మోహన్‌రెడ్డిపై మరో ఏసీబీ కేసు | Another ACB case against Mohan Reddy | Sakshi
Sakshi News home page

మోహన్‌రెడ్డిపై మరో ఏసీబీ కేసు

Published Mon, Mar 12 2018 12:48 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Another ACB case against Mohan Reddy - Sakshi

కరీంనగర్‌ క్రైం: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిపై మరో ఏసీబీ కేసు నమోదు అయింది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నర సారయ్య, వేల్పుల ఓదయ్య, దాడి కనుకయ్య కలసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు. వీరు వ్యాపారం నిమిత్తం మోహన్‌రెడ్డి వద్ద 2014 నవంబర్‌ 17న రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు.

ఇందుకు రేణికుంట టోల్‌గేట్‌ వద్ద ఉన్న 30 గుంటల భూమిని తనఖా పెట్టారు. దీనికి మోహన్‌రెడ్డి తమ్ముడైన మహేందర్‌రెడ్డి పేరు మీద సేల్‌కమ్‌ జీపీఏ చేయించారు. వీటితోపాటు ముగ్గురికి చెందిన ప్రామిసరి నోట్లు, బాండ్‌ పేపర్లు, తెల్ల కాగితాలు రాయించుకున్నారు. 2015 వరకు మొత్తం రూ.30 లక్షలు చెల్లించామని, అయినా భూమిని తిరిగి ఇవ్వకుండా గన్‌తో బెదిరించాడని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement