మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య | Depression Suicide in Warangal | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Nov 20 2018 11:49 AM | Updated on Nov 20 2018 11:49 AM

Depression Suicide in Warangal - Sakshi

సాక్షి, ములుగు రూరల్‌:  మనస్తాపంతో పురుగుల మందుతాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రాంనగర్‌తండాలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్సై లలిత కథనం ప్రకారం...మండలంలో రాంనగర్‌తండాకు చెంది న పాల్తియా సమ్మయ్య (55) తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. కొన్ని రోజులు గా సమ్మయ్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మనస్తాపానికి గురై నిత్యం బాధపడుతుండేవాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement