Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Praises Shubhanshu Shukla And His Team1
ఇది మనమంతా గర్వించదగ్గ క్షణం: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో అడుపెట్టిన శుభాంశు శుక్లా బృందానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణమైన క్షణమని వైఎస్‌ జగన్‌ కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు జగన్‌.‘28 గంటల ప్రయాణం తర్వాత, అంతరిక్ష నౌక ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా డాకింగ్ జరగటం సంతోషకరం. శుభాంశు శుక్లా బృందం 14 రోజులపాటు పరిశోధనలు చేయబోతున్నారు. నాసా, ఇస్రోలు సంయుక్తంగా ఈ మిషన్‌ను విజయవంతం చేసి ఒక మైలురాయిని అధిగమించాయి.ఈ చారిత్రక విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.Truly a proud moment! Very happy to learn that after a 28-hour journey, the spacecraft successfully docked with the ISS. #ShubhanshuShukla and team are set for 14 days of crucial research. The #Ax4 Mission, a joint effort by NASA and ISRO, marks a significant milestone in space…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025 ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లాISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు‌

Shubhanshu Shukla Axiom-4 At Space Station Shortly2
Shubhanshu Shukla: ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు

సాక్షి,ఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్‌ఎస్‌లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్‌ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్‌ఎస్‌తో స్పేస్‌ డాకింగ్‌ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది. గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. #Ax4's @SpaceX Dragon spacecraft docked with the @Space_Station at 6:31am ET (1031 UTC). Next, the mission crew and our NASA astronauts will prepare to open the hatches. pic.twitter.com/Qj1sgy7RzC— NASA (@NASA) June 26, 2025అమెరికా టూ అంతరిక్షంభారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌. పదేపదే వాయిదాల అనంతరం, యాగ్జియం–4 మిషన్‌ వాణిజ్య మిషన్‌ను వెంట తీసుకుని స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌–9 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్‌ రాకెట్‌ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్‌ పైలట్‌గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌గా శుభాంశు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్‌ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. (Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’)అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్‌ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానం అయ్యింది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్‌ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్‌ పెగ్గీ విట్సన్, మిషన్‌ స్పెషలిస్టులు స్లవోస్‌ ఉజ్నాన్‌స్కీ విస్నియెవ్‌స్కీ (పోలండ్‌), టైబర్‌ కపు (హంగరీ)తో కలిసి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశిస్తారు. LIVE: @Axiom_Space's #Ax4 mission, with crew from four different countries, is about to launch to the @Space_Station! Liftoff from @NASAKennedy is targeted for 2:31am ET (0631 UTC). https://t.co/yBgO8bxb6Z— NASA (@NASA) June 25, 202514 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్‌లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.రాకేశ్‌ శర్మ తర్వాత శుభాంశు శుక్లారాకేశ్‌ శర్మ భారతదేశం తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి. ఆయన 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన సోయుజ్ టి-11 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆయన మొత్తం 7 రోజులు 21 గంటలు 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన భారతదేశాన్ని అంతరిక్షం నుంచి పరిశీలించి, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.రాకేశ్‌ శర్మ తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన రెండో భారతీయుడే ఈ శుభాంశు శుక్లా. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్న సందర్భంలో రాకేశ్ శర్మే తనకు స్పూర్తంటూ శుభాంశు శుక్లా పేర్కొన్నారు. 1984లో రాకేశ్ శర్మను చూసి ఎంతోమంది యువత అంతరిక్షం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పుడు శుభాంశు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ, తదుపరి తరం భారతీయులకు ప్రేరణగా నిలిచారు.

Jasprit Bumrah Is Likely To Miss The 2nd Test Vs England At Edgbaston Due To Workload Management Says Reports3
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. టీమిండియాకు షాకింగ్‌ న్యూస్‌..!

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జులై 2 నుంచి బర్మింగ్హమ్‌ వేదికగా రెండో టెస్ట్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలినట్లు తెలుస్తుంది. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జట్టు యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.బుమ్రా తాజాగా ముగిసిన లీడ్స్‌ టెస్ట్‌లో 44 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఇది అతనిపై అదనపు భారం పడేలా చేసిందని మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది. దీంతో అతనికి రెండో టెస్ట్‌లో విశ్రాంతినిచ్చి, తిరిగి మూడో టెస్ట్‌లో బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ ప్రారంభానికి ముందే బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడడని బీసీసీఐ పరోక్షంగా చెప్పింది. వర్క్‌ లోడ్‌ కారణంగా స్టార్‌ పేసర్‌ కేవలం మూడు మ్యాచ్‌లే ఆడతాడని బోర్డులోని కీలక సభ్యులంతా చెప్పారు.తొలి టెస్ట్‌కు, రెండో టెస్ట్‌కు మధ్య 8 రోజుల గ్యాప్‌ ఉండటంతో బుమ్రా రెండో టెస్ట్‌లో ఆడతాడని అంతా అనుకున్నారు. ఒకవేళ విశ్రాంతినిచ్చినా, చివరి మూడు టెస్ట్‌ల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే తొలి టెస్ట్‌లో పడిన అదనపు భారం కారణంగా బుమ్రా విషయంలో ప్రణాళికలు మారాయని తెలుస్తుంది. బుమ్రా విషయంలో బీసీసీఐ ఎలాంటి సాహసాలు చేసేందుకు సిద్దంగా ఉండదు. జులై 10 నుంచి లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రా సిద్దంగా ఉండే అవకాశం ఉంది. 16 రోజుల గ్యాప్‌లో బుమ్రా పూర్తి సన్నద్దత సాధించవచ్చు.రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడకపోతే సిరాజ్‌ భారత పేస్‌ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ఇప్పటికే తొలి టెస్ట్‌ కోల్పోయి సిరీస్‌లో వెనుకపడిన టీమిండియాకు ఇది అంత శుభపరిణాయం కాదు. తొలి టెస్ట్‌లో బుమ్రా మినహా పేసర్లంతా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా కూడా రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపించలేకపోయాడు. రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడినా, ఆడకపోయిన భారత బౌలింగ్‌ విభాగంలో భారీ మార్పులకు ఆస్కారం ఉంది.ఒకవేళ బుమ్రా ఆడకపోతే ఆకాశ్‌దీప్‌, అర్షదీప్‌ సింగ్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. బుమ్రా ఆడకుండా, తొలి టెస్ట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్‌ కృష్ణపై కూడా వేటు పడితే ఆకాశ్‌దీప్‌, అర్షదీప్‌ సింగ్‌ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది. తొలి టెస్ట్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్‌ ఠాకూర్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో రిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్‌ విభాగం​లో భారత్‌ ఎలాంటి సాహసాలు చేయకపోవచ్చు.పూర్తి లైనప్‌ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌లో సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌ విఫలమైన వారికి మరో ఛాన్స్‌ తప్పక ఉంటుంది. టీమిండియా విషయాన్ని పక్కన పెడితే ఇంగ్లండ్‌ రెండో టెస్ట్‌ కోసం​ జట్టును ప్రకటించింది. ప్రమాదకర పేసర్‌ జో​ఫ్రా ఆర్చర్‌ నాలుగేళ్ల తర్వాత టెస్ట్‌ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

 Navy staffer leaked Operation Sindoor information to Pak4
‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్‌ సింధూర్‌ సమాచారం పాక్‌కు అమ్మేశాడు!

ఇటీవల కాలంలో పాకిస్తాన్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్‌ ఏదైనా ఉంది అంటే అది.. ఆపరేషన్‌ సింధూర్‌. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. భారత్‌ చేపట్టిన ఆ మెరుపు ఆపరేషన్‌కు పాక్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. ఇక ఎప్పుడైనా పాకిస్తాన్‌ దుశ్చర్యలకు పాల్పడి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆపరేషన్‌ సింధూర్‌ మళ్లీ ఆరంభమవుతుందనే గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఫహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఆపరేషన్‌ సింధూర్‌ వివరాలను పాకిస్తాన్‌కు భారత్‌కు చెందిన వ్యక్తి చేరవేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నావీ డైరెక్టర్‌ ఆఫ్‌ ద డాక్‌యార్డ్‌లో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌గా పని చేస్తేన్న విశాల్‌ యాదవ్‌ అనే వ్యక్తి.. ఆపరేషన్‌ సింధూర్‌ సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విశాల్‌ యాదవ్‌,. ప్రియురాలి మోజులో పడి ఆ సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్‌కు చెందిన ప్రియగా పరిచయమై..భారత్‌కు చెందిన అమ్మాయిగా, ప్రియా శర్మగా పరిచయం అయిన సదరు అమ్మాయి.. సోషల్‌ మీడియ ద్వారా విశాల్‌ను ఆకట్టుకుంది. తాను భారత్‌కు చెందిన అమ్మాయినంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఈ పరిచయం అలా మొదలై.. వాట్సాప్‌ వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే భారత్‌ చేపట్టిన పలు ఆపరేషన్ల సమాచారాన్ని విశాల్‌ నుంచి తస్కరించింది. తొలుత చిన్నా చితకా భారత డిఫెన్స్‌ వ్యవహారాల సమాచారాన్ని తనకు తెలియకుండానే పాక్‌కు చేరవేసిన విశాల్‌.. ఆపై పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్‌ సింధూర్‌ సమాచారాన్ని సైతం అమ్మేశాడు. ప్రధానంగా ఆపరేషన్‌ సింధూరు సమాచారాన్ని రూ. 50 వేలకు అమ్మేసిట్లు తేలగా, మొత్తంగా రూ. 2 లక్షల వరకూ ఇలా సమాచారాన్ని అమ్మి డబ్బులు చేసుకున్నాడు విశాల్‌.పోలీసులు ఏం చెబుతున్నారంటే..తొలుత ఫేస్‌బుక్‌లో విశాల్‌కు ఫ్రెండ్‌ రిక్వస్ట్‌ పెట్టి పరిచయయ్యింది. ఒక ఫేక్‌ ఐడెంటీతో పరిచయం అయిన అమ్మాయి.. భారత్‌కు చెందిన ప్రియా శర్మగా పరిచయం అయ్యింది. అనంతరం మెల్లగా అతన్ని మాయమాటల్లో పెట్టి, వరుసగా భారత ఆపరేషన్ల సమాచారాన్ని దొంగిలించింది. ఈ క్రమంలోనే విశాల్‌కు డబ్బులు ఆశపెట్టి మరీ తనపని తాను కానిచ్చేసింది. సీఐడీ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ విష్ణు కాంత్‌ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారాన్ని పాక్‌కు చేరవేసినందకు రూ. 2 లక్షల వరకూ విశాల్‌ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆపరేసన్‌ సింధూర్‌ సమాచారానికి రూ. 50 వేలు ప్రత్యేకంగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.

Netherlands Queen Maxima mock US President Donald Trump5
దేశపు యువరాణి ట్రంప్‌ను వెక్కిరించింది?!.. వీడియో వైరల్

ఆమ్‌స్టర్‌డ్యామ్: అధికారిక పర్యటనలో భాగంగా నెదర్లాండ్‌ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను (Donald Trump) ఆ దేశపు క్వీన్‌ మాక్సిమా (Queen Maxima) వెక్కిరించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల నెదర్లాండ్స్‌ (Netherlands)లో నాటో సమ్మిట్ జరింగింది. ఆ సమ్మిట్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరయ్యారు. అక్కడ రాజకీయ అతిథిగా హుయిస్ టెన్ బోష్ అనే రాయల్‌ ప్యాలెస్‌లో కింగ్ విలెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా అతిథిలుగా వచ్చారు. అక్కడ జరిగిన అధికారిక ఫోటోషూట్ సమయంలో ట్రంప్ మాట్లాడిన తరవాత, క్వీన్ మాక్సిమా అతని ముఖభావాలను అనుకరించినట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని భావించగా, మరికొంతమంది మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అంటున్నారు. ఇది నిజంగా ట్రంప్‌ను వెక్కిరించారా? లేక కేవలం సరదాగా జరిగిన సంఘటనా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. Queen #Máxima of the #Netherlands mocked #Trump's facial expressions.🙃No hint of condemnation – just understanding. pic.twitter.com/hNP3Rp2UaM— Boris Alexander Beissner (@boris_beissner) June 25, 2025

youth finance eight money lessons must know6
మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..

డబ్బుకు సంబంధించిన పాఠాలు నిత్యం చాలామంది చెబుతూంటారు. ‘ఎక్కువ పొదుపు చేయండి..తక్కువ ఖర్చు పెట్టండి..’ వంటి సలహాలను తరచుగా వింటుంటారు. కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్‌గా వాటి అర్థం ఏమిటో కొందరు మాత్రమే చెబుతారు. డబ్బు నిర్వహణ అంటే బడ్జెట్‌ను తయారు చేయడం మాత్రమే కాదు, ఏది అవసరమో..ఏది కాదో తెలుసుకుని మసులుకోవడం అని నిపుణులు చెబుతున్నారు. సీఏ నితిన్ కౌశిక్ 30 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎనిమిది ముఖ్యమైన డబ్బు పాఠాలను తెలిపారు.నితిన్‌ తన లింక్డ్‌ఇన్‌లో రాసిన వివరాల ప్రకారం..‘ఎవరూ మీకు బోధించని 8 కఠినమైన డబ్బు సత్యాలు (అయితే ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల లోపు తప్పకుండా నేర్చుకోవాలి)ఇవి. డబ్బు ఆదా చేయడం అంటే ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు. తర్కంతో ఆలోచించి ఖర్చు చేయడం. చాలా మంది ఆలస్యంగా నేర్చుకునే నిజమైన వివరాలు ఇవి. కాబట్టి మీరు 30 ఏళ్లు దాటడానికి ముందే తెలుసుకోవాల్సిన ఎనిమిది కఠినమైన, నిజమైన డబ్బు పాఠాలను చూద్దాం’ అంటూ నితిన్‌ రాసుకొచ్చారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే క్వాలిటీ వస్తువులపై పెట్టుబడులు పెట్టాలి. చీప్‌గా వస్తుందని కొనుగోలు చేస్తే ఎక్కువసార్లు దాన్ని రీప్లేస్‌ చేయాల్సి వస్తుంది.ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు భారీ ఫర్నిచర్ కొనవద్దు. ఎందుకంటే తరలింపు ఖర్చులు భారంగా మారుతాయి. దీర్ఘకాలిక ఖర్చులకు దారితీస్తూ, స్వల్పకాలిక పొదుపును నివారించే వాటికి దూరంగా ఉండాలని దీని ఉద్దేశం.ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో మీ జీతంలో కనీసం 5 శాతాన్ని నగదు రూపంలో పొదుపు చేయండి. ఫిజికల్ మనీ మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేసేలా చేస్తుంది.ఫోన్ ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకు లేటెస్ట్, ఖరీదైన ఫోన్ అవసరం లేదు. మీ పనులకు నిజంగా ఏది అవసరమో దాన్ని కొనుగోలు చేయండి. అంతకు మించి వద్దు. ఖరీదైన గాడ్జెట్లు త్వరగా వాటి విలువను కోల్పోతాయి.చాలా మంది యువకులు తాము ఫిట్‌గా ఉన్నామని భావించి ఆరోగ్య బీమా తీసుకోరు. కానీ ఊహించని ఒక ఆసుపత్రి బిల్లు కనీసం ఆరు నెలల పొదుపును తుడిచివేస్తుంది. ఆర్థిక భద్రత అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు. ఊహించని ఖర్చుల నుంచి రక్షణ పొందడం అని గుర్తించాలి.ఇదీ చదవండి: బంగారం కంటే వెండి ముద్దుఅనారోగ్యకరమైన ఆహార విధానం మీ శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా వైద్య బిల్లులను పెంచుతుంది. చక్కెర, పామాయిల్ తగ్గించాలి. అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి.క్రెడిట్ కార్డు అనే ఉచితంగా వచ్చే డబ్బు కాదు. సరైన పద్ధతిలో వాడితే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ మీరు దీన్ని మీ ఆదాయ వనరుగా భావిస్తే అప్పుల్లో పడతారు.డబ్బును గౌరవించే వారితో స్నేహం చేయండి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారితో సావాసం చేయాలి. డబ్బును అర్థం చేసుకోని వ్యక్తితో ఉంటే జీవితం దారుణంగా మారుతుంది. ప్రేమ ఒక్కటే ఉంటే ఈఎంఐలు చెల్లించలేరు.

US Embassy in India Mandates Disclosure of Social Media Handles for Visa Applicants7
షాకిచ్చిన ట్రంప్‌.. సోషల్‌ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!

వాషింగ్టన్‌: వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ షాకిచ్చారు. వీసా అప్లయి దారులు వారి సోషల్‌ మీడియా అకౌంట్ల వివరాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్‌ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్‌ మీడియా అకౌంట్లలో వీసా అప్లయి దారులు ఏ మాత్రం నెగిటీవ్‌ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెటట్టడం అసాధ్యం అవుతుంది.ఉదాహారణకు నార్వేకు చెందిన 21ఏళ్ల మాడ్స్‌ మికెల్సెన్‌ అమెరికాలో పర్యాటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్‌ ఫోన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బట్టతలతో ఉన్న మీమ్‌ ఫొటో ఉంది. అంతే ఆ ఫొటొ దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు. మాడ్స్‌ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగుపెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోనున్నారు. అందుకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకి ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?.అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.Visa applicants are required to list all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and… pic.twitter.com/ZiSewKYNbt— U.S. Embassy India (@USAndIndia) June 26, 2025 సోషల్‌ మీడియాతో తస్మాత్‌ జాగ్రత్త.. లేదంటే నో వీసాఅమెరికా వెళ్లేందుకు వీసా అప్లయి చేసుకునే అభ్యర్థులు వారి ఐదేళ్లకు సంబంధించిన అన్నీ సోషల్‌ మీడియా అకౌంట్ల (సోషల్‌ మీడియా వెట్టింగ్‌) వివరాల్ని డీఎస్‌-160ఫారమ్‌లో బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారమ్‌లో వీసా కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్‌ మీడియా అకౌంట్స్‌ వివరాల్ని ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారమ్‌లో అభ్యర్థులు వారి సోషల్‌ మీడియా వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మీ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను చెక్‌ చేస్తారు. అందులో ఏ మాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు.అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలాఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థుల్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్‌లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన అందుకు అనుగుణంగా గత సోమవారం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి, యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల, వలసేతర వీసా దరఖాస్తు ఫారమ్‌లపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్‌లను అందించాలని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా, యునైటెడ్ స్టేట్స్‌కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్, వెట్టింగ్‌లో అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము’ అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Manchu Vishnu Clarity Makers Press Note On Negative Reviews In Social Media8
‘కన్నప్ప’ నిర్మాణ సంస్థ వార్నింగ్‌.. అలా చేయడం వల్లేనన్న విష్ణు!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్‌ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే ఇటీవల'కన్నప్ప' తీసిన నిర్మాణ సంస్థ చాలా ఓ ప్రెస్‌ నోట్ రిలీజ్ చేసింది. క్రిటిక్స్, యూట్యూబర్స్ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్‌గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు నోట్‌లో రాసుకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ప్రెస్‌మీట్‌లో మంచు విష్ణు స్పందించారు.చెన్నైలో కన్నప్ప సినిమా చూసిన ఒకతను నన్ను కౌగిలించుకుని ఏడ్వడం మొదలెట్టారు.. చివరిగంట నా లైఫ్‌లో చూడలేదని చెప్పాడు. మహానటుడు రజినీకాంత్‌ సినిమా చూసిన చెప్పిన మాట నా లైఫ్‌లో మర్చిపోలేనని అన్నారు. అయితే కన్నప్ప చూసిన ఒకతను రివ్యూ ఇచ్చేశాడు. ఈ రివ్యూ వచ్చిన మూడు గంటల్లో ట్విటర్‌లో దాదాపు 42 మంది రివ్యూలు రాసి 0.5 రేటింగ్ ఇచ్చారని తెలిపారు. అయితే కొందరు కన్నప్ప సినిమా చూడకుండానే ట్విటర్‌లో రివ్యూలు ఇ‍చ్చారని అన్నారు. అందువల్లే ఇలాంటి వారిని అరికట్టడం కోసమే కాపీరైట్ స్ట్రైక్, లీగల్ ప్రొసీజర్ తప్ప ఎవర్నీ బెదిరించడం నా ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. మీ వల్లే సినిమాలు వెళ్తాయని.. సినిమా చూస్తూ రివ్యూలు పెట్టడం పైరసీ చేయడంతో సమానమన్నారు. ట్విటర్‌, యూట్యూబ్‌లో సినిమా చూసేటప్పుడు పెట్టే వాళ్లను బ్లాక్‌ చేశామని తెలిపారు. అంతే తప్ప వార్నింగ్ ఇచ్చే సీన్ నాకు ఎక్కడిదంటూ నవ్వుతూ అన్నారు.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఇందులో బాలనటులుగా చేశారు.

Incident Of Woman Driving Car On Railway Tracks Is Creating Sensation9
రైల్వే ట్రాక్‌పై 7 కిలో మీటర్లు కారు నడిపి.. ఇంతకీ ఎవరీ యువతి?

సాక్షి, హైదరాబాద్‌: పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి అంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతిని వోమిక సోనీగా గుర్తించారు. చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొండకల్ నుంచి చిన్న శంకర్‌పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్‌, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.20 నిమిషాల నుంచి 7:40 వరకు ట్రాక్‌ పైనే వోమిక సోనీ కారును నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారును శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌కు తరలించారు.కారును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, అగ్గిపెట్టె, డ్రై ఫ్రూట్స్‌ ఉన్నాయి. నాన్ చాక్‌తో స్థానికులపై వోమిక సోనీ దురుసుగా ప్రవర్తించింది. ఆమె మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మతిస్థిమితం, డ్రగ్స్ తీసుకున్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.🚨 Shocking in Shankarpalli, Vikarabad A woman was spotted driving her car on a railway track towards Hyderabad! Railway staff halted trains, including one from Bengaluru to Hyderabad. Despite efforts to stop her, the woman kept driving on the tracks. Authorities are… pic.twitter.com/BK1MfZDHb8— Sowmith Yakkati (@YakkatiSowmith) June 26, 2025కాగా, వోమిక సోనీ.. గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. కారు నుంచి బయటికి రాకపోవడంతో కారు డోర్స్ బ్రేక్‌ చేసి మరి.. స్థానికులు, అధికారులు బయటికి దింపారు. స్థానికులు, అధికారులపైకి నాన్ చాక్‌తో దాడికి దిగింది.

Isha Ambani confirmed as chair of the Serpentine Summer Party 202510
కొత్త శకానికి నాంది పలికిన ఇషా అంబానీ

రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమార్తె, వ్యాపారవేత్త ఇషా అంబానీ (Isha Ambani ) మరో ఘనతను సాధించారు సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025 ((Serpentine Summer Party 2025)కి తొలి భారతీయ చైర్‌పర్సన్‌గా ఎంపికై కళా ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికారు.సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 25వ వార్షికోత్సవం సందరబంగా తొలి బారతీయ చైర్‌గా ఇషా ఎంపికయ్యారు. కళలు, సంస్కృతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్లు, ప్రభావవంతమైన వ్యక్తులనుచేర్చుకోవడంలో మరింత మార్పువచ్చిందని నిరూపించిం దని, ప్రపంచ దేశాలకు, భారత్‌కు మధ్య ఇషా సాంస్కృతిక వారధి అంటూ ప్రశంసిస్తున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025లో ఇషా అంబానీ లక్‌ మెరీనా టబస్సమ్ రూపొందించిన 2019 నాటి వాలెంటినో, షాంపైన్ కలర్‌ పూసల దుస్తులను ధరించింది. ఉంగరాల జుట్టు, సహజమైన మేకప్ వేసుకుని, హీల్స్‌తో ఇషా ప్రతి ఫ్రేమ్‌లో అందమమైన లుక్‌లో అలరించింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా అంబానీ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఇషా తనదైన వ్యాపార నైపుణ్యాలతో వ్యాపారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డియోర్‌కు ప్రపంచ రాయబారి , సోనమ్ కపూర్‌, సమ్మర్ పార్టీలో సందడి చేసింది. డియోర్ ఫాల్ 2025 కలెక్షన్ నుండి కిమోనో జాకెట్ ధరించింది అందర్నీ ఆకట్టుకుంది. జూన్ 24, 2025న లండన్‌లోని సెర్పెంటైన్ పెవిలియన్‌లో జరిగిన ఈ పార్టీలో ఈజా గొంజాలెజ్, అలిసియా వికాండర్, రెబెల్ విల్సన్, జార్జియా మే జాగర్, లేడీ అమేలియా స్పెన్సర్, లేడీ ఎలిజా స్పెన్సర్, లిల్లీ అలెన్ తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement