ప్రధాన వార్తలు

ఎయిరిండియా ఘటన: బ్లాక్బాక్స్ ఎపిసోడ్లో ట్విస్టులు
279 మంది ప్రాణాలు బలిగొన్న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో కీలకంగా భావిస్తున్న విమానపు బ్లాక్బాక్స్(Air India Black Box) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో డాటా సేకరణ కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఎక్స్క్లూజివ్గా కథనం ప్రచురించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఇదిలా ఉంటే.. బ్లాక్బాక్స్ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కేంద్రం గురువారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దానిని టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్బాక్స్ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్బాక్స్గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్లు 25 గంటలపాటు కాక్పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్బాక్స్లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).AAIB ముందు ఆప్షన్లు ఇవేలక్నోలోని హాల్(HAL) సెంటర్కు పంపడంఅమెరికాలోని ఎన్టీఎస్బీకి (National Transportation Safety Board) జాతీయ రవాణా భద్రతా సంస్థకి పంపడంయూకే లేదంటే సింగపూర్లోని సివిల్ ఏవియేషన్ అథారిటీకి పంపడంబ్లాక్బాక్స్లో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిందని.. ఇక్కడ దానిని రికవరీ చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చని ఏఏఐబీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ డాటా రికవరీ కోసం దానిని అమెరికాకే పంపించే యోచనలో ఏఏఐబీ ఉన్నట్లు సదరు కథనం వెల్లడించింది.ఇదీ చదవండి👉: దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్బాక్స్ ట్విస్ట్!

ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
టెలీ అవీవ్: ఇరాన్తో అమీతుమీ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు బిగ్ షాక్ తగిలింది. నెతన్యాహు తీరుపై ఇజ్రాయెల్ ప్రజలు మండిపడుతున్నారు. తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ ‘త్యాగం’ అని నెతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కరే త్యాగం చేయడం లేదు.. దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కారణంగా ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్కు నష్టం జరుగుతోంది. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరిగింది. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది. నా కుటుంబం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్ వివాహం చేసుకోబోయే అమ్మాయి, నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ ‘హీరో’. పెళ్లి వాయిదా కుటుంబ ‘త్యాగం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మీ కుటుంబాన్ని ఒక త్యాగమేనా?. యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం సమయంలో ఎంతోమంది వైద్యులు నిరంతరం పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. వారు నిజమైన హీరోలు. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే.. మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదాస్పదంగా మారింది. గాజాతో యుద్ధం సమయంలో వివాహం జరగాల్సి ఉండగా.. అప్పుడు యుద్ధం కారణంగా మొదటిసారి వాయిదా పడింది. ఇక, రెండో సారి ఇరాన్తో యుద్ధం కారణంగా వాయిదా పడింది.

'కుబేర' ట్విటర్ రివ్యూ.. హైజాక్ చేసిన ధనుష్
అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న విడుదలైంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో సినిమాను చూశారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుజామున మొదటి ఆట వేశారు. దీంతో సినిమా టాక్ ఏంటి అనేది సోషల్మీడియా ద్వారా టాక్ బయటకు వచ్చేసింది. కుబేరలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతిచోట కుబేర హిట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సోషల్మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ రన్ అవుతుంది..? నాగార్జున, ధనుష్ పాత్రలు మెప్పించాయా..? అనేది చూద్దాంశేఖర్ కమ్ముల అండ్ టీం బ్లాక్ బస్టర్ని అందించారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఫస్టాప్ అదిరిపోయింది అంటూనే సినిమా ప్రాణం, ఆత్మ అంతా సెకండ్ హాఫ్లోనే ఉందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయని తెలుపుతున్నారు. ముఖ్యంగా ధనుష్ ఎంట్రీ సీన్ పట్ల ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు. ధనుష్ మాత్రమే చేయగలిగే పాత్ర అంటూ అభినందిస్తున్నారు. కుబేరలో ధనుష్ ఒక చిరస్మరణీయమైన నటనను కనబరిచాడని, అతను బిచ్చగాడి పాత్రలో జీవించాడంటూ ట్వీట్లు చేస్తున్నారు. కథలో అత్యంత బలంగా ఉన్న పాత్ర నాగార్జునకు దక్కిందని మరికొందరు తెలుపుతున్నారు. ఇందులో రష్మిక కూడా మరో చిరస్మరణీయమైన పాత్రను పోషించిందని కాంప్లీమెంట్స్ దక్కుతున్నాయి.దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందట. చాలా సీన్లకు ఆయన ప్రాణం పోశారని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల రచన, దర్శకత్వం చాలా బాగా వర్కౌట్ అయ్యాయని ప్రేక్షకులు తెలుపుతున్నారు. మొత్తం మీద, కుబేరుడు సినిమా అంతటా బ్లాక్ బస్టర్ అంటూ పోస్ట్లు షేర్ చేస్తున్నారు. సినిమా నిడివి మాత్రమే మైనస్ అంటూనే ఎక్కడా కూడా బోర్ కొట్టదు అంటున్నారు. సినిమా మొత్తం ధనుష్ హైజాక్ చేశాడని, ఇంత అద్భుతంగా ఎలా నటించావ్ బాస్ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఏకంగా 9 రేటింగ్ ఇస్తున్నారు. కొందరైతే 10 ఇవ్వొచ్చు అంటున్నారు. అంతలా ధనుష్ మెప్పించాడని తెలుపుతున్నారు. సినిమా చూసిన ధనుష్ అభిమానులైతే చాలా ఎమోషనల్ అవుతున్నారు. కన్నీళ్లు తెప్పించే సీన్లు చాలా ఉన్నాయంటూ కుబేరకు నేషనల్ అవార్డ్ తప్పకుండా వస్తుందని అభిప్రాయపడుతున్నారు.#Kuberaa [4.5/5] : Sekhar Kammula and team delivered a blockbuster. The first half of the film is good but the life and soul of the film is the second half. The emotional scenes in the second half worked out big time. Dhanush delivered a memorable performance. He just lived in…— Ramesh Bala (@rameshlaus) June 20, 2025#Dhanush – What a Phenomenal Actor!🥹Every Expression, Every Emotion… He Lives the Role! Words Fall Short to Describe His Brilliance🙏🔥Truly a Gifted Gem to Indian Cinema🤞❤️#Kuberaa | #Kubera pic.twitter.com/tQSLRZhVhj— Movies4u Official (@Movies4u_Officl) June 20, 2025#Kuberaa #KuberaaReview #Dhanush #Nagarjuna #ShekharKammula pic.twitter.com/2XX4q8bHia— TollywoodBoxoffice.IN (@TBO_Updates) June 20, 2025#Kuberaa wins your heart, powered by Dhanush’s phenomenal, arguably, career-best performance. Despite minor flaws with length, the film delivers plenty of memorable moments, making it a thoroughly enjoyable watch! ❤️❤️❤️❤️ pic.twitter.com/zqDVjS6owv— LetsCinema (@letscinema) June 20, 2025Mentaloda adhem acting ra babu 🥵 🔥🔥💥💥😭😭 @dhanushkrajaBlock buster #Kuberaa 🔥 🔥 A Must Watch Film Worth Watching 💥💥🔥🔥 #Dhanush pic.twitter.com/cB2oSHgfE2— 𝐃𝐞𝐯𝐚 🛐🛐 (@SudheerJalluri1) June 20, 2025#Kuberaa is the BEST movie in recent times🛐A shekhar kammula Film, A Dhanush’s Masterpiece A Nagarjuna’s ViswaroopamA @ThisIsDSP’s ThandavamWorth every penny, okka scene kuda bore kottaledhu🙏❤️🔥pic.twitter.com/zT2cD04oFU— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 20, 2025After the blockbuster #LoveStory, director @sekharkammula delivers yet another banger for @SVCLLP with #Kuberaa. 💥🔥This winning combo strikes gold once again with powerful storytelling and impactful cinema. A sure-shot BLOCKBUSTER! 🤘👑#SekharKammulasKuberaa pic.twitter.com/vLYFFiBSLA— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 20, 2025#Kuberaa - A WinnerA good first half followed by an emotionally charged second half made the film a good watch. The film started on a slow note but right from Dhanush’s entry sequence, the pace of the film did not drop until the climax. Dhanush delivered one of the his…— Gulte (@GulteOfficial) June 20, 2025#Kuberaa Full Positive response from Telugu shows 🔥#Dhanush's back to back hits in Telugu 🔥🔥 ( #Sir/#Vaathi & Now Kuberaa) @dhanushkraja pic.twitter.com/PyULPDjDMI— Prakash Mahadevan (@PrakashMahadev) June 20, 2025

భారీ సంఖ్యలో ఎయిరిండియా విమానాలు రద్దు
ఢిల్లీ: భారీ సంఖ్యలో విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు అయ్యాయి. నిర్వహణ సమస్యల వల్ల 8 విమానాలను రద్దు చేసింది. 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు పూర్తి రీఫండ్, ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పిస్తునట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.రద్దయిన విమానాలు:AI906 (దుబాయ్–చెన్నై)AI308 (ఢిల్లీ–మెల్బోర్న్)AI309 (మెల్బోర్న్–ఢిల్లీ)AI2204 (దుబాయ్–హైదరాబాద్)రద్దయిన డొమెస్టిక్ విమానాలుAI874 (పుణె–ఢిల్లీ)AI456 (అహ్మదాబాద్–ఢిల్లీ)AI2872 (హైదరాబాద్–ముంబై)AI571 (చెన్నై–ముంబై)కాగా, జూన్ 21 నుంచి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు వెల్లడించింది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత అంతరాయాలతో సతమతమవుతున్న ఎయిరిండియా.. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15 శాతం మేర తాత్కాలికంగా తగ్గించాలని ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది.ఢిల్లీ-నైరోబి, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో జూలై 15 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఢిల్లీ-నైరోబి రూట్లో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు చొప్పున విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.అలాగే.. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియాలోని నగరాలకు కలిపే 16 అంతర్జాతీయ రూట్లలో కూడా విమానా సర్వీసులను తగ్గించారు. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్లలో సర్వీసులను తగ్గించారు.యూరప్లో ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమృత్సర్-బర్మింగ్హామ్, ఢిల్లీ-బర్మింగ్హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్స్టర్డామ్ మార్గాల్లో కూడా విమానాల సర్వీసులను కుదించారు. అలాగే, ఢిల్లీ-మెల్బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా, ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) మార్గాల్లో కూడా సర్వీసులను తగ్గించారు.ఇదిలా ఉండగా, విమాన సర్వీసుల కుదింపుపై ఎయిరిండియా సీఈవో ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. "విమాన ప్రయాణానికి ముందు భద్రతా తనిఖీలను కఠినతరం చేయడం, మధ్యప్రాచ్యంలో గగనతల మార్గాల మూసివేత వల్ల ప్రయాణ సమయం పెరగడం వంటి కారణాలతో ఈ కుదింపులు చేశాం" అని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఆయన ఎయిరిండియా తరఫున ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. జూన్ 25 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్పై వేటు వేసింది. లబూషేన్ గత కొంతకాలంగా పేలవ ఫామ్లో ఉన్నాడు. ఈ కారణంగా అతనికి తొలి టెస్ట్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని సెలెక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ఓ ప్రకటనలో తెలిపారు. లబూషేన్ తమ జట్టులో కీలక సభ్యుడని చెబుతూనే అతని రెండేళ్ల గణాంకాలను ప్రస్తావించాడు. 2023లో 34.91 సగటున పరుగులు చేసిన లబూషేన్.. గతేడాది (2024) తన సగటును (30.93) మరింత దిగజార్చుకున్నాడని అన్నాడు. ఈ ఏడాది సైతం లబూషేన్ ఫామ్ను దొరకబుచ్చుకోలేకపోయాడని తెలిపాడు (4 టెస్ట్ల్లో 16 సగటు). చివరి రెండు ఇన్నింగ్స్ల్లో (డబ్ల్యూటీసీ ఫైనల్) ఓపెనర్గా అవకాశమిచ్చినా దారుణంగా విఫలమయ్యాడని (17,22) అన్నాడు. తొలి టెస్ట్ జట్టు నుంచి తప్పించినా లబూషేన్ టాలెంట్ను గౌరవిస్తూ మున్ముందు పరిశీలిస్తామని తెలిపాడు.మరోవైపు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు కూడా తొలి టెస్ట్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేమని బెయిలీ చెప్పాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా స్మిత్ గాయపడ్డ (చేతి వేలి) విషయాన్ని ధృవీకరించాడు. స్మిత్ సర్జరీని తప్పించుకున్నప్పటికీ.. ఎనిమిది వారాలు చేతికి కట్టుతో ఉండాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. బ్యాటింగ్కు ఇబ్బంది లేకపోతే రెండో టెస్ట్లో (జూన్ 3) స్మిత్ను ఆడించే అవకాశాలున్నాయని అన్నాడు. లబూషేన్, స్మిత్ స్థానాల్లో సామ్ కొన్స్టాస్, జోస్ ఇంగ్లిస్లను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్స్టాస్ గతేడాది భారత్తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో ఆకట్టుకున్నాడు. లబూషేన్ స్థానంలో తొలి టెస్ట్లో అతను ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. స్టీవ్ స్మిత్ స్థానాన్ని మిడిలార్డర్లో ఇంగ్లిస్ భర్తీ చేస్తాడు. ఇంగ్లిస్ ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో ఆడిన తన అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో ఇరగదీశాడు. ప్లేయింగ్ ఎలెవెన్లో మిగతా స్థానాలపై ఆసీస్ ఇంకా ప్రకటన చేయలేదు. జూన్ 25 నుంచి బార్బడోస్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్. ఆసీస్తో తొలి టెస్ట్కు విండీస్ జట్టు: కెవ్లాన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, క్రెయిగ్ బ్రాత్వైట్, మిఖైల్ లూయిస్, జాన్ క్యాంప్బెల్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ ఛేజ్, జోహన్ లేన్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వార్రికన్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్

తోడబుట్టిన బలగం
‘శత్రువులు ఎక్కడో ఉండరు’ అని ఒక సినిమా డైలాగ్. ఇంట్లో టీవీ రిమోట్ కోసం ఫైటింగ్జరిగేది ఆ ‘శత్రువుల’తోనే! ఇంట్లో ప్రతిదానికీ పోటీ ఉండేది ఆ ‘శత్రువుల’ మధ్యనే! ఇంతగా ఫైటింగ్ చేస్తారా.. ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా జాడీ పగలగొట్టేసినప్పుడు, ఆ విషయాన్ని దాచి పెట్టటానికి తోడుదొంగలయ్యేది మళ్లీ ఆ‘శత్రువులే’! వాళ్లెవరంటారా, ఇంకెవరు? తోబుట్టువులు! కొండంత ధైర్యం.. అమెరికాకు చెందిన బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ 395 కుటుంబాలను కలిసి చేసిన అధ్యయన ఫలితాల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ కరువైనప్పటికీ తోబుట్టువులతో బలమైన బంధాలు ఉంటే, కౌమారదశలో నిరాశ, ఆందోళన, ఒంటరితనం అనేవి ఆవరించే అవకాశం 60 శాతం వరకు తక్కువగా ఉంటుందట. తోబుట్టువులు ఉన్నవారు మనోవ్యథల నుంచి వేగంగా కోలుకుంటారు. మానసిక అనారోగ్యాలకు భయపడిపోకుండా ధైర్యంగా పోరాడతారు. సామాజికంగానూ మెరుగైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. అసలు తోబుట్టువులంటూ ఉంటే చాలు.. వాళ్ల బంధం గట్టిగా లేకున్నా వాళ్లు ఉన్నారన్న ధైర్యమే భావోద్వేగాల పరంగా ముఖ్యపాత్ర వహిస్తుందట.మైగ్రేన్లు, రక్తపోట్లు రావు.. తోబుట్టువులుంటే ఉండే ఆ ధీమా బాల్యంతోనే ఆగిపోదు. యవ్వనం, వృద్ధాప్యం వరకూ కూడా మన వెంట వస్తుంది. ఇల్లినాయ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం కనీసం ఒక తోబుట్టువైనా ఉన్న వ్యక్తులు సామాజికంగా గణనీయమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు. బయటి పోటీ ప్రపంచంలో బలమైన వ్యక్తుల మధ్య తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. తోబుట్టువులు మాట్లాడుకుంటారు, విభేదిస్తారు. వాదించుకుంటారు, పోటీ పడతారు, రాజీపడతారు.. ఇవన్నీ కూడా వారికి మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు. ఈ సందర్భంగా వచ్చే ఆలోచనలు, మానసిక పరిపక్వత వంటివి భవిష్యత్తులో ఉద్యోగం, వివాహం, స్నేహం తదితర సంబంధాల్లో వచ్చే సమస్యల పరిష్కారానికి తెలివిడి కలిగిన మార్గాన్ని ఏర్పరుస్తాయట. బ్రిటన్కు చెందిన ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ పరిశోధన కూడా.. తోబుట్టువులతో దగ్గరి సంబంధాలు ఉన్న పెద్దలు జీవితంలో సంతృప్తిగా ఉన్నట్లు కనుగొంది. తోబుట్టువులతో దృఢమైన అనుబంధాలు కలిగి ఉన్న పెద్దలు మైగ్రేన్లు, అధిక రక్తపోటుతో సహా, ఒత్తిడి సంబంధిత అనారోగ్యాలకు 20–25 శాతం తక్కువగా గురవుతారని 2019 సైకలాజికల్ సైన్స్ అధ్యయనం వెల్లడించింది.మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా తోబుట్టువుల బాంధవ్యాలకు ప్రాముఖ్యం ఉంది. జర్మనీలో, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ చేసిన సుదీర్ఘ అధ్యయనాలు – కనీసం ఒక తోబుట్టువు ఉన్న వ్యక్తులు పెద్దయ్యాక చక్కని సామాజిక సంబంధాలను కలిగి ఉండే అవకాశం 45 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాయి. కుటుంబ గౌరవం, పెద్దల సంరక్షణకు పెద్దపీట వేసే జపాన్ లో.. తోబుట్టువులు తరచూ సంరక్షణ పాత్రలను పోషిస్తుంటారు. సాధారణంగా తండ్రి లేదా తల్లి లేని సింగిల్ పేరెంట్ కుటుంబాల్లో పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ, అమెరికాలో ‘చైల్డ్ డెవలప్మెంట్ జర్నల్’లో వచ్చిన పరిశోధనా వ్యాసం – సింగిల్ పేరెంట్ కుటుంబాల పిల్లల్లో.. తోబుట్టువులు ఉన్నవారు ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని, తోబుట్టువుల అండే అందుకు కారణమని వెల్లడించింది. తోడున్నవాళ్లూ తోబుట్టువులే!.. ఇదంతా చదివాక, ‘అరే, నాకు తోబుట్టువులు లేరే’ అని డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తోబుట్టువులు లేని వాళ్లు కూడా –తోబుట్టువులతో ముడిపడి ఉన్న భావోద్వేగ ప్రయోజనాలను, ముఖ్యంగా మెంటల్ సపోర్ట్ను.. స్నేహితులు, బంధువులు లేదా దీర్ఘకాలం రూమ్మేట్లుగా ఉన్న ‘తోబుట్టువుల లాంటి’ వారి ద్వారా పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఒకే రక్తాన్ని పంచుకుపుట్టకపోవడం అన్నది ప్రతికూలాంశం ఏమీ కాబోదని, జన్యువులతో సంబంధం లేకుండా కూడా తోబుట్టువులు దొరకొచ్చని కూడా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రాణ స్నేహితులు కూడా ఒకరకంగా తోబుట్టువులే.తోబుట్టువులు ఉంటే చాలు..» తోబుట్టువులు ఉన్నవారు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు 60 శాతం తక్కువ (బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ)» తోబుట్టువులు ఉన్నవాళ్లకు రాజీపడటం, దీర్ఘకాల అనుబంధాలను కొనసాగించటం వంటి నైపుణ్యాలు అలవడతాయి. (యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్)» తోబుట్టువులతో బాల్యంలో చక్కటి సంబంధాలు ఉన్న పెద్దల్లో ఒత్తిడి సంబంధ అనారోగ్యాలు 2025 శాతం వరకు తక్కువ (సైకలాజికల్ సైన్స్) తాజా పరిశోధన ప్రకారం.. బాల్యంలో ఈ తోబుట్టువులు ఎంత కొట్టుకున్నా... పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఒకరికొకరు అండగా, ఆలంబనగా ఉంటారట. మీకో తోబుట్టువు ఉంటే, మీ లోపల మీకు ఎప్పటికీ ఒక తోడు ఉన్నట్లేనని పరిశోధకులు అంటున్నారు. ఇదెలాగంటే –అక్క అమ్మగా మారిపోయి అక్కునచేర్చుకుంటుంది. తమ్ముడు టెక్నాలజీలో కింగ్ అయిపోయి అన్నగారి సందేహాలను తీరుస్తాడు.– సాక్షి, స్పెషల్ డెస్క్

International yoga day 2025 : ఆరోగ్య ‘యోగం’ ఇంతింత కాదయా
వేగంగా మారుతున్న యుగంలో యువత ఎంతో ఒత్తిడి, అపరిమిత ఆందోళనల మధ్య జీవించాల్సి వస్తోంది. విద్య, ఉద్యోగపోటీలు, డిజిటల్ లైఫ్, సామాజిక ఒత్తిళ్ల మధ్య మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతుంటారు. ‘యువత జీవనవిధానంలో ఏర్పడిన భావోద్వేగ బ్లాకేజ్లను ఎలా తొలగించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగ ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది’ అని వివరిస్తారు యోగా ట్రైనర్ స్వప్న యోగాన్వేష్.‘లండన్లో ఎంబీయే చేసి, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, యోగాతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను’ అని తెలిపిన స్వప్న హైదరాబాద్లో ఐదేళ్లుగా యోగా ట్రైన ర్గా రాణిస్తున్నారు. ‘‘ఇండియాకు వచ్చి, రిషీకేష్ వంటి యోగిక్ ప్లేస్లన్నీ సందర్శించాను. వారాంతంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణా తరగతులు తీసుకుంటుంటాను. సాధారణంగా యువతలో చాలా మంది జిమ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. అది శారీరక ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుంది. యోగా వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, ఆత్మ మూడింటినీ సమతుల్యంగా ఉంచే జీవన విధానం. ఈ కాలంలో యువత ఎక్కువ శాతం డిజటల్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. అన్ని విషయాల మీద చాలా నాలెడ్జ్ వచ్చింది. కానీ, చిన్ననాటి నుంచి రకరకాల ఎమోషనల్ బ్లాకేజీలు అంతర్గతంగా ఏర్పడి, వారితో పాటు ఎదుగుతుంటాయి. వీటి నుంచి రిలాక్స్ అవడానికి యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. యోగా ప్రాచీన భారత సంప్రదాయంలో భాగంగా వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఉంది. పతంజలి వంటి ఎంతో మంది రుషులు, యోగులు యోగాను సాధన చేసినట్టుగా ్ర΄ాచీన భారతం మనకు చూపుతుంది. యోగా వల్ల లాభాలేంటి అని ప్రశ్నించే ఈ తరానికి చెప్పలేనన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.. చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?తరగని గని యోగా! మనందరిలో ఫిజికల్, సైకలాజికల్ ట్రామా రెండూ ఉంటాయి. దైనందిన జీవనంలో శ్వాస తీసుకోవడం, వదలడం కూడా సరిగ్గా చేయడం లేదు. దీర్ఘ శ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే తినే ఆహారం, నిద్రా సమయం కూడా క్రమ బద్ధం అవుతుంది. మొదలు పెట్టేప్పుడు ముందుగా శ్వాస యోగా నుంచి ప్రారంభించాలి. అందుకు కపాభాతి వంటి శ్వాస యోగాసనాలు ఉన్నాయి. వారంలో రెండు రోజులు, మూడు రోజులు యోగా చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల తలనొప్పి వచ్చినా.. ఎందుకొచ్చింది? ఫిజికల్గా, మెంటల్గా, ఫుడ్ పరంగా ఎక్కడ మిస్టేక్ అయ్యింది? ఈ సందేహాలకు సమాధానాలు వెంటనే తెలిసిపోతాయి. కోపం, అసహనం, చిరాకు వల్ల బంధాలలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రం వెళ్లరు. కపాలబాతి, ప్రాణాయామం.. వంటి శ్వాస వ్యాయామాలు చేయడానికి 8 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. అందుకే, యోగాను సూర్యోదయం సమయంలో ఖాళీ కడుపుతో చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మిగతా ఆసనాలకు కనీసం ఆహారం తీసుకోవడానికి మూడున్నర గంటల ముందు తీసుకోవాలి. లంగ్స్, లివర్, స్టమక్, కిడ్నీ, హార్ట్... మనం చేసే పనులలో ఈ ఐదు ఆర్గాన్స్ పనితీరు బాగుండేలా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంటర్నల్ హీలింగ్ ద్వారా వీటిని సాధన చేయచ్చు. – స్వప్న యోగాన్వేషి, యోగా ట్రైనర్, హైదరాబాద్ యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న ఏడు చక్రాల కుండలిని యాక్టివేట్ చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలుఇస్తుంది.దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది∙మైండ్ఫుల్నెస్ (సంపూర్ణ శ్రద్ధతో జీవించడం) అభివృద్ధి చెందుతుంది.డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.శ్వాసక్రియ( ప్రాణాయామం) వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.పొట్ట, తల, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి.కేటాయించాల్సిన సమయం...యోగాసనాల సాధనకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుంది. ప్రతి రోజు కనీసం 20–30 నిమిషాలు యోగాకు కేటాయించాలి యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు అది అందరూ చేయగలిగేది ∙సరైన గురువు లేదా యాప్ సహాయంతో శాస్త్రీయంగా ప్రారంభించాలి యోగా అనేది యువతకు శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, సామాజిక నైతికత అన్నింటినీ అందించే ఓ సంపూర్ణ మార్గం. యోగాకు వయస్సు అడ్డంకి కాదు, ముందు అడుగు వేయడమే ముఖ్యంసోషల్ మీడియా డీటాక్స్: రోజంతా మొబైల్, స్క్రీన్ ముందు గడిపే యువతకు యోగా ద్వారా స్వీయ ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఇది డిజిటల్ డీటాక్స్కు సహాయపడుతుంది. యువతలో స్థిరత్వం, ఓర్పు, విలువల పట్ల గౌరవం పెరుగుతుంది.ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో -నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్.. ఆరోసారి వాయిదా
ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేయాల్సి ఉండగా.. యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడిందని నాసా తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, అంతరిక్ష ప్రయోగంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్సియం-4 మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో ఈ మిషన్ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడింది.ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.NASA's Axiom-4 mission with Indian astronaut Shubhanshu Shukla delayed for sixth time pic.twitter.com/TAaXUZpCnv— UPSC Post 📫 (@upscpost) June 20, 2025

భారత్ దాడులతో వణికిపోయాం.. పాక్ డిప్యూటీ పీఎం షాకింగ్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ ఎట్టకేలకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై స్పందిస్తోంది. ఆపరేషన్ సిందూర్ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు పాక్ నేతలు ఒక్కొక్కరుగా ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులోకి పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ చేరిపోయారు. తాజాగా ఆపరేషన్ సిందూర్పై ఇషాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వైమానిక దాడులు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ మాపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్లోని రెండు ముఖ్యమైన వైమానిక స్థావరాలు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్, షోర్కోట్ ఎయిర్బేస్లపై భారత్ విరుచుకుపడింది. దీంతో, రెండు ఎయిర్బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్పై పాకిస్తాన్ తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. అందుకే ప్రతి దాడి చేయలేకపోయాం. దాడుల విషయంలో భారత్ వేగంగా స్పందించింది. భారత్తో యుద్ధం అంత తేలిక కాదు.భారత దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ వ్యక్తిగతంగా నాతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో మాట్లాడాలని యువరాజు సూచించారు. రెండు దేశాల మధ్య సమస్యలను తగ్గించేందుకు రియాద్ ముఖ్యమైన పాత్ర పోషించింది. అమెరికా సైతం భారత్ను నిలువరించే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు.Pakistan Deputy PM Ishaq Dar' openly admits 2 things in this interview 📍India struck the Nir Khan Air base and Shorkot Air base 📍 Ishaq Dar' says Saudi Prince Faisal called him asking "Am I authorised to talk to Jaishankar also and CONVEY ..and you are READY TO TALK"… pic.twitter.com/45TJqnlWKu— OsintTV 📺 (@OsintTV) June 19, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్పై పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చేసిన దాడులను పాక్ ప్రధాని అంగీకరించారు. బాలిస్టిక్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్ వెల్లడించారు. మే 10వ తేదీన తెల్లవారుజాము 2.30కి పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పారు. నూర్ఖాన్ ఎయిర్బేస్తోపాటు ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసిందని మునీర్ తనతో చెప్పారన్నారు. ఇక, షరీఫ్ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

కడప కార్పొరేషన్లో హైడ్రామా.. తెరుచుకోని తలుపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దాదాపు ఆరు మాసాల తర్వాత ఇవాళ జరుగుతున్న నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత రెండు నెలలుగా మీటింగ్ హాలుకు అధికారులు తాళం వేశారు. చివరికి ఇవాళ ఉదయం 11గంటలకు పాలకవర్గ సమావేశం ఉన్నా కానీ తాళం తీయలేదు. కుర్చీ కోసం.. కడప ఎమ్మెల్యే దొడ్డి దారిన కుర్చీ వేయించుకుని, దానికి బోల్టులు కూడా బిగించారనే ఆరోపణలు ఉన్నాయి.మీటింగ్ హాల్ తలుపులు తీస్తేనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నేడు మీటింగ్ ఉన్నా ఇంతవరకూ తాళం తీయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు అనుకూలంగా నిబంధనలను కాలరాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కౌన్సిల్ హాలులో మేయర్తో సమానంగా తనకు వేదికపై కుర్చీ వేయలేదన్న కారణంతో.. గత రెండు సర్వసభ్య సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆర్.మాధవిరెడ్డి తన అనుచరులతో ప్రవేశించి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే.తనకు లేని కుర్చీ.. మేయర్కు కూడా ఉండకూడదని భీష్మించుకుని.. మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేయించాలని ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పురపాలక శాఖ కార్యదర్శి ఏకపక్షంగా జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. మళ్లీ విచారణ చేసి మేయర్ వాదన వినాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పురపాలక అధికారులు పెడచెవిన పెట్టి పాత పద్ధతిలోనే విచారణ చేసి.. ఈనెల 20వ తేదీన సర్వసభ్య సమావేశం కంటే ముందే మళ్లీ అనర్హత వేటు వేయాలని పన్నిన కుయుక్తులు న్యాయస్థానం ముందు ఫలించలేదు.19వ తేదీ వరకూ మేయర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. ఈనెల 20వ తేదీన మేయర్ సురేష్బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగడం తథ్యమని తేలిపోయింది. మేయర్ కోరినా కౌన్సిల్ హాలు తలుపులు ఎందుకు తెరవలేదో.. మేయర్ ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన కమిషనర్.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి ఎక్స్ అఫిషియో సభ్యులైన కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు మేయర్తో సమానంగా వేదికపై కుర్చీలు వేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అందుకే కౌన్సిల్ హాలు తాళం చెవులను తన వద్ద ఉంచుకొని.. మేయర్ స్వయంగా కోరినా తలుపులు తెరవలేదని సమాచారం. దీంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాలు తెరిచేలా ఆదేశాలివ్వాలని జాయింట్ కలెక్టర్ను కోరడంతోపాటు సమావేశంలోకి ఇతరులను ఎవ్వరినీ అనుమతించవద్దని, పటిష్ట భద్రత కల్పిపంచాలని జిల్లా ఎస్పీని కోరారు.అంతేగాక 39 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించి తమకు భద్రత కల్పించాలని విన్నవించారు. కార్పొరేటర్ల పిటీషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నగరపాలక సర్వసభ్య సమావేశానికి పటిష్ట భద్రత కల్పించాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సర్వసభ్య సమావేశపు హాలులో ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేసి ఉంటే.. మేయర్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఎలా స్పందిస్తారు.. కమిషనర్ ఎవరి ఆదేశాలతో.. ఎవరి మెప్పు కోసం ఈ పని చేశారు.. కమిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు పట్టుబడతారు.. అనే ప్రశ్నలకు నేడు సమాధానం లభించబోతోంది. ఒకవేళ కుర్చీ వేయకపోతే ప్రభుత్వ విప్ ఆర్.మాధవిరెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏం చేయాలన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందే వైఎస్సార్సీపీ మేయర్, కార్పొరేటర్ల గోడు విని న్యాయస్థానం ఆదేశాలిచ్చినా.. వాటిని అమలు చేయాల్సింది మళ్లీ అధికారులే కావడంతో సమస్య మళ్లీ మొదటికొస్తోంది. సభ నిర్వహణకు, సభలో చేసిన తీర్మానాలను మినిట్స్ బుక్లో రాయించేందుకు, వాటిని అమలు చేసేందుకు, అభివృద్ధి పనులు చేసేందుకు ఇలా ప్రతి దానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, మేయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. గతంలో ఎన్నడూ ప్రతిపక్షంపై అధికార పక్షం ఇంతటి ఘర్షణ పూరిత వాతావరణం తీసుకురాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం
పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
సూర్య- ఆర్జే బాలాజీ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్
ఎయిరిండియా ఘటన: బ్లాక్బాక్స్ ఎపిసోడ్లో ట్విస్టులు
వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
Yoga సంపూర్ణ ఆరోగ్యం కావాలా? ఇదిగో ఖర్చు లేని మందు
కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపు
ఫండ్స్ కోసం పబ్లిక్ ఇష్యూ బాట
మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలు
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
నాకు పునర్జన్మనిచ్చింది వారే.. లైవ్ లో కన్నీరు పెట్టుకున్న కొమ్మినేని
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం
పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
సూర్య- ఆర్జే బాలాజీ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్
ఎయిరిండియా ఘటన: బ్లాక్బాక్స్ ఎపిసోడ్లో ట్విస్టులు
వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
Yoga సంపూర్ణ ఆరోగ్యం కావాలా? ఇదిగో ఖర్చు లేని మందు
కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపు
ఫండ్స్ కోసం పబ్లిక్ ఇష్యూ బాట
మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలు
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
సాక్షి కార్టూన్ 18-06-2025
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
SBI క్రెడిట్ కార్డు కొత్త రూల్.. జూలై 15 నుంచి..
సినిమా

ఈ దశాబ్దంలో నాకు నచ్చిన సినిమా అదే: హీరో నాని
నేచురల్ స్టార్ నాని ఇటీవలే హిట్-3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో మోస్ట్ వయొలెంట్గా కనిపించి అభిమానులను మెప్పించారు. హిట్ సిరీస్లో వచ్చిన మూడో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నాని ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలో తనకు నచ్చిన చిత్రాల్లో మెయిజగన్(తెలుగులో సత్యం సుందరం) ఒకటని తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాల మధ్య వచ్చిన ఈ చిత్రం భావోద్వేగం, వ్యక్తిగత జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఇటీవల వ్యక్తిగతంగా తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిన చిత్రమిదేనని వెల్లడించారు. తన సినిమా హిట్-3 ప్రమోషన్ల సందర్భంగా ఈ సినిమా గురించి విన్నానని ఓ యూట్యూబ్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. వేల కోట్లతో నిర్మించిన చిత్రాలకు ప్రశంసలు రావొచ్చు..కానీ ఇలాంటి కథలు రావడం చాలా అరుదైన విషయమన్నారు.కాగా.. తమిళంలో మెయిజగన్ అనే పేరుతో ప్రేమ్ కుమార్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫుల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు.

భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
సంగీత ప్రపంచంలో గాయణీమణులకు ప్రత్యేక స్థానం ఉంది. తమ అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది ప్రేమను పొందుతున్న లేడీ సింగర్స్ చాలా మందే ఉన్నారు. వారు ఆలపించే సినిమా పాటలకు యూట్యూబ్లో కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో ‘గాన కోకిల’లకు మంచి డిమాండ్ ఉంది. మేల్ సింగర్స్ కంటే వాళ్లే ఎక్కువ సంపాదించే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు లైవ్ కాన్సర్ట్లు, ఈవెంట్ల ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న లేడీ సింగర్స్పై ఓ లుక్కేద్దాం.1. శ్రేయా ఘోషాల్: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీ శ్రేయా ఘోషాల్. ఈమె ఒక్కో పాటకు సుమారు రూ. 25-27 లక్షలు, లైవ్ కాన్సర్ట్లకు రూ. 40-45 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. 'బర్సో రే', 'దేవసేనా' వంటి పాటలతో ఆమె అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. సూసేకీ..(పుష్ప 2), హైలోస్సో..(తండేల్), నానా హైరానా..(గేమ్ ఛేంజర్) లాంటి అద్భుతమైన పాటలను ఆలపించి.. తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది.2. సునిధి చౌహాన్సునిధి ఒక్కో పాటకు రూ. 20-25 లక్షలు, కాన్సర్ట్లకు రూ. 25-30 లక్షలు ఛార్జ్ చేస్తారట. నాలుగేళ్ల వయసులోనే ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'ఢూమ్ మచాలే', 'బీడీ జలైలే' వంటి పాటలతో బాలీవుడ్లో సంచలనం సృష్టించారు.ఇప్పటి వరకు ఆమె 10 భాషల్లో 2500 వరకు పాటలను పాడారు. ఓయ్ సినిమాలో ఆమె ఆలపించిన ‘సరదాగా చందమామనే..’ పాట సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ ఆ పాట చాలా మంది వింటుంటారు.3. కనికా కపూర్ బేబీ డాల్, చిట్టియక్కలాయాన్, టుకుర్ టుకుర్, జెండా ఫూల్ పాటలతో పాటు పుష్ప సినిమాలోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్తో జనాలను ఉర్రూతలూగించిన ఈ అందాల గాయని ఒక్కో పాటకు 18-22 లక్షలు తీసుకుంటుందట. ఆమె ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల వరకు ఉంటుదని సమాచారం.4. నేహా కక్కర్యూత్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సింగర్ నేహా కక్కర్. ఆమె ఒక్కో పాటకు రూ. 10-15 లక్షలు, ఈవెంట్లకు రూ. 25-30 లక్షలు తీసుకుంటారు. 'మైల్ హో తుమ్', 'గర్మీ' వంటి హిట్ డ్యాన్స్ నంబర్స్తో ఆమె ట్రెండ్సెట్టర్గా మారారు.5. అల్కా యాగ్నిక్: 90లో బాలీవుడ్ హిట్ల రాణి అల్కా ఒక్కో పాటకు రూ. 12 లక్షలు, కాన్సర్ట్లకు రూ. 15-20 లక్షలు తీసుకుంటారు. 'ఏక్ దో తీన్', 'చోలీ కే పీఛే' వంటి పాటలతో ఆమె లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు6. నీతి మోహన్బాలీవుడ్ ప్రముఖ సింగర్స్లో నీతి మోహన్ ఒకరు. ఆమె ఒక్కో పాటకు 8-10 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటుంది.7. తులసి కుమార్మెలోడీ సాంగ్స్తో గుర్తింపు పొందిన తులసి ఒక్కో పాటకు రూ. 5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 8-10 లక్షలు తీసుకుంటారు. 'తుమ్ జో ఆయే', 'లవ్ హో గయా' వంటి పాటలతో ఆమె అభిమానులను సంపాదించారు.8. ఆషా భోస్లేదిగ్గజ గాయనీమణి ఆషా ఒక్కో పాటకు రూ.5-8 లక్షలు, ఈవెంట్లకు రూ. 10-15 లక్షలు ఛార్జ్ చేస్తారు. 'దమ్ మారో దమ్', 'పియా తు అబ్ తో ఆజా' వంటి ఐకానిక్ పాటలతో ఆమె మంచి గుర్తింపు పొందింది.9. శిల్పారావుతనగాత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుటున్న తెలుగమ్మాయి శిల్పారావు ఒక్కో పాటకు 5-10 లక్షల వరకు తీసుకుంటుంది. దేవర సినిమాలో ‘చుట్టమల్లే..’, జైలర్ లో కావాలయ్యా అనే పాట పాడింది ఈ సింగరే.10. మోనాలీ ఠాకూర్బహుముఖ ప్రతిభ కలిగిన మోనాలీ ఒక్కో పాటకు రూ.5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 15 లక్షల వరకు తీసుకుంటారు. 'జరా జరా టచ్ మీ', 'సావర్లూన్' వంటి పాటలతో ఆమె గుర్తింపు పొందారు.

'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్ కోహ్లి (RCB Won IPL 2025) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్ అన్న పేరుతో ఉన్న ట్వీట్ కావడంతో ఇది కచ్చితంగా సింగర్ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.అసలు నిజమిదే!ఆర్సీబీ ఐపీఎల్ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్ (Sonu Nigam) ట్వీట్ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్ సోనూ నిగమ్ కాదు, బిహార్కు చెందిన లాయర్ సోనూ నిగమ్. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్కు బ్లూ టిక్ ఉండటంతో ఆ ట్వీట్ చేసి సింగర్ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్ సోషల్ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.సోనూ నిగమ్ కన్నడ వివాదమేంటి?బెంగళూరులో సోనూ నిగమ్ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్ను కన్నడ పాటలు పాడాలని కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.సారీ కర్ణాటకసోనూ నిగమ్ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదాలు⇒ జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.⇒ జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు.⇒ జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025 చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు

సౌత్లో బాడీ షేమింగ్.. ఇండస్ట్రీ నుంచే వెలేశారు: హీరోయిన్
వాణిజ్య ప్రకటనలతో ప్రయాణం మొదలుపెట్టిన బనితా సంధు (Banita Sandhu) ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తోంది. తమిళంలో ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి రీమేక్).. హిందీలో అక్టోబర్, సర్దార్ ఉద్ధమ్, మదర్ థెరిస్సా అండ్ మి చిత్రాలు చేసింది. హాలీవుడ్లో సినిమాతో పాటు వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2 చిత్రం చేస్తోంది. అలాగే ఆమె నటించిన డిటెక్టివ్ షెర్డిల్ మూవీ జీ5లో శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుంది.నిద్ర లేకుండా షూటింగ్ఈ సందర్భంగా ప్రమోషన్స్లో బనితా సంధు మాట్లాడుతూ.. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే అంతా మెరుగవుతోంది. కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఊహించినదానికన్నా భిన్నంగా ఉండేది. 16-18 గంటలు పని చేసేదాన్ని. రోజంతా షూటింగ్ చేయించుకుని రాత్రికి పంపించేవాళ్లు. సరైన నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి 24 గంటలు మేల్కొనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు నేను.. నాకోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను. బ్లాక్లిస్ట్.. లెక్కచేయనుఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలను వారించాను. బహుశా అందుకేనేమో నన్ను ఆ ఇండస్ట్రీలో బ్లాక్లిస్ట్లో పెట్టారు. అయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా (ఆదిత్య వర్మ) చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేశారు. పీలగా, చెండాలంగా ఉన్నానని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటిదానికి హీరో ఎలా పడిపోయాడని వెకిలిగా మాట్లాడారు. బాడీ షేమింగ్ అనుభవించడం అదే మొదటిసారి అని బనితా చెప్పుకొచ్చింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

నెదర్లాండ్స్, స్లొవేనియాలతో భారత్ ‘ఢీ’
బెంగళూరు: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ వరల్డ్ టీమ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది నవంబర్ 14 నుంచి 16 వరకు బెంగళూరులోని ఎస్ఎం కృష్ణ టెన్నిస్ స్టేడియంలో ఈ టోర్నీ జరగనుంది. భారత్తోపాటు ఇతర దేశాల్లో ఇవే తేదీల్లో ఇతర గ్రూప్ల ప్లే ఆఫ్స్ టోర్నీలను నిర్వహిస్తారు. ‘ప్లే ఆఫ్స్’కు మొత్తం 21 జట్లు అర్హత పొందాయి. 21 జట్లను ఏడు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో మూడు జట్లకు చోటు కల్పించారు. గ్రూప్ విజేతగా నిలిచే ఏడు జట్లు వచ్చే ఏడాది బిల్లీ జీన్ కింగ్ కప్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధిస్తాయి. 2021 తర్వాత వరల్డ్ గ్రూప్ ‘ప్లే ఆఫ్స్’కు అర్హత పొందిన భారత జట్టుకు గ్రూప్ ‘జి’లో చోటు దక్కింది. గ్రూప్ ‘జి’లోనే నెదర్లాండ్స్, స్లొవేనియా జట్లు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించాలంటే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. పుణేలో ఇటీవల జరిగిన ఆసియా జోన్ క్వాలిఫయర్స్ టోర్నీలో టాప్–2లో నిలవడం ద్వారా భారత్, న్యూజిలాండ్ జట్లు ‘ప్లే ఆఫ్స్’ టోర్నీకి అర్హత పొందాయి. హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అద్భుత ఆటతీరు కనబరిచి తాను ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. రష్మికతోపాటు సహజ యామలపల్లి, అంకిత రైనా, వైదేహి, ప్రార్థన, మాయా రాజేశ్వరన్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. గట్టిపోటీ తప్పదు... వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు తొలిసారి అర్హత పొందాలంటే భారత్ విశేషంగా రాణించాల్సి ఉంటుంది. భారత్ ప్రత్యర్థులుగా ఉన్న నెదర్లాండ్స్, స్లొవేనియాలతో పోలిస్తే టీమిండియా నుంచి ఒక్కరు కూడా టాప్–300 ర్యాంకింగ్స్లో లేకపోవడం గమనార్హం. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి శ్రీవల్లి రష్మిక (322), సహజ (342), అంకిత రైనా (347), వైదేహి (368) మాత్రమే టాప్–400లో ఉన్నారు. డబుల్స్లో మాత్రం భారత్ నుంచి ఇద్దరు టాప్–200లో ఉన్నారు.ప్రార్థన తొంబారే 145వ ర్యాంక్లో, అంకిత రైనా 190వ ర్యాంక్లో ఉన్నారు. నెదర్లాండ్స్ జట్టులో సింగిల్స్ విభాగంలో టాప్–100లో ఇద్దరు సుజాన్ లామెన్స్ (70), అరంటా రుస్ (91)... డబుల్స్లో టాప్–100లో ఇద్దరు డెమీ షుర్స్ (18), ఇసాబెల్లి హవెర్లాగ్ (91) ఉన్నారు. స్లొవేనియా జట్టులో సింగిల్స్ విభాగంలో టాప్–250లో ఇద్దరు వెరోనికా ఎర్జావెక్ (172), తమారా జిదాన్సెక్ (206)... డబుల్స్లో టాప్–300లో ఇద్దరు కాజా జువాన్ (259), ఇవా ఫాల్క్నర్ (219) ఉన్నారు. బిల్లీ జీన్ కింగ్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్ గ్రూప్ వివరాలు గ్రూప్ ‘ఎ’: కెనడా, డెన్మార్క్, మెక్సికో. గ్రూప్ ‘బి’: పోలాండ్, రుమేనియా, న్యూజిలాండ్. గ్రూప్ ‘సి’: స్లొవేకియా, స్విట్జర్లాండ్, అర్జెంటీనా. గ్రూప్ ‘డి’: చెక్ రిపబ్లిక్, కొలంబియా, క్రొయేషియా. గ్రూప్ ‘ఇ’: ఆస్ట్రేలియా, బ్రెజిల్, పోర్చుగల్. గ్రూప్ ‘ఎఫ్’: జర్మనీ, బెల్జియం, తుర్కియే. గ్రూప్ ‘జి’: నెదర్లాండ్స్, స్లొవేనియా, భారత్.

అగ్ర స్థానమే లక్ష్యంగా...
పారిస్: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ సీజన్లో అగ్ర స్థానం లక్ష్యంగా మరో టోర్నీలో బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది 90 మీటర్ల మార్క్ను అందుకున్న ఈ మాజీ ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ పారిస్ డైమండ్ లీగ్లో టాప్ ర్యాంక్పై కన్నేశాడు. జర్మన్ స్టార్ జులియన్ వెబెర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గెనడా) తదితర హేమాహేమీలంతా ఈ మీట్లో ఉండటంతో జావెలిన్ త్రో పోటీ ఆద్యంతం రసవత్తరంగా జరగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా 8 మంది బరిలోకి దిగుతున్న ఫైనల్ ఈవెంట్లో ఐదుగురు జావెలిన్ త్రోయర్లు 90 మీటర్ల మార్క్ను అధిగమించిన వారే ఉండటం పోటీని దీటుగా మార్చేసింది. భారత కాలమానం ప్రకారం నీరజ్ ఈవెంట్ రాత్రి 1 గంట 12 నిమిషాలకు మొదలవుతంది. గత నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్లో వెబెర్... నీరజ్ చోప్రాను అధిగమించాడు. వెబెర్ ఈటెను 91.06 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో ... చోప్రా 90.23 మీటర్లతో రెండో స్థానంలో నిలిచారు. అనంతరం జరిగిన పోలాండ్ మీట్లో ఇద్దరు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయినా... మళ్లీ తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

దేశానికి ఆడకుంటే...
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాళ్లు దేశం తరఫున ఆడకపోతే ప్రోత్సాహకాల్ని తిరిగి రాబడతామని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) స్పష్టం చేసింది. కొంతకాలంగా పేరొందిన ఆటగాళ్లు దేశాన్ని విస్మరించి ఏటీపీ టోర్నీలకే ప్రాధాన్యమివ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాయ్’... ఆటగాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పథకాలు, ప్రోత్సాహకాల రూపేణా ఆర్థిక సాయం పొందిన ఆటగాళ్లు సహేతుక కారణాలు లేకుండా దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు నిరాకరిస్తే ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. టార్గెట్ ఒలింపిక్ పొడియం పథకం (టాప్స్) ఎప్పటి నుంచో అమలవుతున్నప్పటికీ... ప్రత్యేకంగా ఆసియా క్రీడల్లో పతకాలే లక్ష్యంగా టార్గెట్ ఆసియా క్రీడల గ్రూప్ (టీఏజీజీ) పథకాన్ని కొత్తగా ఈ ఏడాదే తీసుకొచ్చింది. దీనికింద పలువురు ప్లేయర్లకు విదేశీ కోచ్లతో శిక్షణ, విదేశీ పర్యటనల కోసం భారత్ నిధులు మంజూరు చేస్తోంది. ఇలా పథకాలతో ఆర్థికసాయం, ప్రోత్సాహకాలు పొందిన ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. భారత మేటి సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ డేవిస్ కప్ ఆడేందుకు అదేపనిగా ససేమిరా అంటున్నాడు. గతేడాది పాకిస్తాన్, స్వీడన్... ఈ ఏడాది టోగోతో డేవిస్ కప్ మ్యాచ్లు ఆడకుండా తప్పించుకున్నాడు. ఇలాగే శశికుమార్ ముకుంద్, యూకీ బాంబ్రీలు కూడా డేవిస్ కప్ పోటీలపై అనాసక్తి కనబరుస్తున్నారు. కానీ ఏటీపీ, గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు రాంకుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, సాకేత్ మైనేని, రిత్విక్ బొల్లిపల్లి, మహిళా ప్లేయర్లు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి, వైదేహి చౌధరీ, రుతుజా, మాయా రాజేశ్వరన్లకు టీఏజీజీ కింద ఆర్థిక అండదండలు లభిస్తున్నాయి. ‘సాయ్’ తాజా నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సహా డేవిస్ కప్ కెపె్టన్ రోహిత్ రాజ్పాల్, బిల్లీ జీన్ కింగ్ కప్ కెప్టెన్ విశాల్ ఉప్పల్ స్వాగతించారు.

భారత్ ‘పరీక్ష’ మొదలు
భారత టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర లేస్తోంది. సుదీర్ఘ కాలం జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత జట్టు తొలి సిరీస్ బరిలోకి దిగుతోంది. టెస్టు ఫార్మాట్లో కొత్త సారథిగా బాధ్యతలు తీసుకున్న శుబ్మన్ గిల్కు తొలి సిరీస్లో కఠిన పరీక్ష ఎదురవుతోంది.ప్రత్యర్థి గడ్డపై ఇప్పటి వరకు మన రికార్డు, ప్రస్తుత యువ జట్టు అనుభవాన్ని చూస్తే ఇది పెద్ద సవాల్. టీమ్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో పాటు కెప్టెన్గా, బ్యాటర్గా గిల్ తనను తాను నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది. అయితే గతంలోనూ పాత చరిత్రను మార్చిసంచలనాలు సృష్టించిన భారత బృందం మరోసారి అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తే అనూహ్య ఫలితాలు ఖాయం. లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ పోరుకు సైరన్ మోగింది. ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య హెడింగ్లీ మైదానంలో నేటి నుంచి తొలి టెస్టు జరగనుంది. ఏడాది క్రితం భారత గడ్డపై జరిగిన టెస్టు పోరులో టీమిండియా 4–1తో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఇప్పుడు తమ సొంత మైదానంలో దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని స్టోక్స్ బృందం భావిస్తుండగా... అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చి పైచేయి సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. టెస్టుల్లో భారత్కు 37వ కెప్టెన్గా గుర్తింపు పొందిన గిల్కు ఇది కీలక సిరీస్ కానుండగా... బ్యాటర్గా ఇంగ్లండ్ గడ్డపై పేలవ రికార్డు ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా గెలుపుపై గురి పెట్టాడు. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్కు స్వదేశంలో మంచి ఫలితాలు అందించిన ‘బజ్బాల్’ శైలి ఆట ఈసారి ఎలాంటి ఫలితాలు అందిస్తుందనేది ఆసక్తికరం. ఆరో స్థానంలో ఎవరు? తొలి టెస్టులో భారత తుది జట్టు దాదాపుగా ఖాయమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆడనుండగా మూడో స్థానంలో కరుణ్ నాయర్ బరిలోకి దిగుతాడు. ఆస్ట్రేలియా సిరీస్లో ఆకట్టుకున్న జైస్వాల్తో పాటు రాహుల్ కూడా రాణిస్తే జట్టుకు శుభారంభం లభిస్తుంది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న కరుణ్ నాయర్ తన ఇటీవలి దేశవాళీ ఫామ్ను కొనసాగించడంతో పాటు జట్టులో స్థానం కాపాడుకునే ఒత్తిడిని కూడా అధిగమించాల్సి ఉంటుంది. నాలుగో స్థానంలో ఆడనున్న గిల్ తన బ్యాటింగ్తో అంచనాలు అందుకోవడం కీలకం. ఆసీస్ గడ్డపై విఫలమైన పంత్ మరింత బాధ్యతగా ఆడాల్సిన తరుణమిది. భారత జట్టు విజయావకాశాలు పేసర్ బుమ్రాపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. సొంత మైదానంలో అయినా సరే ఇంగ్లండ్ బ్యాటర్లు అతడిని సమర్థంగా ఎదుర్కోవడం అంత సులువు కాదు. సిరాజ్ కూడా స్వింగ్తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు. మూడో పేసర్గా ప్రసిధ్ కృష్ణ ఆడటం కూడా దాదాపు ఖాయమే. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తన సత్తాను ఈ సిరీస్లో నిరూపించుకోవాల్సి ఉంది. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా స్థానానికి ఢోకా లేదు. అయితే మిగిలిన ఆరో స్థానం కోసమే జట్టులో గట్టి పోటీ ఉంది. ఇక్కడా రెగ్యులర్ బ్యాటర్ను ఆడిస్తారా లేక ఆల్రౌండర్కు అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బ్యాటర్ అయితే సాయి సుదర్శన్ అరంగేట్రం చేయవచ్చు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలంటే శార్దుల్ ఠాకూర్ లేదా నితీశ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. లేదా స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ రూపంలో ప్రత్యామ్నాయం ఉంది. బౌలింగ్లో అనుభవలేమి... దాదాపు రెండు దశాబ్దాల పాటు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బలంపైనే ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆధారపడుతూ వచి్చంది. వీరిద్దరు కలిసి ప్రత్యర్థులను కుప్పకూలుస్తూ ఎన్నో విజయాలు అందించారు. అయితే ఇప్పటి పేస్ బృందానికి చాలా తక్కువ అనుభవం ఉంది. ఈ బౌలింగ్ దళం ప్రత్యర్థిని ఏమాత్రం భయపెట్టించేలా లేదు. కార్స్ 5, టంగ్ 3 టెస్టులు ఆడగా...అనుభవజ్ఞుడే అయినా అండర్సన్, బ్రాడ్లతో పోలిస్తే క్రిస్ వోక్స్ స్థాయి తక్కువ. భారత బ్యాటర్ల కోణంలో చూస్తే స్పిన్నర్ బషీర్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అందుకే ఇంగ్లండ్ ఈ సిరీస్లో తమ బ్యాటింగ్నే నమ్ముకుంది. 13 వేలకు పైగా టెస్టు పరుగులు సాధించిన రూట్ మరోసారి బ్యాటింగ్ బాధ్యత మోస్తున్నాడు. అద్భుత ఫామ్లో ఉన్న అతడు భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది కీలకం. ‘బజ్బాల్’ వచ్చాక ఎన్నో శుభారంభాలు అందించిన క్రాలీ, డకెట్ నుంచి మరో సారి జట్టు అదే ఆటను ఆశిస్తోంది. పోప్తో పాటు ప్రతిభావంతుడైన బ్రూక్పై జట్టు బ్యాటింగ్ భారం ఉంది. కెప్టెన్ స్టోక్స్ బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. గత మూడేళ్లుగా అతను సెంచరీనే చేయలేదు. భారత గడ్డపై ఆడిన ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైన స్టోక్స్ ఎలాంటి ప్రభావం చూపించగలడనేది కీలకం. 3 ఇంగ్లండ్ గడ్డపై భారత్ 19 టెస్టు సిరీస్లు ఆడింది. ఇందులో 3 సిరీస్లను (1971లో, 1986లో, 2007లో) సొంతం చేసుకుంది. 14 సిరీస్లను చేజార్చుకుంది. మరో 2 సిరీస్లు ‘డ్రా’గా ముగిశాయి.67 ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టుతో భారత్ 67 టెస్టులు ఆడింది. 9 టెస్టుల్లో గెలిచిన భారత్ 36 టెస్టుల్లో ఓడిపోయింది. మరో 22 టెస్టులను టీమిండియా ‘డ్రా’ చేసుకుంది.7 హెడింగ్లీ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొత్తం 7 టెస్టులు జరిగాయి. 2 టెస్టుల్లో భారత్, 4 టెస్టుల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి. 1 టెస్టు ‘డ్రా’గా ముగిసింది. పిచ్, వాతావరణం హెడింగ్లీ మైదానంలో తొలిసారి ఆరంభంలో పేసర్లకు కాస్త అవకాశం ఉన్నా ఆట సాగిన కొద్దీ బ్యాటింగ్కు అనుకూలం కావొచ్చు. ఇంగ్లండ్ కూడా పూర్తిగా బౌలింగ్ పిచ్ను ఎంచుకునే సాహసం చేయడం లేదు. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్ష సూచన లేదు. తుది జట్లు ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, టంగ్, బషీర్. భారత్ (అంచనా): గిల్(కెప్టెన్), జైస్వాల్, రాహుల్, కరుణ్ నాయర్, పంత్, సుదర్శన్/నితీశ్ రెడ్డి, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, కుల్దీప్.
బిజినెస్

ప్రాజెక్ట్ రుణాలకు కొత్త నిబంధనలు
ముంబై: మౌలిక రంగ ప్రాజెక్టులు, మౌలికేతర ప్రాజెక్టులకు బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, ఇతర నియంత్రిత సంస్థలు మంజూరు చేసే రుణాలకు సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటి ప్రకారం ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాల ప్రారంభించే తేదీ (డీసీసీవో) విషయంలో వెసులుబాటు కల్పించింది. ఇన్ఫ్రా ప్రాజెక్టులకు మూడేళ్లు, నాన్ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రెండేళ్ల పాటు డీసీసీవో పొడిగింపు పరిమితికి అవకాశం ఇచ్చింది. కొత్త మార్గదర్శకాల అమలుకు ప్రాజెక్టులను స్థూలంగా.. డిజైన్, నిర్మాణం, కార్యకలాపాల దశలుగా వర్గీకరించారు. ‘‘నిర్మాణ దశలోని ప్రాజెక్టులకు బ్యాంక్లు లేదా ఎన్బీఎఫ్సీల రుణ వితరణ గరిష్టంగా రూ.1,500 కోట్లను మించకూడదు. విడిగా ఒక్కో రుణ దాత ఎక్స్పోజర్ ఇందులో 10 శాతానికి తక్కువ కాకుండా ఉండాలి. రూ1,500 కోట్లకు మించిన ప్రాజెక్టు రుణాల్లో ఒక్కో రుణదాత వారీ వాటా కనీసం 5 శాతం లేదా రూ.150 కోట్లు ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. రుణాన్ని ఖరారు చేయడానికి ముందే సంబంధిత ప్రాజెక్టుల నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు/ క్లియరెన్స్లు వచ్చినట్టు ధ్రువీకరించుకోవాలి. పర్యావరణ, చట్టబద్ధమైన, నియంత్రణ సంస్థల అనుమతులు ఇందులో భాగంగా ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. రుణం మంజూరు చేసిన తర్వాత కూడా బ్యాంక్/ఎన్బీఎఫ్సీ ప్రాజెక్టుల పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలి. సంబంధిత ప్రాజెక్టు సమస్యల్లో పడుతుందన్న సంకేతాలు కనిపిస్తే ముందస్తుగానే పరిష్కార ప్రణాళికకు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు రుణాలకు సంబంధించి 1.25% ప్రొవిజన్ చేయాల్సి (పక్కన పెట్టడం) ఉంటుంది. వాణిజ్య–నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఇది ఒక శాతంగా ఉంటుంది. ఇతర ప్రాజెక్టుల రుణాలకు సైతం ఒక శాతం ప్రొవిజన్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులు కార్యకలాపాల దశలోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన కేటాయింపులు వరుసగా 1%, 0.75%, 0.40 శాతంగా ఉండనున్నాయి. నిజానికి గతంలో విడుదల చేసిన ముసాయిదా నిబంధనల్లో ప్రాజెక్టు రుణాలకు సంబంధించి.. నిర్మాణ దశలో ఉన్న వాటికి 5 శాతం, కార్యకలాపాలు మొదలు పెట్టిన తర్వాత ఒక శాతం కేటాయింపులు నిర్వహించాలని ఆర్బీఐ ప్రతిపాదించడం గమనార్హం.

టర్మ్ ప్లాన్ సమగ్రంగా ఉండాలి..!
పుణె: మహిళల ఆర్థిక ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నట్టు బజాజ్ అలియాన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ‘‘ఉమెన్ టర్మ్ సర్వే 2025’’లో వెల్లడైంది. పిల్లల భవిష్యత్తు, వారి విద్య, ఆరోగ్య పరిరక్షణకు వారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి విషయంలో ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. పిల్లల భద్రత దృష్ట్యా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా, 53 శాతం మహిళలు అనుకోని వైద్య ఖర్చులు తమ కుటుంబ పొదుపులపై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు. అందుకే 87 శాతం మహిళలు క్రిటికల్ ఇల్నెస్ కవర్’ను అత్యంత అవసరంగా భావిస్తున్నారు. అంతేగాక, 50 శాతం మంది మహిళలు టర్మ్ ప్లాన్లో ఆరోగ్య సేవలు కూడా ఉండాలని సర్వేలో తెలిపారు. దీనికితోడు తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్యా అవసరాలను తీర్చే రక్షణ కూడా టర్మ్ ప్లాన్లలో భాగంగా ఉండాలని మహిళలు భావిస్తున్నారు. సర్వేలో ముఖ్యాంశాలు → ఏవైనా ఊహించని పరిస్థితులు ఎరురైతే పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని 61 శాతం మంది మహిళలు భావిస్తున్నారు. → 61 శాతం మంది ఆదాయ స్థిరత్వానికి, 53 శాతం మంది వైద్య వ్యయాలకు, 54 శాతం మందికి రిటైర్మెంట్ ప్రణాళిక, 57 శాతం మంది మహిళలు విద్యకు తొలి ప్రాధాన్యమని సర్వేలో చెప్పారు. → 46 శాతం మంది మహిళలు పిల్లల భవిష్యత్ భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. → 87 శాతం మహిళలు క్రిటికల్ ఇల్నెస్ కవర్ను అత్యవసరంగా భావిస్తున్నారు. → 93 మంది టర్మ్ ప్లాన్లో ‘పిల్లలకు ఆదాయ భద్రత’ సదుపాయాన్ని ఆకర్షణీయంగా చూస్తున్నారు. → 51 శాతం మహిళలు జీవిత బీమా కవరేజీ పెంచుకునే సదుపాయాన్ని కోరుకుంటున్నారు. → 33 శాతం పిల్లల విద్యా భవిష్యత్తుకు సంబంధించిన ప్రయోజనాలు టర్మ్ ప్లాన్లో తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నారు. → బీమా కవరేజీని సవరించుకునే సౌలభ్యం లేకపోవడాన్ని లోపంగా చూస్తున్నారు. సమగ్ర పరిష్కారంగా చూస్తున్నారు.. టర్మ్ ఇన్సూరెన్స్ను కేవలం జీవిత బీమా రక్షణగానే మహిళలు చూడడం లేదని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. తమ ఆర్థిక ప్రాధాన్యతలకు సరితూగే సమగ్రమైన పరిష్కారంగా చూస్తున్నారు. మహిళల అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆవిష్కరించే దిశగా ఈ సర్వే ఫలితాలు మాకు ప్రేరణనిస్తాయి. – తరుణ్ ఛుగ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము మూడింతలు
న్యూఢిల్లీ/జ్యురిచ్: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నిధులు (డిపాజిట్లు, సెక్యూరిటీలు సహా) మూడింతలకు పైగా పెరిగి 2024 చివరికి 3.5 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్కు (రూ.37,600 కోట్లు) చేరాయి. 2021 తర్వాత స్వివ్స్ బ్యాంకుల్లో భారత నిధులు గరిష్ట స్థాయికి చేరుకోవడం మళ్లీ ఇదే కావడం గమనార్హం. 2021లో ఈ మొత్తం 3.83 స్విస్ ఫ్రాంక్స్గా ఉన్నాయి. ఈ వివరాలను స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) గురువారం విడుదల చేసింది. బ్యాంక్ ఛానళ్లు, ఇతర ఆర్థిక సంస్థల రూపంలో జమ అయిన నిధులు ఇవి. ఇక స్విస్ బ్యాంకుల్లోని భారత క్లయింట్ల ఖాతాల్లోని డిపాజిట్లు 11 శాతం పెరిగి 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.3,675 కోట్లు)గా ఉన్నాయి. మొత్తం నిధుల్లో క్లయింట్ల ఖాతాల్లో ఉన్నవి 10 శాతమేనని తెలుస్తోంది. విడిగా చూస్తే.. 3.02 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ ఇతర బ్యాంకుల రూపంలో ఉంటే, 346 మిలియన్ల ఫ్రాంక్స్ కస్టమర్లకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లో ఉన్నాయి. 41 మిలియన్లు ఫిడూషియరీలు లేదా ట్రస్ట్ల రూపంలో, 135 మిలియన్ల ఫ్రాంక్స్ బాండ్లు, ఇతర సెక్యూరిటీల రూపంలో ఉన్నట్టు ఎస్ఎన్బీ వెల్లడించింది. నిజానికి స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం క్షీణించి 1.04 ఫ్రాంక్స్గా ఉండడం గమనార్హం. ఆ తర్వాత రెండేళ్లలో ఇవి గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, 2026లో స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లు 6.5 బిలియన్ల ఫ్రాంక్స్ కంటే తక్కువే. బ్యాంకులు అందించిన సమాచారంగా ఎస్ఎన్బీ విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఇందులో నల్లధనం వివరాల్లేవు. అలాగే, ఏ సంస్థల పేరు మీద ఖాతాలున్నాయనే వివరాలను కూడా వెల్లడించలేదు. నల్లధనంగా చూడరాదు.. భారతీయులు స్విట్జర్లాండ్లో కలిగి ఉన్న ఆస్తులను ‘నల్లధనం’గా పరిగణించకూడదన్నది స్విస్ అధికారుల వాదన. ‘‘పన్ను మోసాలు, పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి స్విట్జర్లాండ్ మద్దతుగా నిలుస్తుంది. 2018 నుంచి భారతీయుల డిపాజిట్ల వివరాలను ఆటోమేటిక్ ఎక్సే్ఛంజ్ మార్గంలో అందజేస్తున్నాం. మొదటిగా 2019లో డేటా బదిలీ చేయగా.. అప్పటి నుంచి ఏటా ఇది కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి అనుమానం ఉన్న ఖాతాల వివరాలు కూడా అందిస్తూనే ఉన్నాం’’అని స్విస్ అధికారులు తెలిపారు. ఇక స్విస్ బ్యాంకుల్లో మొత్తం విదేశీ క్లయింట్ల నిధులు 2024లో 977 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్కు తగ్గాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 983 బిలియన్ ఫ్రాంక్స్గా ఉన్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఉన్న విదేశీ ఫండ్స్లో దేశాల వారీగా చూస్తే భారత్ 48వ స్థానంలో ఉంది. గతేడాది 67వ స్థానం నుంచి పుంజుకుంది. అంతర్జాతీయంగా చూస్తే స్విస్ బ్యాంకుల్లోని విదేశీ క్లయింట్ల నిధుల్లో 222 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యూకే నుంచే ఉండడం గమనార్హం. 89 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యూఎస్, 68 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ వెస్టిండీస్ క్లయింట్లకు చెందినవి. పాకిస్థాన్ క్లయింట్లకు సంబంధించి 272 మిలియన్ ఫ్రాంక్స్, బంగ్లాదేశ్ క్లయింట్లకు సంబంధించి 589 మిలియన్ ఫ్రాంక్స్ కూడా ఉన్నాయి.

డిజిటల్ అరెస్ట్ల నిరోధానికి పరిష్కారాలు చూడండి
న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్ట్లు, ఇతర సైబర్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో వీటికి కళ్లెం వేసేందుకు సరైన పరిష్కారాలతో ముందుకు రావాలని ఫిన్టెక్ స్టార్టప్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో, మారుమూల ప్రాంతాలకూ చెల్లింపుల సేవలను విస్తరించడంలో ఫిన్టెక్లు పోషించిన పాత్రను ఆమె ప్రశంసించారు. డిజిటల్ పేమెంట్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇంట్లోనే ఉన్నవారిని డిజిటల్గా అరెస్ట్ చేయకుండా లేదా నైట్ ఆపరేటర్ల ద్వారా డబ్బులు మోసపోకుండా పరిష్కారాలతో ముందుకు రావాలని స్టార్టప్లను కోరారు. ప్రజలకు మరింత నష్టం కలిగిస్తున్న డీప్ఫేక్ (నకిలీ)ను అతిపెద్ద ముప్పుగా అభివరి్ణంచారు. కొత్తగా ఎదురయ్యే సవాళ్లకు తగిర పరిష్కారాలను కనుగొని, వాటిని అందించే ఫిన్టెక్ స్టార్టప్ల అవసరం ఎంతో ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) రుణ సదుపాయాలను విస్తరించాలని ఫిన్టెక్లను కోరారు. ఫిన్టెక్ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల వినియోగ వస్తువులుగా మారాలంటూ.. అవి ఇతర వర్ధమాన, అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలకు సైతం ప్రయోజనం కలిగిస్తాయన్నారు. మన సంస్థలకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయని చెప్పారు. ‘‘విజయవంతమైన నమూనాలను విదేశాలకు తీసుకెళ్లాలి. అంతర్జాతీయ మార్కెట్లను సొంతం చేసుకోవాలి. మనకు నైపుణ్యాలున్నాయి. పెద్ద మార్కెట్తోపాటు రుజువైన పరిష్కారాలూ ఉన్నాయి’’అని మంత్రి వివరించారు. ప్రపంచంలో ప్రస్తుతం రోజువారీ జరుగుతున్న డిజిటల్ల లావాదేవీల్లో సగం భారత్లోనే ఉంటున్న విషయాన్ని ప్రస్తావించారు. దేశ ఫిన్టెక్ పరిశ్రమ 2028–29 నాటికి 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఎంతో దూరంలో లేదంటూ.. అవకాశాలకు ఆకాశమే హద్దన్నట్టు మంత్రి చెప్పారు.
ఫ్యామిలీ

పొగడ్తల కోసమా దానం? ఎలాంటి దానం గొప్పది!
పవిత్రమపి యత్ క్రూరం కర్మ తన్నహి శోభతేపరోపకారకం శాంతం కర్మ సద్భిః ప్రశస్యతే మనం చేసే పని ఎంత పవిత్రమైనదైనా క్రూరంగా ఉంటే మాత్రం రాణించదు. అది శాంతమై, ఇతరులకు ఉపకారం కలిగించేదైతే సజ్జనులు దాన్ని ప్రశంసిస్తారు. పూర్వం ఒక గ్రామంలో వృద్ధ స్నేహితులు ఇద్దరుండేవారు. వాళ్ళిద్దరూ బాగా కలిగిన ధనవంతులే. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. ఒకసారి ఊరి బయటకు వారు షికారుకు వెళ్లినప్పుడు వారిని పిచ్చి కుక్క కరిచింది. ఫలితంగా ‘రేబిస్ వ్యాధి’ సోకింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మరణం తప్పదని నిర్ధారణ అయింది.ఇప్పుడు వాళ్ళకు ఏదో దాన ధర్మాలు చేసుకుంటే మంచిదనీ, కీర్తి ప్రదమనీ అనిపించింది. పిచ్చికుక్కలు మానవజాతికి ప్రమాదకారులు కనుక వాటివల్ల తమ లాగానే ఇతరులు బాధపడకూడదనే సదుద్దేశంతో వారిలో ఒకాయన, తన యావత్తు ఆస్తినీ పిచ్చికుక్కల్ని చంపటానికి ఖర్చు పెట్టాలని వీలునామా రాశాడు. ఇక రెండవ వ్యక్తి, పిచ్చికుక్క కాటువల్ల వచ్చే రోగానికి మంచి మందు కనిపెట్టి దాన్ని రోగులకు ఉచితంగా ఇచ్చి వైద్యం చేయాలంటూ అందుకోసం తన ఆస్తినంతా ఖర్చుపెట్టాలని వీలు నామాలో రాశాడు. ఎలా వుంది, వీరిరువురి దానాల తీరు? ఇద్దరూముందు తరాలవారికై మంచి పనే చేశారు. కాని మొదటాయన చేసిన దానం చాలా క్రూరమైంది. హింసాత్మకం. రెండవవాడు చేసింది సున్నితమైంది. జాతికి బాగా ఉపయోగపడేది. ఈరెండవ పద్ధతి దానాన్నే పెద్దలు మెచ్చుకుంటారు. ఇలాగే దానధర్మాల కోసం ధనం బాగా ఖర్చుపెట్టే దాతలున్నారు. బీదలకు అన్న సత్రాలు కట్టిస్తారు. పాఠశాలలు నెలకొల్పుతారు. బావులు, చెరువులు తవ్విస్తారు. దళిత దీన జనాలకై తిండి, వస్త్రాలు, వసతి వంటివెన్నో కల్పిస్తారు. కానీ ఇలాంటివి చేసే వ్యక్తులకెంతో ఓర్పు, జాలి, దయాదాక్షిణ్యా దులుండటం అవసరం. లేకపోతే ఆ దానాల ఫలితాన్నందు కోలేరు. ముఖ్యంగా ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం ఉండ కూడదు. ‘నా గురించి పదిమంది పొగడాలి’ అనే కాంక్ష ఉండ రాదు. ‘దానం చేయటం నా కర్తవ్యం’ అని భావిస్తూ ఫలాపేక్ష రహితంగా చేసే దానం ఉత్తమం. జయ గురుదత్త!శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

కోకాకోలా ఇండియా రీసైకిల్డ్ జెండాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు..
ఐసీసీ పురుషుల ప్రపంచకప్ 2023 సందర్భంగా కోకాకోలా ఇండియా రీసైకిల్డ్ పెట్ ఇండియా జెండాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జెండా ప్రతిష్టాత్మకమైన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025లో చోటుదక్కించుకుంది. రీసైకిల్డ్ మెటీరియల్ వినూత్న ఆవిష్కరణ కేటగిరీలో ఈ గుర్తింపు దక్కించుకుంది. ఈ మేరకు కోకా-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా పబ్లిక్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ దేవయాని రాణా మాట్లాడుతూ.."ఈ ఆవిష్కరణకు సహకరించిన ‘గో రివైజ్’, ఐసీసీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. రీసైక్లింగ్ వ్యర్థాలను విలువైన వనరులుగా ఎలా మార్చవచ్చో చెప్పేందుకు ఈ జెండా నిదర్శనం. ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు అనేది మా పురురోగతని పునరుద్ఘాటించేలా గర్వపడే క్షణం". అని అన్నారు. ఇక గో రివైజ్ వ్యవస్థాపకుడు యష్ శర్మ ఇది పర్యావరణ బాధ్యతపై శక్తిమంతమైన స్ప్రుహని అందిస్తోంది. కాగా, కోకాకోలా ఇండియా మైదాన్ సాఫ్ ప్రచారంలో భాగంగా ఈ జెండాను ఇలా వినూత్నంగా రూపొందించారు. దీన్ని 11వేల పోస్ట్-కన్స్యూమర్ PET బాటిళ్లతో రూపొందించారు. ఈ జెండాని భారత్లో ఆడే ప్రతి ప్రపంచకప్ మ్యాచ్ ప్రారంభోత్సవ వేడుకలో సగర్వంగా ప్రదర్శిస్తున్నారు నిర్వాహకులు. అంతేగాదు అక్టోబర్ 5, 2023 ప్రారంభమైన ఈ పురుషుల ప్రపంచకప్ టోర్నమెంట్.. నవంబర్ 19 వరకు మొత్తం 19 స్టేడియంలలో సుమారు వెయ్యిమందికి పైగా వాలంటీర్లు రీసైకిల్డ్ పెట్ బాటిళ్లతో తయారు చేసిన సేఫ్టి జాకెట్లను ధరించి, ప్రేక్షకులకు స్టేడియంను క్లీన్గా చూసుకోవడంపై అవగాహన కల్పించడం విశేషం.(చదవండి: ఆ టీచర్ పాఠాలు చెప్పే తీరే వెరేలెవెల్..! ఎవ్వరైనా ఫిదా అవ్సాల్సిందే)

భవసాగరం అంటే..
మనలోని ఏడుపొరలలోని భవసాగరం, నాభి రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ధర్మ సంరక్షణలో మనం ఆనందాన్ని పొందుతాం. మనం ఎవరితోనైనా మంచిగా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. ఈ ధర్మ బద్ధత అనేది మనలోని భవసాగరం పరిశుభ్రంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఉదయం 4 గంటలకే నిద్రలేచి పెద్దగా హారతిపాటలు పాడుతూ, గంధంచెక్క అరగదీస్తూ పెద్ద పెద్ద స్తోత్రాలు పాడుతూ స్నానమాచరించి ఇంటిల్లిపాదికీ నిద్రాభంగం చేసినంత మాత్రాన అది సదాచార పరాయణత్వం కాక పోవచ్చు. పిల్లల్ని నిద్రపుచ్చి తల్లి బహుశా ఎప్పుడో ఆలస్యంగా పడుకుని ఉండవచ్చు. ఈ ధర్మం అనేది అంతర్గతమైనది. ఉదాహరణకు మీరు ఏదైనా ఎవరికైనా దానం చేయాలనుకున్నారనుకోండి. అది మీకు, పరమాత్మునికి మధ్య విషయం మాత్రమే. దానిని బాహ్యంగా ప్రకటించ వలసిన పని లేదు. ధర్మమంటే మిమ్మల్ని మీరు అంతర్ముఖంగా పరిశుభ్రపరచుకోవటం ముఖ్యం. అంతే కానీ వేరెవరినో కాదు. మీ హృదయాన్నుండి వచ్చే ఆ ధర్మానందాన్ని, ఆ రసాన్ని మీరే ఆస్వాదించాలి. మీ పవిత్రతను మీరే ఆస్వాదిస్తారు. ఆనందిస్తారు. ధర్మం అనేది మీ హృదయంలో ఎంతవరకు ఉన్నదనేది ముఖ్యం. అనాహత చక్రం ఇది చాల ముఖ్యమైన చక్రం. అదే హదయ(అనాహత) చక్రం ‘‘ ఉదార చరితానామ్ వసుధైక కుటుంబం’’ అంటే ఉదార స్వభావులైన వారు ప్రపంచమంతా వారి కుటుంబమే అని భావిస్తారు. ప్రతి ఒక్కరిపట్ల ప్రేమ ప్రవహిస్తూంటుంది. ప్రతి ఒక్కరి సమస్య తమ సమస్యగానే భావిస్తారు. ప్రతి ఒక్కరికీ తానొక తల్లిగా ఉండాలి అని భావించుకోవటం అనే గుణం మధ్య హృదయం నుండి వస్తుంది. ప్రప్రథమంగా హృదయ చక్రం విశిష్టత భద్రత. మీలోని భద్రతా భావాన్ని మీరు అనుభూతి చెందటం. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఆ భద్రతాభావాన్ని అనుభూతి చెందగలరు.మీ సంపూర్ణ భద్రత అనేది మీలోని ఆత్మ మాత్రమే. అంతేగాని వేరే ఏవీ ముఖ్యం కావు. మీరు అలాంటి భద్రతాభావం కలిగి ఉన్నవారైతే మీ పిల్లలు కూడా ఆ భద్రత అనేది తమలోనే ఉన్నదని గ్రహిస్తారు. అటువంటి పిల్లలు నిజమైన ధైర్యవంతులుగా ఉంటారు. చదవండి: Murugan పళని మురుగన్కి ప్రణామాలు!మీలోని మీ భద్రతాభావాన్ని మీరు ఆస్వాదించండి. భద్రతాభావం వలన కలిగే ఆనందమే మిమ్మల్ని అధ్యాత్మిక లోతులకు తీసుకుని వెళుతుంది. ఎవరిలో అయితే భగవంతుడు ఉంటాడో, ఎవరికైతే భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయో వారికి అంతకన్నా ఇంకేమి కావాలి? ఎందుకంటే భగవంతుడు సర్వ శక్తిమంతుడు. ఎవ్వరిశక్తీ ఆ భగవంతుని శక్తి కన్నా ఎక్కువకాదు. కాబట్టి మొదటగా మీ మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆ విశ్వాసాన్ని మీ హృదయ చక్రంలో పదిల పరచుకోండి. ఆ విశ్వాసమే మీకు రక్షణ ఆనందాన్నిస్తుంది. ప్రపంచంలోని అభద్రతా భావాలన్నింటికీ విశ్వాసమే సమాధానం. మన హృదయంలో జగదంబ అయిన దుర్గామాతను స్థిరపరచుకోవాలి. – డా. పి. రాకేష్(మన అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనం ఆధారంగా) ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత

బోధనకు సృజన తోడైతే ఇంత బాగుంటుందా..!
చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. ఇక పిల్లలు, పెద్దలు హడావిడి మాములుగా ఉండదు. ఇన్నాళ్లు జాలీగా గడిపిన చిన్నారులకు ఇప్పుడు స్కూల్కి వెళ్లాంటే ఉంటుంది బాధ..మాములుగా ఉండదు. వాళ్లని యథావిధిగా స్కూల్కి వెళ్లేలా చేయలేక పేరెంట్స్ తంటాలు ఓ రేంజ్లో ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో సామాజిక మాధ్యమంలో ఓ టీచర్ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతున్న వైరల్ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇలా ప్రతి టీచర్ పిల్లల్నిఎంజాయ్ చేసేలా పాఠాలు చెబితే వాళ్లు స్కూల్కి వెళ్లనని మారం చెయ్యరు అంటున్నారు నెటిజన్లంతా. మరీ ఆ వీడియో కథాకమామీషు ఏంటో చూద్దామా..!.వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తెరిచిన రోజు సామాజిక మాధ్యమాల్లో ఒక టీచర్ వీడియో వైరల్ అయింది. తొలి రోజు తరగతి గదిలో నృత్యం చేస్తూ, పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్ పేరు వందనరాయ్. కర్నాటకలోని కర్కలకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలను నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటోంది. పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆడుతూ, పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు సందర్భోచితంగా మేకప్ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తారు. ఆమె వీడియోలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. బోధనకు, సృజనాత్మకత తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలు చెప్పకనే చెబుతాయి. "Vandana Rai Karkala, a teacher & a social media sensation"She is a teacher in Karkala, Udupi district. Her teaching methods are integrated with music & nature, rooted in our culture. No wonder her videos have gone viral with millions of views.Youtube: https://t.co/zWQbi6y3Xa pic.twitter.com/Rc3zbBUppQ— Girish Alva (@girishalva) April 24, 2023(చదవండి: రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ప్చ్.. పాకిస్తాన్ పీత కష్టాలు
ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ సూపర్ సక్సెస్.. ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అని డప్పు కొట్టి ప్రకటించుకున్నా పాక్ను పట్టించుకునే నాథుడే(దేశం)కరువయ్యాడు. పైగా 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పాక్ పాలిట పీడకలగా తయారయ్యాడు.భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఈ విషయాన్ని బయటపెట్టిన డామియన్.. ఇప్పుడు మరో కీలక సమాచారాన్ని ఎక్స్ వేదికగా వదిలాడు. అందులో రహీం యార్ ఖాన్ బేస్ను పాక్ ఎంతకీ పునరుద్ధరించలేకపోతోందని వెల్లడించాడు.Pakistan once again issues a NOTAM for Rahim Yar Khan, the runway struck by India in May 2025 now remains offline estimated till 04 July 2025 pic.twitter.com/M6nE1ONTmL— Damien Symon (@detresfa_) June 19, 2025ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఫేజ్1లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం.. ఫేజ్2లో రహీమ్ యార్ ఖాన్ బేస్ను సైతం దెబ్బ తీసింది. అయితే జులై 4వ తేదీ దాకా దాని కార్యకలాపాలు ప్రారంభం కాబోవని పాక్ సైన్యం తాజాగా నోటామ్(notice to airmen) సైతం జారీ చేసింది.ఆపరేషన్ సిందూర్లో భాగంగా.. పక్కా ప్రణాళికతో భారత్ ఈ ఎయిర్బేస్ను దెబ్బ తీసింది. దీంతో పాకిస్తాన్కు జరిగిన నష్టం మాములిది కాదు. పంజాబ్ ప్రావిన్స్లో పాక్కు ఇదే వ్యూహాత్మక స్థావరంగా ఉండేది. అంతేకాదు.. ఈ ఎయిర్బేస్కు అనుసంధానంగా రహీమ్ యార్ ఖాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఒకే రన్వే ఉన్న ఈ ఎయిర్పోర్టును భారత్ జరిపిన దాడి తర్వాత వారం పాటు మూసే ఉంచుతామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే అది కూడా ఇప్పటిదాకా తెరుచుకోకపోవడం గమనార్హం. దీంతో.. దాడి ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ‘‘అది ఇంకెప్పటికి తెరుచుకుంటుందో?’’ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.India didn’t just respond, it decimated yet another key site of #Pakistan's attack. #Rahimyarkhan airport, a key launchpad for Pakistani drone attacks, now lies in ruins.Precision. Power. Payback.#PakistanIndianWar pic.twitter.com/zvkaaWFH5R— DrVinushaReddy (@vinushareddyb) May 10, 2025విశేషం ఏంటంటే.. రాజస్థాన్ బికనీర్లో నిర్వహించిన ఓ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్బేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాక్ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది. అది ఎప్పటికీ తిరిగి తెరుచుకుంటోందో కూడా చెప్పలేకపోతున్నారు అని మోదీ తన ప్రసంగంలో వ్యంగ్యం ప్రదర్శించారు. " مودی" نے رحیم یارخان ائیر بیس تباہ کردیا 😂😂راجھستان ، رحیم یارخان بارڈر کے دوسری طرف عوامی جلسے سے خطاب#modi #rajasthan #RahimYarKhan #rahimyarkhanpakistan pic.twitter.com/9oRsvL5ql6— Rana Kashif (@ranakashi102) May 23, 2025📍రహీం యార్ ఖాన్ (Rahim Yar Khan) పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఒక ప్రముఖ నగరం(జిల్లా కేంద్రం కూడా). ఇది పాకిస్తాన్లో 21వ అతిపెద్ద నగరం. ఈ నగరం పూర్వపు పేరు నౌషెహ్రా. అయితే 1881లో బహావల్పూర్ రాష్ట్ర నవాబ్ సాదిక్ ఖాన్ IV.. తన కుమారుడు రహీం యార్ ఖాన్ (1877–1881) పేరును ఈ నగరానికి పెట్టాడు. ఈ ప్రాంతంలో పట్టన్ మినారా అనే 2000 సంవత్సరాల పురాతన బౌద్ధ స్థూపం ఉంది, ఇది మౌర్యుల హక్రా లోయ నాగరికతకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తుంటారు.

లాడెన్ను అంత తేలికగా మరిచిపోయారా?
పహల్గాం ఘటన తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తన మధ్యవర్తిత్వంతోనే చల్లారాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్న మ్యాటర్ తెలిసిందే. అంతేకాదు.. అందుకు సహకరించారంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను వైట్హౌజ్కు ఆహ్వానించి మరీ భోజనం పెట్టారు. ఈ పరిణామంపై తిరువనంతపురం(కేరళ) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యంగ్యంగా స్పందించారు.‘‘పాకిస్తాన్ అనేది గతంలో ఒసామా బిన్ లాడెన్ను తమ సైనిక శిబిరం సమీపంలో దాచిన దేశం. అలాంటి దేశానికి చెందిన సైన్యాధిపతికి అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యమివ్వడం విడ్డూరం. ఈ పరిణామం.. బహుశా అమెరికా ప్రజలు ఒసామాను మరిచిపోయారా? అనే సందేహాన్ని కలిగిస్తోంది’’ అని థరూర్ వ్యాఖ్యానించారు. .. పాక్ ప్రతినిధి బృందాన్ని కలిసిన కొంతమంది అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు ఉన్నారు. కానీ ఒసామా బిన్ లాడెన్ అనే పేరును అమెరికన్లు అంత త్వరగా మరచిపోయి ఉండరని నేను అనుకోను. ఇది అమెరికన్లకు అంత సులభంగా మరిచిపోలిగిన విషయమైతే కాదు. పాక్ లాడెన్ను తన ఆర్మీ శిబిరం దగ్గర దాచిన విషయంలో బాధ్యత వహించాల్సిందే. వారు(పాక్) అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రదాడికి కారణమైన వ్యక్తిని రహస్యంగా దాచారు. పైగా భారత్పై ఉగ్రదాడులకు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు... కనీసం ఈ సమావేశాన్ని ఉపయోగించుకుని అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పాక్ ఆర్మీ చీఫ్ను హెచ్చరించి ఉండాలి. వాళ్ల దేశం నుంచి ఉగ్రవాదులను ఆర్థికంగా, సాయుధంగా, శిక్షణ ఇచ్చి మరీ భారత్కు పంపడం మంచిది కాదని చెప్పి ఉండాలి. మందు, విందుతో పాటు పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు ఈ విషయాలన్నీ చెప్పి ఉండాలి. ఎందుకంటే ఇదంతా అమెరికా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కూడా’’ అని థరూర్ ఖ్యానించారు. పహల్గాం దాడి తర్వాత.. పాక్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో తెలియజేసేందుకు ఎంపీల అఖిల పక్ష బృందాలను పలు దేశాలకు కేంద్రం పంపుతోంది. అందులో శశిథరూర్ కూడా ఉన్నారు.#WATCH | Thiruvananthapuram, Kerala | On US President Donald Trump's lunch meeting with Pakistan Army Chief Asim Munir, Congress MP Shashi Tharoor says, "I hope the food was good and he gets some food for thought in the process. I hope that in these interactions, the Americans… pic.twitter.com/QJn6BHEjoY— ANI (@ANI) June 19, 20252001 సెప్టెంబర్ 11వ తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్పై ఉగ్రదాడి జరిగి 3 వేల మందికిపైగా మరణించారు. ఈ దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా ఉందని తేలింది. పదేళ్ల తర్వాత.. 2011, మే 2వ తేదీన అమెరికా నేవీ సీల్ బలగాలు పాకిస్తాన్లోని అబోట్టాబాద్ అనే పట్టణంలో నిర్వహించిన రహస్య ఆపరేషన్లో లాడెన్ను హతమార్చాయి. ఇందుకోసం జరిపిన ఆపరేషన్కు Operation Neptune Spear అనే కోడ్ పేరు పెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ఈ దాడిని పర్యవేక్షించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే తానే చెబితేనే యుద్ధం ఆగిందని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ల చొరవతోనే ఇది సాధ్యమైందని చెబుతూ ఇద్దరినీ వైట్హౌజ్ లంచ్ ఈవెంట్కు ఆహ్వానించారు. అసిమ్ మునీర్ అప్పటికే అమెరికా చేరుకోగా.. జీ7 సదస్సుకు హాజరైన మోదీతో ట్రంప్ ఫోన్లో 35 నిమిషాలపాటు సంభాషించారు. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన మోదీ.. ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారన్న ప్రకటనను తోసిపుచ్చారు. పాక్ ఆర్మీ బతిమాలినందు వల్లే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందని, భారత్-పాక్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం జరగలేదని.. ఇక మీదటా జరగబోదని ట్రంప్తో స్పష్టం చేశారు.

ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజా టెల్ అవీవ్ ఆస్పత్రి దాడిని ఉద్దేశించి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్(israel katz) స్వయంగా ఈ ప్రకటన చేశారు.తాజాగా.. టెల్ అవీవ్లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్తో ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడికి ఇరాన్ సుప్రీం ఖమేనీ(Khamenei)నే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ .. త్వరలోనే ఆయన కథ ముగిస్తామని, ఇరాన్ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్ 13వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా ఇరాన్ సుప్రీంను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. ఈ బెదిరింపులను ఖమేనీ తీవ్రంగా భావించే పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘బెదిరింపులకు తలొగ్గం.. యుద్ధం తీవ్రతరం అయ్యింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు గట్టి సందేశాలు పంపుతున్నారు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఓ వీడియో సందేశం సైతం విడుదల చేశారాయన. ‘‘ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని వాళ్లు(ట్రంప్, నెతన్యాహులను ఉద్దేశిస్తూ) తెలుసుకోవాలి. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో వాళ్ల సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలి అని ఖమేనీ తన సందేశం పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఖమేనీకి బెదిరింపులపై లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా తీవ్రంగా స్పందించింది. ఈ బెదిరింపులు మూర్ఖపు చర్య అని, అలాంటి ప్రయత్నాలు జరిగితే తాము చూస్తూ ఉండబోమని, అమెరికా-ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. ఎవరీ ఖమేనీ.. అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ (Ayatollah Sayyid Ali Khamenei) ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్. అత్యంత శక్తివంతమైన ప్రపంచాధినేతల్లో ఒకరు. ఖమేనీ ఒక షియా మత పండితుడు మాత్రమే కాదు.. రాజకీయ నేతగా ఇస్లామిక్ విప్లవంలో కీలకంగా వ్యవహరించాడు. 1989లో అయతొల్లా ఖోమేనీ మరణం తర్వాత ఇరాన్కు సుప్రీం అయ్యారు. ఖమేనీ (మధ్యలో వ్యక్తి)ఖమేనీ జీవిత నేపథ్యం:పుట్టిన తేదీ: జూలై 17, 1939స్థలం: మష్హద్, ఇరాన్విద్య: మష్హద్, కూమ్ నగరాల్లో మత విద్యవృత్తి: మత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడురాజకీయ ప్రస్థానం:1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు.విప్లవం తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా 1981 నుంచి 1989 వరకు పనిచేశారు.1989లో ఖోమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్గా పగ్గాలుసుప్రీం లీడర్గా.. ఇరాన్లో సుప్రీం లీడర్ పదవి అత్యున్నతమైనది. ఖమేనీకి సైనిక, న్యాయ, మత వ్యవస్థలపై పూర్తి నియంత్రణ ఉంది. విదేశాంగ విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనదే. ఆయన నియామకాలు, ఆదేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ పేరు మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి.

Donald Trump: అబ్బా.. ఏం గుండెరా వాడిది!
అమెరికా అధ్యక్ష భవనం చరిత్రలోనే తొలిసారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హయాం ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది. వైట్హౌజ్ ఆవరణలో రెండు భారీ జెండా స్తంభాలు ఏర్పాటు అయ్యాయి. పైగా అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పోల్స్ అంటూ ట్రంప్ తనదైన శైలిలో ఓ ప్రకటన చేశారు కూడా.బుధవారం ఆ పోల్స్ను వైట్హౌజ్ భవనం బయట దక్షిణం వైపు, ఉత్తరం వైపు మరొకటి ఏర్పాటు చేయించారు(White House Huge Poles). ఆ మరుసటి రోజు అమెరికా జెండాను ఆవిష్కరించి.. సెల్యూట్ చేశారు. అయితే.. మొదటి టర్మ్(2013-2020) టైంలోనే ఇలా ఏర్పాటు ఎందుకు చేయించలేదని కొందరు మీడియా వాళ్లు అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ‘‘చాలా కాలం కిందటే ఇలా చేయాలని అనుకున్నా. తొలి టర్మ్లో అన్ని కళ్లు, వేళ్లు నా వైపే ఉండేవి. ఎక్కడ నేను దొరుకుతానా? అని విమర్శకులు వెంటాడేవాళ్లు. ఇప్పుడు నేనే అందరినీ వేటాడుతున్నా. చాలా తేడా ఉంది కదా. అందుకే ఇప్పుడు కుదిరింది’’ అని బదులిచ్చారు.అంతేకాదు.. రియల్టర్ అయిన ట్రంప్ ఆ పోల్స్ను ఎంపిక చేయడం మాత్రమే కాదు.. ఎక్కడ పాతాలో(ఏర్పాటు చేయాలో) కూడా స్వయంగా స్థలాన్ని సిబ్బందికి వెతికి చూపించారట. అయితే ఆ స్తంభాలను అక్కడ ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందించే క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పోల్స్ ఏర్పాటు చేసిన సిబ్బంది ఒక్కొక్కరిని పిలిచి ట్రంప్ కరచలనం చేశారు. ఆ సమయంలో వెనకాల.. ఓ క్రేన్ ఆపరేటర్(Crane Driver Trump Funny) కునుకు తీస్తూ కనిపించాడు. అయితే ట్రంప్ అది గమనించకుండా సిబ్బందితో ఫొటోలు దిగసాగారు. ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అతగాడు ట్రంప్ ముందు అంత దర్జాగా ఆ పని ఎలా చేయగలిగాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు జస్ట్ మిస్ అంటూ కామెంట్ పెన్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి.. అతను ఇప్పుడు అసలు ప్రాణాలతో ఉన్నాడా? అని ఆరాలు తీస్తున్నారు.NEW: Crane operator appears to take a quick nap during the installation of President Trump's flag pole at the White House.The president was seen taking pictures with workers while the man sat back in the crane.Trump says the two large flag poles were his gift because it was… pic.twitter.com/QYZONrjlKO— Collin Rugg (@CollinRugg) June 18, 2025ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికారంతో వైట్హౌజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చిరాగానే.. ఓవల్ ఆఫీస్లో ఫొటోలన్నీంటిని మార్పించేశారు. పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం ఫొటోను ప్రముఖంగా ఆఫీస్లో ఏర్పాటు చేయించుకున్నారు. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రోజ్ గార్డెన్ను ఏర్పాటు చేయించారు. అయితే ఆ గార్డెన్లో నిర్మాణ పనులు జరపాలని ట్రంప్ తాజాగా ఆదేశించారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. అక్కడి గడ్డిలో హైహీల్స్తో నడిచేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారని!!.
జాతీయం

54 ఉన్నత విద్యాసంస్థలకు గ్లోబల్ గుర్తింపు
సాక్షి. న్యూఢిల్లీ: విద్యారంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్–2026లో మన దేశానికి చెందిన 54 ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ రంగంలో ఇప్పటివరకు భారత్ అందుకున్న అతిపెద్ద గ్లోబల్ రికార్డు ఇది. లండన్కు చెందిన గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ సంస్థ క్వాక్క్వరెల్లీ సిమండ్స్ (క్యూఎస్) గురువారం విడుదల చేసిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్–2026 జాబితాలో ప్రపంచంలోని 1,500కి పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ కోసం అకడెమిక్ ప్రతిష్ట, ఫ్యాకల్టీ–సూ్టడెంట్ నిష్పత్తి, రీసెర్చ్ ప్రభావం, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం, గ్రాడ్యుయేట్ల ఉద్యోగావకాశాలు వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వరుసగా 14వ సంవత్సరం ‘ఎంఐటీ’టాప్.. అమెరికా కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయంగా వరుసగా 14వ సంవత్సరం కూడా తొలి ర్యాంకు పొందింది. తరువాత.. ఇంపీరియల్ కాలేజ్ లండన్ రెండో స్థానంలో, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మూడవ స్థానంలో ఉన్నాయి. జాబితాలో 192 విద్యాసంస్థలతో అత్యధిక ప్రాతినిధ్యం వహించే దేశంగా అమెరికా ఉంది. గత సంవత్సరం నుండి దాదాపు 500 విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నాయి. వీటిలో మలేసియాలోని సన్వే యూనివర్సిటీ 120 స్థానాలకు పైగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. భారత్లో ఐఐటీ–ఢిల్లీ టాప్.. ఇక ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న భారత్లోని 54 ఉన్నత విద్యాసంస్థల్లో 65.5 స్కోర్తో ఐఐటీ–ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2025లో 150, 2024లో 197 ర్యాంకు నుంచి ఈ ఏడాది ప్రపంచంలో 123వ స్థానానికి చేరుకుంది. అకడమిక్ రెప్యుటేషన్లో 142వ స్థానంలో, ఫ్యాకలీ్టకి సైటేషన్స్లో 86వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర ఐఐటీలు, ప్రధాన వ ర్సిటీలూ ప్రభావవంతమైన ప్రదర్శన చేశాయి. ఐఐటీ హైదరాబాద్కు 664వ ర్యాంకు, వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ (విట్)కు 691వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 801–850 మధ్య ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 1,201–1,400 మధ్య ర్యాంకులో నిలిచింది. అలాగే, ఐదు భారతీయ విశ్వవిద్యాలయాలు ఎంప్లాయర్ రెప్యుటేషన్ కోసం పోటీపడి ప్రపంచవ్యాప్తంగా టాప్–100లో స్థా నం సంపాదించాయి. అంతేకాక.. సగటున 43.7 స్కోరుతో 8 భారతీయ విద్యాసంస్థలు పరిశోధన ప్రభావం పరంగా సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీలో టాప్–100లో స్థానం సంపాదించాయి. ఇక 2025లో ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయంగా ర్యాంకు పొంది గతేడాది 118వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే, ఈ సంవత్సరం 129వ స్థానానికి పడిపోయింది. ఐఐటీ మద్రాస్ గతేడాదితో పోలిస్తే 47 స్థానాలు ఎగబాకి 180వ స్థానానికి చేరుకుంది. ఐఐటీ ఖరగ్పూర్ (215), ఐఐఎస్సీ బెంగళూరు (219), ఢిల్లీ వర్సిటీ (328).. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (851–900), బిట్స్ పిలాని (668) వంటివి కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. ప్రపంచంలో భారత్కు 4వ స్థానం.. ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం భారత్ నుంచి ఎనిమిది కొత్త విద్యాసంస్థలు మొదటిసారిగా ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నాయి. దీంతో జాబితాలో చోటు దక్కించుకున్న మొత్తం భారతీయ విద్యా సంస్థల సంఖ్య 54కి చేరుకుంది. అమెరికా (192), యూకే (90), చైనా (72) తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచింది. ఈ సంవత్సరం మరే దేశ విద్యా సంస్థలు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోలేదు. ఇక ఈ ఏడాది ఎనిమిది కొత్త విద్యా సంస్థలకు ర్యాంకులతో భారత్ తొలిస్థానంలో ఉండగా.. జోర్డాన్, అజర్బైజాన్ దేశాలు ఆరు కొత్త సంస్థలతో రెండో స్థానంలో ఉన్నాయి. ప్రధాని, కేంద్రమంత్రి హర్షం.. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ–2026 ర్యాంకింగ్స్లో భారత్ సాధించిన మైలురాయిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు హర్షం వ్యక్తంచేశారు. ఈ ర్యాంకింగ్స్ మన విద్యా రంగానికి గొప్ప కీర్తిని తెస్తున్నాయని.. దేశ యువత ప్రయోజనం కోసం పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థలను మరింతగా పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అలాగే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ‘2014లో కేవలం 11 భారత విద్యాసంస్థలు మాత్రమే ఈ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోగా, ఇప్పుడా సంఖ్య అయిదింతలు పెరిగి 54కి చేరింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో అమలుచేసిన విద్యా సంస్కరణల ఫలితం. అలాగే, నూతన విద్యా విధానం (ఎన్పీఈ)–2020 వల్ల ఇది సాధ్యమైంది. రికార్డు స్థాయిలో 54 సంస్థలు ఆ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోవడం భారత విద్యావ్యవస్థలో సంభవించిన మార్పు, పురోగతికి నిదర్శనం. ఇది ఒక మార్పు మాత్రమే కాదు–ఒక విద్యా విప్లవం’అని తెలిపారు.

బనకచర్లను అడ్డుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫీజబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్–1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం–2014లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జల్శక్తి మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్తోపాటు ఎంపీలు మల్లురవి, రఘువీర్ రెడ్డి, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొందని వివరించారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని.. జీడబ్ల్యూడీటీ–1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని, అయితే బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, జల్శక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కోరారు.వరద నిజమైతే ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానంపై చర్చిద్దాంసీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి పాటిల్కు రేవంత్, ఉత్తమ్ వివరించారు. గోదావరి అవార్డు ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు కొనసాగిస్తూనే ఉందని చెప్పారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం–బనకచర్లకు బదులు, కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి–నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రం స్పందన సానుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.1,500 టీఎంసీలను వాడుకునేలా..» తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి శాఖ, ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్రం ఆమోదం తెలపాలని సీఆర్ పాటిల్కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటి న్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీ లిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.» ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతు ల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని సీఎం రేవంత్ అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నా రు. పాలమూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు అన్ని రకా ల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.» గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్కు రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Ahmedabad Plane Incident: ‘ఒక ఇంజిన్ను మార్చిలో చేంజ్ చేశాం..’
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం ఎయిర్లైన్స ఇండియాపై అపనమ్మకం ఎక్కువ కావడంతో ఆ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విమాన మెయింటినెన్స్ పరంగా చూస్తే తమ నుంచి ఎటువంటి తప్పిదాలు లేకపోయినా ఆ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకర పరిణామమన్నారు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్. ఈ మార్చి నెలలో ప్రమాదానికి గురైన విమానానికి కుడివైపున ఉన్న ఇంజిన్ను మార్చామన్నారు. అదే సమయంలో ఏప్రిల్లో ఎడమవైపు ఇంజిన్ను పరీక్షించామని స్పష్టం చేశారు. అయితే 2024 జూన్లో ఆ విమానానినికి మేజర్ ఇన్స్పెక్షన్ నిర్వహించామని, ఈ డిసెంబర్లో ఆ విమానాన్ని పూర్తి పర్యవేక్షణ అనేది షెడ్యూల్ చేయబడిందన్నారు. ఈ మేరకు సదరు ఎయిర్లైన్స్ సంస్థ లాయల్టీ ప్రొగ్రామ్ మహరాజా క్లబ్ సభ్యులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు క్యాంప్బెల్ విల్సన్. ఇక్కడ విమానం మెయింటినెన్స్ నిర్వహణలో ఎటువంటి లోపం జరగలేదని, పైలట్ల విషయంలో కూడా అపార అనుభవం ఉన్నవారే ఉన్నారన్నారు. ఆ విమానాన్ని నడిపన పైలట్, కో పైలట్లకు ఇద్దరికీ కలిపి 13,400 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉందన్నారు.

Viral Video: కర్రలతో కొట్టుకున్న కేదార్నాథ్ యాత్రికులు
కేదార్నాథ్ యాత్రికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్లో జరిగిన ఈ ఘటనలో యాత్రికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో స్థానిక అధికారులు వెంటనే స్పందించి వారిని చెదరగొట్టారు.పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ కూడా చేశారు. కేదార్నాథ్ యాత్ర మార్గంలో పర్యాటకుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ యాత్రలో కీలక జంక్షన్ అయిన సోన్ప్రయాగ్లోని పార్కింగ్ ప్రాంతంలో కొందరు యాత్రికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. దాడులు చేసుకున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభం నుంచి తరుచూ ఇలాంటి ఘటనలు అశాంతిని కలిగిస్తున్నాయి.Earlier, Indian pilgrims travelled to holy sites for peace and darshan but nowadays we have goons going to Kedarnath and Badrinath with rods and sticks always ready for a fight. pic.twitter.com/Szo2RLMWQV— Uttarakhandi (@UttarakhandGo) June 19, 2025కేదార్నాథ్ యాత్రకు విశేషస్పందన లభిస్తోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. స్థానిక అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మే 2న ఆలయ తలుపులు తెరిచినప్పటి నుంచి 1.14 మిలియన్లకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించారు. అధికారిక లెక్కల ప్రకారం యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు, పోర్టర్లు, హెలి ఆపరేటర్ల సంబంధిత సేవల వ్యాపారం రూ.300 కోట్లు దాటింది.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

మంట కలిసిన మానవ సంబంధం
వరంగల్: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు.లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపలి్లకి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది.

ప్రియుడే కాలయముడు?
విశాఖపట్నం: భీమిలి కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవిత మృతి కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి బీచ్రోడ్డు సమీపంలోని జీడి తోటలో బంగారు కవిత మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడే కవితను కిరాతకంగా హత్య చేసి.. నెల రోజులుగా ఏమీ ఎరుగనట్టు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. క్రైమ్ సినిమా కథను తలపించేలా సాగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివి.. కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవితకు, భీమిలికి చెందిన పారిశుధ్య కార్మికుడు బొడ్డు రాజుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితను అడ్డు తొలగించుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడదామనే నెపంతో గత నెలలో ఆమెను బీచ్రోడ్డు సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వద్దకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఆమెపై రాయితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పక్కనే ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి, ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసి వచ్చేశాడు. ఆ తర్వాత రాజు ఏమీ తెలియనట్టు అందరితో కలిసి తిరుగుతూ, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. కవిత కనబడటం లేదని ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానంతో రాజును పలుమార్లు విచారించారు. అయినప్పటికీ తనకు ఏమీ తెలియదని నమ్మబలుకుతూ దర్యాప్తును పక్కదారి పట్టించాడు. అయితే కవిత మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ఆధారాలతో బొడ్డు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఒక వైపు దారుణ హత్యకు పాల్పడి, మరో వైపు నెలరోజుల పాటు అందరినీ నమ్మించిన రాజు తీరుపై పోలీసులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.

మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్కౌంటర్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అరుణ అలియాస్ అరుణక్క..వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రిఅగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్రగాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్కౌంటర్పై అనుమానాలు.. నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్