
రూమ్ సరిగా శుభ్రం చేయడం లేదనే కారణంగా పిడిగుద్దులు గుద్దుతూ.. కాలితో విచక్షణారహితంగా తన్నాడు. గొంతు పిసుకుతూ దాడి చేశాడు.
సాక్షి, మంచిర్యాల : లాడ్జిలో రూమ్ బాయ్గా పనిచేస్తున్న ఓ యువకునిపై సురభి గ్రూప్స్ యజమాని రవి కిరాతంగా ప్రవర్తించాడు. రూమ్ సరిగా శుభ్రం చేయడం లేదనే కారణంగా పిడిగుద్దులు గుద్దుతూ.. కాలితో విచక్షణారహితంగా తన్నాడు. గొంతు పిసుకుతూ దాడి చేశాడు. దీంతో యువకుడు (17) దారుణంగా గాయపడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు రూమ్లోని సీసీటీవీలో నమోదయ్యాయి. కాగా, ఏదైనా తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలిగాని ఇంతలా దాడి చేస్తారా అని ఈ వీడియో చూసిన వారు నివ్వెర పోతున్నారు. సురభి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్, సురభి బిర్యాని హౌజ్, సురభి రెస్టారెంట్, సురభి డీలక్స్ లాడ్జి, సురభి రాయల్ రెసిడెన్సీ, సురభి క్యాటరర్స్కు రవి యజమాని. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.