పిల్లలను బావిలోకి తోసి.. వివాహిత ఆత్మహత్య | Woman Commits Suicide in Anantapur | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Published Fri, Nov 16 2018 12:44 PM | Last Updated on Fri, Nov 16 2018 12:44 PM

Woman Commits Suicide in Anantapur - Sakshi

చెట్టుకు ఉరేసుకున్న మహిళ

అనంతపురం, గుడిబండ:  హిరేతుర్పి సమీపంలో ఓ మహిళ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను సమీపంలోని బావిలోకి తోసినట్లు అనుమానం రావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఎస్‌ఐ శరత్‌చంద్ర వివరాల మేరకు..కర్ణాటక రాష్ట్రం కోట గ్రామానికి చెందిన లక్ష్మీ(26)కి పదేళ్ల క్రితం అదే రాష్ట్రం మధుగిరి తాలూకా శిడదరగల్లు గ్రామానికి చెందిన యశ్వంత్‌తో వివాహం జరిగింది. వీరికి వంశీ, చందు అనే ఇద్దరు కుమారులున్నారు.

రెండు రోజుల కిందట లక్ష్మీ పుట్టింటికి వెళతానని భర్తతో చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గురువారం  ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లిన రైతులకు చెట్టుకు వేలాడుతున్న మహిళ మృతదేహం కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిరేతుర్పిలో పూజారి పని చేసున్న అనిల్‌కుమార్‌ మృతదేహాన్ని తన సోదరి లక్ష్మీదిగా గుర్తించారు. ఘటన స్థలానికి సమీపంలో ఉన్న బావి గట్టున చిన్నారుల చెప్పులు ఉండడంతో వారిని ఆమె బావిలోకి తోసేసినట్లు అనుమానించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపేశారు. సీఐ దేవేంద్రకుమార్‌ సంఘట నాస్థలాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement