ఏటూరునాగారం: ట్రాక్టర్ బోల్తాపడి పది మందికి తీవ్ర గాయాలైన సంఘటన భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీయం ఆస్పత్రికి తరలించారు.
ట్రాక్టర్ బోల్తా.. పదిమందికి తీవ్ర గాయాలు
Published Sun, Nov 13 2016 11:20 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement