Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Strong Counter To Chandrababu Over Podili Incident1
రైతులను రౌడీలుగా చూపిస్తూ.. చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరిట ఉద్రిక్తతలకు కారణమైనవాళ్లను వదిలేసి.. అమాయక ప్రజలపై, రైతులపైనా కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు సర్కార్‌ చేయిస్తున్న మరో దుర్మార్గమని ఎక్స్‌లో మండిపడ్డారాయన. చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా?. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన.. అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది?. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?.. .. పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ?. రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని వైఎస్‌ జగన్‌ తన పోస్టులో పేర్కొన్నారు..@ncbn గారూ పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2025

AI Plane Incident: No thrust losing power Pilots last message2
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!

ఢిల్లీ: అహ్మదాబాద్‌ విమాన ‍ప్రమాదంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా విమానం నుంచి ఏటీసీకి చివరిగా వచ్చిన మే డే కాల్‌లో ఐదు సెకన్ల పాటు రికార్డ్‌ అయిన ఆడియో సందేశంలో కీలక విషయం వెల్లడైంది. ఎయిర్‌ ఇండియా విమానం నుంచి ఏటీసీకి వచ్చిన మే డే కాల్‌లో.. మే డే.. మే డే.. మే డే.. నో పవర్‌.. నో త్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌ ఇవి కెప్టెన్‌ సబర్వాల్‌ ఆఖరి సందేశంగా రికార్డైంది. దీనికి సంబంధించి ఆడియో ప్రస్తుతం ఏటీసీ వద్ద ఉందని తాజాగా వెల్లడించారు. మే డే కాల్‌కు శతాబ్ధానికి పైగా చరిత్ర!సివిల్‌ ఏవియేషన్‌ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్‌లోని క్రోయ్‌డన్‌ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్‌గా పనిచేసిన ఫ్రెడరిక్‌ స్టాన్లీ మాక్‌ఫీల్డ్‌ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్‌ పదమైన మైడెర్‌కు సమానార్ధకం. ఫ్రెంచ్‌లో మైడెర్‌ అంటే సహాయం చేయండి (హెల్ప్‌ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్‌ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్‌ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్‌ ఏవియేషన్‌ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్‌ఓఎస్‌ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.మేడే కాల్‌ వస్తే..!ఎవరైనా పైలట్‌ నుంచి ఏటీసీకి మేడే కాల్‌ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్‌ ఇచ్చిన పైలట్‌ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. కాగా, జూన్‌ 12వ తేదీ మధ్యాహ్నాం లండన్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది.

Gaddar Film Awards Ceremony Allu Arjun 3
గ్రాండ్‌గా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఈ వేడుకకు వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు ఎంతోమంది హాజరయ్యారు. అయితే ప్రత్యేక్ష ఆకర్షణగా అల్లు అర్జున్ నిలిచాడు. బన్నీతో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపించడం విశేషం.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్ రాజు.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 నుంచి 2024 వరకూ గద్దర్ అవార్డులను ఇప్పుడు ఇవ్వబోతున్నారు. సదరు పురస్కార గ్రహీతలకు సిల్వర్ మెమొంటో, రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రం అందిస్తారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. వేల మంది ఈవెంట్‌కు హాజరయ్యారు.ఇప్పటివరకు 'గామి' సినిమాకుగాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా అద్నితిన్ జిహానీ చౌదరి.. 'కల్కి 2898ఏడీ' సినిమాకు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను (రజాకార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు- అజయ్ కుమార్ (కల్కి), ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ (గామి), ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్), ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) అవార్డులు అందుకున్నారు.

WTC Final 2025: South Africa Wins First ICC Trophy In 27 Years4
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేత‌గా సౌతాఫ్రికా..

ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల చిరకాల స్వప్నం. గత 27 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌ ఎట్టకేలకు ఆ జట్టు సొంతమైంది. ఇకపై మేము ఛోకర్స్ కాదు ఛాంపియన్స్ అంటూ క్రికెట్ ప్రపంచానికి స‌ఫారీలు చాటి చెప్పారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. త‌మ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది. ఆసీస్ నిర్ధేశించిన‌ 282 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ప్రోటీస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.మార్‌క్ర‌మ్ సూప‌ర్ సెంచ‌రీ..సౌతాఫ్రికా వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్‌గా నిల‌వ‌డంతో ఆ జ‌ట్టు ఓపెన‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్‌ది కీల‌క పాత్ర‌. భారీ ల‌క్ష్య చేధ‌న‌లో మార్‌క్ర‌మ్ అద్బుత‌మైన సెంచ‌రీతో మెరిశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ త‌న జ‌ట్టుకు రెండో ఐసీసీ టైటిల్‌ను అందించాడు. అత‌డి ఇన్నింగ్స్‌కు ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఆట‌గాళ్లు సైతం ఫిదా అయిపోయారు. ఆఖ‌రిలో ఔట‌య్యి తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా లార్డ్స్‌లోని ప్రేక్ష‌కులు స్టాండింగ్ ఓవియేష‌న్ ఇచ్చారు. ఓవ‌రాల్‌గా 207 బంతులు ఎదుర్కొన్న మార్‌క్ర‌మ్‌.. 14 ఫోర్ల సాయంతో 136 ప‌రుగులు చేశాడు.బావుమాది వారియ‌ర్‌..ఈ మ్యాచ్‌లో మార్‌క్ర‌మ్ సెంచ‌రీ ఎంతో విలువైందో, బావుమా ఇన్నింగ్స్ కూడా వెల‌క‌ట్ట‌లేనిది. తొడ కండరాల గాయంతో బాధ‌ప‌డుతునే త‌న జ‌ట్టు కోసం బావుమా పోరాడాడు. 134 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 66 ప‌రుగులు చేశాడు. మార్‌క్ర‌మ్‌తో క‌లిసి కీల‌క బాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన బావుమా.. ద‌క్షిణాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్‌ను అందించిన కెప్టెన్‌గా చ‌రిత్ర‌కెక్కాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టగా, హాజిల్‌వుడ్ క‌మ్మిన్స్ త‌లా వికెట్ సాధించారు.ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్‌(72) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్‌ స్మిత్‌(66) రాణించాడు. సఫారీ బౌలర్లలో రబాడ ఐదు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్‌ మూడు వికెట్లు సాధించాడు. అనంతరం దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ప్యాట్‌ కమ్మిన్స్‌ 6 వికెట్లు పడగొట్టి ప్రోటీస్‌ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 207 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సఫారీల ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించి ప్రోటీస్‌ ఛాంపియన్స్‌గా నిలిచింది.సంక్షిప్త సమాచారం..ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌: 212/10దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌: 138/10ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ స్కోర్‌: 207/10సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ స్కోర్‌: 282/5ఫలితం: ఆసీస్‌సై 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయంమ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఐడైన్‌ మార్‌క్రమ్‌

Tech skills for youth in remote villages A new chapter with the efforts of NxtWave NSDC5
మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్‌ శిక్షణ.. నెక్స్ట్‌ వేవ్‌ & ఎన్‌ఎస్‌డిసి కృషితో కొత్త అధ్యాయం

ఉత్తరప్రదేశ్ బాగ్‌పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్‌ వేవ్‌, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్‌ ఆంట్రప్రైన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్‌కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.నెక్స్ట్‌ వేవ్‌ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్‌లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్‌లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్‌తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్‌ వేవ్‌ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్‌ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.NxtWave Institute of Advanced Technologiesకపిల్‌ కావురి హబ్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌గూడ, తెలంగాణ, 500032

What lone Air India India survivor said in video call to father6
‘నాన్నా.. నేను మాత్రం బ్రతికాను.. తమ్ముడు ఏమయ్యాడో తెలీదు’

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన విమానం జూన్‌ 12వ తేదీ సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు.ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే బ్రతికానన్న ఆనందం అతనికి ఒకవైపు ఉండగా.. తన వెంట వచ్చిన సోదరుడు దుర్మరణం చెందాడన్న దుఃఖం మరొకవైపు కలచివేస్తోంది. రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌తో పాటు అతని సోదరుడు కూడా లండన్‌ బయల్దేరాడు. కానీ రమేశ్‌ విశ్వాస్‌ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, సోదరుడు మాత్రం చనిపోయిన 241 మందిలో ఒకడయ్యాడు. ఇది రమేశ్‌ను అతని కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది.విమానం కూలి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత రమేశ్‌ తన తండ్రికి ఫోన్‌ చేసిన విషయాన్ని రమేశ్‌ మరో సోదరుడు నయన్‌ కుమార్‌ రమేశ్‌ స్కై న్యూస్‌క వెల్లడించాడు. ‘ మా నాన్నకు రమేశ్‌ విశ్వాస్‌ ఫోన్‌ చేశాడు. విమానం కూలిపోయిందన్నాడు. నేనొక్కడినే బయటపడ్డా. మిగతా ఎవరూ నాకు అక్కడ కనిపించలేదు. తమ్ముడు ఎక్కడ అనే విషయం కూడా తెలీదు. అసలు విమానం ఎలా కూలిపోయిందో నాకైతే అర్థం కాలేదు’ అని చెప్పినట్లు నయన్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రమేశ్‌ ప్రాణాలతో బ్రతికాడన్న సంతోషం ఒకవైపు, ఉన్న మరొక సోదరుడ్ని కోల్పోవడం మాత్రం తీవ్ర వేదనకు గురిచేస్తుందన్నాడు. What Is Mayday Call: AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!

Advantages of Buying a Home in Monsoon7
ఇల్లు కొనడానికి ఇదే సరైన కాలం..

వర్షంలో బయటకు వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో కారణాలెన్నో! కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షణ్ణంగా తెలుస్తుంది కాబట్టి.. సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్‌ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్‌ జామ్‌ అవుతాయి. వర్షం నీరు వెళ్లే సౌకర్యం లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతానికి సంబందించి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్‌ స్టాండ్‌ లేక రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.నాణ్యత తెలుస్తుంది.. ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలంలోనే.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసే కొనుగోలుదారుల మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్‌ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశం అయ్యాక కామన్‌గా ఏర్పాటు చేసిన వసతుల్లో లీకేజ్‌లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా కాలంలో ప్రాజెక్ట్‌ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్‌రూమ్, సీలింగ్, పంబ్లింగ్, డ్రైనేజీ లీకేజ్‌ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్‌ను కోరే వీలుంటుంది.👉 ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..రీసేల్‌ ప్రాపర్టీలనూ.. రీసేల్‌ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధ్రుడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్‌ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా? అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్‌ మెంట్‌ సెల్లార్‌ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది.వర్షంలో రాయితీలు.. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్‌–అక్టోబర్‌ పండగ సీజన్‌ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు.

Indian Students in Iran Urge Evacuation 8
Indian Students: మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి.. !

ఇజ్రాయిల్‌ నిన్న(శుక్రవారం) చేసిన దాడుల తర్వాత ఇరాన్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా ఇజ్రాయిల్‌ విరుచుకుపడటంతో ఇరాన్‌లో భారీ నష్టమే వాటిల్లింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు చేసింది. ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ ప్రారంభించిన తర్వాత ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్‌ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. అయితే దీనికి ప్రతిగా ఇజ్రాయిల్‌పై ఈరోజు(శనివారం) ఇరాన్‌ మెరుపు దాడులు చేసింది. ఇరాన్‌ చేసిన క్షిపణి దాడులతో ఇజ్రాయిల్‌లో సైతం భారీ నష్టమే వాటిల్లినట్లే తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్‌లో ఉన్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. ఏ సమయంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ వేడుకుంటున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం ఇక్కడ అంతా బాగానే ఉందని, మీరంతా సురక్షితంగా ఉన్నారనే భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ భారత విద్యార్థులు మాత్రం ఈ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని, తమకు ఒకానొక సమయంలో భారీగా భూమి కంపించినట్లు అనిపించిందని, సురక్షిత ప్రాంతాలకు తరలించే యత్నం చేయాలని విన్నవిస్తున్నారు. ఈ యుద్ధ సమయంలో ఏది సురక్షిత ప్రాంతమనేది కూడా ఆ యూనివర్శిటీ అధికారులు చెప్పలేకపోతున్నారు. తమకు ఫలానా ప్రాంతం సురక్షితమైనదనే సమాచారం ఏదీ లేదని, మీరు దయచేసి సంయమనం పాటించాలని అంటున్నారు. ‘ మనమంతా సేఫ్‌ ప్లేస్‌లో ఉన్నాం. దయచేసి మీరు కామ్‌గా ఉండండి’ అంటూ టెహ్రాన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టీయూఎంఎస్‌) అధికారులు చెప్పినట్లు కశ్మీర్‌ నుంచి వెళ్లి అక్కడ ఎంబీబీఎస్‌ రెండో ఏడాది చదువుతున్న తబియా జహ్రా పేర్కొన్నారు.ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి వెళ్లిన అలిషా రిజ్వీ మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం మా డేటాను అధికారులు సేకరిస్తున్నారు. మా ఈ మెయిల్‌ అడ్రస్‌, ఫోన్‌ నంబర్లు తీసుకుంటున్నారు. ఒకవేళ మమ్మల్ని తరలించే అవసరం ఏర్పడితే అందుకు ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’ ని ఆమె పేర్కొన్నారు. వీరిద్దరి 5.5 ఎంబీఎస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇరాన్‌లోని టెహ్రాన్‌కు 2023లో రాగా, ఇప్పటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదే తరహాలో చాలామంది విద్యార్థులు ఇరాన్‌లోని ప్రస్తుత పరిస్థితుల నడుమ భయాందోళనలతో ఉన్నారు. ఇదిలా ఉంచితే, జమ్మూ కశ్మీర్‌ విద్యార్థి సంఘం.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కలిసింది. భారత స్టూడెంట్లు అక్కడ ప్రస్తుత భయానక పరిస్ధితుల్లో ఉన్నారని, వారికి పదేపదే యుద్ధ సైరన్లు వినిపించడంతో వారు బెంబేలెత్తిపోతున్నారని జై శంకర్‌కు సదరు అసోసియేషన్‌ పెద్దలు విజ్తిప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇరాన్‌లో చదువుతున్న తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని స్టూడెంట్‌ అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. మరొకవైపు ఇరాన్‌లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఇప్పుడు తాము ఉన్న ప్రదేశంలో ఉండలేకపోతున్నామనే ఆందోళన భారత విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.

I Survived a Plane Disaster by Sitting in Seat 11A: Thai Singer9
11A సీట్‌.. 1998లో అచ్చం ఇలాగే.. మరో జన్మ ఎత్తిన సింగర్‌!

మనకేం అవుతుందిలే? అనుకునే రోజులు కావివి. మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్నామనడానికి అహ్మదాబాద్‌ విమాన ప్రమాదమే నిలువెత్తు ఉదాహరణ. ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ 171 విమానం టేకాఫ్‌ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదం (Ahmedabad Plane Crash)లో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్‌ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు. నా విషయంలోనూ ఇదే మిరాకిల్‌ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే 27 ఏళ్ల క్రితం తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు థాయ్‌ సింగర్‌ రౌంగ్‌సక్‌ లోయ్‌చుసక్‌ (47). సింగర్‌ మాట్లాడుతూ.. 'ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను. నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను.రెండో జన్మ..ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత విమానప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేవరకు కిటికీవైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని. నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు, పిడుగు శబ్ధం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని. నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది. ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు, ఆ మట్టి వాసన, నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.1998లో విషాదం1998లో సింగర్‌ ప్రయాణించిన థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఫ్లైట్‌ TG261 విమానం బ్యాంకాక్‌ నుంచి సూరత్‌ బయల్దేరింది. ల్యాండ్‌ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 101 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు.మాటలకందని విషాదంజూన్‌ 12.. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌ బయల్దేరింది. 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే అనూహ్య సమస్య తలెత్తింది. క్షణాల్లోనే బీఆర్‌ మెడికల్‌ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోగా మెడికల్‌ కాలేజీ క్యాంటీన్‌లో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారు.చదవండి: అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్‌.. శ్రీయ భూపాల్‌ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?

 Which Is the Safest Seat in a Plane?10
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!

మీరు విన్నది నిజమే.. ఈ విమానం కూలిపోలేదు.. కూల్చేశారు.ఎందుకో తెలుసా? విమానంలో ఏ సీట్లు సేఫ్‌ అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం..అయితే, ఇది జరిగింది ఇప్పుడు కాదు.. 2012లో.. ఆ విమానం కూడా బోయింగ్‌ కంపెనీదే.. తాజా విమాన ప్రమాదంలో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ 11ఏ సీటులో కూర్చున్న రమేశ్‌ మృత్యుంజయుడిలా తిరిగొచ్చిన నేపథ్యంలో 2012లో ఏం జరిగిందన్న విషయం మీ కోసం.. మెక్సికోలోని సొనొరన్‌ ఎడారి.. విమానాలు కూలిపోయినప్పుడు ఏ సీట్లు సేఫ్‌ అన్న విషయాన్ని తెలుసు కోవడం కోసం ఓ ప్రయోగాన్ని చేయాలని శాస్త్రవేత్తలు అనుకున్నారు. దీన్ని డాక్యుమెంటరీగా తీయడానికి ముందుకొచ్చిన చానెల్‌ 4, డ్రాగన్‌ ఫ్లై అనే టెలివిజన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ.. అప్పట్లోనే దీని కోసం రూ. 13 కోట్లు ఖర్చుపెట్టాయి. విమానంలో కెమెరాలు, సెన్సర్లు అమర్చారు. ప్రమాద సమయంలో మనుషుల్లో ఏయే ఎముకలు విరిగే చాన్సుందో తెలుసుకోవడానికి మన ఎముకల నిర్మాణం ఎలా ఉంటుందో అలాంటివే కలిగిన డమ్మీ బొమ్మలను ఉంచారు. వాటిని మూడు రకాల పొజిషన్లలో కూర్చోబెట్టారు. ఒకటి.. సీటు బెల్ట్‌ పెట్టుకుని, బ్రేస్‌ పొజిషన్‌ (క్రాష్‌ ల్యాండింగ్‌ టైంలో ఇదే సురక్షితమైన పొజిషన్‌)లో, రెండు.. బెల్ట్‌ పెట్టి.. మామూలుగా కూర్చోబెట్టారు. మూడు.. బెల్ట్‌ లేకుండా.. బ్రేస్‌ పొజిషన్‌లో కాకుండా మామూలుగా కూర్చోబెట్టారు. ఆ బోయింగ్‌ 727 విమానాన్ని 2,500 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాక.. పైలట్‌ పారాచూట్‌ ద్వారా బయటకు దూకేశాడు. తర్వాత ఆ విమానాన్ని వెనుక చిన్నపాటి విమానంలో వస్తున్న పైలట్‌ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నడిపి, కూల్చేశాడు. బిజినెస్‌ క్లాస్‌.. భద్రత పెరగదు..బిజినెస్‌ క్లాస్‌కు రేటెక్కువ చెల్లించినంత మాత్రాన.. దానికి తగ్గట్లు భద్రత పెరగదని ఈ పరిశోధనలో తేలింది. విమానం కూలితే.. మిగిలినవారితో పోలిస్తే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు దగ్గర్లో ఉండే.. ఎకానమీ క్లాసులోని వారే బతికే అవకాశాలు ఎక్కువని నిర్ధారణ అయింది. ఇందులో తొలి 11 వరుసల సీట్లు పూర్తిగా చిన్నాభిన్నమైపోయాయి. ఈ సీట్లలో ఎవరూ బతికే అవకాశం లేదని తేల్చారు. వెనుక ఉన్న సీట్లలో 75% మంది (విమానం పేలిపోలేదు గనుక) బతికే అవకాశముందని శాస్త్ర వేత్తలు చెప్పారు. చ‌ద‌వండి: విమానంలో 11ఏ సీటును ఎందుకు ఇష్ట‌ప‌డ‌రో తెలుసా?కూలిన ప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌ బాడీ ఎంత తీవ్ర తను తట్టుకోగలదు అన్న విషయాన్నితెలుసుకోవడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడిందని తెలిపారు. అప్పటి 727 బ్లాక్‌ బాక్స్‌ సమాచారాన్ని విశ్లేషించిన అన్నే ఇవాన్స్‌.. అప్పటితో పోలిస్తే.. ఇప్పటి విమానాల్లో భద్రత బాగా పెరిగిందని చెప్పారు. అయితే.. తనను విమానంలో సీటు ఎంచుకోమన్నా.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు దగ్గర్లో ఉన్న వరుసల్లోని సీటునే ఎంచుకుంటానని చెప్పారు. 2012 కన్నా ముందు.. ఇలాంటి పరీక్షనే 1984లో బోయింగ్‌ 720 విమానంతో నాసా నిర్వహించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement