-
ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
పాపన్నపేట (మెదక్): ధాన్యం రవాణా చేయాలని కోరుతూ వారం రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన కరువైంది. వారి ఆందోళనను పట్టించుకోక పోగా ఓ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మెదక్ జిల్లా పాపన్న పేట సమీపంలో మిన్పూర్లో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో వారం రోజులుగా రవాణా జరగక వందలాది క్వింటాళ్ల ధాన్యం కల్లాల్లో పేరుకు పోయింది. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలెత్తాయి. దీంతో ధాన్యం రవాణా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.సమాచారం అందుకున్న పోలీసులు పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్బాబుకు రైతుల ఆందోళన గురించి వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ‘ఎప్పు డంటే అప్పుడు వచ్చేయడానికి మాకు మాత్రం భార్యా పిల్లలు లేరా’అంటూ నిర్లక్ష్యంగా సమాధాన మివ్వడంతో ఆగ్రహించిన రైతులు బొడ్మట్పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై సురేశ్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చ జెప్పినప్పటికీ ఆందోళన విరమించలేదు. పోలీ సులు ఫోన్ చేసి తహసీ ల్దార్ను ఘటనా స్థలానికి పిలిపించారు. రైతులతో తహసీ ల్దార్ కొద్దిసేపు మాట్లాడి వారికి క్షమాపణ చెప్పారు. అదేవిధంగా గంటలో ధాన్యం రవాణా ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమా..
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏయే అంశాలు ఆ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు? అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిన తర్వాత బీఆర్ఎస్ బలం పెరిగిందా? మరింత తగ్గిందా? అసలు గులాబీ శ్రేణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం చాలా ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను లోక్ సభకు చేయకుండా చర్యలు తీసుకుంది. పోటీ చేసే అభ్యర్థులను దాదాపు మెజార్టీ స్థానాల్లో మార్చింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అసలెందుకు ఈ స్థానాల్లో ఆ పార్టీ ఆశలు పెట్టుకుందంటే అందుకు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయంటోంది ఆపార్టీ. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాస్ట్ ఈక్వేషన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ మాజీ పోలీస్ అధికారి స్థానికంగా బలం ఉంది. అదీకాక నియోజకవర్గంపై పట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. సికింద్రాబాద్ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు స్థానికంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పద్మారావు గౌడ్. అంతే కాకుండా బీజేపీఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ది సరిగా చేయలేదన్న విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలని ఆపార్టీ అంచనా వేస్తోంది.పెద్దపల్లి లో కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గులాబీ పార్టీ అంచనాలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుండి పోటీ చేసి ఓడిన కొప్పుల ఈశ్వర్ కచ్చితంగా ఇక్కడ గెలుస్తారని భావిస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం పై కొంత జనంలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అందుకే పెద్దపల్లిలో పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంది. మెదక్పాలో ర్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం తో పాటు, ఇక్కడ కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉండటం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట గజ్వేల్ లో భారీగా ఓట్లు పడి మెజారిటీ ఎక్కువ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. గెలవక పోయిన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరిలో రెండో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలపై ఇలానే లెక్కలేసుకున్న బీఆర్ ఎస్ పార్టీకి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తెలంగాణ ప్రజలు కట్టబెడతారన్నది జూన్ 4న తేలనుంది. -
Medak: రన్నింగ్ కారులో మంటలు.. దగ్ధమైన కారు
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల్లోనే కారు పూర్తిగా దగ్దమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. #A car coming from HYD to Narayankhed burntdown at Bodmatpalli of Medak district on Sunday morning alert driver stopped car on the road side and got other from the car all are safe.@Kalyan_TNIE @balaexpressTNIE @NewIndianXpress pic.twitter.com/ffifPUnHNc— Krishna.panugannti (@Krishna_TNIEsrd) May 5, 2024 -
మోదీతో ఫైనల్స్
సాక్షి, హైదరాబాద్/ మెదక్ జోన్: ‘రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే. ఇప్పుడు ఫైనల్స్ ఆడుతున్నాం. సెమీస్లో బంగ్లాదేశ్ జట్టు లాంటి కేసీఆర్ను ఓడించాం. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి. బీజేపీ నేతలు అమిత్షా, జేపీ నడ్డా సహా ముఖ్య నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వమిది. దీన్ని మీరే కాపాడుకోవాలి.ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. 14 ఎంపీ సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. రేవంత్ లేకపోతే చాలు.. ఎవరైనా ఫర్వాలేదు అనే పరిస్థితికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. బిడ్డ కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు..’ అని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జరిగిన జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ ‘పదేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారు.ఈ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే 400 సీట్ల నినాదాన్ని బీజేపీ చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోంది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బ్రిటిష్ జనతా పారీ్టగా మారింది. బ్రిటిష్ వాళ్ల మాదిరిగానే మోదీ దేశాన్ని దోచుకొనేందుకు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఏళ్ల తరబడి కులగణన జరగడం లేదు. దీంతో బీసీలకు జనాభా లెక్కల ప్రకారం దక్కాల్సిన లబ్ధి దక్కడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కులగణన జరిగితేనే రిజర్వేషన్ కల్పించడం సాధ్యమవుతుంది..’ అని రేవంత్ అన్నారు. జహీరాబాద్ స్థానం బీజేపీకి తాకట్టు ‘లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లలో గెలిపిస్తే ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అంటున్నారు. అదెలా సాధ్యం? ఇక్కడ అల్లాటప్పాగా కూర్చున్నామా? తండ్రి పేరు చెప్పుకొని కురీ్చలోకి వచ్చామా? బిడ్డ కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. తన బిడ్డ కోసం జహీరాబాద్ స్థానాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. జహీరాబాద్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను గెలిపించే కుతంత్రంలో మెదక్లో గాలి అనిల్కుమార్కు టికెట్ ఇవ్వాల్సి ఉండగా జహీరాబాద్లో ఇచ్చి గాలికి వదిలేశారు.తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు 60 ఏళ్లుగా అనేక పోరాటాలు జరిగాయి. చివరకు సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు రాకపోగా కేసీఆర్ కుటుంబానికి.. కొడుకు, కూతురు, అల్లుడుతో పాటు ఆయన బంధువులందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు దక్కాయి. పదేళ్లుగా గడీల్లో తెలంగాణ తల్లిని బందీ చేశారు. గడీలను బద్ధలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించాం..’ అని సీఎం చెప్పారు. వైఎస్సార్ హయాంలో సంక్షేమ పథకాలు ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందాయి. అప్పట్లో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టడం జరిగింది. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. పేదలకందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు. కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఎవరికీ కట్టించిన పాపాన పోలేదు..’ అని రేవంత్ విమర్శించారు. ‘సోనియాగాంధీ అభీష్టం మేరకు ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు చేశాం..’ అని తెలిపారు. ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు శని వదిలిపోతుంది ‘హరీశ్రావు మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు స్తూపం గుర్తొస్తుంది. హరీశ్రావు సవాల్ను స్వీకరించా. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది..’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘హరీశ్రావు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారా? రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు? దానికి రూ.30 –రూ.40 వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా?..’ అని సీఎం ఎద్దేవా చేశారు. హరీశ్.. రాజీనామా లేఖ రెడీ పెట్టుకో..హరీశ్రావు సవాల్ను స్వీకరించా. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది. రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. -
పైపైనే గంగ.. లేదు బెంగ
మెదక్జోన్: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం శమ్నాపూర్కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్ బిగించి పైపులైన్ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. 24 గంటలు మోటార్ నడిచినా.. ఐదు గజాల బావిలో మోటార్ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్ నడిచినా నీరు తగ్గడం లేదు. ఏ కాలంలోనైనా నిండుగా.. ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్ ఉన్నంత సేపు మోటార్ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్ బంద్ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్ -
పండుగ నింపిన విషాదం
జిన్నారం(పటాన్చెరు): ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలికొన్నది. గుమ్మడిదల మండలంలోని వీరన్నగూడ గ్రామంలో సోమవారం చెరువులో మునిగి ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా ఈ ఇద్దరు యువకుల మృతదేహాలు మంగళవారం చెరువులో లభ్యమయ్యాయి. గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వరెడ్డి కథనం ప్రకారం.. సూరారంలోని నివాసం ఉంటున్న శ్రావణ్(16), శంకర్ (22)లతోపాటు మరో పది మంది స్నేహితులు హోలి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు వీరన్నగూడ గ్రామంలోని వీరన్న చెరువు వద్దకు వెళ్లారు. తోటి స్నేహితులు స్నానం చేసి బయటకు రాగా శ్రవన్, శంకర్లు చెరువులోకి వెళ్లి బయటకు రాలేదు. గజ ఈతగాళ్లతో వెతికించినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం వీరిద్దరి మృతదేహాలు చెరువులో తేలాయి. మృతుడు శ్రావణ్ పదవ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు ఉన్నా, తల్లిదండ్రులు చెబుతున్నారా వినకుండా సరాదా కోసం ఈతకు వెళ్లడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. మృతులు ఇద్దరూ వరుసకు అన్నాదమ్ముళ్లు అవుతారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ తెలిపారు. ఇద్రేశం చెరువులో మరో యువకుడు పటాన్చెరు టౌన్: హోలీ వేడుక స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి స్నేహితుడిని రక్షించబోయి నీటిలో మునిగిపోయి గల్లంతైన ఘటనలో మంగళవారం మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన దాదాపు పది మంది స్నేహితులు సోమవారం హోలీ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఇంద్రేశం గ్రామ శివారు సదర్ చెరువులో స్నానానికి వెళ్లారు. చెరువులో ఉన్న పుట్టె ఎక్కిన శివ అనే స్నేహితుడిని కాపాడబోయి బండి రాజేశ్ గల్లంతు కాగా, గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం తిరిగి గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
Medak Lok Sabha: మెదక్ నుంచి కేసీఆరే!
గులాబీ దళపతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే శ్రేణులను కార్యోన్ముఖులను చేసేలా రంగం సిద్ధమైనట్లు సమాచారం. మరో వైపు వంటేరు ప్రతాప్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మెదక్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తేలిన తరువాతే బరిలో ఎవరుంటారన్నది తేలనుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు జహీరాబాద్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాయి. కానీ మెదక్ కు వచ్చేసరికి బీజేపీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడనుందో వేచిచూడాల్సిందే మరి.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ లోక్సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ టికెట్ను ప్రకటించినప్పటికీ, మెదక్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్ను వంటేరు ప్రతాప్రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు పోటీ పడుతున్నారు. మరికొంత మంది కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలువుల మదన్రెడ్డి రేసులో ఉన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ను సునీతారెడ్డికి ఖరారు చేసిన సందర్భంగా ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ అధినాయకత్వం హామీ కూడా ఇచ్చింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్కు కూడా ఎంపీ టికెట్ ఇస్తామనే హామీ ఇచ్చారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఖరారు చేశారు. మరోవైపు తమకే కేటాయించాలని సంగారెడ్డికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కూడా అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధినేత కేసీఆర్ మాత్రం వంటేరు ప్రతాప్రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వంటేరును లోక్సభ నియోజకవర్గ పరిధిలో పని చేసుకోమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ అభ్య ర్థిత్వం ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ మాత్రం వారం రోజుల క్రితమే ప్రకటించింది. ఈ టికెట్ను మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావుకు కేటాయించింది. ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అధినేతే బరిలోకి దిగుతారనే ప్రచారం? ఈ మెదక్ లోక్సభ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆరే బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా షురూ అయింది. అందుకోసమే ఈ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన రాలేదనే టాక్ జోరందుకుంటోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుచుకునే సీట్లలో మెదక్ సీటు ముందుంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానం మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా కారు జోరందుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టికెట్ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. -
కొన ఊపిరితో ఉన్నాడు.. చచ్చాకే తలుపులు తీస్తా...
పాపన్నపేట (మెదక్): వేధింపులతో విరక్తి చెంది కన్న తండ్రినే కిరాతకంగా చంపాడు ఓ కుమారుడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సంగం ప్రేమానందం (42), సుగుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సందీప్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతుండగా, కూతురు 9వ తరగతి, చిన్న కుమారుడు ప్రవీణ్ 7వ తరగతి చదువుతున్నారు. ప్రేమానందం మద్యానికి అలవాటు పడి, భార్యను అనుమానిస్తూ తరచూ కొడుతుండేవాడు. 10 రోజుల కిందట అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసులు సైతం ప్రేమానందంకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా వారి కుటుంబంలో సఖ్యత కుదరలేదు. బుధవారం మళ్లీ గొడవ జరగడంతో తల్లి సుగుణమ్మ, పెద్ద కుమారుడు సందీప్ కలిసి రోకలి బండతో ప్రేమానందం మోకాళ్లు విరగ్గొట్టి నడవడానికి రాకుండా చేసి తల్లిగారింటికి వెళ్లిపోయారు. అయితే శనివారం మళ్లీ సందీప్ ఇంటికొచ్చేసరికి ప్రేమానందం తన తండ్రి ప్రసాద్, పక్కింటి వారితో మాట్లాడుతున్నాడు. వెంటనే సందీప్ తాత ప్రసాద్ను, పక్కింటి వారిని ఇంట్లో నుంచి బయటకు పంపి తలుపులు గడియపెట్టాడు. లేవలేని స్థితిలో ఉన్న తండ్రి ప్రేమానందంను కరెంట్ హీటర్తో విచక్షణా రహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. చుట్టు పక్కలవారు తలుపులు తీయమని బతిమిలాడినా ‘కొన ఊపిరితో ఉన్నాడు.. ప్రాణం పోయాకే తలుపులు తీస్తానంటూ’ ఆగ్రహంతో ఊగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత చున్నీతో ఉరి వేసి తండ్రిని హత్య చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై నరేశ్, క్లూస్ టీం తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి, సందీప్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సందీప్ ఇటీవల పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నించగా,కొద్ది తేడాతో అవకాశం పోయినట్లు తెలిసింది. -
అధిక వడ్డీ..35 కోట్లు టోకరా
-
కాంగ్రెస్ గ్యారంటీలతో గారడీ చేస్తోంది
తూప్రాన్ (మెదక్)/గజ్వేల్: కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి...నేడు తికమకపడుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర మెదక్ జిల్లా తూప్రాన్కు చేరుకోగా కిషన్రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, రెండూ కుటుంబపార్టీలేనని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తూ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 17 సీట్లు గెలుస్తుందని, హైదరాబాద్లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రూ.12 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన కాంగ్రెస్ దేశంలో రూ.12 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డ కాంగ్రెస్కు వచ్చే ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర ఆదివారం రాత్రి గజ్వేల్కు చేరుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితం కావడం వల్ల మూడు నెలల పాటు విదేశీయాత్రకు వెళ్లిన రాహుల్గాంధీకి ఈ సారి ఏకంగా ఏడాది పాటు విదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్ప్రదేశ్, కర్ణాటకలోనూ బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. -
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను కారు ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారిని పాపన్నపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. -
సీఎంతో మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), గూడెం మహిపాల్రెడ్డి (పటాన్చెరు), మాణిక్రావు (జహీరాబాద్), కొత్త ప్రభాకర్రెడ్డి (దుబ్బాక) జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న ప్రొటోకాల్, పోలీసు ఎస్కార్ట్, వ్యక్తిగత భద్రత తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. మీడియాలోనూ వీరి భేటీ వైరల్ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేలు స్పందించారు. తమ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు కొనసాగేలా చూడాలని సీఎంను కోరినట్లు కొత్త ప్రభాకర్రెడ్డి చెప్పారు. గతంలో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. రేవంత్తో కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు మాణిక్రావు తెలిపారు. తాము ముఖ్యమంత్రిని కలవడంపై విపరీతార్థాలు తీయొద్దని, ప్రధాన మంత్రి మోదీని రేవంత్రెడ్డి ఎలా అభివృద్ధి పనుల కోసం కలిశారో తాము కూడా అదే విధంగా కలిసినట్లు మహిపాల్రెడ్డి వివరించారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కాగా వీరు బుధవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎంతో భేటీపై వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలావుండగా తమ భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం ఇంటెలిజెన్స్ ఏడీజీ శివధర్రెడ్డిని కూడా కలిశారు. -
మెదక్ జిల్లా రెడ్డిపల్లి విలేజ్ లో బీజేపీ నేత నిర్వాకం
-
భారీగా చేరి.. బారులు తీరి..!
మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ సంబరాలు వైభవంగా జరిగాయి. మెదక్ పట్టణంలోని సుమారు 600 ఎకరాల చర్చి ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి మూడులక్షల మంది భక్తులు తరలివచ్చారని అంచనా. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. చలితీవ్రతను కూడా లెక్కచేయకుండా భక్తులు యేసయ్య దీవెనల కోసం బారులుతీరారు. ఈ సందర్భంగా బిషప్ కె.పద్మారావు దైవసందేశం ఇచ్చారు. శాంతిద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ క్రీస్తును ఆరాధించాలని, విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతిసమస్యకూ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రభువు చూపిన మార్గంలో నడుస్తూ సుఖసంతోషాలతో విరాజిల్లాలంటూ ప్రార్థనలు చేశారు. అంతకుముందు చర్చి వందో యేటా అడుగు పెట్టిన సందర్భంగా రూపొందించిన కేలండర్ను ఆవిష్కరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ‘కల్వరి’లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హఫీజ్పేట్(హైదరాబాద్): మియాపూర్ కల్వరి టెంపుల్లో సోమవారం వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షలమంది భక్తులు తరలివచ్చి యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్కుమార్ భక్తులకు క్రీస్తు జననం గురించి వివరించి, ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా క్రీస్తు నాటక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల క్రిస్మస్ ట్రీ ఆకట్టుకుంది. దీంతో ట్రీ వద్ద సందర్శకులు పెద్దఎత్తున ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు. -
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
మెదక్ జిల్లా తూప్రాన్ లో కుప్ప కూలిన ట్రైనింగ్ జెట్ విమానం
-
తుఫ్రాన్లో కూలిపోయిన శిక్షణ విమానం.. పైలట్ మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని తుఫ్రాన్లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలెట్, కో-పైలట్ మృతిచెందారు. వివరాల ప్రకారం.. తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. Two Indian Air Force pilots were killed in action when their Pilatus trainer aircraft crashed at 8:55 during training at Air Force Academy, Dindigul in Telangana. The pilots include an instructor and one cadet: Indian Air Force officials pic.twitter.com/48bGdfawRy — ANI (@ANI) December 4, 2023 -
మెదక్ లో అధ్యధికంగా పోలింగ్
-
మెతుకు సీమలో.. నువ్వా నేనా!
మెతుకుసీమ ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక శాసనసభ స్థానాల్లో నెగ్గి రాజకీయ ఆధిపత్యం నిలుపుకునేందుకు అధికార బీఆర్ఎస్ చెమటోడ్చుతుండగా, మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతజిల్లా ఉమ్మడి మెదక్లో బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ రెండు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు, కల్యాణలక్ష్మి వంటి ప్రజాకర్షక సంక్షేమ పథకాలే ప్రధాన అండగా బీఆర్ఎస్ భావిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలుండగా, సిద్దిపేట, గజ్వేల్ మినహా మిగిలిన 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ కార్యకర్తలు సర్వశక్తులూఒడ్డి పార్టీని గట్టెక్కించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పాత కేడర్ మళ్లీ సంఘటితమై ఆ పార్టీ గెలుపుకోసం పావులు కదుపుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజానాడిని పట్టేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్టు. సిద్దిపేట మెజారిటీపైనే లెక్కలు సిద్దిపేటలో బీఆర్ఎస్ తరఫున మంత్రి తన్నీరు హరీశ్రావు, కాంగ్రెస్ తరఫున పూజల హరికృష్ణ పోటీ చేస్తున్నారు. 2004, 2008, 2010 ఉప ఎన్నికలు, 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి వరుసగా ఆరు పర్యాయాలు గెలుపొందిన హరీశ్రావుకు ఈ ఎన్నికలు కూడా నల్లేరు మీద నడక లాంటివేనని తెలుస్తోంది. 2018లో 1.18లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి ఆయన రికార్డు సృష్టించారు. ఆయనకు పెద్దగా పోటీ లేదనే చెప్పాలి. సంగారెడ్డి ఆ ఇద్దరి మధ్యే కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మధ్య సంగారెడ్డిలో ద్విముఖ పోటీ నెలకొని ఉంది. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి బలమైన నాయకుడిగా పేరు పొందడం జగ్గారెడ్డికి కలిసివచ్చే అంశం. ఆయన స్థానికంగా ఉండడం లేదని విమర్శ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభించగా, టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ రెండు నెలలుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతా ప్రభాకర్ ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ పథకాలు, పార్టీ బలగంపై ఆశలు పెట్టుకున్నారు. మెదక్ మెరిసేదెవరో.. మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ మధ్య గట్టిపోటీ నెలకొని ఉంది. పద్మాదేవేందర్ రెడ్డి 2004లో రామాయంపేట(2009లో రద్దైంది), 2014, 2018 లో మెదక్ నుంచి గెలుపొందారు. నియోజకవర్గ వ్యవహారాల్లో ఆమె భర్త దేవేందర్రెడ్డి జోక్యంపై కొంత ప్రతికూల ప్రచారం ఉంది. బీఆర్ఎస్ పథకాలే ఆమెకు బలం. మల్కాజ్గిరి ఎంపీ మైనంపల్లి హన్మంతరావు కుమారుడైన మైనంపల్లి రోహిత్ తొలిసారిగా మెదక్ నుంచి పోటీచేస్తున్నారు. హన్మంతరావు 2009లో టీడీపీ తరఫున ఇక్కడి నుంచి గెలుపొందారు. స్థానికంగా మైనంపల్లి కుటుంబానికి గట్టి పట్టు ఉండడం రోహిత్కు కలిసి వచ్చే అంశం. జహీరాబాద్ ఎవరికి జై కొట్టేనో.. జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొన్నింటి మాణిక్రావు, కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ మ«ద్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. మాణిక్రావు స్థానికుడిగా మూడోసారి పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఓటర్లతో కలియతిరుగుతున్నారు. కాంగ్రెస్ నుంచి నరోత్తమ్ బీఆర్ఎస్లో చేరడం ఆయనకు కలిసి వచ్చే అంశమే. ఇక చంద్రశేఖర్ స్థానికుడైనా, ఈ ప్రాంత ప్రజలకు కొత్త అభ్యర్థి. అయితే కాంగ్రెస్ పార్టీకి జహీరాబాద్ కంచుకోటగా పేరుంది. ఇప్పటి వరకు ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ పార్టీ 12 సార్లు గెలుపొందింది. స్థానికంగా పార్టీకి బలమైన కేడర్, ఓటు బ్యాంకు ఉండడం కాంగ్రెస్కు కలిసివచ్చే అంశాలు. పటాన్చెరు పోటాపోటీ పటాన్చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్గౌడ్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. 2014, 2018లో ఇక్కడి నుంచి గెలిచిన మహిపాల్రెడ్డి స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018లో ఓడిన శ్రీనివాస్గౌడ్ పట్ల సానుభూతి ఉంది. శ్రీనివాస్గౌడ్ తండ్రి దర్శన్ గౌడ్ అమీన్పూర్ సర్పంచ్గా, భార్య అమీన్పూర్ ఎంపీటీసీగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి తొలుత టికెట్ పొంది ఆ తర్వాత రద్దు కావడంతో బీఎస్పీ తరఫున అభ్యర్థి బరిలో దిగిన సర్పంచ్ నీలం మధు సైతం గట్టిపోనిస్తుండడంతో ఆయన చీల్చే ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. దుబ్బాక ఆ ముగ్గురి మధ్యనే.. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ముగ్గురు హోరాహోరీగా తలపడుతున్నారు. కొత్త ప్రభాకర్రెడ్డికి ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీ బలం వచ్చే అంశాలు. శ్రీనివాస్రెడ్డి తండ్రి దివంగత ముత్యంరెడ్డి 1989, 1994, 1999లో వరుసగా మూడు పర్యాయాలు టీడీపీ తరఫున దొమ్మాట (2009లో రద్దైంది) నుంచి, 2009లో కాంగ్రెస్ తరఫున దుబ్బాక నుంచి గెలుపొందారు. ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా చెక్డ్యామ్లు నిర్మించడంతో ప్రజల్లో ఇంకా ఆదరణ ఉండడం శ్రీనివాస్రెడ్డికి కలిసివచ్చే అంశం. 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి 1,079 ఓట్ల స్వల్ప మెజారిటీతో బీజేపీ తరఫున గెలిచిన రఘునందన్ రావు సైతం మరోసారి గెలిచేందుకు గట్టిగా కృషిచేస్తున్నారు. యువతలో బీజేపీ పట్ల ఉన్న ఆదరణ కలిసి వచ్చే అంశం. గజ్వేల్ సీఎం కేసీఆర్తో ఈటల ఢీ గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. కేసీఆర్ ఆధిక్యతతో ముందంజలో ఉన్నా, ఈటల రాజేందర్ నుంచి కొంత పోటీ ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు పర్యాయాలు సీఎం కావడం, గజ్వేల్ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడం కేసీఆర్కు ఎన్నికల్లో కలిసివచ్చే అంశాలు. గజ్వేల్లో ముదిరాజ్ సామాజికవర్గ ఓటర్లు గణనీయంగా ఉండడంతో ఈటల రాజేందర్కు కొంత మద్దతు లభిస్తోంది. నారాయణఖేడ్ ద్విముఖ పోటీ నారాయణఖేడ్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మారెడ్డి భూపాల్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డి మధ్య గట్టిపోటీ నెలకొని ఉంది. భూపాల్రెడ్డి 2016 ఉపఎన్నిక, 2018 సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రెండు పర్యాయాలూ 50వేలకు పై చీలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించడం కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ టికెట్ తొలుత మాజీ ఎమ్మెల్యే సురేశ్షెట్కార్కు కేటాయించగా, ఆయన తప్పుకుని పటోళ్ల సంజీవరెడ్డికి అవకాశం కల్పించారు. సంజీవరెడ్డి తండ్రి పి.కిష్టారెడ్డి ఇక్కడి నుంచి గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేయడంతో వారి కుటుంబానికి స్థానికంగా మంచి పట్టు ఉంది. సురేశ్షెట్కార్ మద్దతు ఉండడం సంజీవరెడ్డికి కలిసి వచ్చే అంశం. అందోల్ ఎవరికి అండనో.. అందోల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. దామోదర రాజనర్సింహ 1989, 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు. చంటి క్రాంతి కిరణ్ తొలిసారిగా 2018 ఎన్నికల్లో రాజనర్సింహపై 16వేలపై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ బలగంపై క్రాంతి కిరణ్ ఆశపెట్టుకోగా, తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రభుత్వ వ్యతిరేకతపై రాజనర్సింహ ఆశలు పెట్టుకున్నారు. గతంలో వరుసగా రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి ఆయనకు ఉంది. నర్సాపూర్ నువ్వానేనా నర్సాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి మధ్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. సునీతా లక్ష్మారెడ్డి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరుసగా మూడు పర్యాయాలు ఇక్కడి నుంచి గెలుపొందగా, రాజీరెడ్డి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు పెరగడం సునీతారెడ్డికి కలిసొచ్చే అంశం. 20014, 2019లో ఇక్కడి నుంచి గెలుపొందిన సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ నిరాకరించినా, ఆయన మాత్రం సునీతారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత నాలుగైదు ఏళ్ల నుంచి రాజిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశం. మద్యానికి బానిసగా యువతను మార్చుతున్నారు ఎన్నికలొస్తే చిన్న వయస్సు పిల్లలను కూడా బాగా తాపించి కరాబ్ చేస్తున్రు. ఫంక్షన్ హాళ్లలో చికెన్ బిర్యానీ వండి పెడ్తున్రు. ఓటర్ల స్థాయిని బట్టి బ్రాండ్ల లిక్కర్ పంచుతున్రు. వాళ్లు బీరు, బిర్యానీ, 500 నోటు ఇవ్వుడు.. పోరగాళ్లు తాగి కింద పడుడు. నాలుగు రోజులు(ఎన్నికలు) పోయాక మద్యానికి డబ్బులు కావాలని ఇంట్లో పెళ్లాలను కొడుతున్నరు. ఆడవాళ్లతోనే ధర్నా చేయించాలనుకుంటున్నాం. – గొండి మల్లయ్య, సిర్పూరు, హత్నూర మున్సిపాలిటీతో ఉపాధి బంద్ అల్లాపూర్ను మున్సిపాలిటీలో కలపడంతో 2018 నుంచి ఉపాధి హామీ పథకం కట్ అయ్యింది. మా ఊర్లో 370 కుటుంబాలుంటాయి. ఇంట్లో ఇద్దరు కూలీకి పోతే ఒక్కొక్కరికి రోజుకి రూ.250 కూలీ వచ్చేది. ఇప్పుడు మొత్తం బంద్ అయింది. 2014లో గజ్వేల్ మున్సిపాలిటీ అయితే 2018 వరకు అక్కడ ఉపాధి హామీ పని నడిచింది. మా దగ్గర వెంటనే బంద్ చేశారు. – మన్నే భాస్కర్ ఎల్లాపూర్, గజ్వేల్ రైతుబంధుకు కటాఫ్ పెట్టాలి మా ఊర్లో 20 ఎకరాలున్న వారికి కూడా రైతుబంధు వస్తుంది. మినిమం కటాఫ్ పెట్టాలి. తుమ్మ చెట్లు మొలిచిన భూములకు, ఫారెస్ట్లాగా ఉన్న భూములకూ ఇస్తున్నరు. ఐదెకరాలు ఉన్నోడికి అదే ఇస్తున్రు. 200 ఎకరాలున్నోడికి అదే ఇస్తున్రు. వడగండ్లు పడి పోయిన పంట ఖరాబ్ అయింది. ఎకరాకు రూ.10వేలు ఇస్తామన్నరు. ఇప్పటి వరకు ఒక రూపాయి రాలేదు. –కిష్టయ్య, పైతరా, కొల్చారం -ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముహమ్మద్ ఫసియుద్దీన్ -
మెదక్లో విషాదం.. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చి..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో విషాదం నెలకొంది. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. హవేళి ఘనపూర్ మండలంలోఅస్తికలు కలిపేందుకు నీటిలో దిగిన అన్నాదమ్ముళ్లు.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. కామారెడ్డి సరిహద్దు పోచారం ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులను కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఇనాం తండాకు చెందిన హర్యా, బాల్సింగ్గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
19 ఏళ్ల పోరాటం.. ఈసారైనా ఆమెను ఓడిస్తారా?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒకే ప్రత్యర్థిపై ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు మెదక్ నియోజకవర్గంలో కనిపించింది. ఎమ్మెల్యే పద్మపై మైనంపల్లి కుటుంబీకులు చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ రావడం ఆసక్తి సంతరించుకుంది. మెదక్: ప్రస్తుత మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఉమ్మడి ఏపీలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ పద్మాదేవేందర్రెడ్డి పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనం పల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో.. అనంతరం నియోజకవర్గాల పునర్ విభజనలో రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దుచేసి చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలను మెదక్ నియోజకవర్గంలో కలిపారు. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మెదక్ టికెట్ను మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించడంతో పద్మాదేవేందర్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మైనంపల్లి చేతిలో మరోసారి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2014, 2018 లో వరుసగా పద్మాదేవేందర్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యరి్థగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి సైతం పద్మారెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈసారి పద్మపై రోహిత్.. గతంలో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులు పద్మాదేవేందర్రెడ్డిపై పోటీ పడగా, ప్రస్తుతం వారి కుమారుడు రోహిత్రావు కాంగ్రెస్ అభ్యరి్థగా పద్మకు పోటీగా బరిలో నిలిచారు. నాడు తల్లీదండ్రులు, నేడు కొడుకు పోటీపడుతుండడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 19 ఏళ్లుగా రాజకీయ వైరం వీరి మధ్యలోనే జరుగుతుండడం విశేషం. -
మెదక్లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..
సాక్షి, మెదక్ జిల్లా: మెదక్లో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీని టిప్పర్ ఢీకొనడంతో పృథ్వీతేజ్(12), ప్రణీత్ తేజ్(12) ప్రాణాలు కోల్పోయారు. తల్లికి అన్నపూర్ణకు గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కొనడానికి తల్లితో పాటు కలిసి చిన్నారులు స్కూటీపై వెళ్తుండగా ఘటన జరిగింది. అన్నపూర్ణ భర్త శ్రీనివాస్ హోం గార్డ్.. రెండు సంవత్సరాల క్రితమే ఆయన ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చదవండి: వీడియో కాల్లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి.. -
కాంగ్రెస్లో టికెట్ల చిచ్చు.. హస్తానికి దామోదర రాజనర్సింహ గుడ్ బై!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ టికెట్ల కేటాయింపు అంశం అన్నీ పార్టీల్లోనూ అగ్గి రాజేసింది. ఇక, కాంగ్రెస్లో మూడు జాబితా నేతల్లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది. దీంతో, తుది వరకు టికెట్ ఆశించి భంగపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ. ఇక, టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. అయితే, నారాయణఖేడ్ నుండి సంజీవరెడ్డికి, పటాన్ చెరు నుండి శ్రీనివాస్ గౌడ్కు టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సూచించారు. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో దామోదర రాజనర్సింహ సూచించిన వ్యక్తులకు కాకుండా వేరే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. మరోవైపు.. పటాన్చెరు టిక్కెట్ను నీలం మధుకు కేటాయించడంపై రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కాటా శ్రీనివాస్ గౌడ్ గత కొంతకాలంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. దీంతో, ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమవుతున్నారు. కాగా, కాంగ్రెస్లో కొనసాగడంపై నేడో రేపో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నీలం మధుకు టిక్కెట్ ఎలా కేటాయిస్తారంటూ దామోదర రాజనర్సింహ ప్రశ్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్పై మండిపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఇక ఆపండి.. కిషన్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ -
ఎంపీ ప్రభాకర్ మరో 4 రోజులు ఐసీయూలోనే.. దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను చేప్యాలలో పోలీసులు విచారించారు. నిందితుడు రాజు కాల్డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రాజుకి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నాలుగు రోజులు ఐసీయూలోనే.. కత్తిపోటుతో ప్రభాకర్రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో సోమవారం యశోద ఆసుపత్రిలో వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. చిన్న పేగును 10 సె.మీ మేర వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మరో నాలుగు రోజులు ఐసీయూలోనే ఉండనున్నారు. మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్కు పిలిపునిచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు.వర్తక వ్యాపారులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. అదే విధంగా ఎంపి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మెదక్ చర్చిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అసలేం జరిగిందంటే.. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రభాకర్రెడ్డి.. సోమవారం సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో ప్రచారం నిర్వహించారు. తిరిగొస్తూ వాహనం వైపు వెళ్తుండగా ఓ వ్యక్తి కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ప్రభాకర్ రెడ్డిని మొదట గజ్వేల్కు, అక్కడి నుంచి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి ఎంపీని ఆస్పత్రికి తీసుకొచ్చారు మంత్రి హరీశ్రావు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. గాయమైన చోట చిన్నపేగు భాగం తొలగించారు. సీఎం కేసీర్, మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చదవండి: Miryalaguda: ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.. ఇప్పుడు అనాథగా.. -
చేదోడు లేని ఆ నలభై ఏడు!
తెలంగాణలో అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి గత చరిత్ర మాత్రం చేదు జ్ఞాపకంగానే ఉంది. 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనని గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా స్థానాల్లో కొన్నిచోట్ల గత పది ఎన్నికల్లో ఆ పార్టీ ఒకట్రెండు సార్లు మాత్రమే గెలవగలిగింది. 1967 తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించలేదు. పునర్విభజన తర్వాత ఏర్పాటైన బెల్లంపల్లి, మంచిర్యాల, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, ధర్మపురి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, దేవరకద్ర, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వైరాలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్ పాగా వేయలేదు. మెదక్ నియోజకవర్గంలోనూ 1989 తర్వాత కాంగ్రెస్ గెలవలేదు. సిరిసిల్లలో 2009 నుంచి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కెవిజయం సాధిస్తూనే ఉన్నారు. దుబ్బాకలో 2009లో చెరుకు ముత్యంరెడ్డి గెలిచారు. అంబర్పేటలో 1989లో వి. హనుమంతరావు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ విజయం దక్కలేదు. మహబూబ్నగర్లో 1989లో పులివీరన్న గెలిచిన తర్వాత జరిగిన ఏడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. భువనగిరిలో 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కె.నర్సింహారెడ్డి మాత్రమే గెలిచారు. నర్సంపేటలో మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే 1957లో కె.కనకరత్నమ్మ, 1967లో కె.సుదర్శన్రెడ్డి మాత్రమే గెలిచారు. గతంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీచిన నియోజకవర్గాలివే.. ♦ 2004 తర్వాత సిర్పూర్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు దక్కలేదు. 1978 తర్వాత గెలిచింది 2004లోనే. అప్పుడు కోనేరు కోనప్ప విజయం సాధించగా, గత 10 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒకసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ♦ చెన్నూరులో కూడా 1978 తర్వాత గెలిచింది 2004లోనే. ఇక్కడ మాత్రం ఓడిపోయిన ప్రతిసారీ రెండోస్థానంలో నిలిచింది. 2004లో జి.వినోద్ గెలిచారు. ♦ 2009లో బెల్లంపల్లి అసెంబ్లీ స్థానం ఏర్పాటయిన తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ♦ మంచిర్యాలలోనూ కాంగ్రెస్ ఇప్పటివరకు గెలవలేదు. నాలుగుసార్లు (ఒక ఉప ఎన్నికతో సహా) ఓడిపోయిన కాంగ్రెస్ మూడుసార్లు రెండో స్థానంలో నిలిచింది. ♦ ఖానాపూర్లో 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి కె.భీంరావు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవలేదు. ♦ 1983 నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గంలో పదిసార్లు ఎన్నికలు జరిగితే 1989, 2004లో రెండుసార్లు సి.రామచంద్రారెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ♦ బోథ్ నియోజకవర్గంలో వరుసగా ఎనిమిది పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోంది. ఇక్కడ 1983లో కాంగ్రెస్ పక్షాన ఎం.కాశీరాం గెలిచిన తర్వాత మరెవరూ గెలవలేదు. ♦ నిర్మల్లో 1999, 2004లో వరుసగా రెండు సార్లు ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ ఆ నియోజకవర్గంలో గెలవలేదు. ♦ 1989, 99 ఎన్నికల్లో రెండుసార్లు ఆర్మూరు నుంచి కాంగ్రెస్ గెలిచింది. 1999 తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. ♦ ఎస్సీ రిజర్వుడు అయిన తర్వాత జుక్కల్ నియోజకవర్గంలో 10 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచింది నాలుగు సార్లు మాత్రమే. ఐదు సార్లు రెండోస్థానంలో నిలిచింది. చివరగా 2004లో సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ♦ బాన్సువాడలో గత నాలుగు సార్లు ఓటమిపాలయ్యింది. 2004లో బాజిరెడ్డి గోవర్దన్ గెలవగా, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో ఓడిపోయింది. ♦ కామారెడ్డిలో 1983 తర్వాత కాంగ్రెస్ గెలిచింది రెండుసార్లు మాత్రమే. 1989, 2004లో షబ్బీర్అలీ ఇక్కడి నుంచి గెలిచారు. ♦ నిజామాబాద్ అర్బన్గా మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి గెలుపొందలేదు. 2009లో నియోజకవర్గం పేరు మారగా, అంతకుముందు 2004, 1999లో కాంగ్రెస్ తరఫున డి.శ్రీనివాస్ రెండుసార్లు గెలుపొందారు. ♦ నిజామాబాద్ రూరల్లో కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ గెలవలేదు. అంతకుముందు డిచ్పల్లిగా ఉన్నప్పుడు కూడా 2008 ఉప ఎన్నికలో, 1978లో ఆకుల లలిత, ఎ. బాల్రెడ్డిలు మాత్రమే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ♦ కోరుట్లలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్ విజ యాన్ని అందుకోలేకపోయింది. బుగ్గారం (2009కి ముందు)గా ఉన్నప్పుడు మాత్రం రెండుసార్లు రత్నాకర్రావు, ఒకసారి కె.గంగారం, మరోమారు రాజారాం, ఇంకోసారి మోహన్రెడ్డిలు కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. ♦ పెద్దపల్లిలో 1989 తర్వాత కాంగ్రెస్ గెలుపొందలేదు. 1989లో గీట్ల ముకుందరెడ్డి గెలిచిన తర్వాత వరుసగా ఆరుసార్లు ఆ పార్టీ ఓటమి పాలు కావడం గమనార్హం. ♦ హుజూరాబాద్ నియోజకవర్గంలో 1978 తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అప్పుడు దుగ్గిరాల వెంకట్రావు విజయం సాధించారు. ♦ సిద్దిపేటలో కాంగ్రెస్ చివరగా గెలిచింది 1983లోనే. అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన 12 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం గమనార్హం. ♦ దేవరకద్రలో ఇంతవరకు కాంగ్రెస్ బోణీ కొట్టలేదు. నాగర్కర్నూల్లో 1989లో వంగా మోహన్గౌడ్ గెలుపొందారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓటమి పాలవుతూనే ఉంది. 1983 తర్వాత ఇబ్రహీంపట్నంలోనూ కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమి పాలవుతోంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
ఆసీస్ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్.. వరల్డ్కప్ జట్టులో చోటు!?
పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement