్కింగ్కు బదులు వ్యాపార కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి భవనాలు అశోక్నగర్లో కోకొల్లలు. అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లంచాలకు అలవాటు పడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడే హడావుడి చేయడం తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. -
కొలువుల కోసం ప్రత్యేక శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నియామక సంస్థల చర్యలు వేగవంతమవడంతో అభ్యర్థులు సైతం అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒకదఫా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు మరోసారి స్వల్పకాలిక శిక్షణ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ వెనుకబడిన తరగతుల అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల బీసీ స్టడీ సర్కిల్ అధికారులతో ఉచిత కోచింగ్పై పలు రకాల సూచనలు చేశారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. జిల్లాలవారీగా స్టడీ సెంటర్లు బీసీ అభ్యర్థులకు స్వల్పకాలిక శిక్షణ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 50 స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. బీసీ సంక్షేమ వసతిగృహాలు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో తాత్కాలిక పద్ధతిలో తక్షణమే ఈ స్టడీ సెంటర్లను ప్రారంభించాలని మంత్రి గంగుల ఆదేశించారు. దీంతో అనువైన భవనాల లభ్యతపై ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. త్వరలో గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4తోపాటు గురుకుల కొలువులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే ఆ యా కేటగిరీల్లోని ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపడంతో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీసీ అభ్యర్థులకు వారి జిల్లా కేంద్రాల్లోనే శిక్షణలు ఇచ్చేవిధంగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటిల్లో కూడా స్వల్పకాలిక శిక్షణ తరగతులను అతిత్వరలో నిర్వహించాలని బీసీ స్టడీ సర్కిల్ భావిస్తోంది. వారంరోజుల్లోగా కోచింగ్కు సంబంధించి ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది. -
‘మా అమ్మాయికి చదువు అక్కర్లేదని గొడవలకు దిగేవారు’
బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్గా మంచి పేరున్న హర్సంజమ్కౌర్ వృత్తి నుంచి కాస్త విరామం కోసం మౌంట్కైలాష్లో నిర్వహించిన మెడిటేషన్ క్లాస్లకు హాజరయ్యారు. అయితే అక్కడ ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. ‘అంగన్’ అనే స్వచ్ఛందసంస్థతో పిల్లల చదువు నుంచి పేదల ఆకలి తీర్చడం వరకు ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కౌర్.... నిత్యజీవిత పరుగులో పరుగుకే సమయం సరిపోతుంది. కొందరు మాత్రం ఆ పరుగుకు బైబై చెప్పి నిదానంగా కూర్చొని ‘ఆత్మసమీక్ష’ చేసుకుంటారు. కొత్త వెలుగుతో కొత్త దారిలో ప్రయాణిస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తి హర్సంజమ్కౌర్. ‘కోల్కత్తాలో ఒక సంపన్న కుటుంబం లో పుట్టాను’.. ‘యూకేలో ఏంబీఏ చేశాను’ ‘ఇంటిరీయర్ డిజైనర్గా నాకు మంచిపేరుంది’... ఇలా చెప్పుకోవడంలో కౌర్కు ఎక్కడా తృప్తి కనిపించలేదు. ‘ఆకలితో నకనకలాడుతున్న నలుగురు అభాగ్యులను ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టాను’ అని చెప్పుకోవడంలో మాత్రం ఆమెకు గొప్ప తృప్తి లభించింది. రొటీన్ లైఫ్స్టైల్కు కాస్త విరామం ఇవ్వడానికి అన్నట్లుగా కౌర్ ‘అమ్ముకేర్’ అనే స్వచ్ఛందసంస్థ మౌంట్కైలాష్లో నిర్వహించిన మెడిటేషన్ ట్రిప్ కు వెళ్లారు. మన దేశంలోని అనేక ప్రాంతాలు, విదేశాల నుంచి అక్కడికి ఎంతోమంది వచ్చారు. ‘మీరు ఎంత సంపాదిస్తున్నారు?’ ‘ఎన్ని ఆస్తులు ఉన్నాయి?’... ఇలాంటి మాటలు అక్కడ మచ్చుకు కూడా వినిపించలేదు. క్షణభంగురమైన జీవితాన్ని వేదాంతకోణంలో దర్శించే మాటలు, పరులకు సేవ చేయడంలో లభించే ‘తృప్తి’ విలువను, ఆ శక్తి ముందుకు నడిపించే చైతన్యాన్ని విశ్లేషించే మాటలు వినిపించాయి. ‘మరి నా సంగతి ఏమిటీ?’ అని తనను తాను ప్రశ్నించుకున్నారు కౌర్. దానికి సమాధానమే ‘అంగన్’ అనే స్టడీసెంటర్. ‘అమ్ముకేర్’తో కలిసి పేదవిద్యార్థులకు ఈ స్టడీసెంటర్ ద్వారా వివిధరకాలుగా సహాయం చేయడం మొదలుపెట్టారు కౌర్. కూలీపనులకు వెళ్లే శ్రామికులు పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళుతుంటారు. అక్కడ కూలిపని చేస్తున్న మాటే గానీ వారి మనసంతా పిల్లలపైనే ఉంటుంది. పిల్లలు ఏ ప్రమాదం కొని తెచ్చుకుంటారో అని వారి భయం. ఇది గ్రహించిన కౌర్ అలాంటి పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం, శుభ్రత, ఆరోగ్యాలను పట్టించుకోవడం ప్రారంభించారు. దీనివల్ల ఇటు పిల్లలకు, అటు తల్లిదండ్రులకు ఇద్దరికీ మేలు జరిగింది. ‘నా బిడ్డ స్కూల్లో భద్రంగా ఉన్నాడు’ అని వారిలో భరోసా వచ్చింది. ‘అంగన్’ స్టడీ సెంటర్ ద్వారా పిల్లలకు చిత్రకళ, సంగీతం లాంటివి నేర్పించారు. వారిలోని సృజనను వెలికి తీయడానికి రకరకాల పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి భుజం తట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే కొందరు తల్లిదండ్రులు... ‘మా వాడికి చదువు ఎందుకమ్మా... ఇంకో రెండు సంవత్సరాలైతే పనిలోకెళతాడు’ ‘మా అమ్మాయికి చదువుకు అక్కర్లేదు. ఇంట్లో బోలెడు పని ఉంది’ అంటూ కౌర్తో గొడవకు దిగేవారు. అయితే ఆమె వారికి ఓపికతో సమాధానం చెప్పేవారు. కొందరు మనసు మార్చుకొని పిల్లలను స్కూలుకు పంపించేవారు. కొందరు ససేమిరా అనేవారు. అయితే ఈ రెండోకోవకు చెందిన వారు కూడా కొన్ని నెలల తరువాత చదువు విలువ గ్రహించి కౌర్ చెప్పిన మాటలు విన్నారు. రెండోసారి కరోనా విలయం మొదలైంది. బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో కూలీలు, శ్రామికులు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. వారి ఆకలి ని తీర్చడానికి ప్రతిరోజూ ‘ఫుడ్సేవ’ కార్యక్రమంతో ముందుకు వచ్చి ఎంతోమంది ఆకలి తీర్చారు. మాస్క్లు, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేశారు. ‘మంత్లీఫుడ్ కిట్’లు సరఫరా చేశారు. ‘డబ్బు విషయంలోనైనా ఇక చాలు అనే మాట వస్తుందేమోగానీ సేవ విషయంలో అది ఎప్పటికీ రాదు’ అంటున్న కౌర్ తన సేవాదృక్పథాన్ని మరింత విస్తరించడానికి భవిష్యత్ ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. చదవండి: కుకింగ్ క్వీన్ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్.. -
పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్!
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రశాంత వాతావరణం ముఖ్యం. ఎలాంటి లొల్లి లేకుంటేనే శ్రద్ధగా చదువుకోవడం సాధ్యం. పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నవారిలో అత్యధికులు ఇళ్లలో ప్రత్యేకగదులను స్టడీ రూమ్గా ఏర్పాటు చేసుకుంటారు. మరి ప్రత్యేకగది లేని వాళ్ల సంగతి? అలాంటి వారి కోసం స్టడీసెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఏప్రిల్ నెలాఖరుకు వీటిని అందుబాటులోకి తెచ్చేవిధంగా చర్యలు చేపట్టింది. ప్రధానంగా హరిజనవాడలకు అత్యంత సమీపంగా వీటిని ఉండేలా చూస్తున్నారు. ఇతర అభ్యర్థులను సైతం వీటిలోకి అనుమతించనున్నప్పటికీ ఎస్సీలకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. ఆ వనరులను వినియోగించుకుని... అందుబాటులో ఉన్న వనరులను స్టడీ సెంటర్ల కోసం వినియోగించుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో ఉన్న భవనాలను గుర్తిస్తోంది. ప్రస్తుతం చాలాచోట్ల కమ్యూనిటీ హాళ్లు, అంబేడ్కర్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అనువైనవాటిని స్టడీ సెంటర్లుగా మార్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. స్థానికంగా ఇబ్బంది కలగకుండా, కమ్యూనిటీ అవసరాలు తీరే విధంగా పక్కా ప్రణాళికతో ఈ భవనాలను వినియోగించుకోనుంది. కేవలం ఒక హాల్ వరకు మాత్రమే స్టడీ సెంటర్లకు వాడుకోవాలని భావిస్తోంది. మిగతా సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించనుంది. మినీలైబ్రరీ మాదిరిగా... స్టడీ సెంటర్లు మినీ లైబ్రరీలుగా కూడా ఉండనున్నాయి. విద్యార్థులకు కరెంట్ అఫైర్స్ కోసం దిన, వార, మాస పత్రికలతోపాటు కీలకమైన పుస్తకాలను అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా డ్యూయల్ డెస్క్లు, టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ అంచనాల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి కలిగేవిధంగా ప్రతిపాదనలు ఉండాలని ఆయన అధికారులకు సూచించడంతో ఆ మేరకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. -
అసెంబ్లీలో అధ్యయన కేంద్రం
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ రీసెర్చ్ సెంటర్ (డీఏఆర్సీ)ని ఏర్పాటు చేయనుంది. ఇందులో యువతకు ఫెలోషిప్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టనుంది. ఇందులో అప్రెంటిస్గా చేరిన విద్యార్థులు ఎమ్మెల్యేలతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఇందువల్ల యువతకు శాసనసభ కార్యకలాపాల నిర్వహణపై అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా వీరు శాసనసభ్యులకు ఆయా రోజుల్లో చర్చించే అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల ఎమ్మెల్యేలకు తాజా సమాచారం అందుతుంది. తత్ఫలితంగా వారికి కూడా ఆయా అంశాల విషయంలో నిష్ణాతులుగా మారుతారు. ఇలా ఇరువైపులా ప్రయోజకనకరమైన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం త్వరలో కార్యరూపంలోకి తీసుకురానుంది. అసెంబ్లీ సచివాలయం ఈ డీఏఆర్సీని ఏర్పాటు చేస్తుంది. 50 మందికి ఫెలోషిప్తోపాటు మరో 90 మందికి అసిస్టెంట్ ఫెలోషిప్ ఇవ్వనుంది. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఏడాది కాలానికి ఇస్తారు. ఎవరైనా పూర్తిస్థాయిలో నేర్చుకోలేదని అనిపిస్తే మరో ఏడాదికాలం పొడిగిస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి ఏడాదిన్నర క్రితం ఈ అంశాన్ని సభ ముందుంచారు. తమకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు తగినంత వ్యవధి దొరకకపోతుండడంతో సోమ్నాథ్ ఈ ఆలోచనను సీఎం ముందుంచారు. ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించే బాధ్యతను స్పీకర్ రాంనివాస్ గొయల్ అప్పట్లో జనరల్ పర్పస్ కమిటీ (జీపీసీ)కి అప్పగించారు. ఏడాదిలోగా తనకు నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు. ఔత్సాహికులు ఈ నెల 25వ తేదీలోగా డీఏఆర్సీ.డీటీయూ.ఏసీ.ఇన్’కు పంపాల్సి ఉంటుంది. డీఏఆర్సీలో విలువైన, నాణ్యతా ప్రమాణాలతో కూడిన అధ్యయనం జరుగుతుందని, ఇది శాసనసభ్యులకు ఉపయుక్తంగా ఉంటుందని, వారికి అవసరమైన సమాచారం అందేందుకు దోహదం చేస్తుందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో శాసనసభ సచివాలయం పేర్కొంది. ఎంపిౖకైన యువకులు...శాసనసభ్యులు, అసెంబ్లీ సెక్రటరియేట్, ఆయా ప్రభుత్వ విభాగాలతో చక్కని సమన్వయంతో కలసిమెలసి పనిచేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. -
‘దూర విద్య’ దందా!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దూర విద్యా కేంద్రాలు విద్యార్థులతో చెలగాటమాడుతున్నాయి. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లు నిర్వహించడానికి వీల్లేదని తెలిసినా, వాటిలో చదివే విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు రాష్ట్రంలో చెల్లకున్నా.. తమ కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. రాష్ట్ర యూనివర్సిటీల గుర్తింపుతో ఇక్కడ కొనసాగుతున్న కాలేజీలు కూడా ఈజీ మనీ కోసం అక్రమాల బాట పట్టాయి. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ఇచ్చే భారీ కమీషన్ల కోసం తమ కాలేజీల్లో దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులను మోసం చేస్తున్నాయి. ఇలాంటి స్టడీ సెంటర్లు ఒకటీ రెండూ కాదు వందల్లో ఉన్నాయి. ఒక్క నాగార్జున యూనివర్సిటీకి చెందిన స్టడీ సెంటర్లే రాష్ట్రంలో 100కు పైగా ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 20కి పైగా ఉండగా, ద్రవిడ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 40 వరకు ఉన్నాయి. పాండిచ్చేరి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు, అన్నామలై యూనివర్సిటీ, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ, వినాయక విద్యా మిషన్, మధురై కామరాజ్ తదితర యూనివర్సిటీలు కుప్పలుతెప్పలుగా తెలంగాణలో తమ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఇంత జరుగుతున్నా ఉన్నత విద్యా మండలి కానీ, యూనివర్సిటీలు కానీ నోరు మెదపడం లేదు. తెలంగాణలోని స్టడీ సెంటర్లలో చదివే విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంటూ ఆయా యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి రూ.కోట్లు దండుకుంటున్నా ఉన్నత విద్యా మండలికి చలనం లేకుండా పోయింది. రెగ్యులర్గా చదువుకునే స్తోమత లేక.. రాష్ట్రంలో రెగ్యులర్గా కాలేజీలకు వెళ్లి చదువుకునే స్తోమత లేనివారే దూర విద్యా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు తెలియక దారుణంగా నష్టపోతున్నారు. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లను రాష్ట్రంలో నిర్వహించడానికి వీల్లేదన్న విషయం ఉన్నత విద్యా మండలికి తెలుసు. అయినా వాటిని నిర్వహిస్తున్న కాలేజీలకు ఎలాంటి నోటీసులు, ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. స్టడీ సెంటర్ల నుంచి యూనివర్సిటీల అధికారులు ముడుపులు పుచ్చుకొని ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ విద్యార్థి వేరే రాష్ట్ర యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రంలో (తెలంగాణలోని) చదివిన సర్టిఫికెట్ను పెడితే దాన్ని తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి.. సంబంధిత నిబంధనలపై కనీస ప్రచారం చేయడం లేదు. ఉద్యోగాల్లో అలాంటి సర్టిఫికెట్లను అనుమతించవద్దని చెబుతోందే తప్ప.. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లలో చదవవద్దన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. దీంతో లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ సర్టిఫికెట్లను తెలంగాణలో చెల్లనివిగా పరిగణిస్తారన్న విషయం తెలియక విద్యార్థులు వాటిల్లో చేరుతూనే ఉన్నారు. బయటకు వచ్చినవి కొన్నే.. ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా డిగ్రీ పూర్తి చేసిన ఓ విద్యార్థి.. గతేడాది టీఎస్ ఐసెట్ రాసి మేనేజ్మెంట్ కోటాలో ఘట్కేసర్లోని ఓ కాలేజీలో ఎంబీఏలో చేరాడు. ఆ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల ర్యాటిఫికేషన్కు అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యా మండలికి వెళ్లాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆ విద్యార్థి సర్టిఫికెట్ చెల్లదంటూ ప్రవేశాన్ని తిరస్కరించారు. అలాగే భువనగిరి ప్రాంతంలో ఓ కాలేజీలో గీతమ్ విద్యా సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లో మరో విద్యార్థి డిగ్రీ చదివాడు. అతను మేనేజ్మెంట్ కోటాలో ఎంబీఏలో చేరగా.. సర్టిఫికెట్లను పరిశీలించిన ఉన్నత విద్యా మండలి అతని ప్రవేశాన్ని తిరస్కరించింది. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్లోని దూర విద్యా కేంద్రంలో మరో విద్యార్థి డిగ్రీ పూర్తి చేసి.. లాసెట్ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు. అతని ప్రవేశాన్ని కూడా అధికారులు తిరస్కరించారు. ఇలా వందల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉద్యోగాల్లోనూ అలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యా మండలి తిరస్కస్తోంది. అనుమతి లేకున్నా.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్ జూరిస్డిక్షన్–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి వీల్లేదు. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్ విక్రమ్ సాహే లేఖ (ఎఫ్.ఎన్ఓ.డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. దాంతోపాటు నిబంధనల కాపీని జత చేసి పంపించారు. అవే నిబంధనలను తాము అమలు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చెబుతోంది. కానీ తెలంగాణలో స్టడీ సెంటర్ల పెట్టవద్దని ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు ఓ లేఖ రాయాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. కనీసం తమ ఆధీనంలోని కాలేజీల్లోనైనా ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లు పెట్టకుండా కట్టడీ చేయడం లేదు. ఇవేవీ చేయకున్నా అలాంటి స్టడీ సెంటర్లలో చేరవద్దని విద్యార్థుల్లో అవగాహన కూడా కల్పించడం లేదు. మా సర్టిఫికెట్లు చెల్లుతాయి: నాగార్జున యూనివర్సిటీ తెలంగాణలోని తమ స్టడీ సెంటర్లలో చదువుకొని పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని నాగార్జున యూనివర్సిటీ అధికారులు స్టడీ సెంటర్ల నిర్వాహకులకు చెబుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు ఉమ్మడి విద్యా అవకాశాల విధానం అమల్లో ఉన్నందున తమ స్టడీ సెంటర్లు కూడా చెల్లుబాటు అవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా యూనివర్సిటీల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి కనీసం ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలితోనైనా ఈ విషయంపై చర్చించడం లేదు. -
దూర విద్య.. అంతా మిథ్య!
సాక్షి, హైదరాబాద్: - ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన హైదరాబాద్లోని దూర విద్యా కేంద్రం ద్వారా శ్రీనివాస్రెడ్డి డిగ్రీ చేశాడు. తెలంగాణ ఐసెట్ రాసి మేనేజ్మెంట్ కోటాలో ఎంబీఏలో చేరాడు. ర్యాటిఫికేషన్ కోసం అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యామండలికి వెళ్లగా పరిశీలించిన అధికారులు అతని సర్టిఫికెట్ చెల్లదని ప్రవేశాన్ని తిరస్కరించారు. - సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్లోని దూర విద్యా కేంద్రం ద్వారా వెంకటేశ్వర్లు డిగ్రీ చదివాడు. తెలంగాణ లాసెట్ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు. అతని ప్రవేశాన్నీ ఉన్నత విద్యామండలి తిరస్కరించింది. ఇలా ఒకరు.. ఇద్దరు కాదు వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. విద్యలోనే కాదు ఉద్యోగాల్లోనూ ఇలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యామండలి తిరస్కరిస్తోంది. సుప్రీంకోర్టు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్ జూరిస్డిక్షన్–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని రాష్ట్ర యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి.. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్ విక్రమ్ సాహే లేఖ(ఎఫ్ఎన్ఓ డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. ఈ నిబంధనను తెలంగాణ ఉన్నత విద్యామండలి పక్కాగా అమలు చేస్తోంది. ఫలితంగా అనేక మంది విద్యార్థులు వివిధ కోర్సుల ప్రవేశాల్లో తిరస్కరణకు గురవుతున్నారు. దీంతో ఇతర రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన రాష్ట్రంలోని స్టడీ సెంటర్ల ద్వారా 2013 తర్వాత చదివిన చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. 50 ఇతర రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన 50 వరకు రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య వంటి కోర్సులను దూర విద్య ద్వారా అందిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే వేల కాలేజీల్లో ఆయా విద్యా సంస్థలు 150 కోర్సులను నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. వాటిల్లో 2 లక్షల మంది విద్యార్థులు వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువుతున్నారు. ఏపీలోని ఓ స్టడీ సెంటర్ ద్వారా అక్కడి వర్సిటీలో చదివితే ఆ సర్టిఫికెట్ చెల్లుతుంది.. అదే వర్సిటీకి చెందిన హైదరాబాద్లోని దూర విద్య స్టడీ సెంటర్ ద్వారా చదివితే ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు కాదు. దీనిపై ప్రచారం లేకపోవడంతో విద్యార్థులకు తెలియడం లేదు. ఇతర రాష్ట్ర వర్సిటీలు ఆదాయం కోసం ఈ విషయాన్ని దాచిపెట్టి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగాల్లోనూ తిరస్కరణ! ఇలాంటి సర్టిఫికెట్లను విద్యా ప్రవేశాల్లోనే కాకుండా ఉద్యోగాల్లోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆ సర్టిఫికెట్లను ఉద్యోగ నియామకాల విభాగాలు తిరస్కరిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటుండటంతో పలువురు అభ్యర్థులు ఉద్యోగాల్లోనూ తిరస్కరణకు గురి కావాల్సివస్తోంది. యూజీసీ నిబంధనల ప్రకారమే యూజీసీ దూర విద్య, ఆఫ్ క్యాంపస్ల టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర వర్సిటీ మరో రాష్ట్రంలో దూర విద్య కేంద్రాలను ఏర్పాటు చేసి కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. అందుకే అలా వచ్చే విద్యార్థుల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నాం. ఇప్పటికైనా అలాంటి వాటిల్లో విద్యార్థులు చేరవద్దు. రెగ్యులర్గా చదువుకునే అవకాశం లేని వారు తెలంగాణ రాష్ట్ర వర్సిటీల దూర విద్యా కేంద్రాల ద్వారా చదువుకోవాలి. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీసేన విజయానికి ముఖ్య కారకుడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనినే. జట్టుకు కెప్టెన్ కోహ్లి అయినా, ఈ విజయాలకు సారథి మాత్రం ధోనినే అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లుతున్నాయి. ధోని తొలుత బ్యాటింగ్లో కీలక వికెట్లు కోల్పోయిన జట్టును హార్ధిక్ పాండ్యాతో పాటు ఆదుకున్నాడు. ఆపై ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో టీమిండియా బౌలర్లకు ధోని చేసిన కీలక సూచనలే మ్యాచ్ గతిని మార్చివేశాయని తెలుస్తోంది. ఇందుకు స్టంప్ మైక్ల్ రికార్డయిన ధోని మాటలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ ఆడియో సంభాషణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 'మిస్టర్ కూల్' ధోని కీలక సూచనలు పాటించిన ఇద్దరు బౌలర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్పిన్నర్లు వైవిధ్యమైన బంతులతో ఆసీస్ బ్యాట్స్మెన్ను ఒక్కొక్కరిగా పెవిలియన్కు పంపారు. కానీ వికెట్ల వెనుక ఉన్న మహేంద్రుడు వారికి మార్గనిర్దేశం చేశాడు. తొలుత ప్రమాదకర ఆటగాడు డేవిడ్ వార్నర్, స్టొయినిస్ను కుల్దీప్ పెవిలియన్కు పంపించాడు. ఆపై భారీ సిక్సర్లతో చెలరేగిన మ్యాక్స్వెల్, పాట్ కమిన్స్, మాథ్యూ వేడ్ లను మరో స్పిన్నర్ చహల్ పెవిలియన్ బాట పట్టించాడు. స్టంప్ మైక్లో ధోని మాటలు 'వో మార్నే వాలా దాల్నా.. అందర్ యా బాహర్ కోయీ భీ (షాట్ ఆడేలా బాల్ వేయి అయితే వికెట్ల వైపు లేదా బయటకి వచ్చినా ఒకే), గూమ్నే వాలా దాల్.. ఘూమ్నే వాలా దాల్.. (బాగా టర్న్ అయ్యేలా బౌలింగ్ చెయ్)' అంటూ యువ బౌలర్ కుల్దీప్నకు ధోనీ సూచించాడు. మాక్స్వెల్ ఆటకట్టించేందుకు స్టంప్స్ పైకి బాల్స్ వేయొద్దన్నాడు. తాను చెప్పిన బంతులు వేయని సందర్భంలో మహీ.. 'ఐసే ఐసే దాలో, తు భీ సున్తా నహీ హై క్యా (నువ్వు కూడా నా మాట వినిపించుకుంటలేవు)' అంటూ చహల్కు చెప్పడం రికార్డైంది. ఇలా ధోని చేసిన సూచనల్ని పాటింటిన స్పిన్నర్లు ఆసీస్ దూకుడుకు కళ్లెంవేశారు. తద్వారా ధోని ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. -
విద్యావేత్త యశ్పాల్ కన్నుమూత
► శాస్త్రరంగంలోనూ విశేష సేవ ► ప్రధాని మోదీ విచారం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ విద్యావేత్త, భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్పాల్ సింగ్ (90) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో యశ్పాల్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నోయిడాలోని ఓ వైద్యశాలలో తుదిశ్వాస విడిచారని ఆయన కొడుకు రాహుల్ పాల్ మంగళవారం తెలిపారు. అంత్యక్రియలను ఢిల్లీలోని లోధి రోడ్లో ఉన్న విద్యుత్ దహనవాటికలో నిర్వహించామని చెప్పారు. విశ్వకిరణాల (కాస్మిక్ రేస్)పై అధ్యయనంలో యశ్పాల్ కీలక పాత్ర వహించారు. భారతీయ విద్యావిధానంలో పలు సంస్కరణలకు ఆయన ఆద్యుడిగా నిలిచారు. ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో 1926లో జన్మించిన యశ్పాల్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో తన కెరీర్ను ప్రారంభించారు. అనంతరం అమెరికా వెళ్లి మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. తిరిగి భారత్కు వచ్చిన ఆయన టీఐఎఫ్ఆర్లో తన ఉద్యోగాన్ని కొనసాగించారు. 1986–91 మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గాను యశ్పాల్ పనిచేశారు. ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అటు విద్యా విధానం రూపకల్పనలోనూ యశ్పాల్ విశేష కృషి చేశారు. జాతీయ విద్యా విధానంపై.. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) ఏర్పాటు చేసిన కమిటీకి యశ్పాల్ నేతృత్వం వహించారు. 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపై యశ్పాల్ సారథ్యంలో ఓ కమిటీని నియమించింది. ఇది యశ్పాల్ కమిటీగా పేరుగాంచింది. సైన్సుకు ప్రాచుర్యం కల్పించినందుకుగాను ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆయనకు ‘కళింగ ప్రైజ్’ను ప్రదానం చేసింది. ఇవేకాక మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను ఆయన అందుకున్నారు. సేవలు గుర్తుండిపోతాయి: మోదీ ప్రొఫెసర్ యశ్పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘యశ్పాల్ మరణవార్త నన్ను బాధించింది. ఒక గొప్ప శాస్త్రవేత్తను, విద్యావేత్తను మనం కోల్పోయాం. భారతీయ విద్యా వ్యవస్థకు ఆయన అందించిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయి’ అంటూ మోదీ ఓ ట్వీట్ చేశారు. యశ్పాల్ మృతి భారత్కు పెద్ద లోటు అని శాస్త్ర, సాంకేతిక, భూ శాస్త్ర శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా యశ్పాల్ మృతికి సంతాపం తెలిపారు. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి విజయ్ రాఘవన్ మాట్లాడుతూ ‘డా.హోమిబాబా, డా.విక్రమ్ సారాభాయ్ తదితరుల కాలానికి, నేటి తరానికి మధ్య వారధిలా ఉన్న వ్యక్తిని మనం కోల్పోయాం’ అని అన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా స్టడీ సెంటర్లు
- ‘బీఎస్సీ అగ్రికల్చర్’ కోర్సును నిర్వహిస్తున్న 3 వర్సిటీలు - చర్యలు చేపట్టాలని యూజీసీకి ఉన్నత విద్యామండలి లేఖ సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 3 వర్సిటీలు రాష్ట్రంలో పలు స్టడీ సెంటర్ల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి యూజీసీ కి లేఖ రాసింది. బీఎస్సీ అగ్రికల్చర్ వంటి వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఫిరోజాబాద్లోని జేఎస్ వర్సిటీ, రాజస్థాన్లోని సింఘానియా వర్సిటీలు రాష్ట్రంలోని 8 స్టడీ సెంటర్ల ద్వారా ఈ కోర్సును నిర్వహిస్తున్నాయని పేర్కొంది. యాప్రాల్లోని ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, తూముకుంటలోని ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, గ్రీన్ల్యాండ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రీన్ఫీల్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, తెలంగాణ అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, మాగ్జిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రీన్ప్లాంట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసర్చ్లు ఆ కోర్సును నిర్వహిస్తున్నాయని వివరించింది. -
ఓపెన్ యూనివర్శిటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి
ఒంగోలు: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ అర్హత పరీక్షకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వడ్రాణం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక శర్మా కాలేజీలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ స్టడీ సెంటర్ను పరిశీలించేందుకు ఆదివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26వ తేదీ తెలంగాణా, ఏపీలోని అన్ని స్టడీ సెంటర్లలో అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్ష కేవలం రాయడం, చదవగలగడం అనే అంశాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదన్నారు. పరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నామన్నారు. దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే పంపుకోవాలని, ఏపీ ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించేవారు రూ. 310లు, డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించేవారు రూ. 300లు చెల్లిస్తే సరిపోతుందన్నారు. అభ్యర్థులు స్టడీ సెంటర్కు తప్పనిసరిగా రావాల్సిన అవసరంలేదని, సైన్స్ అభ్యర్థులు మాత్రం స్టడీ సెంటర్లో వారంవారం జరిగే స్టడీ క్లాసులను వినియోగించుకోవచ్చన్నారు. డిగ్రీ విద్యార్థులకు మూడు సంవత్సరాలకు కలిపి రూ. 5 వేలు కూడా మించదన్నారు. ఈ ఏడాది నుంచి సెమిస్టర్ సిస్టంను కూడా ప్రారంభిస్తున్నామని, దీనివల్ల విద్యార్థులకు మరింత సులభతరంగా ఉంటుందన్నారు. దాంతోపాటు స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్ కోర్సులను కూడా విద్యార్థులకు అందించేందుకు ప్రాంతాల వారీగా పరిశీలన చేస్తున్నామన్నారు. తమ విద్యాసంస్థకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు కూడా ఉందన్నారు. అందువల్ల తమ దూర విద్యాకోర్సులు చదివిన వారు ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలకు సైతం హాజరుకావొచ్చన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ జిల్లాలో స్టడీ సెంటర్లను పెంచే అవకాశాన్ని, పీజీ కోర్సులు ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. సమావేశంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్.నరశింగరావు, సూపరింటెండెంట్ వి.వెంకటరమణ , సీనియర్ అసిస్టెంట్ శివరాం తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది?
నేటి పిల్లలే రేపటి పౌరులు అనే వ్యాఖ్య ఏ దేశానికైనా వర్తిస్తుంది. కానీ అత్యంత తెలివితేటలు గల పిల్లల చేతుల్లోనే రేపటి అమెరికా భవితవ్యం ఆధారపడి ఉందంటున్నారు స్టడీ ఆఫ్ మ్యాథమెటికల్లీ ప్రెషియస్ యూత్ (ఎస్ఎంపీవై). అమెరికాలోని మొత్తం విద్యార్థుల్లో ఒక్కశాతం కన్నా తక్కువగా ఉన్న అతి తెలివైన (ఐక్యూ ఎక్కువగా ఉన్న) పిల్లలపై ఈ సంస్థ 1971 నుంచి అధ్యయనం చేస్తూ వస్తోంది. అలా ఇప్పటి వరకు దాదాపు 5000 మంది తెలివైన విద్యార్థులపై అధ్యయనం చేసింది. వారే ఫెడరల్ జడ్జీలు, సెనేటర్లు, బిలియనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు అవుతున్నారని అధ్యయనం తేల్చింది. అయితే ఇప్పటివరకు ఎంతమంది ఆయా రంగాల్లో స్థిరపడ్డారో మాత్రం వివరించలేదు. విద్యార్థులపై దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు అధ్యయనం జరపడం బహూశ ప్రపంచంలో ఇదే మొదటిసారి. విద్యాప్రమాణాలకు సూచికగా అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానంలో గ్రేడ్ మారడం అనేది విద్యార్థుల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తోందని అధ్యయనం తేల్చింది. గ్రేడ్ మారుతున్న విద్యార్థుల్లో 60 శాతం మంది శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ స్టడీస్లో డాక్టరేట్లు సాధిస్తున్నారని, గ్రేడ్ మారుతున్న, మారని విద్యార్థులను పోల్చి చూడగా ఈ విషయం వెల్లడైందని అధ్యయనకారులు పేర్కొన్నారు. దేశంలోని ఏ పాఠశాలలోనైనా తెలివైన విద్యార్థులను వదిలేసి తెలివి తక్కువ విద్యార్థులపైనే టీచర్లు ఎక్కువ దృష్టి పెడతారని, కానీ తెలివైన విద్యార్థులకు మరింత పదును పెడితే వారు జీవితంలో మరింత పైకి వస్తారని, వారిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అధ్యయనం సూచించింది. ఈ విషయంలో తెలివిగల పిల్లల చదువులపై తల్లిదండ్రులు కూడా మరింత శ్రద్ధ పెడితే ఫలితాలు మరింత బాగుంటాయని కూడా పేర్కొంది. -
టీచర్ల పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేష¯ŒS కోర్సుల అమలు మున్సిపల్ మంత్రి నారాయణ అమలాపురం టౌ¯ŒS : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదవించినప్పుడే ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. అమలాపురం కొంకాపల్లి జవహర్ లాల్ నెహ్రు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఫౌండేష¯ŒS కోర్సు చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మంగళవారం రాత్రి మంత్రి నారాయణ ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించన ప్రభుత్వ ఉపాధ్యాయుల సదస్సులో 500 మంది పాల్గొనగా అందులో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో విద్యా ప్రమాణాల్లో మరీ వెనుకబడి ఉన్నారన్న దృష్టితోనే రాష్ట్రంలో ఎంపిక చేసిన 57 మున్సిపాలిటీల్లో ఫౌండేష¯ŒS కోర్సులు అమలు చేస్తున్నుట్టు తెలిపారు. మంత్రి నారాయణ పలువురు ఫౌండేష¯ŒS కోర్సు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖీ నిర్వహించారు. వారు ఏం చదువు తారు...భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నారని అడిగారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ ఇష్టాగోష్టిలో మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్వర్మ, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు. చివరగా మంత్రి నారాయణ కొంకాపల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. -
ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చేరేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రధానంగా 2011 - 2012 విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులు పెరుగుతున్నారు. 2011 - 12లో ఈ సంఖ్య 50 ఉండగా.. గతేడాది (2015- 16) 1210కి చేరింది. 2011 నుంచి గతేడాది వరకు నమోదైన విదేశీ విద్యార్థుల సంఖ్య 4038. వీరిలో 3,323 మంది విద్యార్థులు కాగా 715 మంది విద్యార్థినులు. ఈ విద్యా సంవత్సరంలో యూజీ కోర్సుల్లో దాదాపు 1500 మందికిపైగా విద్యార్థులకు ప్రొవిజినల్ అడ్మిషన్లు జారీ చేశారు. పీజీ, స్పెషల్ ఇంగ్లిష్ కోర్సుల్లోనూ వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది. యూఎఫ్ఆర్ఓ లెక్కల ప్రకారం.. 2013-14 విద్యా సంవత్సరంలో అత్యధికంగా యూజీ, పీజీ కోర్సుల్లో కలిపి 2,645 మంది విద్యార్థులు చేరారు. వీరిలో 1367 మంది విద్యార్థులు, 1278 విద్యార్థినులు ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ ప్రవేశాలు పొందిన విద్యార్థుల్లో కొందరిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) స్పాన్సర్ చేస్తోంది. మిగిలినవారు సెల్ఫ్ ఫైనాన్స విధానంలో చేరారు. క్రేజీ కోర్సులు ఓయూలో గతేడాది యూజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స (బీసీఏ) కోర్సులో అత్యధికంగా 602 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. పీజీలో 334 మంది విద్యార్థులతో ఎమ్మెస్సీ టాప్లో నిలిచింది. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్)లో 567, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ)లో 439, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ)లో 357, బీటెక్/బీఈలో 333, ఎంఏలో 242 మంది చేరారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)లో 132, పీహెచ్డీలో 196 మంది ప్రవేశాలు పొందారు. ఓయూలో ప్రత్యేకంగా విదేశీ విద్యార్థుల కోసం సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ ఫర్ ఫారిన్ స్టూడెంట్స్ అనే కోర్సు ఉంది. దీని కాలవ్యవధి పది నెలలు. ఈ దేశాల నుంచి ఎక్కువ ఓయూలో చేరిన విద్యార్థుల్లో అత్యధికంగా అఫ్గానిస్తాన్ (593), ఇరాక్ (572), యెమెన్ (474) సోమాలియా (467), సూడాన్ (350), నైజీరియా (169) దేశాల వారు ఉన్నారు. దాదాపు 85 దేశాల విద్యార్థులు ఓయూ పరిధిలోని కాలేజీల్లో చేరుతున్నారు. వీరితోపాటు యూఎస్, యూకే, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండియన్ ఎన్ఆర్ఐ విద్యార్థులూ కూడా ప్రవేశం పొందుతున్నారు. మహారాష్ట్రలోని యూనివర్సిటీ ఆఫ్ పుణె తర్వాత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ప్రవేశం పొందుతున్న విశ్వవిద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ నిలుస్తోంది. దేశమేదైనా ఉన్నత విద్యకోసం ఇక్కడికి వచ్చిన విద్యార్థులంతా కలిసిమెలసి ఉంటారు. ఇక్కడ కోర్సులనభ్యసించిన విదేశీ విద్యార్థులకు వారి దేశాల్లో గుర్తింపు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రొఫెసర్ జి.బి. రెడ్డి, జాయింట్ డెరైక్టర్, యూఎఫ్ఆర్ఓ, ఉస్మానియా యూనివర్సిటీ. -
‘జాతీయ స్థాయి’కి సాత్విక్
మద్దిరాల (చిలకలూరిపేట రూరల్): తుపాకులతో టెర్రరిస్టులను మాత్రమే చంపవచ్చు, విలువలతో కూడిన విద్యతో టెర్రరిజాన్ని రూపుమాపవచ్చు. నేటి విద్యావిధానంలో విలువలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా టెర్రరిస్టులుగా మారుతున్నారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం అహింసా విధానాన్ని పాటించారు. పెన్ను, పుస్తకం, ఉపాధ్యాయుడితో కలిసి టెర్రరిజాన్ని రూపుమాపవచ్చని ఇటీవల నోబుల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని కేంద్రీయ విద్యాలయమైన జవహర్ నవోదయకు చెందిన విద్యార్థి సాత్విక్ ప్రదర్శించిన ఎగ్జిబిషన్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన క్లస్టర్ పోటీల్లో విజేతగా, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి ఐదు రాష్ట్రాల విద్యార్థులకు రీజనల్ స్థాయిలో సైతం విజేతగా నిలిచాడు. త్వరలో జాతీయస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికయ్యాడు.మండలంలోని మద్దిరాల గ్రామంలో నవోదయ పాఠశాలలో సీహెచ్ సాత్విక్ పదోతరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. ఈనెల 18, 19వ తేదీలలో శ్రీకాకుళంలో జరిగిన క్లష్టర్ పోటీల్లో, 23,24 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో నిర్వహించిన రీజనల్ పోటీల్లో పాల్గొన్నాడు. రెండు పోటీలను సోషల్ సైన్స్ విభాగంలో అధ్యాపకుడు బ్రహ్మానందరెడ్డి సూచనలు, సలహాలతో ఎగ్జిబిషన్ను ప్రదర్శించి ప్రతిభను కనబరచాడు. వ్యవసాయ కూలీ కుటుంబంలో మెరిసిన విద్యార్థి.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఆరవ తరగతి ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణుడై 2012–13 విద్యా సంవత్సరంలో జిల్లాలోని పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన అనుదీప్– శాంతి దంపతుల కుమారుడు సీహెచ్ సాత్విక్ ప్రవేశం పొందాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సాత్విక్ను ప్రిన్సిపాల్ ఎన్వీడీ విజయకుమారి జ్ఞాపిక, సర్టిఫికెట్లను అందించారు. డిప్యూటీ ప్రిన్సిపాల్ రాఘవయ్య, అధ్యాపకుడు బ్రహ్మానందరెడ్డి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
ఈ యూనివర్సిటీలు, కాలేజీలు నకిలీవే
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు, రాష్ట్రానికి చెందిన పలు కాలేజీలు తెలంగాణలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, అవి నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలేనని రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. వాటిల్లో చదివి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కోర్సును నిర్వహించే 3 యూనివర్సిటీలు, 8 కాలేజీలకు, వాటి స్టడీసెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కాని, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ గుర్తింపునివ్వలేదని, యూజీసీ కూడా వాటికి గుర్తింపు ఇవ్వలేదని వెల్లడించారు. యూనివర్సిటీలు/ప్రభుత్వం/ యూజీసీ గుర్తింపు లేని కాలేజీల్లో చదివితే నష్టపోవాల్సి వస్తుందని సూచించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇతర వివరాలను యూజీసీ వెబ్సైట్లో (ugc.ac.in) పొందవచ్చని వివరించారు. ఇవీ నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలు ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ ⇒ సంఘానియా యూనివర్సిటీ, ఝుంఝును రాజస్తాన్ ⇒ జేఎస్ యూనివర్సిటీ, ఫిరోజాబాద్, ఉత్తరప్రదేశ్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా యాప్రాల్, హైదరాబాద్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, తూముకుంట, సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ ఎదురుగా, శామీర్పేట్, రంగారెడ్డి ⇒ గ్రీన్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, సుందర్నగర్ కాలనీ, మెయిన్రోడ్ సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్ ⇒ గ్రీన్ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ , సాయినగర్ రోడ్, రాజధాని హోటల్ లేన్ ఎదురుగా, హైదరాబాద్ ⇒ తెలంగాణ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్ట్రీట్ నెంబర్-2 బిగ్ బజార్ దగ్గర తార్నాక, హైదరాబాద్ ⇒ మాగ్జిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, నంజిని ఎన్క్లేవ్, ప్రశాంత్నగర్, ఉప్పల్ పోలీసుస్టేషన్ పక్కన, ఉప్పల్ ⇒ గ్రీన్ ప్లాంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, వివేకానందనగర్, కెనరా బ్యాంకు ఎదురుగా, కూకట్పల్లి, హైదరాబాద్ ⇒ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, హిల్ కాలనీ, రిలయన్స్ డిజిటల్ ఎదురుగా వనస్థలిపురం, హైదరాబాద్ -
చదువుతోపాటు సమాజాభివృద్ధికీ పాటుపడాలి
విద్యార్థులకు ‘నన్నయ’ వీసీ పిలుపు రంపచోడవరం : చదువుతోపాటు సమాజాభివృద్ధికి కూడా విద్యార్థులు పాటుపడాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక బీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో నన్నయ వర్సిటీ, వికాస సంయుక్త ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏటా చదువు పూర్తి చేసుకునే 30 మంది విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. వర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటి కేంద్రాలు 20 ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ పరిధిలో 450 డిగ్రీ కళాశాలలున్నాయన్నారు. విద్యార్థులు పూర్తి చేసిన డిగ్రీకి అనుబంధంగా అదనపు నైపుణ్యాలను అందించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, తమలో ఉన్న భయాన్ని తొలగించుకోవాలని వీసీ సూచించారు. వికాస ప్రాజెక్టు అధికారి వీఎన్ రావు, నన్నయ ఎడ్యుకేషన్ మెంబర్ బి.సువర్ణకుమార్ కూడా ప్రసంగించారు. వీసీని లెనోరా విద్యాసంస్థ ఆధ్వర్యాన ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో లెనోరా విద్యాసంస్థ అధినేత డాక్టర్ బి.రత్నం, వర్సిటీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, వికాస ప్లేస్మెంట్ అధికారులు పి.శ్రీకాంత్, కౌముది, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్, లెనోరా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్మూర్తి, సర్పంచ్ వై.నిరంజనీదేవి, బీఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
14న బీఈడీ, డిగ్రీ ప్రవేశ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ, బీఈడీ (స్పెషల్), డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీలో ప్రవేశం కోసం ఈనెల 14న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు ఆ యూనివర్సిటీ సీఆర్ఆర్ కళాశాల స్టడీ సెంటర్ ప్రిన్సిపాల్ ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బీఈడీ, డిగ్రీ ప్రవేశపరీక్ష జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బీఈడీ (స్పెషల్) ప్రవేశపరీక్ష జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్ఎఓయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. -
అక్రమాలపై అధ్యయనం
యాంత్రీకరణ అక్రమాలపై రెండు బృందాల తనిఖీలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన అధికారులు ఖమ్మం వ్యవసాయం : వ్యవసాయ యాంత్రీకరణ అమలు.. జరిగిన అక్రమాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు పూనుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రెండు బృందాలను నియమించింది. ఆధునిక పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఆహార భద్రతా పథకం(ఎన్ఎస్ఎఫ్), రాష్ట్రీయ కృషి వికాస యోజన(ఆర్కేవీవై), నార్మల్ స్టేట్ ప్లాన్(ఎన్ఎస్పీ) వంటి పథకాల ద్వారా రూ.కోట్లు వెచ్చిస్తున్నాయి. ఈ నిధులను కొందరు అక్రమాలు కొల్లగొడుతున్నారు. 2014–15లో జిల్లాకు ఆయా పథకాల కింద విడుదలైన నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి. రూ.20కోట్ల నిధుల్లో పలు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ.. జిల్లా వ్యవసాయ శాఖలో అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించింది. అప్పటి జిల్లా వ్యవసాయ శాఖ బాస్(జేడీఏ) నిధులను సెల్ఫ్ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నట్లు నిర్ధారించారు. దాదాపు రూ.70లక్షలు డ్రా చేసుకున్నట్లు విచారణలో తేలింది. వీటిలో కొంత మొత్తాన్ని బాస్ తిరిగి రాష్ట్ర వ్యవసాయ శాఖకు జమ చేశారు. ఈ వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులు సస్పెన్షన్కు కూడా గురయ్యారు. ఇందులో ఆడిట్ జరగగా.. విచారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు బృందాల తనిఖీలు జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ.. క్షేత్రస్థాయిలో పథకం అమలును పరిశీలించాలని.. లబ్ధిదారుల ఆధారంగా యంత్ర పరికరాలు అందాయా? వాటిని ఆయా లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారా? అధికారులు మార్గదర్శకాలను పాటిస్తున్నారా? లబ్ధిదారుల గుర్తింపు సక్రమంగా ఉందా? లేదా? తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు రెండు బృందాలను నియమించింది. ఇవి సోమవారం నుంచి తనిఖీలకు శ్రీకారం చుట్టాయి. మెదక్ జిల్లా సదాశివపేట సీడ్పామ్ సహాయ వ్యవసాయ సంచాలకులు వి.విద్యాసాగర్, సిద్దిపేట ఏఓ ఆర్.ప్రభాకర్రావు ఒక బృందంగా, సంగారెడ్డి రైతు శిక్షణా కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు జి.రమాదేవి, సంగారెడ్డి రైతు శిక్షణా కేంద్ర వ్యవసాయాధికారి ఎం.మీనా ఒక బృందంగా నియమితులయ్యారు. వీరు వ్యవసాయ డివిజన్లవారీగా తనిఖీలను ప్రారంభించారు. 2014 నుంచి పథకం అమలుపై పరిశీలన 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాల యాంత్రీకరణ పథకం అమలు తీరును తనిఖీ బృందాలు పరిశీలిస్తున్నాయి. రెండేళ్ల కాలంలో.. వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లకు సంబంధించిన పలు కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవటం, ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో పథకం అమలుపై సమగ్రంగా అధ్యయనం చేయాలని రెండు బృందాలను తనిఖీలకు నియమించారు. బృందాలు ఇప్పటివరకు బోనకల్లు, చింతకాని, ఖమ్మం అర్బన్(రఘునాథపాలెం), సత్తుపల్లి, కారేపల్లి, కామేపల్లి మండలాల్లో తనిఖీలు చేపట్టాయి. రైతులను కలుస్తూ.. పరికరాల వివరాలను పరిశీలిస్తున్నాయి. శుక్రవారం వరకు జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తాయని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు మణిమాల తెలిపారు. ఇక్కడ జరిగిన అక్రమాలు, అమలు తీరుపై సమగ్ర నివేదికను రూపొందించి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్కు అందజేయనున్నట్లు తెలిసింది. -
న్యాయం చేయండి
ఆర్మూర్: సమాధాన పత్రాలు చింపివేయడంతో తాము ఫెయిల్ అయ్యామని, తమకు న్యాయం చేయాలని పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న 15 మంది డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జూన్లో ఎంపీసీ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన 15 మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేసి యూనివర్సిటీకి పంపించిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జవాబు పత్రాలు చింపివేయబడ్డ 15 మంది విద్యార్థులు టెట్–1 క్వాలిఫై అయినవారే కావడం గమనార్హం. సమాధాన పత్రాలు చింపి వేయడంతో తాము ఫెయిల్ అయినట్లు తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా స్టడీ సెంటర్, యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. బాధితులకు పీడీఎస్యూ చంద్రన్న వర్గం నాయకులు అండగా నిలిచారు. గురువారం అంబేద్కర్ వర్సిటీ ఆర్మూర్ స్టడీ సెంటర్లో సెంటర్ కోఆర్డినేటర్ రాజ, క్లర్క్ శ్యాం, అటెండర్ రూపేశ్తో వాగ్వాదానికి దిగారు. ఆర్మూర్ సెంటర్లోనే సమాధాన పత్రాలు చినిగి వచ్చాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. సమాధాన పత్రాలను భద్రపరిచిన క్లర్క్ శ్యాం, హాల్ టికెట్టు నంబర్లు సేకరించిన అటెండర్లపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి కారణం చెప్పకుండానే అటెండర్ రూపేశ్ తమ హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు నోట్ చేసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులను రీవాల్యూయేషన్లో పాస్ చేయిస్తానంటూ క్లర్క్ శ్యాం చెప్పేవాడని ఆరోపించారు. ఈ సంఘటనపై కలెక్టర్ యోగితారాణాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా.. సమాధాన పత్రాలను చింపివేయడంతో విద్యా సంవత్సరం వృథా అవుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ చంద్రన్న వర్గం నాయకులు డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజకు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు స్వామి, రమాకాంత్, చందు, దినేశ్ తదితరులున్నారు. -
న్యాయం చేయండి
ఆర్మూర్ : సమాధాన పత్రాలు చింపివేయడంతో తాము ఫెయిల్ అయ్యామని, తమకు న్యాయం చేయాలని పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న 15 మంది డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జూన్లో ఎంపీసీ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన 15 మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేసి యూనివర్సిటీకి పంపించిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జవాబు పత్రాలు చింపివేయబడ్డ 15 మంది విద్యార్థులు టెట్–1 క్వాలిఫై అయినవారే కావడం గమనార్హం. సమాధాన పత్రాలు చింపి వేయడంతో తాము ఫెయిల్ అయినట్లు తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా స్టడీ సెంటర్, యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. బాధితులకు పీడీఎస్యూ చంద్రన్న వర్గం నాయకులు అండగా నిలిచారు. గురువారం అంబేద్కర్ వర్సిటీ ఆర్మూర్ స్టడీ సెంటర్లో సెంటర్ కోఆర్డినేటర్ రాజ, క్లర్క్ శ్యాం, అటెండర్ రూపేశ్తో వాగ్వాదానికి దిగారు. ఆర్మూర్ సెంటర్లోనే సమాధాన పత్రాలు చినిగి వచ్చాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. సమాధాన పత్రాలను భద్రపరిచిన క్లర్క్ శ్యాం, హాల్ టికెట్టు నంబర్లు సేకరించిన అటెండర్లపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి కారణం చెప్పకుండానే అటెండర్ రూపేశ్ తమ హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు నోట్ చేసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులను రీవాల్యూయేషన్లో పాస్ చేయిస్తానంటూ క్లర్క్ శ్యాం చెప్పేవాడని ఆరోపించారు. ఈ సంఘటనపై కలెక్టర్ యోగితారాణాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా.. సమాధాన పత్రాలను చింపివేయడంతో విద్యా సంవత్సరం వృథా అవుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ చంద్రన్న వర్గం నాయకులు డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజకు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు స్వామి, రమాకాంత్, చందు, దినేశ్ తదితరులున్నారు. -
విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ
హజిపల్లి(షాద్నగర్రూరల్): ఫరూఖ్నగర్ మండలం హజిపల్లి ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ షాద్నగర్ స్టార్స్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఎంఈఓ శంకర్రాథోడ్ చేతుల మీదుగా అందజేశారు. ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతస్థాయిలో రాణించాలని అన్నారు. లయన్స్క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సింగారంశ్రీనివాస్, వార్డుసభ్యులు, ఉపాధ్యాయులు రంగయ్య, నాగరాజ్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ముందు చదవండి.. తర్వాత చెల్లించండి
ఖరగ్పూర్: ఐఐటీలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోత విధించడంతో ఐఐటీ-ఖరగ్పూర్ నిధుల కోసం కొత్తదారి వెతుక్కుంది. విద్యార్థులు ఫీజు కోసం ఇబ్బందులు పడకుండా, సంస్థ ఆర్థిక భారంతో సతమతమవకుండా, ‘నేర్చుకోండి-సంపాదించండి-చెల్లించండి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగం వచ్చాక డబ్బులు విరాళంగాఇచ్చేందుకు విద్యార్థులు సుముఖంగా ఉంటే పథకంలో చేరొచ్చు. ఫీజు మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. ‘ఉద్యోగమొచ్చాక ఏడాదికి కనీసం రూ.10 వేలు చెల్లించాలి. ఒక్కో మాజీ విద్యార్థి కనీసం రూ.30 వేలిచ్చినా ఏడాదికి రూ.30 కోట్లు అవుతుంది’ అని ఐఐటీ-కేజీపీ డెరైక్టర్ పార్థ ప్రతీమ్ చక్రవర్తి చెప్పారు. -
ఫీజులు నియంత్రించాలి
గద్వాల : ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సం స్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుభా న్ అన్నారు. గురువారం అధిక ఫీజులను నిరసిస్తూ స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు పెచ్చుమీరుతున్నా.. ప్రభుత్వం వారిపట్ల ఉ దాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించా రు. ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అం జి, నాగరాజు, రాకేష్, రవి, గోపాల్, రాజు, రాము, ఆనం ద్, తాయన్న పాల్గొన్నారు. -
చెంచు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
అచ్చంపేట రూరల్: పట్టణంలోని వనవాసి కల్యాణ పరిషత్లో మంగళవారం అనాథ చెంచు విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. పరిషత్ అధ్యక్షుడు కోట దశరథం 65వ జన్మదినం సందర్భంగా అనాథ చెంచు విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పండ్లు తన కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. పరిషత్ ఆవరణలో 10 మొక్కలు నాటారు. కార్యక్రమంలో దశరథం, యాదమ్మ, దశరథం కుమారులు యాదగిరి, భాస్కర్, రాజేందర్, కిషోర్ ఉన్నారు. -
స్మార్ట్ ఫోన్లను ఎలా వాడుతున్నారో తెలుసా?
ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం లేవడంతోనే స్మార్ట్ ఫోన్ యూజర్స్ సోషల్ మీడియాలో చాటింగ్, వీడియో కాలింగ్,ఇతర పనులు చేస్తుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. స్మార్ట్ ఫోన్ వినియోగించేవారు సగటున రోజులకు 2,617 సార్లు ఫోన్ ను టచ్ చేస్తారు. కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లపై అమెరికాలో ఈ సర్వే నిర్వహించారు. అధిక సమయం స్మార్ట్ ఫోన్ వాడేవారు ఏకంగా 5,427 సార్లు స్క్రీన్ మీద స్వైప్ చేయడం చేస్తుంటారని సర్వేలో తేలింది. తక్కువగా యూజ్ చేసేవారు మొబైల్ లో సగటున 76 సార్లు ఏదో ఒక పనిలో నిమగ్నం కాగా, టాప్ టెన్ యూజర్లు సగటున 132 సందర్భాలలో ఒకేరోజులో యాప్స్ వినియోగించడం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వంటివి చేస్తుంటారు. ఉదయం 7 గంటలకు మొబైల్ వాడకం మొదలుపెట్టే యూజర్లు డిన్నర్ సమయంవరకూ అప్పుడప్పుడూ గ్యాప్ ఇచ్చి ఫోన్ కోసం సమయాన్ని వెచ్చిస్తుంటారు. 87 శాతం యూజర్లు అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటలలోపే కనీసం ఒక్కసారి అయినా ఫోన్ అప్ డేట్స్ చెక్ చేసుకుంటారని సర్వేలో వెల్లడైంది. ఫేస్బుక్ యూజ్ చేసేవారు 15 శాతం ఉండగా, మరో 11 శాతం యూజర్లు ఇతర యాప్స్ ద్వారా ఛాటింగ్ చేస్తుంటారు. మెస్సేజ్ యాప్ ను 26 యూజర్స్ వాడుతుండగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా 22శాతం మంది ఉంటున్నారని సర్వే బృందం వివరించింది. -
రాష్ట్రంలో మరో మూడు ఎస్సీ స్టడీ సర్కిళ్లు
షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులు, అభ్యర్థులకు పోటీపరీక్షల్లో శిక్షణనిచ్చేందుకు కొత్తగా ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో స్టడీసర్కిళ్ల బ్రాంచీలను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటి ద్వారా ఎస్సీ అభ్యర్థులకు బ్యాంకింగ్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ అందించనున్నారు. ఈ ఆర్థికసంవత్సరం (2016-17) నుంచే వీటి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ.90 లక్షలు మంజూరు చేసిందని బుధవారం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బి.మహేశ్దత్ ఎక్కా తెలిపారు. -
‘సజీవ సమాధి’పై అధ్యయన కమిటీ
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో భాగంగా మట్టి పెళ్లలు మీద పడడంతో ఏడుగురు సజీవ సమాధైన సంఘటనపై కార్పొరేషన్ అధికారులు నలుగురు సభ్యుల అధ్యయన కమిటీని నియమించారు. విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ పాండురంగారావు, స్ట్రక్చర్ ఇంజినీర్లు ఆంజనేయప్రసాద్, వేణుప్రసన్న, జి.శ్రీనివాసరావుతో కమిటీ వేశారు. ఈ కమిటీతో పాటు డీఆర్వో నాగబాబు, నగరపాలక సంస్థ సీపీ ధనుంజయరెడ్డి తదితరులు మంగళవారం ప్రమాదం జరిగిన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు. అనంతరం ప్రమాద స్థలానికి పశ్చిమ వైపు ఉన్న పంచ్ హోటల్తో పాటు ఐదు భవనాలకు ప్రమాదం జరుగుతుందేమోననే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటిల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. లేడీస్ హాస్టళ్లలోని విద్యార్థినులను సైతం పంపించేశారు. ల్యాబ్ నుంచి నివేదిక రాగానే భవనాల్లోకి మళ్లీ అనుమతించాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు. బుధవారం పంచ్ హోటల్ స్థలంలోని కొంత భాగాన్ని కూల్చివేయాలని నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులకు కమిటీ సూచించినట్లు తెలిసింది. గోడ కూలిన వైపు నిర్మాణ స్థలంలో రిటైనింగ్ వాల్ నిర్మించాలని కూడా సూచించింది. అయితే బిల్డర్తో పాటు, టెక్నికల్ పర్సన్, స్ట్రక్చరల్ ఇంజినీర్ల లెసైన్సు రద్దు చేస్తూ నగర కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో దీన్ని ఎవరు నిర్మించాలనే దానిపై చర్చించి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం కమిటీ నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశమై పలు విషయాలపై చర్చించింది. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి గుంటూరు నగరంలోని బిల్డర్లు, కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు జీవో నంబరు 16 ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె వివరించారు. కార్మికులకు హెల్మెట్లు వంటి సేఫ్టీ వస్తువులను తప్పనిసరిగా అందించాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. -
దక్షిణ కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. భారత వాతావరణ అధ్యయన విభాగం తొలిసారిగా దక్షిణ కర్ణాటక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. మొత్తం 30 జిల్లాలకుగాను 26 జిల్లాల్లో 40 డిగ్రీ సెల్సియస్ను మించిన ఉష్ణోగ్రతలున్నాయి. అత్యధికంగా బళ్లారిలో 45.1 డిగ్రీలు నమోదైంది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగొచ్చంటూ బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కొలారు, రామనగర, చిక్కబళాపుర తుమకూరు, మైసూరు, మండ్య, చామరాజనగర, దావణగెరె, చిత్రదుర్గ,శివమొగ్గ, హాసన్, కొడుగుజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధ్యయన బృందంలో రాజన్
దావోస్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అధ్యయనానికి ఏర్పాటయిన ప్రత్యేక కర్తవ్య నిర్వహణా బృందంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సభ్యునిగా నియమితులయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ బ్యాంకర్లు, విధాన నిర్ణేతలు ఉన్నారు. ఈ మేరకు జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డబ్ల్యూఈఎఫ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల పాత్ర, ఆర్థిక రెగ్యులేటరీ సంస్కరణలు వంటి అంశాలపై చర్చిస్తుంది. తమ సమగ్ర అధ్యయన నివేదికను ఈ బృందం 2017 జనవరిలో జరిగే డబ్ల్యూఈఎఫ్ 47వ వార్షిక సదస్సులో సమర్పిస్తుంది. -
దేశ రాజధానిలో మరో దారుణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి అనంతరం ఒక బ్యాగులో కుక్కి పడేసిన కిరాతక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందేహాస్పదంగా కనపించిన సంచిని పోలీసులు తనిఖీ చేసినపుడు విషయం బయటపడింది. పోలీసులు అందించిన వివరాల ఢిల్లీలో మయూర్ విహార్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఇ-రిక్షాలో పడి ఉన్న బ్యాగు పెట్రోలింగ్ పోలీసుల కంటపడింది. దాన్ని పరిశీలించినపుడు డీ కంపోజ్ అయిన యువతి మృతదేహాన్ని గొన్నారు. అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేసి వుంటారని అనుమానిస్తున్నారు. సంఘటన జరిగి 24 గంటలు దాటి వుంటుదని భావిస్తున్నారు. మరోవైపు జీన్ ప్యాంట్, కుర్తా, మెడచుట్టు స్కార్ఫ్ ధరించి వున్న యువతికి సంబంధించి మరే సమాచారం అందుబాటులో లేదన్నారు. అత్యాచారం, హత్యకేసు నమోదు చేసిన పోలీసులు రిక్షా డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నామన్నారు. అయితే ఈ హత్యకు తనకు ఏమీ సంబంధంలేదని ఇ-రిక్షా డ్రైవర్ చెబుతున్నాడు. ఒక వ్యక్తి మెట్రో రైల్వేస్టేషన్ కి వెళ్లాలని ఆటోను కిరాయికి మాట్లాడుకొన్నాడు. తాను వెనకాలే బైక్ మీద వస్తానని చెప్పి ఉడాయించాడని తెలిపాడు. అతని కోసం వెదుకుతున్న క్రమంలో పోలీసులు బ్యాగ్ను స్వాధీని చేసుకున్నారన్నాడు. -
అశ్లీలంలో ఐడీల గుట్టు!
* ‘స్టఫ్ మై స్టాకింగ్స్’ పుస్తకం ఆధారంగా మెయిల్ ఐడీల సృష్టి * నిఘా వర్గాలకు చిక్కకుండా రూపొందించిన ఐఎం ఉగ్రవాదులు * పుస్తకం వివరాలను ఎట్టకేలకు గుర్తించిన దర్యాప్తు అధికారులు సాక్షి, సిటీబ్యూరో: దిల్సుఖ్నగర్ లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు సమాచారమార్పిడికి వినియోగించిన ఐడీలను అశ్లీల సాహిత్య పుస్తకం ఆధారంగానే సృష్టించినట్లు తేలింది. దాదాపు ఏడాదికి పైగా ఈ పుస్తకం పేరు, ఇతర వివరాల కోసం ఆరా తీసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఎట్టకేలకు అది ‘స్టఫ్ మై స్టాకింగ్’గా గుర్తించాయి. పాకిస్థాన్లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హైదరాబాద్ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించాడు. ఈ బాధ్యతల్ని తన సోదరుడు యాసీన్ భత్కల్కు అప్పగించాడు. ఆపరేషన్ పూర్తి చేసేందుకు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, జకీ ఉర్ రెహమాన్ అలియాస్ వఖాస్లను రంగంలోకి దింపాడు. సమాచారమార్పిడికి ఫోన్లపై ఆధారపడితే తేలిగ్గా నిఘా వర్గాలకు దొరికే ప్రమాదం ఉందని వాటికి పూర్తి దూరంగా ఉన్నారు. కేవలం ఈ-మెయిల్తో పాటు నింబస్, పాల్టాక్ వంటి సోషల్ మీడియాలను వినియోగించాలని రియాజ్ సూచించాడు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించడంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పేర్లను వినియోగించి వీటిని సృష్టించుకుంటే వాటిపై నిఘా వర్గాల కన్ను పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్లో తన మెయిల్ ఐడీ నుంచి మిగతా వారికి ఓ మెయిల్ పంపాడు. అందులో పీడీఎఫ్ ఫార్మెట్లో ఉన్న ఓ పుస్తకాన్ని జతచేసి, అందులోని ప్రతి పది పేజీలను ఒక్కో సభ్యుడికి కేటాయిస్తూ సమాచారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదం వినియోగించి ఐడీని సృష్టించుకోవాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నెంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు. ప్రతి నెల రోజులకు కచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలి. ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందరి దగ్గరా ఉన్న నేపథ్యంలో ఎవరి ఐడీ ఏమిటి? అనేది మిగతా వారికి తేలిగ్గా తెలిసేది. ఈ రకంగా నిఘా వర్గాలకు ఏ మాత్రం అనుమానం రాకుండా కమ్యూనికేషన్ సాగించారు. ఎక్కువగా సంప్రదింపులు జరిపిన వారు ఎక్కువ ఐడీలు, తక్కువగా జరిగిన వారు తక్కువ ఐడీలు సృష్టించుకున్నారు. 2013లో యాసీన్ భత్కల్ సహా మిగిలిన ఉగ్రవాదులు అరెస్టయినప్పుడు ఓ పుస్తకం ఆధారంగా ఐడీలు సృష్టించినట్టు బయటపడింది. అయితే అది ఏ పుస్తకం అనేది ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో అనేక కోణాల్లో లోతుగా అధ్యయనం చేసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఆ పుస్తకం ఇంటర్నెట్లో లభిస్తున్న ‘స్టఫ్ మై స్టాకింగ్స్’గా గుర్తించాయి. ఎవరు, ఏ ఐడీలు వాడారంటే..? .... రియాజ్ భత్కల్ (సూత్రధారి): lovesam361@yahoo.com, patarasingh@yahoo.com, coolallz@yahoo.com, dumzum@paltalk.com. యాసీన్ భత్కల్ (కీలక పాత్రధారి): halwa.wala@yahoo.com, jankarko@yahoo.com, a.haddad29@yahoo.co, hbhaddur@yahoo.com, khalid.k@Nimbuzz.com హడ్డీ (సహాయ సహకారాలు అందించాడు): khalid.k@Nimbuzz, spentthose11@yahoo.com, tashan99@paltalk.com, spentthose@nimbuzz.com మోను (ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద బాంబు పెట్టాడు): laho0@yahoo.com వఖాస్ (107 బస్టాప్ వద్ద బాంబు పెట్టాడు): Ubhot4u@yahoo.com వీరు వాడిన ఇతర ఐడీలు: Jamesusually10, menothing1, davidthapa77, menothing1 (ఇవన్నీ నింబస్లో), kul.chitra@yahoo.com, muthumamu80@yahoo.com, jankarko@yahoo.com -
స్టడీ సెంటర్లకు సేవలు కొనసాగించాలి: హైకోర్టు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో తెలుగు, అంబేద్కర్ యూనివర్సిటీల సేవలు నిలిపివేయడంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ అంశంపై 'సాక్షి' కథనానికి స్పందించిన న్యాయస్థానం... ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శులు కలిసి మాట్లాడుకోవాలని గతవారమే సూచించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పురోగతి లేకపోవటంతో విద్యార్థుల భవిష్యత్ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న స్టడీ సెంటర్లకు సేవలు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. అలాగే ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల జీతాలను ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని సూచించింది. ఈ వివాదాన్ని ఎనిమిది వారాల్లోగా తెల్చాలని కేంద్ర హోంశాఖకు ఆదేశిస్తూ, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఆంధ్రప్రదేశ్లోని క్యాంపస్లకు తన సేవల్ని నిలిపేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జారీచేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీలోని క్యాంపస్లకు గతంలో మాదిరిగా యథాతథంగా తన సేవల్ని కొనసాగించేలా తెలుగు వర్సిటీని ఆదేశించాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి జి.కన్నందాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ను ప్రతివాదిగా పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం ప్రాంతాల్లో క్యాంపస్లు ఉన్నాయని, ఇందులో 348 మంది విద్యార్థులు చదువుతున్నారని, అలాగే బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయం తన సేవల్ని ఆంధ్రప్రదేశ్లో క్యాంపస్లకు నిలిపేయడం వల్ల వీరంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన విషయం తెలిసిందే. -
సంక్షేమంలో సంక్షోభం !
- జిల్లా కేంద్రంలో చదివే బీసీ విద్యార్థులకు తప్పని తిప్పలు - కళాశాల వసతిగృహాలు సరిపడా లేక ఇక్కట్లు - ఉన్న హాస్టళ్లలోనూ పేదలకు దక్కని స్థానం ! - అయినవారికే అందలమనే ఆరోపణలు - బాలబాలికల సమస్యలు పట్టని అధికారులు ఇందూరు : విద్యనభ్యసించేందుకు దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే పేద విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునేలా ఉచితంగా భోజనం, అన్ని వసతులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కళాశాల వసతిగృహాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సరిపడా వసతిగృహాలు ఉన్నప్పటికీ బీసీ విద్యార్థులు మాత్రం సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు. బీసీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండగా, బాల, బాలికలకు ఒక్కో హాస్టల్ చొప్పున మాత్రమే ఉన్నారు. జిల్లాలోని 36 మండలాలకు చెందిన అనేక మంది బీసీ విద్యార్థులు జిల్లా కేంద్రంలో చదువుకుంటున్నారు. వీరు ప్రతి రోజు మారుమూల ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి రావడం, తిరిగి ఇంటికి వెళ్లేసరికి సమయమంతా బస్సుల్లోనే గడుస్తోంది. దీంతో కళాశాల వసతిగృహంలో ఉండేందుకు పలువురు విద్యార్థులు దరఖాసు చేసుకున్నారు. సుభాష్ నగర్లో ఉన్న బాలికల వసతిగృహంలో 100 సీట్లకు గాను ఇప్పటికే 106 మంది విద్యార్థులు ఉన్నారు. మరో 60 మంది ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాందేవ్వాడలోని బాలుర వసతిగృహంలో 200 సీట్లు ఉండగా అవి కూడా భర్తీ అయ్యాయి. ఇంకా చాల మంది విద్యార్థులు తమకు సీటు కావాలని అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. ప్రజావాణిలో సైతం ఈ సమస్యపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అరుుతే ఈ హాస్టళ్లలో ఇప్పటికే పరిమితికి మించి సీట్లు భర్తీ చేశామని, కొత్తగా ఇంకెవరికీ అవకాశం ఇవ్వలేమని బీసీ సంక్షేమాధికారులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది బాలబాలికలు ఇంకా సీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సీట్లు ఖాళీగా ఉన్నా, అందులో బీసీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంధిత శాఖల అధికారులు ఒప్పుకోవడం లేదు. చర్యలు చేపట్టని అధికారులు... జిల్లా కేంద్రంలో మరో రెండు కళాశాల వసతిగృహాలు అవసరం ఉన్నా వాటి కోసం బీసీ సంక్షేమాధికారులు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. కనీసం ఉన్నతాధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు. ప్రతి సంవత్సరం ఈ సమస్య ఎదురవుతున్నా ప్రత్యామ్నాయ మార్గాలు చూపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏటా తెలిసిన వారికి సీట్లిచ్చి, అసలైన పేద వారికి సీట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. తద్వారా చాల మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు ఈ రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. బాలికలకు మరో హాస్టల్ నిర్మిస్తున్నాం ‘జిల్లా కేంద్రంలో బాలుర, బాలికల కళాశాల వసతిగృహాలు సరిపడా లేవు. ఉన్న వసతిగృహాల్లో సీటు కోసం చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. సీట్లు లేకపోవడంతో వారికి న్యాయం చేయలేకపోతున్నాం. అయితే కోటగల్లిలో నూతనంగా బాలికల వసతిగృహాన్ని నిర్మిస్తున్నాం. అది పూర్తయితే బాలికల సమస్య సగం వరకు తీరుతుంది.’ - శ్రీనివాస్రెడ్డి, ఏఎస్డబ్ల్యూఓ, నిజామాబాద్ -
వానతో పొత్తుకు సై
ఓ పక్క... వాన చినుకుల చిటపట. మరో పక్క... కుంపటిలో మొక్కజొన్నపొత్తుల చిటాపటా. రెయినీ సీజన్లో... కామన్ సీన్ ఇది. కానీ ఇప్పుడు... మొక్కజొన్న స్థానాన్ని స్వీట్కార్న్ కొట్టేస్తోంది! ఆవిరిపై కాసేపు ఉడికిస్తే చాలు... స్వీట్ అండ్ హాట్ స్టఫ్ రెడీ అంటుంది. ఆ స్టఫ్తో పకోడీలా, సమోసాలా, కర్రీ టోస్టా, కార్న్ చాటా... ఏం చేసుకుంటామన్నది మన చాయిసే. స్వీట్కార్న్ మెంతి పకోరా కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - మూడు కప్పులు (మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి); మెంతి ఆకులు - కప్పు (ఆకులు శుభ్రం చేసి బాగా కడిగి ఉడికించాలి); ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; అల్లం తురుము - టీ స్పూను; కొత్తిమీర తరుగు - పావు కప్పు; సెనగ పిండి - 3 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; కార్న్ఫ్లోర్ - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి తగినంత నూనె పోసి కాగనివ్వాలి ఒక పాత్రలో స్వీట్కార్న్ ముద్ద, ఉడికించిన మెంతి ఆకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి సెనగ పిండి, బియ్యప్పిండి , కార్న్ఫ్లోర్ జత చేసి మిశ్రమం మరోసారి కలపాలి. (నీళ్లు పోయకూడదు బాణలిలో నూనె కాగిందో లేదో చూసుకుని, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి టొమాటో కెచప్తో స్వీట్ కార్న్ మెంతి పకోరాలను వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ చాట్ కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - 2 కప్పులు; ఉల్లి తరుగు - పావు కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; నిమ్మరసం - 2 టీ స్పూన్లు; కారం - పావు టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు - తగినంత; అలంకరణ కోసం... కొత్తిమీర తరుగు - కొద్దిగా; సన్న కారప్పూస - కొద్దిగా. తయారీ: స్వీట్ కార్న్ గింజలను ఆవిరి మీద ఉడికించాలి ఒక పాత్రలో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి నిమ్మరసం. చాట్ మసాలా జత చేసి మరోమారు కలపాలి చిన్న చిన్న బౌల్స్లో వేసి పైన కొత్తిమీర తరుగు, సన్న కార ప్పూసలతో అలంకరించి వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ కర్రీ టోస్ట్ కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 10; స్వీట్ కార్న్ - కప్పు; ఉల్లి తరుగు - పావు కప్పు; నిమ్మరసం - టీ స్పూను; జీలకర్ర - పావు టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; గరం మసాలా - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; నూనె - తగినంత తయారీ: ముందుగా స్వీట్ కార్న్ గింజలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి వేయించాలి పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి కొద్దిగా వేయించాలి ఉల్లి తరుగు జత చేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి స్వీట్ కార్న్ ముద్ద, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ఐదు నిమిషాలయ్యాక దించేయాలి నిమ్మరసం, కొత్తిమీర తరుగు జత చేయాలి ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ మీద సమానంగా పరవాలి వేడి చేసిన పెనం మీద వీటిని రెండు వైపులా బటర్ వేసి కాల్చాలి టొమాటో కెచప్తో వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ సమోసా కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు - కప్పు; మైదా పిండి - కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - గుప్పెడు; చనా మసాలా పొడి - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత తయారీ: బాణలిలో మూడు టీ స్పూన్ల నూనె వేసి దింపేయాలి ఒక పాత్రలో మైదా పిండి, కాచిన నూనె, ఉప్పు వేసి బాగా కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండి మాదిరిగా బాగా కలిపి పక్కన ఉంచాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక స్వీట్ కార్న్ గింజలు వేసి వేయించాలి పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, పుదీనా ఆకుల తరుగు, చనా మసాలా పొడి, ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలిపి తీసి పక్కన ఉంచాలి స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి కలిపి ఉంచుకున్న మైదా పిండి ని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీ మాదిరిగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా కొద్దిగా కాల్చి తీసి దానిని రెండుగా మధ్యకు కట్ చేయాలి. (అర్ధ వ్యాసంగా వస్తుంది) ఒక భాగాన్ని తీసుకుని దానిని కోన్ మాదిరిగా చుట్టి, అందులో తయారుచేసి ఉంచుకున్న కార్న్ మిశ్రమం కొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి ఇలా అన్నీ తయారుచేసుకోవాలి నూనె కాగాక వీటిని ఒకటొకటిగా వేస్తూ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. చట్పటా కార్న్ కావలసినవి: స్వీట్ కార్న్ - కప్పు; వేయించిన పల్లీలు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఉల్లి తరుగు - పావు కప్పు (మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి); టొమాటో ప్యూరీ - టేబుల్ స్పూను; టొమాటో తరుగు - 2 టేబుల్ స్పూన్లు (చిన్న చిన్న ముక్కలుగా తరిగినవి); అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; పంచదార - చిటికెడు; నిమ్మరసం - అర టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు; ఉప్పు - కొద్దిగా; అలంకరణ కోసం... కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు; టొమాటో తరుగు - 2 టీ స్పూన్లు తయారీ: బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లి ముద్ద వేసి దోరగా వేయించాలి అదే బాణలిలో పల్లీ ముక్కలు, టొమాటో ప్యూరీ, టొమాటో ముక్కలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, పంచదార, ఉప్పు, పావు కప్పు నీళ్లు వేసి బాగా కలిపి నాలుగైదు నిమిషాలు సన్న మంట మీద ఉంచి కలుపుతూండాలి నిమ్మరసం జత చేసి మరోమారు కలిపి దింపేయాలి చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుని వేడివేడిగా అందించాలి. సేకరణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై -
ఉద్యోగాలు ఇప్పిస్తామని సాఫ్ట్ వేర్ సంస్థ టోకరా
సాఫ్ట్వేర్ శిక్షణా సంస్థపై కేసు నమోదు అమీర్పేట: శిక్షణ.. ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని టోకరా ఇచ్చిందో సాఫ్ట్వేర్ సంస్థ. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సార్నగర్ ఇన్స్పెక్టర్ రమణగౌడ్ కథనం ప్రకారం... భీమవరానికి చెందిన గౌతమి భూపతిరాజు నగరంలోని నిజాంపేటలో ఉంటూ అమీర్పేట కేఆర్కే ఎన్క్లేవ్లో ఏఎస్ఐటీ పేరుతో సాఫ్టవేర్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేశాడు. తమ సంస్థలో ఉన్నతస్థాయి ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి.. ఉద్యోగం కూడా ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నాడు. దీంతో గ్రామీణప్రాంతాల నుంచి వచ్చి పలువురు యువకులు ఏఎస్ఐటీ సంస్థలో చేరారు. సంస్థ నిర్వాహకుడు ఒక్కొక్కరి వద్ద రూ.25 వేలు నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేశాడు. శిక్షణ పూర్తైఏడాదైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితులు పట్టాభి, వినోద్ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు 123 మంది ఉన్నట్టు తెలిసిందని, వీరు 15 మంది తమకు ఫిర్యాదు చేశారని ఇన్స్పెక్టర్ తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిచ్చెక్కించిన పులిబొమ్మ
తంపా: ఒక బాలుడు తెచ్చుకున్న పులిబొమ్మ.. తంపా విమానాశ్రయ అధికారులకు తలపోటు తీసుకొచ్చింది. ఆ వెంటనే రిలీఫ్ ఇచ్చి సరికొత్త ఆలోచనకు ప్రాణంపోసి వారిలో నవ్వులు పూయించింది. ఓవెన్ అనే ఆరేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి హ్యూస్టన్ వెళ్లేందుకు తంపా విమానాశ్రయానికి వచ్చాడు. అయితే, తన వెంట తెచ్చుకున్న హాబ్స్ అనే పులిబొమ్మ పోగొట్టుకున్నాడు. దీంతో అతడు బిక్కమొఖం పెట్టుకొని ఏడుపు మొదలుపెట్టాడు. ఏం చేయాలో పాలుపోక తల్లి దండ్రులు విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా కలిసి ఎయిర్ పోర్ట్ మొత్తం జల్లెడ పెట్టారు. ఒక సాహసయాత్ర మాదిరిగా చేసి చివరికి చిన్న పిల్లలు ఆడుకునే ప్రాంతంలో దానిని గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద సాహసయాత్రగా చేసిన ఈ కార్యక్రమాన్ని 'ఎడ్వంచర్' అనే పేరుతో అప్పటికప్పుడు డాక్యుమెంటరీ రూపొందించారు. పులిబొమ్మ హాబ్స్తో ఫొటోలు దిగారు. ఆ పిల్లాడికి చూపించి సంతోష పెట్టారు. ఎట్టకేలకు ఓవెన్ తిరిగి తనకిష్టమైన హాబ్స్తో హ్యూస్టన్ వెళ్లాడు. -
ఇంటిగ్రేటెడ్ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు విముఖత
సొంత గుర్తింపును కోల్పోతామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీశాఖల వ్యతిరేకత సాక్షి, హైదరాబాద్: అన్ని సంక్షేమశాఖలకు సంబంధించి సమీకృత అధ్యయన కేంద్రాలను (ఇంటిగ్రేటెడ్ స్టడీ సెంటర్లు) ఏర్పాటుచేయాలనే రాష్ర్ట ప్రభుత్వ ఆలోచనకు ప్రతిపాదన దశలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ ఒకే చోట శిక్షణనివ్వాలనే కొత్త ఆలోచనపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడం లేదు. ఈ నెల 8న ‘మీటింగ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ స్ట్రీమ్లైనింగ్ వెల్పేర్ డిపార్ట్మెంట్’ పేరిట నిర్వహించిన మంత్రుల బృందం భేటీలో అన్ని వర్గాల విద్యార్థులకు కలిపి ఒకే స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలనే సూచన వచ్చింది. ముందుగా హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 400 మంది విద్యార్థులకు ప్రయోగాత్మకంగా స్టడీ సెంటర్ను మొదలుపెట్టి, ఆ తర్వాత వాటిని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే తమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీసెంటర్లకు మంచి గుర్తింపు ఉన్నందున, తమ ప్రత్యేక ముద్ర పోతుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. అదీగాకుండా తమకు వస్తున్న కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులపై ఆధిపత్యం పోతుందనే భావనతో ఈ అధికారులున్నట్లు చెబుతున్నారు. -
వీళ్లు జనం నాడి పట్టేస్తారు!
సర్వేలకు టెక్నాలజీని జోడించిన స్టడీ ఎన్ సర్వే, క్యూథియరీ స్టార్టప్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సర్వే అనగానే తెల్ల కాగితాలో, పుస్తకాలో చేత పట్టుకొని.. ఇంటింటికీ తిరిగి చెప్పిన వాటిని రాసుకోవడమేనని అనుకుంటాం. కానీ పరిస్థితులు మారుతున్నాయి. కొత్తగా కంపెనీ పెట్టాలన్నా.. కొత్త ఉత్పత్తుల్ని ప్రారంభించాలన్నా.. అంతెందుకు తమ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి జనాలేమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ సర్వేనే గతి. అందుకే దీన్ని తెల్లకాగితాలకే పరిమితం చేయకుండా టెక్నాలజీని జోడించాయి హైదరాబాదీ కంపెనీలు స్టడీ ఎన్ సర్వే, క్యూథియరీ బ్రోస్. ఆ వివరాలే ఇవి.... సర్వేతోనే సరిపెట్టం... కొత్త కంపెనీ పెట్టే ముందు అది ఎక్కడ పెడితే సక్సెస్ అవుతుంది? మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రొడక్ట్ ప్రజలకు చేరువ కావాలంటే ఏం చేయాలి? వంటి మార్కెట్ స్థితిగతుల్ని సర్వే చేయడమే ‘క్యూథియరీ బ్రోస్’ పని. అడ్వర్టయిజింగ్, పొలిటికల్, సోషియో ఎకనమిక్, ప్రొడక్ట్స్, మార్కెట్ విభాగాల్లో ఖఖీజిౌ్ఛటడఛటట.ఛిౌఝ సర్వే చేస్తుంది.. అని చెప్పారు కంపెనీ ఫౌండర్ రవిశంకర్ బొజ్జంకి. ‘సర్వేతోనే మా పని అయిపోదు. మా కస్టమర్ల వ్యాపారాలు మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి? వారి ఉత్పత్తుల్లో వినియోగదారులు కోరుతున్న మార్పులేంటి? పోటీదారులు ఎలాంటి ఆఫర్లు, ప్రొడక్ట్లను విడుదల చేస్తున్నారు? నకిలీల ప్రభావం? వంటి అన్ని కోణాల్లో సూచనలనూ ఇస్తాం. ప్రస్తుతం తయారీ రంగ కంపెనీలకు సంబంధించిన సర్వేలను.. అది కూడా ఇంటర్వ్యూ విధానంలో చేస్తున్నాం. త్వరలోనే ఇతర విభాగాలకూ విస్తరిస్తాం’ అని వివరించారాయన. సర్వే స్థాయిని బట్టి ధర రూ.25 వేల నుంచి లక్షన్నర వరకు ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలలో పలు ప్రాజెక్ట్లను సంస్థ పూర్తి చేసింది. 2014 ఎలక్షన్స్ ఫలితాలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్కు కూడా సర్వేలు చేసిచ్చామని రవిశంకర్ చెప్పారు. త్వరలోనే యాప్ ద్వారా సర్వే.. సర్వేల్లోనూ మార్పులు తేవటానికే రూ.5 లక్షల పెట్టుబడితో 2014 డిసెంబర్లో ‘స్టడీ ఎన్ సర్వే’ను స్థాపించామన్నారు సంస్థ సీఈఓ రాహుల్. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే.. ట్యాబ్లెట్స్ ద్వారా సర్వే చేస్తుంది. వాటి తాలుకా రిపోర్ట్లు విభాగాల వారీగా మేనేజ్మెంట్కు ఒక్క క్లిక్తో వెళ్లిపోతాయి. ‘‘ఇప్పటివరకు హైదరాబాద్లో ప్రసాద్ ఐమ్యాక్స్, రాయల్ రీఫ్ హోటల్, వీఎల్సీసీ సంస్థలకు సర్వే చేసిచ్చాం. సర్వే స్థాయిని బట్టి నెలకు రూ.3-10 వేల వరకూ ధరలుంటాయి. విద్యా సంస్థలకు ఉచితంగానే సేవలందిస్తున్నాం. ‘‘మణిపాల్లోని టాంపీ, చెన్నైలోని గ్రేట్లెగ్స్ వంటి సుమారు 15 విద్యా సంస్థలకు సర్వే చేసిచ్చాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ముంబైకి చెందిన ఓ టెక్నాలజీ కంపెనీ రూ.60 లక్షల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. వచ్చిన పెట్టుబడులతో త్వరలోనే యాప్ ద్వారానే సర్వే చేసే విధానాన్ని తీసుకొస్తాం. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో సేవలు అందుబాటులో ఉండగా.. ఫండింగ్ అనంతరం ఇతర నగరాలకూ విస్తరిస్తాం’’ అని వివరించారు రాహుల్.. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
వాహనం ఢీకొని ఇద్దరు మృతి
వైఎస్సార్ జిల్లా(సిద్ధవటం): కడప- చెన్నై రహదారిపై కనుమలపల్లి వద్ద మోటార్ బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు. -
నర్సరీ చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా వ్రపర్తించిన క్యాబ్ డ్రైవర్ అరెస్టు
న్యూఢిల్లీ: నర్సరీ చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గురువారం ఆ బాలిక పట్ల క్యాబ్ డ్రైవర్ మనోజ్కుమార్ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర ఢిల్లీలోని తిమార్పూర్ పరిధిలో చోటు చేసుకొంది. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. ఈమేరకు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివిధ ప్రైవేట్ పాఠశాలల క్యాబ్స్ నడిపించే డ్రైవర్ మనోజ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్కు కూడా బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వేషం వేసి..మోసం చేసి..
విజయనగరం క్రైం: బుధవారం సాయంత్రం 4 గంటల సమయం.. విజయనగరంలోని గాజులరేగ ప్రాంతంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సెంటర్ సమీప సీతం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర్లోని తోట..ముగ్గురువ్యక్తులు అక్కడికి వెళ్లారు. ఇంతలో పోలీసుల వేషంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి ఇద్దరిపైదాడిచేసి రూ.20లక్షలతో ఉండాయించారు. వారివెనుకనే మరో వ్యక్తి పరారయ్యాడు. ఇదేదో సినిమా స్టోరీని తలపించే సంఘటనలా ఉంది కదా! కానీ ఇది సీతం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన యదార్థ సంఘటన. పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని లకడీకాపూల్కు చెందిన కొలిశెట్టిసుబ్బారావు మెడికల్ బిజినెస్ చేస్తుంటాడు. సుబ్బారావుకు విజయవాడకుచెందిన శివఅనే స్నేహితుడు ఉన్నాడు. శివకు హైదరాబాద్కు చెందిన జగదీష్ స్నేహితుడు. సుబ్బారావుకు జగదీష్ను శివ పరిచయం చేశాడు. జగదీష్ తక్కువరేటుకు బంగారాన్ని అందిస్తాడని రూ.20లక్షలు తేవాలని సుబ్బారావుకు శివ ఆశపెట్టాడు. జగదీష్ కూడా అలాగే నమ్మబలికాడు. విజయనగరంలోని ఆంధ్రాయూనివర్సిటీ స్టడీ సెంటర్ ప్రాంతంలో తక్కువ రేటుకు బంగారాన్ని అందిస్తానని జగదీష్ చెప్పడంతో గత రెండు రోజులుగా సుబ్బారావు,శివలు విజయనగరంలో తిరుగుతున్నారు. జగదీష్ ఫోన్చేసి ఫలానా స్థలానికి రావాలని సూచించేవాడు. ఆ మేరకు సుబ్బారావు,శివ ఆర్టీసీ కాంప్లెక్స్లో తిరిగారు. ఈ క్రమంలో బుధవారం మళ్లీ సుబ్బారావు, శివ విశాఖపట్నంలో కారు బుక్చేసుకుని విజయనగరం వచ్చారు. జగదీష్ కూడా వారిని కలవడంతో ముగ్గురూ కలిసి ఆటోలో ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సెంటర్ ప్రాంతంలో దిగారు. సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సుబ్బారావు, శివ, జగదీష్ ముగ్గురు కలిసి స్టడీసెంటర్ సమీప సీతం ఇంజనీరింగ్ కళాశాల దగ్గర గల తోటలోకివెళ్లారు. తక్కువ రేటుకు బంగారం విషయంగురించి ముగ్గురూ మాట్లాడుకుంటున్న సమయంలో జగదీష్ కొంచెం పక్కకువెళ్లి ఫోన్లో కొంతమందికి సమాచారం అందించాడు. అంతే హఠాత్తుగా తోటలోకి పోలీసుల వేషంలో నలుగురువ్యక్తులు ఆటోలో వచ్చి ఎప్పటినుంచిదొంగ వ్యాపారం చేస్తున్నారని చెప్పి సుబ్బారావు, శివలపై దాడిచేశారు. సుబ్బారావువద్దనున్న రూ.20లక్షల నగదును లాక్కుని పరారయ్యారు.వారి వెనుకనే జగదీష్ కూడా పరిగెత్తుకుంటూ పరారయ్యాడు. కొద్దినిమిషాల్లో తేరుకున్న సుబ్బారావు, శివలు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, టూటౌన్ ఇన్చార్జ్ సీఐ కె.రామారావు బాధితులతో కలిసి సంఘటన స్ధలానికి చేరుకున్నారు. బాధితులను డీఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ చేశారు. బాధితులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో పరిశీలించారు. మధ్యవర్తిగా వ్యవహరించిన శివనుఅదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ కె.రామారావు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు భారీస్థాయిలో నగదు అపహరించినట్లు సమాచారం రాగానే డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వాహనాలు తనిఖీ చేసి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ విచారణ చేయాలని ఆదేశాలు జారీచేశారు. -
విచారణకు వచ్చిన ఎంఈవోను చితకబాదారు
కడప : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం బోయనపల్లి గ్రామంలో లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక టీచర్పై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు శనివారం పాఠశాలను ముట్టడించారు. విచారణకు వచ్చిన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) కృష్ణకుమార్ను చితకబాదారు. కాగా వివరాల్లోకి వెళితే విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. లెక్కల టీచర్ అర్తర్ అనునిత్యం వికృత చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థినులు మదనపడేవారు. ఓ విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో వ్యవహారం బయటకు పొక్కింది. దాంతో గ్రామస్తులు కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు సర్థిచెప్పారు. టీచర్ ను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. గత రెండు సంవత్సరాల నుంచి స్కూల్ లో చదువుతున్న బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అతనిపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామన్నారు. -
పెళ్లికి అర్హతలు మారాయా?
పెళ్లి కొడుకు తరఫు వారంటే భయం మాట దేవుడెరుగు... గుర్తిస్తే చాలు అని అనుకుంటున్నారు. ఇది కాలం చేసిన మాయ. కొన్ని సీరియస్ విషయాలు జోకులుగా చలామణి చేయడం మనకో అలవాటు. పెళ్లాం వేధింపులపై వేలకు వేల కార్టూన్లు, జోకులు వస్తుంటాయి. రాష్ట్రంలో కాదు, దేశమంతటా వస్తుంటాయి. కానీ, ఆ జోకులు వేసినంత మాత్రాన అవి అప్రాధాన్యం అయిపోవు. అలాగే పెళ్లి కాని వాడంటే సమాజానికే ఓ కమెడియన్. కానీ ఆ ప్రక్రియ ఒక క్షోభ. ఆ క్షోభతో కొందరు ఆడుకుంటారు, దానిని ఇంకొందరు వాడుకుంటారు. మరికొందరు దాన్ని చూసి నవ్వుకుంటారు. చాపకింద నీరులా జరిగిన మరో విషయం ఏంటంటే... ఆ క్షోభ ఇపుడు అమ్మాయిల కొరతతో రెట్టింపయింది. పెళ్లి కాని ప్రసాదులు ముందుకంటే మరింత చులకనైపోయారు. ఈ నేపథ్యంలో పెళ్లికి మారిన అర్హతల గురించే లోకం పట్టించుకోలేదు. గతంలో... పెళ్లి కొడుకు తరఫు వారంటే భయపడే ఆ రోజుల్లోనూ అమ్మాయిల తరఫు వారికి కొన్ని విషయంలో పట్టింపులుండేవి. అర్హతల లిస్టుండేది. అబ్బాయి ఆదాయం ఎంత? సర్కారు కొలువు అయితే పై ఆదాయమెంత? అని కూడా అడిగేవారు. అంతకు మించి చదువు చేసే వారు. ఇంజినీరింగ్ జాడే లేకపోయినా ‘బియ్యే’ పాసయ్యాడా? అయితే గొప్ప సంబంధమే అనుకునే వారు. ఇవన్నీ సంబంధం దగ్గరగా వచ్చినపుడు అడిగే ప్రశ్నలు. సంబంధాలు వెతకడంతోనే సంస్కారాన్ని వెతికే వాళ్లు. ఉద్యోగం, చదువుకంటే ఆ సంస్కారానికే మార్కులు ఎక్కువగా పడేవి. ఇక పెళ్లి ఫిక్స్ చేసుకునే ముందు మాటల్లో పెట్టి సిగరెట్టు, మందు కావాలా బావా అంటూ కాబోయే మరదళ్లు, బావమరుదులు అడిగే వారు.... అయితే, ఇందులో పెళ్లి కొడుకు యమా జాగ్రత్తపడేవాడు అది వేరే విషయం అనుకోండి! మొత్తానికి ఈ ప్రక్రియల ప్రకారం పెళ్లి తంతు పూర్తయ్యేది. ఈ తంతంతా భవిష్యత్తు భద్రత, గౌరవ మర్యాదల కోసం చేసే వారు. అందులో ఏం తప్పులేదు. ఇపుడు... పెళ్లి కొడుకు తరఫు వారంటే భయం మాట దేవుడెరుగు... గుర్తిస్తే చాలు అని అనుకుంటున్నారు. ఇది కాలం చేసిన మాయ. దీని గురించి పెద్ద బెంగ లేదు కానీ నిగూఢంగా తెరపైకి వచ్చిన వేరే విషయాలే భయపెడుతున్నాయి. పెళ్లి కూతురు తరఫు వారు కాదు పెళ్లి కూతురే ఇంటర్వ్యూ చేస్తోంది. ఉద్యోగం అడగడం కాదు, ఉన్నతోద్యోగం అడుగుతోంది. నెలకు లకారం దాటితేనే గౌరవ మర్యాదలు. అది కూడా తను పనిచేసే ఊర్లో అయితే బెటరట. దీన్ని కూడా కొట్టిపారేయొచ్చు. కానీ, పిల్లాడికి మందు అలవాటుందా? సిగరెట్ అలవాటుందా? అని అడిగేవారే లేరు. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఆస్తి ఎంత? అని అడుగుతున్నారు. ఇక్కడే వరుడు, అతని తరఫువారు జావగారి పోతున్నారు. ఇంటి వద్ద ఏం లేకపోయినా కసితో కష్టంతో పెద్ద ఉద్యోగంలో చేరినా ఆస్తి సంగతే ప్రాధాన్యం అయిపోయింది. అంతేనా... మరో రెండు ఊహించని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అక్కాచెల్లెలు ఉన్నారా? ఉంటే... విల్ కాల్ యు లేటర్ అంటున్నారు. చివరగా అమ్మానాన్నతో కలిసి ఉంటున్నారా అని నేరుగా అడగకపోయినా ఆరా తీసి...తీసి పారేస్తున్నారు... ప్రైవసీ ఇంపార్టెంట్ కదండీ ఈరోజుల్లో! వస్తు డిమాండ్... సరఫరా మధ్య తేడా వల్ల ఈ సమస్యలన్నీ అనుకుని ఆర్థిక శాస్త్రంలోకి వెళ్తారేమో కానే కాదు. పెళ్లి ఇరవై ఏళ్లకే చేసుకోవాల్సిన అవసరం, అగత్యం, ఒత్తిడి లేవు కాబట్టి వీలైనన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అనుకున్నది జరిగితే లక్కే కదా. కాబట్టి అసలు విషయం చెప్పొచ్చేదేంటంటే ‘అమ్మాయిల కొరత’ అనేది భ్రమ. మారిన అర్హతలే అబ్బాయిలకు త్వరగా పెళ్లి కాకపోవడానికి కారణమన్నది నిజం. ఇప్పటికైనా నిజం తెలుసుకుని మేలుకుంటే బెటరేమో! -
‘ఓపెన్’ మిస్టేక్
అంబేద్కర్ వర్సిటీ అధికారుల నిర్వాకం హాల్ టికెట్లపై సమయం ముద్రణలో తప్పిదం పరీక్ష నష్టపోయిన పలువురు విద్యార్థులు తిరిగి నిర్వహించాలంటూ డిమాండ్ తాండూరు/ఆలంపల్లి: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారుల తప్పిదం కారణంగా పలువురు విద్యార్థులు వార్షిక పరీక్ష నష్టపోయారు. ఈ నెల 18 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఈనెల 16 నుంచి విద్యార్థులకు హాల్టికెట్లు అందజేశారు. ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసేందుకు తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాల, వికారాబాద్లోని ఎస్ఏపీ కళాశాలల్లోని కేంద్రాలకు విద్యార్థులు వచ్చారు. తృతీయ సంవత్సరం విద్యార్థుల హాల్టికెట్లపై మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని రాసి ఉంది. వారు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రానికి రాగా.. ఉదయమే పరీక్ష అయిపోయిం దని అధికారులు చెప్పారు. దీంతో విద్యార్థులు అవాక్కయ్యా రు. హాల్టికెట్లో మధ్యాహ్నం 2గంటల నుంచి పరీక్ష ఉన్నట్లుగా రాసిఉంటే ఉదయమే పరీక్షను ఎలా నిర్వహించారని పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. తృతీయ సంవత్సరం విద్యార్థులమైన తాము ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో పాసై ఉన్నత చదువులు చద వాలనుకుంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయామని వాపోయారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. వికారాబాద్ స్టడీ సెంటర్లో 105 మంది విద్యార్థులకు 76 మంది మాత్రమే పరీక్షలు రాశారు. మిగతా 29 మంది పరీక్ష రాయలేకపోయారు. తమ పిల్లల భవిష్యత్తుతో వర్సిటీ అధికారులు ఆటాడుకున్నారని, ఒక పరీక్ష కోసం సంవత్సరం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మా తప్పేమీ లేదు యూనివర్సిటీలోనే సమయాన్ని మార్చారు. విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. కొందరు తెలియని వారు మధ్యాహ్నం పరీక్ష కేంద్రానికి వచ్చారు. ఇందులో మా త ప్పేమీ లేదు. యూనివర్సిటి నుంచే పరీక్ష సమయం మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. - రాజరత్నం, స్టడీసెంటర్ కో-ఆర్డినేటర్, వికారాబాద్ -
స్టడీ కామ్ ప్రసాద్ కన్నుమూత
ప్రముఖ సినిమాటోగ్రాఫర్కుంపట్ల సూర్యదుర్గ వరప్రసాద్ (54) ఆదివారం ఉదయం కన్నుమూశారు. స్టడీకామ్ ప్రసాద్గా ఆయన సుపరిచితులు. గత కొన్ని రోజులుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన రాయవెల్లూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ప్రసాద్ స్వస్థలం. 12 ఏళ్ల వయసులోనే చెన్నయ్ వెళ్లి హరి అనుమోలు వద్ద కెమెరా అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించారాయన. దేశంలోనే పేరెన్నికగన్న స్టడీకామ్ ఆపరేటర్లలో ఒకరిగా ఎదిగారు. మణిరత్నం, రామ్గోపాల్వర్మ చిత్రాలకు స్టడీ కామ్ చేసి, నాగార్జున సూపర్హిట్ ‘నిన్నే పెళ్లాడతా’తో సినిమాటోగ్రాఫర్గా మారారు ప్రసాద్. రజనీకాంత్ ‘నరసింహ’ చిత్రానికి ప్రసాదే కెమెరామేన్. ఇంకా జూనియర్ ఎన్టీఆర్, అర్జున్, వేణు... ఇలా పలువురు హీరోలతో దాదాపు 25 సినిమాలకు పనిచేశారు. ఆయన ఛాయాగ్రహణం అందించిన ‘డేగ’ చిత్రం విడుదల కావల్సివుంది. ప్రసాద్కి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వెలిబుచ్చింది. 1 అమితాబ్, సారిక జోడీగా! అమితాబ్ బచ్చన్, సారిక జంటగా నటిస్తున్నారా? బాలీవుడ్ వార్తల ప్రకారం ఔననే చెప్పాలి. అయితే, ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నది వెండితెర కోసం కాదు. బుల్లితెరపై ఈ జోడీ కనిపించనుంది. 30, 35 ఎపిసోడ్స్గా సాగే ఓ ధారావాహికలో ఈ ఇద్దరూ నటిస్తున్నారు. ఇందులో అమితాబ్కు ఇద్దరు భార్యలు ఉంటారట. మొదటి భార్యకు దూరమైనప్పటికీ, ఆ తర్వాత తమ కుమార్తె ద్వారా దగ్గరవుతారట అమితాబ్. ఆ మొదటి భార్య పాత్రను సారిక చేస్తున్నారు. ఈ ధారావాహికకు అమితాబ్ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ధారావాహిక ప్రసారం కానుందని సమాచారం. -
ముంగిట్లోకి దూరవిద్య
సిద్దిపేట జోన్, న్యూస్లైన్: రోజూ కళాశాలకు వె ళ్లి విద్యను అభ్యసించలేని ఔత్సాహిక విద్యార్థుల కోసం దూరవిద్యను ముగింట్లోకే తీసుకువచ్చే ప్రయత్నానికి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (సీడీఈ) శ్రీకారం చుట్టింది. జిల్లాలో అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులను, గృహిణులను, ఉద్యోగులను ఉన్నత విద్యాధికులుగా తీర్చిదిద్దేందుకు వినూత్న ప్రక్రియను చేపట్టింది. హైదరాబాద్తో అనుసంధానాన్ని తగ్గిస్తూ స్థానికంగా అడ్మిషన్ కేంద్రాల ద్వారా విద్యను అందించి వ్యయప్రయాసలను తగ్గించడమే లక్ష్యంగా సీడీఈ ప్రణాళిక రూపొందించింది. అం దులో భాగంగానే జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి కేంద్రాల్లో అడ్మిషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే నిర్వహించేలా దూరవిద్య అధికారులు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు. అందుకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్ను సంస్కరిస్తూ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ విధానంతో జిల్లాలోని వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది. సిద్దిపేటలోనే అడ్మిషన్ కేంద్రం డిగ్రీ, పీజీ లాంటి కోర్సులను రెగ్యులర్గా చదువుకోలేని ఔత్సహికుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ అనుసంధానంగా ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లు దూరవిద్యను అందిస్తున్నాయి. అందులో భాగంగానే మెదక్ జిల్లా వాసుల కోసం సీడీఈ 2001లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకే ఒక స్టడీ సెంటర్ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు దూరవిద్యలో డిగ్రీ, పీజీతో పాటు డిప్లొమా కోర్సులను అభ్యసిస్తున్నారు. కేవలం స్టడీ కేంద్రంగానే ఉన్న సిద్దిపేట సీడీఈతో జిల్లా విద్యార్థులకు దూరవిద్య సేవలను ఆశించిన స్థాయిలో అందడం లేదన్న వాదనలున్నాయి. మరోవైపు దూరవిద్య విధానంలోని నిబంధనల మేరకు కోర్సులు పూర్తయ్యే వరకు ప్రక్రియ అంత హైదరాద్లోని సీడీఈ ప్రధాన కేంద్రంతోనే కొనసాగుతుంది. ఇది జిల్లా విద్యార్థులకు, గృహిణులకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో రె గ్యులర్ విద్యకు దీటుగా దూరవిద్యను క్షేత్ర స్థాయిలో విస్తృత పరిచి, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను ముఖ్యంగా బాలికలు, మహిళలు, నిరుద్యోగ యువతకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఈ ఏడు సీడీఈ అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కేవలం స్టడీ సెంటర్గా ఉన్న సిద్దిపేటలో తొలిసారిగా అడ్మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దూరవిద్య సేవలను విద్యార్థుల ముంగిట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. అందుకు అనుగుణంగానే సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డిలో అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తు విక్రయాలు, ఫీజుల వసూలు, స్టడీ మెటీరియల్ సరఫరా, తరగతి గదుల నిర్వహణ, హాల్ టికెట్ల జారీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను స్థానికంగానే నిర్వహించేందుకు సీడీఈ భవిష్యత్ ప్రణాళిక రూపొందించింది. ఈ విధానం అమలైతే జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు బీఏ, బీకాంతో పాటు ఎంఏ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఫ్రొఫెషనల్ కోర్సులను పీజీ డిప్లొమా కోర్సులను ఇంటి వద్ద ఉంటూ స్థానికంగా ఉన్న కేంద్రాల ద్వారా దూరవిద్యను అభ్యసించవచ్చు. ఈ విద్య సంవత్సరానికి గాను డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు. జిల్లా ప్రజలకు వరం సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రస్తుతం సిద్దిపేటలో ఒకే ఒక స్టడీ సెంటర్ ఉంది. దూరవిద్య సంస్కరణల్లో భాగంగా జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో పూర్తి స్థాయి అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఈ విధానం ద్వారా విద్యార్థులకు, గృహిణులకు వ్యయప్రయాస తగ్గుతుంది. - వెంకటేశ్వర్లు ( డెరైక్టర్, సీడీఈ) -
వ్యాయామం చేస్తే మంచి మార్కులు!!
క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకు రావాలనుకుంటున్నారా? పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించాలని ఉత్సాహంగా ఉందా? అయితే.. వెంటనే వ్యాయామం మొదలుపెట్టండి. అవును.. టీనేజిలో ఉన్న అమ్మాయిలు ప్రతిరోజూ కాస్తంత వ్యాయామం చేస్తే.. వాళ్లకు సైన్సులో మంచి మార్కులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. వ్యాయామం ఎంత ఎక్కువగా చేస్తే, వాళ్ల పరీక్ష ఫలితాల్లో అంత ఎక్కువ ప్రభావం ఉంటోందని పరిశోధకులు తెలిపారు. 5వేల మంది పిల్లల మీద పరిశోధన చేసిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధరించుకున్నారు. 1991 నుంచి 1992 వరకు ఇంగ్లండ్లో పుట్టిన 14వేల మంది పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని గమనించి మరీ ఈ విషయాన్ని తేల్చారు. యాక్సెలరోమీటర్ అనే పరికరాన్ని వారికి అమర్చి మూడునుంచి ఎనిమిది రోజుల వరకు వారి వ్యాయామాల తీరును లెక్కించారు. ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు సబ్జెక్టులలో వారికి వచ్చిన మార్కులు చూడగా.. సైన్సు మార్కులలో మంచి మెరుగుదల కనిపించింది. అందులోనూ అమ్మాయిలకు ఈ మార్కుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. -
విద్యార్థినిని బలిగొన్న బస్సు
చంపాపేట, న్యూస్లైన్: అతివేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు బస్టాప్లో నిలబడి ఉన్న విద్యార్థినిపైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రక్షాపురం అరుంధతినగర్ కాలనీలో నివసిస్తున్న నల్లా కరుణాకర్, సుధారాణి దంపతులకు ముగ్గురు సంతానం. కరుణాకర్ డీఆర్డీఎల్లో ప్రైవేటు ఉద్యోగి. చిన్న కూతురు కీర్తన ఐఎస్ సదన్ చౌరస్తాలోని సంగం లక్ష్మీబాయి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగా శనివారం కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన కీర్తన సంతోష్నగర్ వైస్రాయి హోటల్ సమీపంలోని బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి చేస్తోంది. అదే సమయంలో కేశవగిరి నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న మిథాని డిపో బస్సు (ఏపీ 11జడ్ 2681) అతివేగంగా దూసుకొచ్చి ఆమె పైనుంచి వెళ్లింది. దీంతో కీర్తన అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ బస్సు దిగి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బస్సును స్వాధీనం చేసుకొని, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
కౌడిపల్లి, న్యూస్లైన్: ఉన్నత చదువులు చదివి ఆదుకుంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో పెద్దల అమావాస్య పండుగ రోజున ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని వెల్మకన్నలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్, మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వడ్ల చంద్రకళ, భూషణం దంపతుల కుమారుడు వడ్ల నాగరాజు(20) మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత ఆదివారం రాత్రి కౌడిపల్లికి చెందిన గొల్ల నాగరాజు, ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ షీలోమార్టిన్లతో కలిసి నాగరాజు తన బైక్పై చేగుంట వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరగ్గా షిలోమార్టిన్ మృతి చెండాదు. అయితే బైక్ వడ్ల నాగరాజు పేరుతో ఉండడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నాగరాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసినా తనకు ప్రభుత్వ ఉద్యోగం రాదనీ, తనవల్ల తన తల్లిదండ్రుల పరువు కూడా పోయిందని మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బహిర్భూమికని వెళ్లిన వడ్ల నాగరాజు ఇంటి వెనుక ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలన్నీ ఓ సూసైడ్ నోట్లో రాసి ఉంచాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ కుమారుడు ఇలా అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో నాగరాజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జునగౌడ్ గ్రామానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. నాగరాజు కుటుంబీకులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వెల్మకన్నలో అంత్యక్రియలు నిర్వహించగా, నాగరాజు స్నేహితులు, మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు భారీగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి అమానుషం
అనంతగిరి, న్యూస్లైన్: చేవెళ్లలో మంత్రి రఘువీరారెడ్డి పర్యటన లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషమని తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ అన్నారు. లాఠీచార్జిలో గాయపడి వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నాయకులు క్రిష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి, చంద్రకాంత్రెడ్డిలను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు కాలరాస్తున్నారన్నారు. విద్యార్థుల ఉద్యమంతోనే గతం లో 14ఎఫ్ నిబంధనను తొలగించారని, దీంతో పోలీసులే లాభపడ్డారన్నారు. అలాంటి పోలీసులు ఉద్యమకారులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యార్థులను పోలీ సులు చితకబాదుతుంటే ఏసీ కారుల్లో కూర్చుని తెలంగాణ మంత్రుల చూస్తూ వెళ్లిపోవడం దారుణమన్నారు. ఇలాంటి మంత్రులకు సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గాయపడ్డ విద్యార్థి నాయకులను పరామర్శించిన వారిలో విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్, నియోజకవర్గ చైర్మన్ నర్సింలు, యూత్ జేఏసీ జిల్లా చైర్మన్ నర్సింలు, నాయకులు కిశోర్, శ్రీకాంత్ తదితరులున్నారు. -
ట్రిపుల్ ఐటీలో కుక్కల బెడద
భైంసా, న్యూస్లైన్ : చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువుదీరిన బాసరలో విద్యార్థుల కోసం మెరుగైన వసతులతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఎన్నో ప్రమాణాలు.. మరెంతో లక్ష్యంతో నిర్మించిన ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఉండాలంటేనే భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. భవ నం చుట్టూ ప్రహరీ లేక కుక్కలు.. పశువులు బెడద వేధిస్తోంది. ట్రిపుల్ ఐటీ ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా విద్యార్థుల సంక్షేమ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిండా నిర్లక్ష్యం.. బాసర ట్రిపుల్ఐటీ కళాశాల చుట్టూ ప్రహరీ లేదు. దీం తో పశువులు, మేకలు, కుక్కలు ట్రిపుల్ ఐటీ ఆవరణలోనే సంచరిస్తుంటాయి. దీనికితోడు మెస్కు చెందిన వ్యర్థ పదార్థాలను కళాశాల ఆవరణలో డంపింగ్ చేస్తున్నారు. వాటి నుంచి వచ్చే దుర్వాసనతోపాటు అక్కడికి కుక్కలు కూడా వస్తుంటాయి. ఇవే కాకుండా ట్రిపుల్ఐటీ చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. అయినా.. విద్యార్థుల సంక్షేమ కోసం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు స్పందించడంలేదు. కళాశాల ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రహరీ నిర్మాణానికి నోచుకోలేదు. ఫలితంగా శుక్రవారం రాత్రి తరగతి గ దుల నుంచి భోజనశాల వైపు వస్తున్న విద్యార్థులపై పి చ్చి కుక్క దాడిచేసింది. 20 మందిని తీవ్రంగా గాయపర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా పిల్లల తల్లిదండ్రులు హై రానా పడ్డారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులు ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైన వారిని హైదరాబాద్ తరలించారు. మరికొందరు త ప్పించుకునే ప్రయత్నంలో కిందపడి గాయపడ్డారు. ఆదివారం మరోమారు దాడికి యత్నం.. శుక్రవారం రాత్రే కుక్క 20 మంది విద్యార్థులను గా యపరిచిన విషయం తెలిసిందే. అయితే.. ఆదివారం రాత్రి సమయంలోనూ మరో కుక్క కళాశాల ఆవరణ లోకి వచ్చింది. దాడికి యత్నించే క్రమంలో విద్యార్థు లు గమనించి పారిపోయేలా ప్రయత్నించారు. ఈ క్ర మంలో కిందపడి విద్యార్థినులు మౌనిక, భవాని గా యపడ్డారు. ఇద్దరికీ స్థానికంగా చికిత్స అందించారు. ఇదిలాఉంటే.. అప్పటికే కళాశాలలోని 60 శాతం మం ది విద్యార్థులు భోజనం చేయగా.. కుక్క ఎప్పుడు వ చ్చి దాడి చేస్తుందోనని భయాందోళనకు గురై రాత్రి 40 శాతం మందిభోజనానికి దూరంగా ఉన్నారు. తేరుకోకుంటే మరోముప్పు.. ట్రిపుల్ఐటీ కళాశాల విద్యార్థులను కుక్క దాడిలో గాయపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం తేరుకోవాల్సి ఉంది. విద్యార్థుల రక్షణపై దృష్టి సారించాలి. ట్రిపుల్ఐటీ క్యాంపస్లో భవనాలపై చాలా చోట్ల తేనె తుట్టెలు పెట్టాయి. ప్రమాదవశాత్తు అవి చెలరేగితే విద్యార్థులు మరోసారి పరుగులు తీయాల్సిందే. నీటి ట్యాంకు ఆనుకుని ఉన్న భవనంలోనూ.. ఆస్పత్రికి వెళ్లే మార్గంలోనూ ఇవి కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు కుక్కలు.. మరో వైపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. సెలవు రోజుల్లో తొలగిస్తే మేలు.. ప్రస్తుతం ట్రిపుల్ఐటీలో 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాల ఆవరణలో తేనె తుట్టెలు పెట్టాయి. ఇప్పుడు వాటిని తొలగించినా ఇబ్బందులు తలెత్తుతాయి. దసరా సెలవుల్లో విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోతారు. అలాంటి సమయంలోనైనా విశాలంగా ఉన్న ట్రిపుల్ఐటీ భవనాల్లో తేనె తుట్టెలను తొలగిం చాలి. ట్రిపుల్ఐటీ కళాశాల ఆవరణలో మూగజీవాలు, గొర్రెలను మేపుతుంటారు. చిట్టడివిని తలపించే కళాశాల ఆవరణను శుభ్రం చేయాలి. ముళ్లపొదలు తొల గించి కళాశాల ఆవరణను చదును చేయాలి. లేనిపక్షంలో విషసర్పాలు తిరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదిస్తాం - నారాయణ, ట్రిపుల్ఐటీ ఓఎస్డీ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం 57 ఎకరాల భూమి సేకరించింది. ఇందులో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రహరీ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ట్రిపుల్ఐటీ చుట్టూ గోడ నిర్మించే విషయంలో ప్రభుత్వానికి మరోసారి నివేదిస్తాం.