బైక్ను ఢీకొట్టిన లారీ: ఇద్దరి మృతి
Published Thu, Jul 21 2016 12:02 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
కోహిర్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కోహిర్ మండలం కవేలి క్రాస్రోడ్డు వద్ద గురువారం చోటు చేసుకుంది. 65 వ నంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement