భార్యపై కోపంతో వాహనానికి నిప్పు | vehicle Burned | Sakshi
Sakshi News home page

భార్యపై కోపంతో వాహనానికి నిప్పు

Published Wed, May 9 2018 1:55 PM | Last Updated on Wed, May 9 2018 1:55 PM

vehicle Burned - Sakshi

మంటల్లో కాలిపోతున్న బైక్‌ 

దేవరుప్పుల, వరంగల్‌ : భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన వాహనానికి నిప్పంటించాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన బోడ రవికి ఆయన భార్యకు ఇటీవల ఓ విషయంలో వివాదం చోటుచేసుకుంది. అయితే తీవ్ర మనస్తాపాని కి గురైన రవి దేవరుప్పుల అంగడి సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లోకి తన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లి నిప్పంటించారు.

దీంతో దుర్గామాత ఉత్సవాల్లో ఏదైనా ప్రమాదం జరిగిందా అని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై స్థానిక ఎస్సై గడ్డం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జరిగిన సంఘటనపై  దర్యాప్తు చేస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement