ప్రధాన వార్తలు

ఏపీ లిక్కర్ షాపుల్లో పర్మిట్ రూమ్లు!
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పర్మిట్ రూమ్ల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసిన చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని, రూ.99కే చీప్ లిక్కర్ ఇస్తానని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక మద్యం బ్రాండ్ల రేట్లు తగ్గించకపోగా మరింత పెంచారు. బెల్టు షాపులు భారీ ఎత్తున అధికారిక,అనధికారిక అనుమతులిచ్చారు.ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్లో, కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిశాయి. వీధి వీధినా కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన మద్యం షాపులు 3,396 మాత్రమే ఉండగా.. వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుసన్నల్లో అనధికారికంగా ఏర్పాటైన బెల్ట్షాపులు గత బాబు పాలనలో ఉన్న 43 వేలకు మించి ఉండటం విస్తుగొలుపుతోంది. తద్వారా కింది స్థాయిలో ఎమ్మెల్యే మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్యం విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారనే విమర్శలు కూటమి ప్రభుత్వంపై వెల్లు వెత్తుతున్నాయి. ఈ క్రమంలో విచ్చల విడిగా తాగి తూగడానికి మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇచ్చే చర్యలకు చంద్రబాబు ఉపక్రమించారు. గతంలో ఉన్న 4500 పర్మిట్ రూమ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది.కానీ ఇప్పుడు నేరాలు, ప్రమాదాలకు కారణమైన పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ వాటిని తెరపైకి తెచ్చింది.

జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో 22 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించిలేక భారత జట్టు చతికల పడింది. ఈ స్వల్ప లక్ష్య చేధనలో 170 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినప్పటికి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆరంభం నుంచే..జడేజాతో పాటు కేఎల్ రాహుల్(54) పర్వాలేదన్పించగా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 58/4 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. ఆరంభం నుంచే తడబడింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, నితీశ్ కాసేపు నిలకడగా ఆడి భారత గెలుపుపై ఆశలు రెకెత్తించారు. అయితే లంచ్ బ్రేక్కు ముందు నితీశ్ ఔట్ కావడంతో మ్యాచ్ మళ్లీ ఇంగ్లండ్ వైపు టర్న్ అయింది. ఆ తర్వాత జడేజా.. జస్ప్రీత్ బమ్రాతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.బుమ్రా ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కొంటూ జడేజాకు మద్దతుగా నిలిచాడు. అయితే 50 బంతులకు పైగా బ్యాటింగ్ చేసిన బుమ్రా(5) భారీ షాట్కు ప్రయత్నించి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ సైతం తన వంతు సహకారం అందించాడు.కానీ ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో సిరాజ్ బౌల్డ్ కావడంతో టీమిండియా అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. సిరాజ్ సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంగ్లండ్ మాత్రం గెలుపు సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టి గిల్ సేన పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు కార్స్ రెండు, బషీర్, వోక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకే చేయగల్గింది. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌటైంది. సెకెండ్ ఇన్నింగ్స్లో బౌలర్లు అద్బుతంగా రాణించినప్పటికి.. బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: మెడ చుట్టూ చేయి వేసి ఆపేశాడు!.. ఇచ్చిపడేసిన జడ్డూ

పుతిన్.. నీకు 50 రోజుల సమయం ఇస్తున్నా: ట్రంప్
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్లు చవిచూస్తుంది. ఆ టారిఫ్లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్లో నాటో చీఫ్ మార్క్ రూట్ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు ఇదీ చదవండి:ట్రంప్- పుతిన్ బ్రొమాన్స్ ముగిసిందా?

చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: మా ఓపికను మీరు చేతగానితనంగా తీసుకోవద్దని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం.వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.. తప్పుడు కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారుల్ని సైతం విచారిస్తామని స్పష్టం చేశారు.సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న రాక్షస పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగాన్ని, చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తోంది. దీన్ని నియంతృత్వం అనాలా..? ఏమనాలి.?. అన్ని వ్యవస్థలను చంద్రబాబు దారుణంగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీశారు. టీడీపీ చెప్పినట్టు వినకపోతే వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా తప్పుడు కేసులు కోసం వాడుతున్నారు.వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తున్నందుకు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేశారు. టీడీపీ వాళ్ళు గుడివాడలో దారి కాసి గొడవలు చేశారు. పోలీసులు ఉండగానే గంటన్నర సేపు గుండాలు మహిళ జెడ్పి చైర్మన్పై దాడికి దిగారు. పోలీసులు రక్షణలో వాళ్ళు దాడులు చేశారు.కారుని పోలీసులు తాళ్ళు కట్టి తీసుకెళ్లాలని యత్నించారు.పోలీసులు దాడి చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ నాయకులు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేస్తుంటే ఆపే ప్రయత్నం చేయలేదు. దాడులు జరపకుండా నిలువరించలేదు. తాము అధికారంలో ఉన్నామని,మా గురించి ఎవరు గొంతెత్తి మాట్లాడకూడదనిదాడులు చేస్తున్నారు.పోలీసులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పించుకోవచ్చు కానీ అందరూ చట్టం ముందు నిలబడాల్సి ఉంటుంది. దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై అక్రమ కేసు పెట్టారు. మాదాల సునీత అనే మహిళతో ఫిర్యాదు చేయించారు. ఆమె ఫ్లెక్సీలు చించారు. గాయం అయితే కారుతో గుద్దినట్టు కేసు పెట్టారు. ఉప్పాల రాము వెనకాల సీట్లు కూర్చొని ఉంటే ఆయన గుద్దించినట్టు కేసు పెట్టారు.ఎలాగైనా కేసులు పెడతాం అన్నట్టు ఇష్టానుసారం కేసులు పెట్టేస్తున్నారు. హైకోర్టు అన్ని కోర్టులకు మెకానికల్గా రిమాండుకు పంపొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానాలపై భయం లేకుండా ఇలాంటి కేసులు పెడుతున్నారు. వైఎస్ జగన్ బంగారు పాళ్యం పర్యటనకు వేలాది మంది రైతులు వచ్చారు. దానికి ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ వస్తే దాడి చేశారని కేసు పెట్టారు.ఎఫ్ఐఆర్ని మార్చి మరి తప్పుడు కేసు పెట్టారు.నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారు. పోలీసులు ఉండగానే ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేశారు.వాళ్ళ ముందే వస్తువులను కాల్చారు. వారం రోజులైనా ఎవరిపైనా కేసు పెట్టలేదు.ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.తాడిపత్రిలో పెద్దారెడ్డిని హైకోర్టు చెప్పినా నియోజకవర్గంలోకి రానివ్వలేదు. పొదిలి, బంగారు పాళ్యం అన్ని చోట్లా తప్పుడు కేసులు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం. తప్పుడు కేసుల్లో ఉన్న అధికారుల పైన కూడా విచారిస్తాం. మా ఓపికను చేతకాని తనంగా తీసుకోవద్దుని సూచించారు.

యుద్ధానికి ఆయన వైఫల్యమే కారణం: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్
న్యూఢిల్లీ: పెహల్గాంలో ఉగ్రదాడి, ఆపై చోటు చేసుకున్న పరిస్థితులకు తాను కారణం కాదని, అది జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వైఫల్యమేనని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పెహల్గామ్ ఉగ్రదాడికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కారణమన్నారు.కాగా, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉదయం గోడ దూకి మహారాజా హరిసింగ్కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు,. డోగ్రా బలగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1931, జూలై 13వ తేదీన పలువురు అమరులయ్యారు. ఈ క్రమంలోనే వారికి కశ్మీర్లోని శ్మశాన వాటికలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. దీన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఆదివారం(జూలై 13) సీఎం అబ్దుల్లాను ఇంటి నుంచి కదలకుండా ఒక బంకర్ ఏర్పాటు చేశారు. అయితే అది సోమవారం తీసేశారు. నేడు(జూలై 14) ఒమర్ అబ్దుల్లా ఒంటరిగా కారులో వెళ్లి ఆ అమరులకు నివాళులు అర్పించే యత్నం చేశారు. అక్కడ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో గోడ దూకి వెళ్లి నివాళులర్పించి వచ్చారు. దీనిపై అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. కేంద్ర నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పినట్లే ఇక్కడ నడుస్తోందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాదాడికి, తర్వాత ఆపరేషన్ సింధూర్ వరకూ భారత్ వెళ్లడానికి ఎల్జీ మనోజ్ సిన్హా వైఫల్యమే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

కర్ణాటకలో మరో నాయకత్వ మార్పు?
కర్ణాటకలో ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు గురించే అక్కడి రాజకీయ వర్గాల్లో ఎక్కవగా చర్చ నడుస్తోంది. సీఎం సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకత్వ మార్పును కాంగ్రెస్ అధిష్టానం తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి మార్పు అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని కన్నడ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఏదోరకంగా దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో చాప కింద నీరులా ప్రతిపక్ష బీజేపీలోనూ ముసలం మొదలైంది. అయితే దీనిపై మీడియా అంతగా ఫోకస్ చేయలేదు.కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర (BY Vijayendra) సీటు కిందకు నీళ్లు వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆయన నాయకత్వంపై సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు తేలడంతో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని విజయేంద్రపై కేంద్ర నాయకత్వానికి పలువురు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. సీనియర్ నేతలతో సఖ్యతగా ఉండడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. విజయేంద్రతో పాటు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక పనితీరుపైనా రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ను నిర్లక్ష్యం చేయడం వల్లే పార్టీలో సమస్యలు తలెత్తాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.రంగం దిగిన 'అప్పా'కొడుకు పదవికి గండం ఏర్పడే పరిస్థితులు నెలకొనడంతో విజయేంద్ర తండ్రి, మాజీ సీఎం యడియూరప్ప (Yediyurappa) స్వయంగా రంగం దిగారు. తన కుమారుడిపై స్థానిక నేతలు, క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ఆయన పయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారు. నాయకులు, కార్యకర్తల సమస్యలను సావధానంగా వింటున్నారు. అసంతృప్తులను బుజగించి గ్యాప్ తగ్గించేందును తన అనుభవాన్ని వాడుతున్నారు. పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా నాయకత్వం ముందు ప్రసావించడానికి వీలుగా ఒక వేదికను కల్పించేందుకు యడియూరప్ప తిరిగి వచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. "ఇది విజయేంద్ర తన సొంత నియోజకవర్గం శికారిపురపై దృష్టి పెట్టడానికి కూడా అవకాశం ఇస్తుంది" అని ఒక సీనియర్ కార్యకర్త అన్నారు.2023 నవంబర్లో విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యడియూరప్ప క్రియాశీలక రాజకీయాలకు దూరం జరిగారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొడును గండం నుంచి తప్పించడానికి ఆయన తిరిగి రావాల్సి వచ్చింది. బెంగళూరులోని జగన్నాథ్ భవన్లో ప్రతిరోజు నాయకులు, కార్యకర్తలకు పెద్దాయన అందుబాటులో ఉంటున్నారు. రాజకీయంగా ఆయన ఇంకా చురుగ్గానే ఉన్నారని, గణనీయమైన ప్రభావాన్ని చూపగలరని సన్నిహితులు పేర్కొంటున్నారు.విజయేంద్రకు వ్యతిరేకంగా పావులుపార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఎమ్మెల్యేలు బిపి హరీష్, మాజీ ఎమ్మెల్యే కుమార్ బంగారప్ప, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర నేతృత్వంలోని వర్గాలు.. విజయేంద్రకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. లింబవల్లి, రమేష్ జార్కిహోళి, ప్రతాప్ సింహా, హరీష్ తదిరత నాయకులు కూడా విజయేంద్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో అసమ్మతిని గుర్తించిన అధినాయకత్వం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని (Pralhad Joshi) కర్ణాటకకు పంపించింది. అసమ్మతి నేతలతో ఆయన జరిపిన సమావేశాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని అంతర్గత వర్గాల సమాచారం. ఇంత జరుగుతున్నా విజయేంద్రకే పార్టీ మద్దతుగా నిలిచింది. అసమ్మతి గళం వినిపించిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ను సస్పెండ్ చేసి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని సందేశం పంపింది.నాయకత్వ మార్పు తప్పదా?కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల కర్ణాటక పర్యటన తర్వాత పార్టీ అంతర్గత పునర్వ్యవస్థీకరణలపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. విజయేంద్ర శిబిరం నమ్మకంగా ఉన్నప్పటికీ, నాయకత్వ మార్పు తప్పదని ఊహాగానాలు మొదలయ్యాయి. విజయేంద్ర ఢిల్లీ పర్యటన కూడా ఈ ప్రచారానికి ఊతం ఇచ్చింది. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక (R Ashoka) కూడా హస్తినలో ఉండడంతో ప్రచారం జోరందుకుంది. అయితే ప్రతిపక్ష నేతను మార్చే అవకాశం ఉందంటూ కొత్త ప్రచారం మొదలైంది.చదవండి: స్టాలిన్ చాణక్యం.. ఏకమైన మారన్ బ్రదర్స్! ఏమైనా జరగొచ్చు..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని మేము అనుకోవడం లేదు. కానీ ప్రతిపక్ష నాయకుడిని మార్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. ఏమైనా జరగొచ్చు అంటూ మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. "ఎవరూ హైకమాండ్ మనసును చదవలేరు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. పార్టీని ఏకం చేసి మమల్ని ఎన్నికల మోడ్లోకి నడిపించగల వ్యక్తిని అధినాయకత్వం ఎంపిక చేస్తుంద"ని అన్నారు. మరి కొడుకును కాపాడటానికి కోసం రంగంలోకి దిగిన యడియూరప్ప తాను అనుకున్నది సాధిస్తారా, లేదా అనేది వేచి చూడాలి.

భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్మెంట్లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.గతంలో ప్రయాగ్రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్పూర్, కౌశంబి, ప్రతాప్ఘడ్, ప్రయాగ్రాజ్లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్లో ఈ ఇద్దరినీ రెడ్హ్యాండెండ్గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్లో బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్కు ఆమె జనరల్ మేనేజర్గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం.

నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదా జగనూ..!
ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని చంద్రబాబుకు సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే,ఇప్పుడు నువ్వు నేర్పించినావు కదా... తండ్రికి మించిన తనయుడువు అయితివి అబ్బా.. ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. అంటూ కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అక్కడే కాసేపు నిలబడి ఆ ఫ్లెక్సీలోని పాయింట్లన్నీ ఆమూలాగ్రం చదివేలా చేస్తోంది.. ఆ తండ్రీకొడుకులిద్దరూ కళ్లు మూసుకుని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా!. నిత్యం నిన్ను అవమానించే వాళ్ళు, నీ ఇమేజ్కు డామేజ్ చేసే వాళ్లు కూడా.. కిక్కురు మనకుండా నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగన్..!! అంటూ అందులో రాసి ఉంది.. .. వాస్తవానికి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్కు పేదలంటే ఇష్టం ఉండదు!. అదొక అసహ్యమనే భావనలో ఉంటారు వాళ్లు. సర్కారు బడుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులు, పథకాలు, సంక్షేమం వగైరా అంటే వారికి అసలు గిట్టదు. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు అని.. ప్రజలతో మమేకం కాకుండా పరిపాలన చేసిన అది నిజమైన ప్రభుత్వం కాదు అని వైఎస్ జగన్ నిరూపించారు. ఐదేళ్ల పరిపాలనలో నిత్యం ఆయన ధ్యాస తపన ఆలోచన ప్రజల చుట్టూనే ఉండేది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేయాల్సిందే అని పట్టుబట్టిన ఆయన వాటి జాబితాను తన కార్యాలయ గోడలకు అతికించి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి అమలుకు ముందడుగు వేస్తూ ఉండేవారు. అయితే.. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా వైయస్ జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు తొలిసారిగా తల్లికి వందనం అంటూ ఓ పథకాన్ని ఇచ్చారు. వాస్తవానికి అది గతంలో జగన్ ‘అమ్మ ఒడి’ పేరిట ఇచ్చిన పథకమే. కానీ దాన్ని తామే కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం. సబ్జెక్ట్ టీచర్లు ఇలా రకరకాల కాన్సెప్ట్లతో ప్రభుత్వ విద్య విధానంలో నాణ్యత పెంచారు. ఇప్పుడు అదే పాఠశాలల్లో చంద్రబాబు లోకేష్ ఫోటోలు దిగి పిల్లలతో ముచ్చట్లు చెబుతూ అదంతా తమ ఘనతగా పత్రికల్లో రాయించుకుంటున్నారు. ఇలా ఎన్నో అంశాలను సదర్ ఫ్లెక్సీలో పేర్కొన్న రహస్య అభిమాని.. ‘‘ఎంత పని చేసావు జగన్’’ అంటూ జగన్ అభినందిస్తూనే చంద్రబాబు పడుతున్న తిప్పలను హాస్యపూరితంగా వివరించారు.నీ ఒత్తిడి భరించలేక పేద పిల్లలకు చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా తల్లికి వందనం ఇచ్చాడు. నువ్వు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పరిశ్రమలు ప్రాజెక్టులు పథకాలనే చంద్రబాబు లోకేష్ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నువ్వు గతంలో ప్రజలతో మమేకం అయినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు కోరికన్నా ముందు నిద్రలేచి టీ స్టాళ్ళు.. చేపల బజార్లు.. సందులు.. గొందుల్లో తిరుగుతూ జనంతో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ఇవన్నీ గతంలో నువ్వు చేసినవి కాక మరేమిటి జగనూ!. .. నీ పర్యటనలకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని ఆపలేక చంద్రబాబు ఆఖరుకు తన కడుపు మంటను మంత్రుల మీదకు వెళ్ళగకుతున్నారు.. ఇది కూడా నువ్వే చేశావు జగనూ!. కూటమిలోని మూడు పార్టీలకు ఒకరంటే ఒకరికి పసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు పట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.. విడిపోతే ముగ్గురూ అస్సామే అనే పరిస్థితి తీసుకొచ్చావు జగనూ!. నువ్వు ఏ ఊరికి పర్యటనక పోతే అక్కడ ముందుగానే పరిస్థితులు చక్కపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అక్కడి సమస్యలపై ఉరుకున పరుగున స్పందించే ప్రయత్నమూ చేస్తున్నారు.. ఎంత పని చేసావు జగనూ!.నువ్వు ఓడిపోయినా.. రాష్ట్రంలో మీ పరిపాలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఈ తండ్రి కొడుకులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావ్.. ఎంత పని చేశావు జగనూ! అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది.::సిమ్మాదిరప్పన్న

టాలీవుడ్ నుంచి కల్కి మూవీ.. ప్రతిష్టాత్మక నామినేషన్స్లో చోటు!
టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రం సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ నామినేషన్స్లో చోటు దక్కించుకుంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది. ఈ విభాగంలో హోమ్బౌండ్, ఎల్2 ఎంపురాన్, మహారాజ్, స్త్రీ-2, సూపర్బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాలతో పోటీ పడనుంది.అంతేకాకుండా ఉత్తమ నటుడు విభాగంలో మోహన్లాల్ (ఎల్2 ఎంపురాన్), అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), ఆదర్శ్ గౌరవ్ (సూపర్బాయ్స్ ఆఫ్ మాలేగావ్), ఇషాన్ ఖట్టర్ (హోమ్బౌండ్), విశాల్ జెత్వా (హోమ్బౌండ్), జునైద్ ఖాన్ (మహారాజ్) పోటీలో నిలిచారు. ఉత్తమ నటి విభాగంలో అంజలీ శివరామన్ (బ్యాడ్గర్ల్), భనితా దాస్ (విలేజ్ రాక్స్టార్స్ 2), కరీనా కపూర్ (ది బకింగహామ్ మర్డర్స్), శ్రద్దా కపూర్ (స్త్రీ -2), తిలోత్తమ షోమ్ (షాడోబాక్స్) పోటీ పడుతున్నారు.వీటితో పాటు బెస్ట్ వెబ్ సిరీస్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్(వెబ్ సిిరీస్), బెస్ట్ మేల్ యాక్టర్(వెబ్ సిరీస్) జాబితాను కూడా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఆగస్టు 14న ప్రకటించనున్నారు. ఈ వేడుకను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా ఆగస్టు 14 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు
ప్రముఖ హాస్యనటి,'లాఫర్ క్వీన్' భారతీ సింగ్ (Bharti Singh) చాలా కష్టపడి బరువును తగ్గించుకొని స్లిమ్గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. 10 నెలల్లో దాదాపు 15 కిలోలు వెయిల్ లాస్ అయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. యూట్యూబర్ నటి ప్రజక్తా కోలితో జరిగిన పాడ్కాస్ట్లో, భారతీ తన వెయిట్ లాజ్జర్నీ గురించి వివరించింది.భారతీ సింగ్ వెయిట్ లాస్ జర్నీ ఇలాకేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా ఆలోచించింది భారతీ సింగ్. ఎందుకంటే అప్పటికే ఆమె ఆస్తమా . డయాబెటిస్తో బాధపడేది. ఎక్కువగా తల తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి ఊపిరి ఆడేది కాదు. డాక్టర్ల సలహామేరకు ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించింది. 2021లో 91 కిలోల నుండి 76 కిలోలకు తగ్గించుకుని ఆటు ఫ్యాన్స్ను ఇటు సినీ అభిమానులను ఆశ్చర్య పర్చింది. బరువుతగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతోపాటు, ఆరోగ్యంగా, శక్తివంతంగా మారినట్టు తెలిపింది. అంతేకాదు డయాబెటిస్, ఆస్తమా కూడా నియంత్రణలో ఉన్నాయని సంతోషంగా చెప్పింది. ఇపుడు తాను చాలాఫిట్గా, హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తలతిరగడాలు, ఊపిరి ఆడకపోవడంలాంటి ఇబ్బందులేవీ లేవని వెల్లడించింది.అడపాదడపా ఉపవాసం Intermittent Fastingసాయంత్రం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం. మధ్యాహ్నం ఆహారం తీసుకునేది. 30-32 ఏళ్లుగా చాలా తినేశాను. ఆ తరువాత సంవత్సరం పాటు విరామం ఇచ్చాను.2022 అధ్యయనం ప్రకారం అడపాదడపా ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇదిబ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.కడుపు మాడ్చుకోలే, ఇష్టమైన ఫుడ్ను త్యాగతం చేయలేదు: తనకిష్టమైన ప్రతిదాన్ని ఆహారంలో చేర్చుకునేది. కానీ మితంగా తినడాన్ని అలవాటు చేసుకుంది. తనకెంతో ఇష్టమైన రెగ్యులర్ పరాఠాలు, గుడ్లు, పప్పు-సబ్జీ, నెయ్యి ఇవన్నీ తీసుకునేదాన్నని తెలిపింది. పోర్షన్ కంట్రోల్: అతిగా తినకుండా తనను తాను నియంత్రించుకుంది. ఎక్కువ కేలరీలు తీసుకోకుండా పోర్షన్ కంట్రోల్ను అలవాటు చేసుకున్నానని భారతీ సింగ్ తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, పోర్షన్ కంట్రోల్ సాధన చేయడం అధిక బరువును తగ్గించుకోవచ్చు.ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!ఖచ్చితమైన మీల్ టైమింగ్స్ : భోజనం టైమింగ్స్ పాటించకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందనీ, అందుకే తాను తన భోజన సమయాలను పాటించేదానన్ని గుర్తు చేసుకుంది. బాగా హెక్టిక్ పనుల్లో ఉంటే, బాగా లేట్ నైట్ తినడం వదిలివేసింది. వేళగాని వేళ తినడాన్ని పూర్తిగా మానేసింది. మరో విధంగా చెప్పాలంటే రాత్రి 7 గంటల తర్వాత నో డిన్నర్ సూత్రం తు.చ తప్పకుండా పాలించింది. ఇది తన బరువును తగ్గించుకోవడంలో చాలా ఉపయోగపడిందని తెలిపింది. 15 కిలోల భారీ బరువు తగ్గడం చాలా ఆనందానిచ్చిందని భారతీ సింగ్కు సంతోషంగా తెలిపింది. క్రాప్ టాప్స్, ఇంకా ఇష్టమైన బట్టలు వేసుకోగలగడం భలే సంతోషాన్నిస్తోందని చెప్పింది.బరువు తగ్గడం స్లిమ్గా కనపించడం ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. కష్టంగా కాకుండా, ఇష్టంగా నిష్టగా కృషి చేస్తే భారతీ సింగ్లా మంచి ఫలితాలను సాధించడం కష్టమేమీ కాదేమో కదా!ఇదీ చదవండి: TodayRecepies బనానాతో ఇలాంటి వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా?
పుతిన్.. నీకు 50 రోజుల సమయం ఇస్తున్నా: ట్రంప్
యుద్ధానికి ఆయన వైఫల్యమే కారణం: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్
వారి కష్టాలు, బాధలు చాలా దగ్గరగా చూశా: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
లోక్సభలో కొత్త అటెండెన్స్ వ్యవస్థ
ఐదేళ్ల ముందే 50 శాతం టార్గెట్ పూర్తి
లార్డ్స్లో లవ్ బర్డ్స్.. బాయ్ఫ్రెండ్తో ఆదిపురుష్ భామ సందడి!
ఏపీ లిక్కర్ షాపుల్లో పర్మిట్ రూమ్లు!
‘అప్పుడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?’
మస్క్ అన్ని కంపెనీల్లో ఒక్కటే ఏఐ
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)
ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా..!
'పెద్ది'లో చరణ్ కోచ్గా స్టార్ హీరో.. ఫస్ట్లుక్ విడుదల
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)
అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు
IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
'కోడిని చూస్తూ చికెన్ తినడం'.. ఆ రోల్ కోట చేయాల్సింది కాదు!
Karthika Nair: రాధ కూతురి బర్త్డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)
ఏంటి బ్రో? కొంచెం కూడా సోయి లేదా?.. రాజమౌళికి కోపం తెప్పించిన అభిమాని!
వైభవ్ ఫెయిల్.. టీమిండియా కెప్టెన్ విధ్వంసకర సెంచరీ
ఒక్క మార్కుతో ఓటమి.. అయినా ఆగని కలల ప్రయాణం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
లారెన్స్ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు'
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ధనలాభం
Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?
పుతిన్.. నీకు 50 రోజుల సమయం ఇస్తున్నా: ట్రంప్
యుద్ధానికి ఆయన వైఫల్యమే కారణం: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్
వారి కష్టాలు, బాధలు చాలా దగ్గరగా చూశా: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
లోక్సభలో కొత్త అటెండెన్స్ వ్యవస్థ
ఐదేళ్ల ముందే 50 శాతం టార్గెట్ పూర్తి
లార్డ్స్లో లవ్ బర్డ్స్.. బాయ్ఫ్రెండ్తో ఆదిపురుష్ భామ సందడి!
ఏపీ లిక్కర్ షాపుల్లో పర్మిట్ రూమ్లు!
‘అప్పుడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?’
మస్క్ అన్ని కంపెనీల్లో ఒక్కటే ఏఐ
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా..!
'పెద్ది'లో చరణ్ కోచ్గా స్టార్ హీరో.. ఫస్ట్లుక్ విడుదల
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు
IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
'కోడిని చూస్తూ చికెన్ తినడం'.. ఆ రోల్ కోట చేయాల్సింది కాదు!
ఏంటి బ్రో? కొంచెం కూడా సోయి లేదా?.. రాజమౌళికి కోపం తెప్పించిన అభిమాని!
వైభవ్ ఫెయిల్.. టీమిండియా కెప్టెన్ విధ్వంసకర సెంచరీ
ఒక్క మార్కుతో ఓటమి.. అయినా ఆగని కలల ప్రయాణం
లారెన్స్ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు'
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ధనలాభం
Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?
విమానాలే కూలుతున్నాయ్! ఆఫ్ట్రాల్ గోడ కూలితే ఇంత రాద్ధాంతం ఏంటని అంటున్నాడ్సార్!!
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కోర్టు సమన్లు
భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
సినిమా

బర్త్ డే గర్ల్ శ్రీలీల.. వైరల్ పాటకు రీతూ డ్యాన్స్
పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న శ్రీలీలవైరల్ వయ్యారి పాటకు రీతూ చౌదరి-సిరి హన్మంతు డ్యాన్స్వింబుల్డన్ కోసం లండన్ వెళ్లిపోయిన జాక్వెలిన్చీరలో చక్కని చందమామలా యాంకర్ స్రవంతిముంగురులతో చీరలో ముద్దుగుమ్మలా అనంతికనాభి అందాలతో రచ్చ లేపుతున్న హీరోయిన్ వేదిక View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__)

ఫన్నీగా కిరణ్ అబ్బవరం 'K ర్యాంప్' గ్లింప్స్
'క' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. ఈ ఏడాది 'దిల్రుబా' మూవీతో చాన్నాళ్ల క్రితమే వచ్చాడు. ఇది ఘోరమైన డిజాస్టర్ అయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో 'కె-ర్యాంప్' పేరుతో తీస్తున్న ఓ చిత్రముంది. ఇప్పుడు దాని గ్లింప్స్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ గుండుపాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా?)'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. తర్వాత చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ హిట్స్ కొట్టలేకపోయాడు. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని విసిగించాడు. ఎట్టకేలకు 'క' అనే థ్రిల్లర్తో హిట్ కొట్టాడు. మరి ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడో ఏమో గానీ క అక్షరం కలిసొచ్చేలా 'కె-ర్యాంప్' సినిమా చేశారు. దీని గ్లింప్స్ ఎంటర్టైనింగ్గా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే కిరణ్ ఎనర్జిటిక్గా కనిపిస్తున్నాడు.ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గ్లింప్స్ బట్టి చూస్తుంటే సినిమా అంతా కేరళలో షూట్ చేశారు. ఈ అక్టోబరు 18న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: 'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?)

లండన్లో లవ్ బర్డ్స్.. ఆ ఫోటోలతో దొరికిపోయిన మహ్వశ్- చాహల్!
ప్రముఖ ఆర్జే మహ్వశ్ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. కానీ తమపై వస్తున్న కథనాలపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న చాహల్ ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. తను ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలుసుగా అంటూ చాహల్ తన మనసులో మాట చెప్పేశాడు. దీంతో ఈ జంట డేటింగ్ నిజమేనంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే చాహల్, ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. లండన్లో ఈ ప్రేమజంట చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తమ ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్లో లోకేషన్ ఓకేలా కనిపిస్తోంది. దీంతో ఈ లవ్ బర్డ్స్ తాజాగా లండన్లోనే వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాహల్ ఫోటోలు చూసిన ఓ నెటిజన్ మహ్వశ్ బాబీ తీశారా అంటూ కామెంట్ చేశాడు. వారిద్దరు డేటింగ్ చేస్తున్నారని నాకు తెలుసు అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.చాహల్, మహ్వశ్పై డేటింగ్ రూమర్స్క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే మహ్వశ్, చాహల్ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లో జంటగా కనిపించడం.. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్ కింగ్స్ టీమ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

ఈ గుండుపాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా?
స్టార్ హీరోయిన్లు వరస సినిమాలతో బిజీగా ఉంటారు. అదే టైంలో సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్గా కనిపిస్తుంటారు. ఫన్నీ కామెంట్స్కి కూడా తమదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోయిన్ తన చిన్నప్పటి ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అది కూడా తన ఫ్రెండ్, యంగ్ హీరోకి బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే విషెస్ కంటే తన గుండు గురించే ఎక్కువగా అడుగుతున్నారని తెగ బాధపడిపోతోంది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప కల్యాణి ప్రియదర్శన్. అదేనండి తెలుగులో అఖిల్ రెండో సినిమా 'హలో'లో హీరోయిన్గా చేసింది. చిత్రలహరి మూవీలోనూ నటించిందిగా. ఆమెనే ఈమె. ఈ రెండు చిత్రాల తర్వాత తెలుగుకి పూర్తిగా దూరమైపోయింది. మాతృభాష మలయాళంలోనే వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాంటిది తన ఫ్రెండ్, మోహన్ లాల్ కొడుకు ప్రణవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇప్పుడు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో కల్యాణిని చూసి భలే ముద్దుగా ఉందే అని నెటిజన్లు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?)కల్యాణి వ్యక్తిగత విషయానికొస్తే.. మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిసీల సంతానం ఈ బ్యూటీ. ఈమెకు సిద్ధార్థ్ అని సోదరుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం కల్యాణికి 30 ఏళ్లు దాటిపోయాయి. ఇప్పుడు ఎవరి గురించి అయితే పోస్ట్ పెట్టిందో.. అతడితోనే ఈమె రిలేషన్లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే ప్రణవ్-కల్యాణి స్నేహితులు మాత్రమేనని కొన్నిరోజుల క్రితం స్వయంగా ప్రణవ్ తల్లినే చెప్పుకొచ్చింది.హీరోయిన్గా తెలుగు చిత్రాలతోనే కెరీర్ ప్రారంభించినప్పటికీ.. కల్యాణి ఎందుకో తర్వాత పూర్తిగా మలయాళ, తమిళ చిత్రాలపైనే పూర్తిగా ఫోకస్ చేసింది. మరి అవకాశాలు రాకపోవడమా లేదంటే కావాలనే ఇలా చేసిందా అనేది తెలియదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

తండ్రికి తగ్గ తనయుడు.. టీమిండియాపై వీరోచిత పోరాటం! సెంచరీ మిస్
ఇంగ్లండ్ యువ సంచలనం, అండర్-19 ఆటగాడు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాప్ తనయుడైన రాకీ.. బెకెన్హామ్ వేదికగా భారత అండర్-19తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రాకీ ఫ్లింటాప్ తన వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించాడు. కెప్టెన్ హమ్జా షేక్ తో కలిసి అతను 154 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓ దశలో సునాయసంగా తన సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన రాకీ.. 93 పరుగుల వద్ద దీపేష్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అతడి ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ యువ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. క్రీజులో అల్బర్ట్(18),ఏకాన్ష్ సింగ్(59) ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే 202 పరుగుల వెనకంజలో ఉంది.అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 540 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో చెలరేగగా.. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు.చదవండి: ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: సునిల్ గావస్కర్ ఫైర్

ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: గావస్కర్ ఫైర్
లార్డ్స్ టెస్టులో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) అవుటైన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాహుల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శించాడు. భారత బౌలర్ల విషయంలో ఒకలా.. ఇంగ్లండ్ బౌలర్ల విషయంలో మరోలా వ్యవహరించడం సరికాదన్నాడు. పక్షపాతంగా ఉండే టెక్నాలజీ ఎవరి కోసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా మూడో టెస్టులో ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ తడబడుతోంది. 58/4 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆఖరిదైన ఐదో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు వరుస షాకులు తగిలాయి. కీలక బ్యాటర్ రిషభ్ పంత్ (9) జోఫ్రా ఆర్చర్ సంధించిన సూపర్ డెలివరీకి బౌల్డ్ కాగా.. ఆ వెంటనే కేఎల్ రాహుల్ (39) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) బౌలింగ్లో బంతి రాహుల్ ప్యాడ్ను తగిలినట్లు అనిపించగా.. ఇంగ్లండ్ గట్టిగా అప్పీలు చేసింది. అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో స్టోక్స్ రివ్యూకు వెళ్లగా.. థర్డ్ అంపైర్ లెగ్ బిఫోర్ వికెట్గా ప్రకటించడంతో రాహుల్ క్రీజును వీడాల్సి వచ్చింది.రీప్లేలో బంతి రాహుల్ ప్యాడ్ను తగిలినట్లుగా కనిపించినప్పటికీ.. బ్యాట్ను కూడా తాకినట్లుగా మరో శబ్దం వినిపించింది. అయితే, ముందుగా బ్యాట్ను తాకిందా లేదంటే ప్యాడ్ను తాకిందా అనేది స్పష్టంగా తేలలేదు. అయితే, బాల్ ట్రాకింగ్లో మాత్రం బంతి స్టంప్స్ను ఎగురగొట్టినట్లుగా తేల్చిన థర్డ్ అంపైర్.. రాహుల్ను అవుట్గా ప్రకటించాడు.అసలు ఇదేం టెక్నాలజీఈ విషయంపై కామెంటేటర్ సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘ఏంటో.. ఈసారి ఆశ్చర్యకరంగా ఈసారి ఎక్కువగా బౌన్స్ అవ్వనేలేదు. భారత బౌలర్లు బౌలింగ్ చేస్తున్నపుడు మాత్రం.. రివ్యూల్లో బాల్స్ అన్నీ స్టంప్స్ మీదుగా వెళ్లిపోయినట్లుగా కనిపించాయి. అసలు ఇదేం టెక్నాలజీ అని నేను ప్రశ్నిస్తున్నా’’ అంటూ ఫైర్ అయ్యాడు.భారత్ తడ‘బ్యా’టుకాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టులో ఆఖరి రోజైన సోమవారం ఫలితం తేలనుంది. భోజన విరామ సమయానికి టీమిండియా 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 81 పరుగుల దూరంలో ఉండగా.. ఇంగ్లండ్ గెలుపునకు కేవలం రెండు వికెట్లు తీస్తే చాలు.భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0), కరుణ్ నాయర్ (14), కెప్టెన్ శుబ్మన్ గిల్ (6) పూర్తిగా విఫలం కాగా.. నైట్ వాచ్మన్ ఆకాశ్ దీప్ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. రిషభ్ పంత్ (9), వాషింగ్టన్ సుందర్ (0), నితీశ్ కుమార్ రెడ్డి (13) నిరాశపరచగా.. ప్రస్తుతానికి భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. రవీంద్ర జడేజా 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.చదవండి: IND vs ENG: సిరాజ్కు భారీ షాకిచ్చిన ఐసీసీ

ఎస్ఆర్హెచ్ కీలక ప్రకటన.. కోచ్గా 'ఊహించని ప్లేయర్'
సన్రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ కోచ్ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(Varun Aaron)ను ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్ఆర్హెచ్ వెల్లడించింది. గత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ కోచ్గా పనిచేసిన కివీస్ మాజీ ఆల్రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు.ఆరోన్కు అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. జార్ఖండ్కు చెందిన వరున్ ఆరోన్ 9 టెస్టులు, 9 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 29 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తరపున ఆడాడు.తన ఐపీఎల్ కెరీర్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా 95 టీ20ల్లో 93 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరోన్ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2024-25 సీజన్లో జార్ఖండ్ తరపున ఆడాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ స్పీడ్ స్టార్.. కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో సన్రైజర్స్ తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. 14 మ్యాచ్లు ఆడి కేవలం ఆరింట మాత్రమే విజయం సాధించింది.చదవండి: IND vs ENG: జోఫ్రా ఆర్చర్ సూపర్ డెలివరీ.. రిషబ్ పంత్కు మైండ్ బ్లాంక్! వీడియో

జోఫ్రా ఆర్చర్ సూపర్ డెలివరీ.. రిషబ్ పంత్కు మైండ్ బ్లాంక్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత జట్టు 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరుగుతున్నాడు.అతడి బౌలింగ్ ధాటికి భారత బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. ఐదో రోజు ఆట ఆరంభంలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను అద్బుత బంతితో ఆర్చర్ బోల్తా కొట్టించాడు. ఆర్చర్ వేసిన డెలివరీకి పంత్ దగ్గర సమాధానమే లేకపోయింది. భారత ఇన్నింగ్స్ 21 ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్లో మూడో బంతికి పంత్ అద్బుతమైన బౌండరీ బాదాడు.ఆ తర్వాత ఐదో బంతికి పంత్ను క్లీన్ బౌల్డ్ చేసి ఈ ఇంగ్లండ్ పేసర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆర్చర్ ఆ ఐదో బంతిని రౌండ్ది వికెట్ నుంచి హాఫ్ స్టంప్ దిశగా హార్డ్ లెంగ్త్ డెలివరీగా పంత్ సంధించాడు. ఆ బంతిని పంత్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ పంత్ తన బ్యాట్ను కిందకు తీసుకొచ్చేలోపే బంతి స్టంప్స్ను గిరాటేసింది.దీంతో పంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పంత్కు వద్దకి వెళ్లి స్లెడ్జ్ చేశాడు. అతడి వైపు చూస్తూ సీరియస్గా ఏదో అంటూ సెండాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అనంతరం వాషింగ్టన్ సుందర్ను కూడా సంచలన రిటర్న్ క్యాచ్తో ఆర్చర్ పెవిలియన్కు పంపాడు. టీమిండియా విజయానికి ఇంకా 93 పరుగులు కావాలి. క్రీజులో రవీంద్ర జడేజా(14), నితీశ్ కుమార్ రెడ్డి(5) ఉన్నారు.Split screen angles just hit different with Jofra 😍👌 pic.twitter.com/9kf7r2QmUk— England Cricket (@englandcricket) July 14, 2025చదవండి: IND vs ENG 3rd Test Day 5: తొలి సెషన్ కీలకం.. ఆరు వికెట్లు తీసి..: ఇంగ్లండ్ కోచ్
బిజినెస్

ఈసారి రిఫండ్ త్వరగా రాకపోవచ్చు..
ఈసారి రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. ఇంచుమించు కోటి దాకా రిటర్నులు వేసినట్లు అంచనా. అందులో చాలా మంది వెరిఫై కూడా చేశారు. గతంలో రిటర్ను వేసిన ఒకటి, రెండు రోజుల్లో రిఫండ్ వచ్చేసిన కేసులున్నాయి. సాధారణంగా 20 నుంచి 45 రోజుల్లోపల మీ బ్యాంకు ఖాతాకి రిఫండ్ మొత్తం జమ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో జాప్యం జరగొచ్చు. ఏ కారణం వల్ల రిఫండ్ త్వరగా రాదంటే..చాలా మంది వెరిఫై చేయడం లేదు. ఇలా వెరిఫై చేయనంతవరకు రిటర్నులను ముట్టుకోరు. ప్రాసెస్ చెయ్యరు. అందుకని రిటర్నులను వేసిన వెంటనే వెరిఫై చేయడం మరిచిపోవద్దు. బ్యాంకు అకౌంట్ వివరాలు పూర్తిగా ఇవ్వకపోతే రిఫండు రాదు. బ్యాంకుల విలీనం వల్లో, అడ్రెస్సులు పోవడం వల్లో, కోడ్లలో వచ్చిన మార్పులను తెలియచేయకపోవడం వల్లో కూడా ఇలా జరగొచ్చు. బ్యాంకు అకౌంటు నంబరు ఇప్పుడు పొడుగ్గా ఉంటోంది. ఏ ఒక్క అంకె తప్పొచ్చినా, సమాచారం లోపం వల్ల జమ ఆగిపోతుంది. పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే .. మిస్మ్యాచింగ్. రిటర్నుల్లో దాఖలు చేసిన అంశాలు, అన్నీ పూర్తిగా 26 ఏఎస్, ఏ19తో సరిపోయి ఉండాలి. 26ఏఎస్, ఏఐఎస్, ఈ రెండూ ఆదాయపు పన్ను వెబ్సైట్లో దొరుకుతాయి. ఇవి చాలా స్పష్టంగా మీకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా క్రోడీకరించి చూపిస్తాయి. సర్వసాధారణంగా తప్పులు ఉండవు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, వీటిలో సమాచారం బేస్గా రిటర్నులు వేసేస్తుంటారు. అ ప్పుడు మిస్మ్యాచ్ ఉండదు. ఇదొక సేఫ్ గేమ్. అలా అని మీరు 26ఏఎస్, ఏఐఎస్ అంశాలతో పూర్తిగా ఏకీభవించాలని లేదు. అందులోని అంశాలు తప్పని అనిపించినా, రెండు సార్లు కనిపించినా, మీవి కాకపోయినా, మీరు విభేదించవచ్చు. అప్పుడు, మిస్మ్యాచ్ తథ్యం. ఇలాంటప్పుడు రిఫండు ఆలస్యం అవుతుంది. కొంత మంది ఫారం ఎంచుకోవడంలో పొరపా టు చేస్తారు. అలాంటి పొరపాటు జరిగినా, రి ఫండు ఆలస్యం కావచ్చు. జాగ్రత్త వహించాలి. సాంకేతికపరమైన సమస్యలు ఉత్పన్నమవ్వొచ్చు. ఇవి తాత్కాలికం కావొచ్చు. తాత్కాలికం అయితే, గంటలోనో లేదా రోజులోపలో దానంతట అదే సాల్వ్ అయిపోతుంది. కొన్ని వారం, పది రోజులు పట్టొచ్చు. అధికార్లకు ఈ సమస్య తెలియకపోవచ్చు. సిస్టమ్ అధికార్లకు కూడా వెనువెంటనే తెలియదు. ఈ మేరకు ప్రాసెసింగ్ లేటు అవుతుంది. పన్నులు చెల్లింపుల మూడు రకాలు. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్. ఈ చలాన్లలోని అంశాలు రాసేటప్పుడు ఏ పొరపాటు జరిగినా .. చెల్లింపులకు సంబంధించిన పద్దు, గవర్నమెంటు ఖాతాలో మీ పేరున జమ అవ్వదు. సస్పెన్స్లో పెడతారు. దాన్ని పట్టుకోవడం సులువైన పని కాదు. అలాగే టీడీఎస్ రికవరీలు, చెల్లింపులు, రిటర్నులు వేయడం – ఈ మూడు దశల్లో ఎక్కడ తప్పు జరిగినా, పెండింగ్లో పడిపోతుంది. అటు పక్క వ్యక్తి తప్పులు చేసినా మీరే సఫర్ అవుతారు. చెక్ చేసుకోండి. ఇలాంటి సమస్యల వల్ల రిఫండ్ ఆగిపోతుంది. పాత/ముందు సంవత్సరాల్లో చెల్లించాల్సిన బకాయిలుంటే వాటిని రికవరీ చేయడం వల్ల ప్రస్తుత సంవత్సరపు రిఫండ్ ఆగిపోవచ్చు. ఈ మధ్య ఓ కేసులో 18 ఏళ్ల క్రితం ఉన్న బకాయిల నిమిత్తం నోటీసులు ఇచ్చారు. కాగితాలు సకాలంలో దొరక్కపోవటం వల్ల జవాబు ఇవ్వలేదు. ఆ సంవత్సరం బకాయిల నిమిత్తం కరెంటు రిఫండును తొక్కి పెట్టేశారు. వాళ్లకి వాళ్లు పన్నులను రికవర్ చేసుకోవడానికి ఎంత వెనక్కయినా వెళ్తారు. మన కష్టాలు పట్టించుకోరు. అందుకనే అన్ని సంవత్సరాల రికార్డులూ భద్రంగా దాచిపెట్టుకోవాలి. అశ్రద్ధ వద్దు. రికవరీ చేసుకున్నామని మీకు చెప్పరు కూడా. ఇక అధికార్ల వద్ద మరో బ్రహ్మాస్త్రం ఉంటుంది. అదే స్క్రూటినీ ప్రొసీడింగ్స్. ఏదైనా కారణాల వల్ల మీ కేసు స్క్రూటినీకి ఎంపిక అయిందనుకోండి. అధికార్లు ఆరా తీస్తారు. ఆరాలో తొక్క తీస్తారు. తొక్క తీసి తోలు కడతారు. అలా అయ్యేవరకు రిఫండ్ రాదు. అలాగని స్క్రూటినీ అంటే భయపడక్కర్లేదు కానీ, జాప్యం ఎక్కువ జరగొచ్చు. అనిశ్చితి .. అయోమయం పరిస్థితి నెలకొనవచ్చు.ఈ సంవత్సరానికి గాను గతంలోలాగా వెనువెంటనే రిఫండులు జారీ చేయడం లేదు. ఒకటికి పది సార్లు చెక్ చేసి, గతానికి వెళ్లి, అన్ని చేక్ చేసి కానీ రిఫండులు ఇవ్వడం లేదు. అలా అని మీరేమీ గాభరాపడక్కర్లేదు.

ఒక్క బిట్ కాయిన్.. రూ.కోటి నాలుగు లక్షలు
పర్సనల్ ఫైనాన్సింగ్ కేటగిరీలో బిట్కాయిన్ సరికొత్త పెట్టుబడి ఎంపికగా మారిపోయింది. దీంతో క్రిప్టో కాయిన్ రేటు తన సుదీర్ఘ ప్రయాణంలో 1లక్ష 20వేల డాలర్ల జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది. అయితే ఇన్వెస్టర్లలో వచ్చిన అవగాహన, క్రిప్టోల వైపు వారి అడుగులు పెద్ద మార్పుగా పరిగణిస్తున్నట్లు ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ జియోటస్ సంస్థ పేర్కొంది.ఒకప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం క్రిప్టోల్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం దానిని ఒక వ్యూహాత్మక దీర్ఘకాలిక అసెట్ క్లాస్ కింద పరిగణిస్తున్నట్లు వాలెట్ చేరికల్లో పెరుగుదల సూచిస్తోందని క్రిప్టో ఎక్స్ఛేంజీ వెల్లడించింది. ప్రస్తుతం వచ్చిన మార్పులు బిట్కాయిన్ వేగంగా సంపద సృష్టికి పునాది స్తంభంగా మారుతుందనే లోతైన మార్కెట్ నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఇటీవల బిట్కాయిన్ తన టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్ లక్ష 10వేల డాలర్ల మార్కును అధిగమించటం మరింత ర్యాలీకి కారణంగా మారింది.దీనికి తోడు ఎథెరియం, సోలానా, కార్డానో, సుయి వంటి ఇతర కాయిన్స్ కూడా క్రిప్టో ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి. డేటా ప్రకారం ఈ ఏడాది బలమైన ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని ఊహించబడింది. ఈ క్రమంలో చిన్నచిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ క్రిప్టోల ప్రాభల్యం పెట్టుబడుల ప్రపంచంలో సుస్థిరంగా ముందుకు సాగుతుందని జియోటస్ భావిస్తోంది.ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే అనుమానం బిట్కాయిన్ ర్యాలీ ఇంకెంత వరకు చేరుకుంటుంది అన్నదే. దీనికి జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అంచనాలను చూస్తే ఇకపై బిట్కాయిన్ ధర లక్షా 35వేల డాలర్ల రేటు వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో క్రిప్టో ఈటీఎఫ్ పెట్టుబడులు పెరిగితే ఒక్కో బిట్కాయిన్ రేటు ఏకంగా లక్షా 50వేల డాలర్ల వరకు చేరుకునే అవకాశం ఉందని విక్రమ్ చెబుతున్నారు. మార్కెట్లలో ఓలటాలిటీ, ఫ్రాఫిట్ బుక్కింగ్, ఇతర ఒడిదొడుకులు ఉన్నప్పటికీ చాలా మంది తమ పోర్ట్ ఫోలియోలో క్రిప్టోలకు కొంత సముచిన మెుత్తాన్ని కేటాయించి ముందుకు సాగటానికి ఇది సరైన సమయంగా జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడుతున్నారు.

వామ్మో రూ.లక్ష! మళ్లీ రికార్డ్ రేటుకు బంగారం
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఈరోజైనా పుత్తడి ధరలు కిందకి చూస్తాయా అని ఆశించినా కొనుగోలుదారులకు నిరాశే ఎదురైంది. తులం (10 గ్రాములు) మేలిమి బంగారం ధర ఏకంగా రూ.లక్ష మార్కును దాటింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.👉 ఇదీ చదవండి: బంగారం ధరలు తగ్గనున్నాయా?(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

జీతాల పెంపుపై టీసీఎస్ సీఎఫ్వో కీలక ప్రకటన
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవల ప్రకటించింది. వ్యాపార వృద్ధి, మార్జిన్లలో ప్రతికూలతను కంపెనీ చూసింది. ఈ క్రమంలో జీతాల పెంపు గురించి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) సమీర్ సెక్సారియా తాజాగా ప్రకటన చేశారు.తమ 6 లక్షల మంది ఉద్యోగులకు వేతనాల పెంపు టీసీఎస్ ప్రాధాన్య అంశమని సీఎఫ్వో సమీర్ సెక్సారియా తెలిపారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన సెక్సారియా, టీసీఎస్ లాభదాయకతతో కూడిన వృద్ధిపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. తోటి కంపెనీల మాదిరిగా కాకుండా టీసీఎస్ చాలా అరుదుగా వేతనాల పెంపును వాయిదా వేస్తోందన్న ఆయన గతంలో మాదిరి సకాలంలో వేతనాల పెంపు అమలు చేయడమే తన ప్రాధాన్యమని సెక్సారియా అన్నారు. అయితే ఈ పెంపును ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.సాధారణంగా వార్షిక వేతనాల పెంపు వల్ల నిర్వహణ లాభం మార్జిన్ 1.50 శాతానికి పైగా తగ్గుతుందని సెక్సారియా తెలిపారు. స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా డిమాండ్ దెబ్బతినడంతో నాన్ కోర్ ఆదాయంపై నికరంగా 6 శాతం పెరుగుదలను కంపెనీ చూపించింది. సాధారణంగా ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. జూన్ త్రైమాసికంలో ఈ సంఖ్య 0.20 శాతం క్షీణించి 24.5 శాతంగా నమోదైందని, అయితే మార్జిన్లను 26-28 శాతం ఆకాంక్షాత్మక పరిధిలోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని సెక్సారియా నొక్కి చెప్పారు.డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకునేందుకు ముందస్తు నియామకాల్లో పెట్టుబడులు పెట్టడం మార్జిన్లను దెబ్బతీసిందని, డిమాండ్ లేకపోవడం వినియోగ స్థాయిలను తగ్గించిందని సెక్సారియా వివరించారు. జూలై 11 నాటికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.81 లక్షల కోట్లుగా ఉంది.
ఫ్యామిలీ

వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు!
ఖిలా వరంగల్ : పూర్వం రోజుల్లో వంటలకు మట్టి పాత్రలనే వాడే వారు. అన్నం, కూర, పాలు, పెరుగు.. ఇలా ప్రతీ పదార్థం మట్టి కుండలోనే వండేవారు, భద్రపరిచేవారు. ఈ పాత్రల్లో వండిన, భోజనం చేసిన వారు ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవించేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి పాత్రలు మాయమయ్యాయి. వాటి స్థానంలో అల్యూమినియం పాత్రలు, పేపర్ పేట్లు ప్రత్యక్షమయ్యాయి. ఫలితంగా వీటిని వినియోగించిన ప్రజలు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ప్రస్తుత తరం మట్టి పాత్రలపై మక్కువ చూపుతోంది. దీంతో ఏళ్ల క్రితం వదిలేసిన మట్టి పాత్రలు ప్రజలు మళ్లీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఫలితంగా మార్కెట్లో మట్టి పాత్రలకు డిమాండ్ కనిపిస్తోంది. అయితే ఈ కాలంలో కూడా మట్టి పాత్రలను ఎవరు వాడతారనుకుంటే పొరపాటే.. వీటిని నేటికీ వినియోగించే వారు ఉన్నత వర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.రుచి..ఆరోగ్యకరం..మట్టిపాత్రలో వంట రుచిగా ఉంటుంది. అలాగే, ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్కు వేడి తగలగానే ఇన్ ఫ్రారెడ్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తవుతాయి. ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తిస్థాయిలో శుద్ధి అవుతుంది. ఉదాహరణకు పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టినా.. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నా ఇంక్యుబేటర్ అనే పరికరంలో (లైట్ కింద పెడతారు) కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే శిశువులకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సరిచేయగల శక్తి ఈ కిరణాలకు ఉంది. ప్రకృతి వైద్యంలో బురద స్నానం (మడ్ బాత్) గురించి తెలిసే ఉంటుంది. శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు. అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయ్యి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే, మట్టి పాత్రల్లో వంట చేస్తే పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్థంలోని పోషక విలువలను ఏమాత్రం వృథా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు శక్తిని కలిగించి ఆహారాన్ని సమతుల్యంగా మారుస్తాయి. అందుకే మట్టి పాత్రల్లో చేసిన వంటలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉంటుంది. లోహపాత్రల వల్లే రోగాలు..అల్యూమినియం పాత్రలో వండిన పదార్థాలు విషతుల్యమవుతాయి. ఈ పదార్థలు తిన్న ప్రజలు బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుబాటులో మట్టి టీ గ్లాస్, వాటర్ బాటిళ్లు..తెలంగాణలోని ఆదిలాబాద్, గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో గృహోపకర పాత్రలను మట్టితోనే తయారు చేస్తారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుమ్మరి కులస్తులు మట్టి పాత్రలు అందుబాటులో ఉంచారు. టీ గ్లాస్, వాటర్ బాటిల్, కంచాలు, స్పూన్లు.. ఇలా అన్ని రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయి.చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!మట్టి కడవల్లోనే మంచినీరు..పూర్వకాలంలో మట్టి పాత్ర(కుండ)ల్లో వంటలు చేసే వారు. మట్టి కడవల్లోనే మంచినీరు తాగే వారు. అందుకే ఆ కాలపు వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే 40 ఏళ్ల నుంచి మట్టి పాత్రలు వాడకం క్రమేనా తగ్గతూ వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న రోగాలతో పాతకాలం నాటి ఆహార పద్ధతులపై ప్రజలు మక్కువ పెంచుకుంటన్నారు. ఇందులో భాగంగా మట్టి కుండలో చికెన్, మట్టి పాత్రలో వంటలకు క్రేజ్ పెరుగుతోంది. మట్టి పాత్రల్లో వంటలు ఆరోగ్యకరం అనగానే ఆ పాత్రలు మార్కెట్లో భారీగా అమ్ముడవుతున్నాయి. గతంలో ఇళ్లలో మట్టితో తయారు చేసే వస్తువులు అనేకం ఉండేవి. ప్రస్తుతం మార్కెట్లో లభించే కుండలు తప్ప మరే ఇతర మట్టి పాత్రలు కనిపించడం లేదు.ఇదీ చదవండి: Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపుమట్టి పాత్రలే ముద్దు : అల్యూమినియం కంటే మట్టి పాత్రలే ముద్దు. తెలంగాణలో ఉగాది పచ్చడి కొత్త మట్టి కుండల్లో చేస్తారు. ఇలా చేయడం వల్ల మట్టి పాత్రల్లో ఉండే పోషకాలు నేరుగా శరీరంలోకి వెళ్తాయి. దీని వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు. పూరి జగన్నాథుడి ఆలయంలో ఇప్పటికీ మట్టి పాత్రల్లోనే ప్రసాదాలు తయారు చేసి పంపణీ చేస్తారు.-డాక్టర్ నరేశ్కుమార్, ఫోర్ట్ రోడ్డు వరంగల్

బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు
విజయనగరం అర్బన్ బొబ్బిలి: ఇప్పటికే దేశ విదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన బొబ్బిలి వీణ (Bobbili Veena) కు మరో అరుదైన గుర్తింపు లభించింది. వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద బొబ్బిలి వీణ బహుమతికి ఎంపికైంది. ఓడీఓపీ అవార్డుకు రాష్ట్రం నుంచి 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపిక కాగా మన బొబ్బిలికి చెందిన నమూ నా వీణ ఎంపిక కావడం జిల్లాకు గర్వ కారణంగా నిలిచింది. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఢిల్లీ వెళ్లారు. కొత్త ఢిల్లీ ప్రగతి మైదానంలో భారత్ మండపంలో సోమ వారం జరిగే కార్యక్రమంలో ఓడీఓపీ అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు. బొబ్బిలి వీణకు అంతర్జాతీయ గుర్తింపు బొబ్బిలి వీణకు దేశ విదేశాల్లో ఎనలేని ఖ్యాతి ఉంది. బొబ్బిలి వీణ అని విస్తృతంగా పిలువబడే బొబ్బి లి నుంచి వచ్చిన సాంప్రదాయ ’సరస్వతి వీణ’ విలక్షణమైన స్వరాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే సరస్వతి వీణను పోలి ఉండే చిన్నపాటి వీణను బహుమతిగా జ్ఞాపికగా ఇవ్వడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులో సైతం బొబ్బిలి నమూనా వీణలను జ్ఞాపికలుగా ఇవ్వడం జరుగుతోంది. బొబ్బిలి వీణ బొమ్మలతో పోస్టల్ స్టాంపులు, నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఇతర రాష్ట్రాలకు సైతం బొబ్బిలి వీణలు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో సైతం బొబ్బిలి వీణ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ ఈ వీణను చూసి ముచ్చటపడ్డారు. బొబ్బిలి వీణకు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి, బాడంగి మండలం వాడాడ వీణల తయారీకి ప్రసిద్ధి చెందిన గ్రామాలు. వీణల తయారీ ఒక అరుదైన హస్త కళగా గుర్తింపు పొందింది. ఈ గ్రామాల్లో దాదాపు 300 కుటుంబాలు తమ జీవనోపాధి కోసం వీణల తయారీలో నిమగ్నమై ఉన్నారు. వీటి తయారీకి పనస మరియు సంపంగి కలప, చెక్కకు ఉపయోగిస్తారు. వీణల తయారీకి కలప కొరతను నివారించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృతంగా పనస చెట్లను పెంచాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఓడీఓపీ కింద బొబ్బిలి వీణకు గుర్తింపు లభించడంతో వీటి ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు.

గామా నైఫ్తో రేడియో సర్జరీ
యురేనియం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ రేడియో ధార్మిక శక్తి గల పదార్థం రేడియం. ఈ రెండు పదార్థాలు అప్రయత్నంగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలను వెదజల్లుతూ ఉంటాయి. వీటిలో గామా కిరణాలు ఎక్కువ శక్తి కల్గి ఉంటాయి. ఈ మూలకాల ధర చాలా ఎక్కువ. 1935లో ఎర్నెస్ట్ లారెన్స్ కృత్రిమ రేడియో ధార్మిక పదార్థం రేడియో సోడియాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇటువంటి రేడియో ధార్మిక పదార్థాలు వెయ్యికి పైగా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ గామా కిరణ జనకాలే.ఈ విశాల విశ్వంలో నక్షత్రాల విస్పోటనం వల్ల గామా కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి భూమిని చేరకుండా ఆకాశంలో ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఈ గామా కిరణాలు భూమిని జేరి మనిషి మీద పడితే అవి పడే డోసును బట్టి మనిషి రకరకాల ఆపదలకు గురవుతాడు.ఎక్స్ కిరణాలకన్నా గామా కిరణాలకు చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువ. సులువుగా ఈ కిరణాలు ఎదిగే మొక్కల అంతర్భాగంలోకీ, జంతువుల ధాతువుల్లోకీ దూసుకుపోగలవు. గామా కిరణాలు మొక్కల మీద పడితే అవి వేగంగా ఎదుగుతాయి, దిగుబడి పెరుగుతుంది. పొలాల్లో పంట లను నాశనం చేసే ఎలుకలు ఈ కిరణాల ధాటికి మరణిస్తాయి. మొక్కలకు వచ్చే చీడ, పీడ, పురుగులు, తెగుళ్లు ఈ గామా కిరణాల తాకిడికి దరిజేరవు. మనిషి తట్టుకోలేని ఈ కిరణాలను ధాన్యం తట్టుకోగలదు. పంట పొలాలపై ఈ కిరణాలు పడటం వల్ల పంట కాల వ్యవధి తగ్గుతుంది. దిగుబడి పెరుగుతుంది. పంట నాణ్యత గణనీయంగా పెరుగుతుంది. ఇంకా ప్రయోగ దశలోఉన్న ఈ విధానం రైతులకు అందుబాటులోకి రావాల్సి ఉంది.మెదడు లోని కణితులు, గాయాలు, ధమనుల వైఫల్యాలు, ట్రెజిమినల్, న్యూరల్జియా, ఇతర పరిస్థితులకు చికిత్స చేయడంలో ‘గామా నైఫ్’ అనే పరికరం సహాయ పడుతుంది. ఇది కోబాల్ట్ –60 రేడియేషన్ మూలాల నుండి వచ్చే గామా కిరణాలను ప్రత్యేకమైన పద్ధతిలో కేంద్రీకరించి నిర్దిష్ట ప్రాంతాలకు పంపడంలో సహకరిస్తుంది. దీని సహాయంతో కచ్చితమైన మోతాదులు వైద్యుడు పంపగల్గుతాడు. రోగికి సమస్య ఉన్న స్థానం, గాయం రకం, ప్రక్రియ సమయంలో రోగి సాధారణ ఆరోగ్యం, ఇతర కారకాలపై గామా నైఫ్ విజయం ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇది మెదడులోని సమస్యలను సరి చేయగల ఒక సాంకేతికత. చికిత్సలో భాగంగా రోగి తల కదలకుండా ఒక ఫ్రేమ్ కట్టి గామా కిర ణాలు ఎక్కడ పడాలో పర్యవేక్షిస్తారు. రోగికి నొప్పి లేకుండా, మెలకువగా ఉండగానే కొన్ని గంటల్లో ఈ చికిత్స పూర్తి అవుతుంది. శరీరంపై ఎటువంటి కోతలు ఉండవు.గామా కిరణాలు ప్రభావిత ప్రాంతాలకు అధిక మోతాదులోనే వెడతాయి. చుట్టుపక్కల కణజాలానికి తక్కువ హాని మాత్రమే జరుగుతుంది. ఈ చికిత్స వైద్యుడు మాత్రమే నిర్వహించాలి. రోగులు ఈ చికిత్స పూర్తి అయిన తరువాత ఇంటికి వెళ్లిపోవచ్చు. ఈ చికిత్స అనంతరం కొంతమందికి కొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. తల నొప్పి, వికారం, వాంతులు, తిమ్మిర్లు, చుట్టుపక్కల జుట్టు రాలిపోవడం, బలహీనత, దృష్టి సమస్యలు రావచ్చు. ప్రతి సమస్యకు వైద్యుని సలహా మేర మందులు వాడితే పరిష్కారం లభిస్తుంది.-డా. సీ. వీ. సర్వేశ్వర శర్మ కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు

సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో.. ఇంటర్నేషనల్ రాక్ డే
హైదరాబాద్ శివార్లలో రెండున్నర బిలియన్ ఏళ్ల క్రితం వెలసిన అరుదైన వారసత్వ రాతి సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు కొనియాడారు. అదే లక్ష్యంగా నృత్యం, ఇకెబనా ఎగ్జిబిషన్ ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని సుందరయ్య విజాన కేంద్రంలో నిర్వహించారు. సొసైటీ టు సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్రాక్ డే సందర్భంగా పర్యావరణంలో ముఖ్య భూమికను పోషించే రాతి సంపదను ఆయా దేశాలు ఎలా కాపాడుకుంటారో వివరించారు. నయనతార నందకుమార్ అవర్ సీక్రేడ్ ప్లేస్కు చెందిన వారు అంతరించిపోతున్న రాతి సంపద గురించి డ్యాన్స్ రూపంలో వివరించారు. పుప్పాలగూడలోని పకృద్ధీన్ గుట్ట 400 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, గుట్టను ఎలా ధ్వంసం చేస్తున్నారో, కంచె గచ్చిబౌలిలో పురాతన రాళ్లు, పర్యావరణ విధ్వంసాన్ని వివరించారు. నగర శివార్లలో రెండున్నర బిలియన్ సంవత్సరాల క్రితం వెలసిన రాతి సంపదకు ముప్పు వాటిల్లుతోందని, పర్యావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని నయనతార వివరించారు. ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాళ్లు, నీళ్లు, చెట్లు ఎలా మమేకమవుతాయో వివరిస్తూ ఓరా స్కూల్ ఆఫ్ ఇకెబనా హైదరాబాద్ చాప్టర్ సభ్యులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చెట్లకు రాళ్లు మినరల్స్ను అందిస్తాయని, రాళ్లలో పక్షలతో పాటు అనేక ప్రాణులు జీవిస్తాయని తెలియజేశారు. పర్యావరణ విచ్ఛిన్నం వల్లే గ్లోబల్వారి్మంగ్, అతి వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి అవాంతరాలు వస్తున్నాయని ఓరా స్కూల్ ప్రెసిడెంట్ నిర్మల పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రెసిడెంట్ ఫాతిమా అలీఖాన్, వైస్ ప్రెసిడెంట్ సంగీత వర్మ, జనరల్ సెక్రెటరీ ఫ్రాక్ ఖాదర్ పాల్గొన్నారు. (చదవండి: సామాజిక మాధ్యమాల్లో వైరల్గా ‘గివ్ హిమ్ నోబెల్’ ..!)
ఫొటోలు
అంతర్జాతీయం

21 నెలలు.. 58 వేల మరణాలు!
దెయిర్ అల్–బలాహ్: గాజా స్ట్రిప్లో హమాస్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో మరణాలు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 58 వేల మంది పాలస్తీనియన్లు అసువులు బాసినట్లు ఆదివారం గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. మృతుల్లో సగానికి పైగా మహి ళలు, చిన్నారులే ఉన్నారంది. క్షత గాత్రుల సంఖ్య లక్ష్యల్లోనే ఉంటుందని అంచనా. యుద్ధ మరణాలపై గాజా ఆరోగ్య విభాగం విడుదల చేసే గణాంకాలను ఐక్యరాజ్యస మితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీ యమైనవిగా భావిస్తున్నాయి. నీళ్ల కోసం వచ్చి ఆరుగురు బాలలు మృతిగాజాపై ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో 30 మంది చనిపోయారు. వీరిలో నీళ్ల ట్యాంకు వద్దకు వచ్చిన ఆరుగురు చిన్నారులున్నారు. సెంట్రల్ గాజా నగరంలో ఓ వీధిలో నడిచి వెళ్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 11 మంది చనిపోగా 30 మంది క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో అల్–అహ్లి ఆస్పత్రి జనరల్ సర్జన్ డాక్టర్ అహ్మద్ ఖండిల్ కూడా ఉన్నారు. ఆస్పత్రికి వస్తుండగా దాడికి గురయ్యారని అధికారులు తెలిపారు. జవైదాలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంటిపై దాడి విషయం తమకు తెలీదని, 24 గంటల వ్యవధిలో గాజాలోని 150 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. కాగా, వెస్ట్బ్యాంక్లో శనివారం ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో చనిపోయిన పాలస్తీనా అమెరికన్ సైఫొల్లా ముసల్లెట్(20), అతని స్నేహితుడు మహ్మద్ అల్ షలాబీలకు ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ సారథ్యంలో సాయుధులు ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపుదాడులు చేసి సుమారు 1,200 మందిని చంపడంతోపాటు 251 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ లక్ష్యంగా గాజాపై యథేచ్ఛగా దాడులు సాగిస్తోంది.

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఝలక్.. ప్రధాని కీలక ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని గద్దె దింపేసి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆ పదవిని చేపట్టాలని భావిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం వదంతులేనంటూ కొట్టిపారేశారు. జర్దారీ ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగుతారన్నారు.‘ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ దేశాధ్యక్ష పదవిపై ఎన్నడూ ఆసక్తి వ్యక్తం చేయలేదు. ప్రస్తుతానికి అటువంటి ప్రణాళిక కూడా ఏదీ లేదు’అని ఆయన స్పష్టం చేశారు. మునీర్, జర్దారీ మధ్య సానుకూల సంబంధాలున్నాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవముంది. పాకిస్తాన్ అభివృద్ధి, పురోగమనమే వీరిద్దరి లక్ష్యం కూడా’అని ప్రధాని వివరించారు.‘జర్దారీ, మునీర్, షరీఫ్లే లక్ష్యంగా తప్పుడు జరుగుతోంది. దీని వెనుక విదేశీ శక్తులున్న సంగతి మాకు తెలుసు. జర్దారీ స్థానంలో ఆర్మీ చీఫ్ మునీర్ రానున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తి అసత్యాలు. దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదు. అటువంటి యోచన కూడా లేదు’ అంటూ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్ నక్వీ ఎక్స్లో చేసిన ప్రకటన అనంతరం ప్రధాని ఈ మేరకు వివరణ ఇవ్వడం విశేషం. ప్రధాని పదవిని షహబాజ్కు, అధ్యక్ష బాధ్యతలను జర్దారీకి అప్పగించేందుకు అధికార కూటమిలో గతేడాది ఒప్పందం కుదిరింది. ఆ మేరకు జర్దారీ ఐదేళ్ల కాలానికి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అణు కార్యక్రమంపై ప్రకటన..ఇదే సమయంలో.. భారత్తో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు అణు ఘర్షణలకు దారితీయొచ్చనే ఆందోళనలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తోసిపుచ్చారు. ఇస్లామాబాద్లోని విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసమే వాటిని వినియోగిస్తామని వెల్లడించారు. భారత్- పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో 55 మంది తమ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.ఇదిలా ఉండగా.. పహల్గాంలో పర్యాటకులపై పాశవిక ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ తర్వాత ఇస్లామాబాద్ ఎదురుదాడికి దిగగా.. భారత్ వాటిని సమర్థంగా అడ్డుకుంది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

కాలిఫోర్నియాలో వలసదారుల అరెస్టులు ఆపండి
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులను ఎక్కడపడితే అక్కడ ఆపి తనిఖీలు చేపట్టడం, అరెస్ట్లు చేయడం తక్షణమే ఆపేయాలని ఫెడరల్ జడ్జి ఒకరు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలోని హిస్పానిక్లు, లాటినోలను పథకం ప్రకారం వేధిస్తోందని గత వారం లాస్ ఏంజెలెస్లోని యూఎస్ డి్రస్టిక్ట్ కోర్టులో వలసదారుల తరఫున పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గుర్తింపు కార్డులు చూపినా ఇద్దరు అమెరికా పౌరులను మరో ముగ్గురు వలసదారులను ఎటువంటి వారెంట్లు లేకుండా అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని ఆరోపించారు. కేవలం శరీరం రంగు ఆధారంగా అరెస్ట్లు చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన జడ్జి మామె ఈ ఫ్రిమ్పాంగ్ శుక్రవారం పలు ఆదేశాలను వెలువరించారు. లాస్ ఏంజెలెస్ సహా కాలిఫోర్నియాలోని ఏడు కౌంటీల పరిధిలో వలసదారుల అరెస్ట్లు, సోదాలను నిలిపివేయాలన్నారు. అంతేకాదు, వలసదారులను నిర్బంధించిన లాస్ ఏంజెలెస్ డిటెన్షన్ కేంద్రంలోకి అటార్నీ ప్రవేశించకుండా ఫెడరల్ ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వులను సైతం రద్దు చేశారు.

ఈయూ, మెక్సికోపై 30% టారిఫ్లు
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో శనివారం పోస్టుచేశారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్ ప్రశంసించారు. మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్లు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు 27 దేశాలతో కూడిన ఈయూపై టారిఫ్లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదని అంటున్నారు.
జాతీయం

‘ఆపరేషన్ కాలానేమి’తో దొంగ బాబాల్లో వణుకు.. 82 మంది ఆటకట్టు
డెహ్రాడూన్: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నకిలీ బాబాల మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ, ఈ నకిలీ బాబాలు తమ ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు. అయితే ఇటువంటి వారి ఆటకట్టించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించిన ‘ఆపరేషన్ కాలానేమి’లో మొత్తం 82 మంది నకిలీ బాబాలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తరాదిలో చార్ ధామ్ యాత్ర, కన్వర్ యాత్ర కొనసాగుతున్న దృష్ట్యా నకిలీ బాబాలు పుట్టుకువస్తున్నారు. దీనిని గుర్తించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ కాలానేమి’ని చేపట్టి, దొంగబాబాల ఆగడాలను కట్టడి చేస్తోంది. ప్రజలను మోసం చేసేందుకు సాధువులు, స్వామీజీల వేషం ధరించినవారిని గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డెహ్రాడూన్లో జరిగిన ఈ ఆపరేషన్లో మొత్తం 82 మంది నకిలీ బాబాలను అరెస్టు చేసినట్లు వివరించారు.మతం ముసుగులో ప్రజలను దోపిడీ చేసేందుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినట్లు డెహ్రాడూన్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్పీ) అజయ్ సింగ్ తెలిపారు. అరెస్టు చేసిన దొంగ బాబాలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు విభాగాల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అజయ్ సింగ్ పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో బంగ్లాదేశ్ జాతీయుడు షా ఆలం అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతన్ని డెహ్రాడూన్ జిల్లాలోని సహస్పూర్లో అరెస్టు చేశారు.

డార్క్ క్వీన్ సాన్ రేచల్ కన్నుమూత
ప్రముఖ మోడల్ సాన్ రేచల్ (San Rechal) బలవన్మరణానికి పాల్పడింది. పుదుచ్చేరిలో తన నివాసంలో ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ శనివారం కన్నుమూసింది. పుదుచ్చేరిలో పుట్టిపెరిగిన సాన్ రేచల్.. మోడలింగ్ రంగంలో మిస్ డార్క్ క్వీన్గా, మిస్ బెస్ట్ ఆటిట్యూడ్గా, మిస్ ఆఫ్రికా గోల్డెన్ ఇండియా లాంటి టైటిల్స్ గెలుచుకున్నారు. మోడలింగ్ మాత్రమే కాదు.. ఆమె మెడిసిన్ విద్యనూ అభ్యసించారు. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె.. అధిక డోస్లో నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యుల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె.. రెండు కిడ్నీలు చెడిపోవడంతో జూలై 12వ తేదీన కన్నుమూసినట్లు సమాచారం.రేచల్ తల్లి ఆమె చిన్నతనంలోనే కేన్సర్తో కన్నుమూసింది. అప్పటి నుంచి తండ్రి, సోదరుడి ప్రోత్సాహంతో ఆమె పెరిగారు. రంగు గురించి తోటి స్నేహితులు, బంధువులు ఆమెను ఎగతాళి చేసేవారు. అయినా ఆమె కుంగిపోలేదు. ‘‘రంగులో ఏముందిలే.. కరుపు(నలుపు) కూడా అందమే’’ అనే ఆమె మాటలు మోడలింగ్ రంగంలో ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి. అయితే.. View this post on Instagram A post shared by San rechal Gandhi / Pageant Coach (@san_rechal_official)సూసైడ్ నోట్లో.. తన మరణానికి భర్త(ఇటీవలె వివాహం జరిగింది), కుటుంబ సభ్యులు కారణం కాదని ఆమె ఒక లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె మృతిపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవమానాలను, ట్రోలింగ్ను తట్టుకుని మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్న రేచల్.. పాతికేళ్లకే ఇలా తనువు చాలించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు.. అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

Kerala: మళ్లీ ‘నిఫా’ కలకలం.. అంతటా అప్రమత్తం
పాలక్కాడ్: కేరళలో నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ‘నిఫా’ అనుమానిత మరణం నమోదైంది. ఈ నేపధ్యంలో ఈ వైరస్ ప్రభావం కలిగినవిగా భావిస్తున్న ఆరు జిల్లాల్లోని వైద్యాధికారులు మరింత అప్రమత్తయయ్యారు. నిఫా రెండవ మరణం విషయంలో పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తుది నిర్ధారణ చేయనుంది.జూలై 12న పాలక్కాడ్ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి నిపా వైరస్ కారణంగా మరణించాడనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ వైరస్తో కేరళలో మరణించినవారి సంఖ్య రెండుకు చేరింది. బాధితుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. మంజేరి మెడికల్ కాలేజీలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నిపా పాజిటివ్గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో వెంటనే అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీల్డ్ సర్వైలెన్స్ను ముమ్మరం చేసింది.మృతునితో సంబంధం కలిగిన 46 మంది జాబితాను సిద్ధం చేశారు. మృతుడు గతంలో తిరిగిన ప్రాంతాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్,మొబైల్ టవర్ డేటా సాయం తీసుకున్నారు. ప్రాంతీయ వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, పరిస్థితులను పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని డేటాలను సేకరిస్తున్నామని వీణా జార్జ్ తెలిపారు. కాగా పాలక్కాడ్, మలప్పురం జిల్లాల ప్రజలు అనవసరమైన సందర్శనలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు. ఆస్పత్రులలోని వైద్య సిబ్బంది, రోగులు, సందర్శకులు మాస్క్లు ధరించాలని సూచించారు. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్ తదితర ఆరు జిల్లాల్లోని ఆసుపత్రులకు నిపా అప్రమత్తతపై అధికారుల నుంచి హెచ్చరికలు అందాయి.

కాలేజీకి వెళ్లే కూతుళ్లు ఉన్నా, జల్సాలకు మరిగిన భార్య..!
యశవంతపుర: భర్త అనే గౌరవంలేదు. పార్టీ, పబ్ అంటూ తిరగటం, తన విలాసవంతమైన జీవనం కోసం ఆరాటం, అందుకే హత్యాయత్నం చేశానని కన్నడ బుల్లితెర నటి మంజుళ శ్రుతి (38) భర్త అమరేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇటీవల బెంగళూరు హనుమంతనగర పోలీసుస్టేషన్ పరిధిలోని మునేశ్వర బ్లాక్లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫిర్యాదు మేరకు భర్త అమరేశ్ను అరెస్టు చేశారు. ఇందుకు భార్య ధోరణే కారణమని చెప్పాడు. ఆమెకు ఏమాత్రం మానవత్వం లేదు, పిల్లలను ఇంటిలో పెట్టి పబ్, పార్టీలంటూ తిరుగుతుంది. అర్ధరాత్రి ఇంటికొచ్చేది. ఒక్కోసారి ఇళ్లు వదిలితే 15 రోజులైనా కనబడదు. కుంభమేళా అంటూ 15 రోజులు అడ్రస్ లేదు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలేజీకీ వెళ్లే ఇద్దరు కూతుళ్లు ఉండగా, నేను రూ.25 లక్షలతో ఒక అపార్ట్మెంట్ ఫ్లాటును కొనాలనుకున్నా. కానీ ఆ డబ్బు తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేసుకొంది. విపరీతంగా వేధిస్తూ ఉండడంతో కత్తితో దాడి చేశాను అని విచారణలో తెలిపాడు. కాగా బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఎన్ఆర్ఐ

శ్రీ సాంస్కృతిక కళాసారథి 5వ వార్షికోత్సవం, గురుపూర్ణిమ శుభాకాంక్షలు
గురుపూర్ణిమ నాడు ప్రారంభమైన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఈ రోజు తన 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. గత ఐదేళ్లయేటట తాము చేపట్టిన ప్రతి అడుగులో, మీరు అందించిన ఆదరణ, ఆశీర్వాదాలు, ప్రోత్సాహం తమకు బలాన్నిచ్చాయని పేర్కొంది. ‘‘ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి, మాకు తోడుగా నిలిచిన సభ్యులకు,మార్గనిర్దేశం చేసిన మేధావులకు, మన ఆహ్వానాన్ని స్వీకరించి అలంకరించిన అతిథులకు, తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులకు, స్పందించిన ప్రేక్షకులకు, సమయానుకూలంగా విరాళాలు అందించిన దాతలకు, ఆశీర్వచనాలు, అభినందనలు తెలియజేసిన మిత్రులకు, మా కార్యనిర్వాహక వర్గం తరఫున శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.’’అని ప్రకటనలో వెల్లడించింది. ఎనలేని సంపదలాంటి ఈ సహకారం ఇక ముందు కూడా కొనసాగాలని అభిలషించింది.అదే శక్తితో, భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చింది. అలాగే ఇప్పటివరకూ మా సంస్థ నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాల సంగ్రహాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చింది.

8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా
టంపా: ఫ్లోరిడా: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గణపతి పూజలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమెరికా తెలుగు సంబరాలను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నందుకు నాట్స్ సంబరాల కమిటీని ఆయన అభినందించారు. అమెరికాలో తెలుగు వారి కోసం నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు భాష పరిరక్షణలో నాట్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఇప్పటివరకు మూడు సార్లు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలు పంచుకున్నానన్నారు.హంసవింశతి పుస్తకం ఆవిష్కరణ18వ శతాబ్ధంలో ప్రముఖ తెలుగు కవి అయ్యలరాజు నారాయణ రచించిన హంసవింశతి కావ్యాన్ని తనికెళ్ల భరణి నేటి తరం కోసం ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సంబరాల వేదికపై నందమూరి బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని ఎందరో కవులు తమ రచనల్లో ప్రతిబింబించారని బాలకృష్ణ అన్నారు. భావితరాలకు తెలుగు మాధుర్యాన్ని అందించేందుకు నేటి తరం వారు తెలుగులో మాట్లాడాలని, తెలుగు రచనలను పిల్లలకు పరిచయం చేయాలన్నారు.పద్యం, అవధానం తెలుగు భాషకే సొంతమైన అమూల్యమైన ఆభరణాలని ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి అన్నారు.. తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భరణి పేర్కొన్నారు. తెలుగులో ఎన్సైక్లోపీడియా లాంటి పుస్తకం హంసవింశతి అని తెలిపారు.. దీనిని ప్రతి తెలుగువాడు చదవితే మన చరిత్రలో మనకు తెలియని సరికొత్త విషయాలు తెలుస్తాయని భరణి అన్నారు. 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ మన్నవతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

తొలి ఏకాదశి సందర్బంగా లండన్లో SVBTCC ఆధ్వర్యంలో బాలాజీ కల్యాణం
తొలి ఏకాదశి అనే పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని, శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) — లండన్ లోని బాలాజీ దేవాలయం - ఒక వైభవమైన శ్రీనివాస (బాలాజీ) కల్యాణాన్ని ఘనంగా నిర్వహించింది. లోడన్ వ్యాలీ లెజర్ సెంటర్, రెడింగ్ — SVBTCC ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 1800 మందికి పైగా భక్తులు హాజరై పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ వేడుకకు ఎర్లీ మరియు వుడ్లీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి యువాన్ యాంగ్, వోకింగ్హాం మేయర్ మేడం క్యారొల్ జ్యూవెల్, మరియు హిల్సైడ్ కౌన్సిలర్ పాలిన్ జార్గెన్సెన్ లాంటి ప్రముఖ స్థానిక రాజకీయ నాయకులు హాజరై ప్రత్యేకంగా గౌరవించారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పిల్లలు మరియు నిపుణుల ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీతం, నృత్యం, భక్తి కళల ద్వారా భారత సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ, కార్యక్రమం మొత్తం భక్తి శ్రద్ధలతో, సాంస్కృతిక గౌరవంతో, సముదాయ భావంతో సాగింది.భక్తుల నుంచి వచ్చిన భారీ స్పందనకు SVBTCC ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. స్వదేశానికి దూరంగా ఉన్నా కూడా, పవిత్ర తొలి ఏకాదశి రోజున కల్యాణాన్ని నిర్వహించగలగటం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నామనీ, లండన్ లోని బాలాజీ దేవాలయంలో ఈ వేడుక నిర్వహించటం మాకు గర్వకారమని అని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ డయాస్పోరా యొక్క స్థిరమైన సాంస్కృతిక విలువలకు గుర్తుగా నిలిచిందన్నారు లండన్లోని ఆధ్యాత్మిక , సామాజిక జీవితాన్ని ప్రోత్సహించడంలో SVBTCC పాత్రను మరోసారి చాటుకుందని భక్తులు కొనియాడారు.

విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్/తిరుపతి గాంధీ రోడ్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని వివిధ దేశాల్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్లో సోమవారం వైఎస్సార్ అభిమానులు మహ్మద్ జిలానీ బాషా, అక్రమ్ బాషా, కోటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి యాత్ర–2 చిత్ర నిర్మాత శివ మేక ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం 500 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ జయంతిని నిర్వహించేందుకు తన స్థలాన్ని కేటాయించిన సోనాపూర్ లేబర్ క్యాంప్ యజమాని మసూద్ అహ్మద్కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రసన్న సోమిరెడ్డి, పవన్ కుమార్, కరుణాకర్, లోకనాథ్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, షేక్ అబ్దుల్లా, ఫహీమ్, ఖాజా ముతాలిబ్, చక్రి, కర్ణ, పవన్ కుమార్, హనుమంత్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, గోపాల్, రమణా రెడ్డి, షోయబ్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో..సౌదీ అరేబియాలోని జుబైల్ ప్రాంతంలో వైఎస్సార్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అకియాకునో కంపెనీ క్యాంపులో కడపకు చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కంపెనీలో పని చేసే సుమారు 100 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సింగపూర్లో ఘనంగా వైఎస్సార్ జయంతి..వైఎస్సార్ జయంతిని సింగపూర్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కేక్ను కట్ చేశారు. తెలుగు జాతి ఈ నేల మీద నడయాడుతున్నంత కాలం.. జనానికి, జగతికి గుర్తుండి పోయే పేరు వైఎస్సార్ అని.. ఇప్పటికి ఆయన పేరు తలుచుకుంటే.. ఒక ఉద్వేగం.. ఓ పులకింత.. ఓ సంక్షేమ భావన గుర్తుకు వస్తాయని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ ఎ. సాంబశివారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా వీడియో కాన్ఫరెన్స్(జూమ్)ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వైఎస్సార్సీపీ విభాగం సలహాదారు కోటి రెడ్డి, కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి, కో కన్వీనర్స్ – ప్రకాష్ , సంతోష్ తో పాటు పవన్, రామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, దొరబాబు, ప్రసాద్, శ్రీనేహారెడ్డి, స్వాతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్సార్ ఆప్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సౌత్ ఆఫ్రికాలో ఘనంగా వైఎస్సార్ జయంతివైఎస్సార్సీపీ ఎన్నారై సౌత్ ఆఫ్రికా విభాగం ఆధ్వర్యంలో జోహన్స్బర్గ్లోని మిడ్ రాండ్లోలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డామన్నారు. అనంతరంచిల్డ్రన్స్ హోమ్లో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు నరసింహారెడ్డి కళ్ల, సూర్యరామిరెడ్డి, శివ రాజవరపు, విక్రం రెడ్డి పెట్లూరు, కృష్ణారెడ్డి, అంజలి రెడ్డి, మనోజ రాజవరపు, సూర్య రామిరెడ్డి, శ్రావణి రెడ్డి పెట్లూరు, వాసు సింగారెడ్డి, మధు పల్లె, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, అంజి రెడ్డి సానికొమ్ము, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: లండన్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
క్రైమ్

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి.. కన్నీటి వీడ్కోలు
త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి.. కన్నీటి వీడ్కోలు పలికారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బావమరదలు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలకు ఆదివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ‘మీ పెళ్లి చేసి మురిసిపోదామనుకుంటే.. ఇలా జరిగిందేమిటి!’.. దేవుడా అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విషాద వదనంలో మునిగిపోయారు.ఓబులవారిపల్లె : చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. యుక్త వయస్సు రాగానే ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరణంలోనూ వారు ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి విషాద గాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని వైకోట రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ కండక్టర్ వనమాల శ్రీనివాసులు, వనమాల ప్రభావతికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు అజయ్ కృష్ణ, చిన్న కుమారుడు సాయి కృష్ణ. పెద్ద కుమారుడు అజయ్ చిట్వేలి గ్రామానికి చెందిన సాతుపాడి నాగయ్య నాల్గవ కుమార్తె మాధవిని వివాహం చేసుకున్నాడు. మాధవి తల్లిదండ్రులు ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉండటంతో.. తన చిన్న చెల్లెలు అనితను చిన్నప్పుడే తనతోపాటు అత్తగారింటికి తీసుకొచ్చింది. అనిత ఇక్కడే హైసూ్కల్లో చదివి పుల్లంపేటలో ఇంటరీ్మడియెట్ పూర్తి చేసింది. నవమాల శ్రీనివాసులు రెండవ కుమారుడు సాయి కృష్ణ డిగ్రీ వరకు చదివాడు. చిప్పన్పటి నుంచి సాయి కృష్ణ, అనిత ఇద్దరూ కలిసి పెరగడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు మొదట్లో ఒప్పుకోకపోయినా.. తర్వాత ఒప్పించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంకా రెండు నెలలకు అనిత మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు నిర్ణయించుకొని అన్ని సిద్ధం చేసుకున్నారు.కబళించిన రోడ్డు ప్రమాదంఈ క్రమంలో విధి వీరి జీవితాలతో ఆడుకుంది. సాయికృష్ణ (24)కు రైల్వేకోడూరు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. చేరేందుకు స్కూటీపై శనివారం రైల్వేకోడూరుకు వెళ్లాడు. అక్కడ ఉండేవారు తిరుపతికి వెళ్లాలని చెప్పడంతో తిరుపతికి వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న మరదలు అనిత నంద్యాల డెమో రైలులో తిరుపతికి వెళ్లింది. ఇద్దరు కలిసి తిరుపతిలో ఉంటున్న అజయ్ కృష్ణతో మాట్లాడారు. సాయంత్రం అనిత, సాయికృష్ణ స్కూటీపై తిరుపతి నుంచి ఇంటికి బయలు దేరారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపానికి రాగానే.. వేగంగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఇద్దరిపై నుంచి లారీ వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఓబులవారిపల్లిలోని ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలిసి మె లిసి మంచి వాడు అన్న పేరు ఉన్న సాయికృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతదేహాలను సర్పంచ్ ఎన్పీ జయపాల్రెడ్డి సందర్శించి నివాళులు అరి్పంచారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అన్నమయ్య జిల్లా: లారీ బోల్తా.. తొమ్మిది మంది దుర్మరణం
ఓబులవారిపల్లె/పుల్లంపేట: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ బోల్తాపడి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా.. నలుగురు పురుషులు. ఈ దుర్ఘటనలో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 22 మంది కూలీలు ఐషర్ వాహనంపై రాజంపేట ఇసుకపల్లి గ్రామానికి మామిడి కాయల్ని కోసి, లారీలో లోడ్ చేసేందుకు వెళ్లారు. మామిడి కాయల్ని లోడ్ చేసిన అనంతరం అదే లారీపై రైల్వేకోడూరు మామిడి మార్కెట్ యార్డుకు బయలుదేరారు. లారీ రెడ్డిపల్లి చెరువుకట్టపైకి రాగా మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో గజ్జల దుర్గయ్య, గజ్జల వెంకటేశు, గజ్జల శ్రీను, గజ్జల రమణ, సుబ్బరత్నమ్మ, చిట్టెమ్మ, గజ్జల లక్ష్మీదేవి, రాధా, వెంకట సుబ్బమ్మ మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 13 మంది కూలీలను 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా రెక్కాడితే గానీ డొక్కాడని రోజు వారీ కూలీలే. ఘటనా స్థలాన్ని ఎస్పీ రామ్నాథ్ కార్గే పరిశీలించారు. లారీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలిసాక్షి, అమరావతి: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ఆదివారం రాత్రి మామిడి కాయల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన తొమ్మిది మంది చనిపోవడం, 13 మంది తీవ్రంగా గాయ పడటం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరంతా నిరుపేదలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు వారిని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సీఐ వార్నింగ్.. వ్యక్తి ఆత్మహత్య
చొప్పదండి/కరీంనగర్ క్రైం: గృహహింస, వరకట్న వేధింపుల కేసులో తనను అత్తింటివారితోపాటు మధ్యవర్తులు, కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ వేధిస్తున్నారని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 7వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగిన కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఈ వ్యవహారంలో చొప్పదండి పోలీసులు కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ శ్రీలత, మృతుడి భార్య, అత్త, మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు.కరీంనగర్ రూరల్ రెవెన్యూ కార్యాలయంలో శ్రవణ్ కుమార్ రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతనికి కరీంనగర్ బస్ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి నీలిమతో 2021 జూన్లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి నీలిమ తల్లిగారింట్లో ఉంటోంది. గత నెలలో కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్లో నీలిమ వరకట్నం వేధింపుల కేసు పెట్టడంతో శ్రవణ్తోపాటు, అతని తండ్రి నర్సింగం, తల్లి విజయ, అక్క కడారి వనజ పోలీస్స్టేషన్కు వెళ్లారు. అక్కడ సీఐ శ్రీలత ‘నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి. నేను చెప్పినట్లు వింటే మంచిది. కంప్రమైజ్ చేసుకో. లేకుంటే ఇబ్బంది పడతావు’అని బెదిరిస్తూ అతడిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో సీఐ శ్రీలత, తన భార్య, అత్త, మధ్యవర్తుల వేధింపులు భరించలేకపోతు న్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రవణ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. శ్రవణ్ తండ్రి నర్సింగం ఫిర్యాదుతో సీఐ శ్రీలత, నీలిమ, ప్రవీణ్కుమార్, నవీన్కు మార్, ఎడ్ల ప్రసన్న, బత్తుల వినోద, బత్తుల మధుకుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్రెడ్డి తెలిపారు. శ్రవణ్ మృతితో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అతడి బంధు వులు ఆందోళన నిర్వహించారు. శ్రవణ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ చిరునవ్వులిక కానరావు
హైదరాబాద్: ఇంటి ఆవరణలోని సంప్లో పడి బాలుడు మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిలాఘన్పూర్ మండలానికి చెందిన సభావత్ శ్రీను, నీల దంపతులకు ఓ కూతురు అఖిల, కుమారుడు అభి (4) ఉన్నారు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం వలస వచ్చి నగరంలో మియాపూర్ హఫీజ్పేట్ సుభాష్చంద్రబోస్ నగర్ కాలనీలో నివాసముంటున్నారు. స్థానికంగా సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బాలుడు అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం శ్రీను, నీల దంపతులు కూలిపనుల నిమిత్తం వెళ్లగా కూతురు అఖిల, కుమారుడు అభి ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో బాలుడు అభి ఇంటి ఆవరణంలో ఉన్న సంపులో నుంచి నీటిని తీసుకునేందుకు వెళ్లి అందులో పడిపోయాడు. సమీపంలో ఆడుకుంటూ ఉన్న అఖిల చూసి స్థానికులకు చెప్పడంతో అభిని సంపులోంచి బయటకు తీసి సమీపంలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. సంపుపై మూత ఏర్పాటు చేయా లని ఇంటి యజమానికి పలుమార్లు చెప్పి నా పట్టించుకోలేదని.. దీంతో తమ కుమారుడు మృత్యువాత పడినట్లు అభి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మియాపూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.