మెదక్‌లో విషాదం.. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చి.. | Medak:Two Brothers Died After Drowned In water | Sakshi
Sakshi News home page

మెదక్‌లో విషాదం.. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చి..

Published Sat, Nov 18 2023 12:01 PM | Last Updated on Sat, Nov 18 2023 12:24 PM

Medak:Two Brothers Died After Drowned In water - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో విషాదం నెలకొంది. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు.

హవేళి ఘనపూర్ మండలంలోఅస్తికలు కలిపేందుకు నీటిలో దిగిన అన్నాదమ్ముళ్లు.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. కామారెడ్డి సరిహద్దు పోచారం ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులను కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఇనాం తండాకు చెందిన హర్యా, బాల్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement