Lorry Accident
-
AP: లారీని ఢీకొన్న మినీ బస్సు.. పలువురు మృతి
సాక్షి, సత్యసాయి: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని మిని టెంపో బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. మడకశిర మండలం బుల్ల సముద్రం వద్ద శనివారం తెల్లవారుజామున లారీని మినీ టెంపో బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను మడకశిరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మినీ వ్యాన్లో 14 మంది ఉన్నట్లు సమాచారం. మృతులను గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. -
దూసుకొచ్చిన మృత్యువు
చేవెళ్ల: రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నచిరువ్యాపారులను దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. లారీ రూపంలో వచ్చి వారిని చిదిమేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఆగి ఉన్న బస్సును దాటి వెళ్తూ..: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు, నాంచేరి, ఖానాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాల వారు నిత్యం ఆలూరు బస్ స్టేజీ వద్ద, రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే సోమవారం కూడా కూరగాయలు విక్రయిస్తుండగా చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ లారీ ఆలూరు స్టేజీ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును దాటి వెళ్లే క్రమంలో అదుపుతప్పి టీస్టాల్ స్టాండ్ను ఢీకొడుతూ రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన నక్కలపల్లి రాములు (48), దామరగిద్ద కృష్ణ (19), నాంచేరికి చెందిన శ్యామల సుజాత (42) అక్కడిక్కడే మృతిచెందారు. అలాగే కూరగాయలు కొనేందుకు అక్కడకు వచ్చిన జమీల్ (25), బాలమణి, చల్ల మాల్యాద్రి, కూరగాయల విక్రేతలు ఆకుల పద్మమ్మ, నక్కలపల్లి రేణకతోపాటు లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జమీల్ మృతిచెందాడు.అతను ఆలూరులోని ఓ ఫాంహౌస్లో పనిచేస్తున్నాడు. మిగతా క్షతగాత్రులను వారివారి బంధువులు మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.షాక్లో డ్రైవర్..: ఈ ఘటనలో లారీ చివరకు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అవగా డ్రైవర్ కాలు విరిగి క్యాబిన్లోనే ఇరుక్కుపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని జేసీబీల సాయంతో అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో షాక్లో ఉన్న డ్రైవర్ తన వివరాలు చెప్పలేకపోయాడు.ప్రమాద తీవ్రతకు చెట్టు విరిగిపడటంతో చెట్టు కింద, లారీ ముందు భాగంలో ఎవరైనా ఇరుక్కుపోయారా? అనే విషయం వెంటనే తెలియరాక మృతుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు తొలుత భావించారు. చివరకు చెట్టును తొలగించాక దాని కింద ఎవరూ లేరని నిర్ధారణ అయింది. ఆ చెట్టు అడ్డుగా లేకపోయి ఉంటే అక్కడే కూరగాయలు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న మరో 30 మంది ప్రమాదం బారిన పడేవారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ దిగ్బ్రాంతి..: ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది
-
రంగారెడ్డి: చేవెళ్లలో లారీ బీభత్సం.. పలువురు మృతి!
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన లారీ.. కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. దీంతో, పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూర్ స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. ఇక, డ్రైవర్.. క్యాబిన్లో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘగనా స్థలంలో కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం రేవంత్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
చిత్తూరు మొగలిఘాట్ రోడ్లో మరో ఘోరం
చిత్తూరు, సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్గా మారింది మొగిలి ఘాట్ రోడ్. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇక్కడి బెంగళూరు - చెన్నై జాతీయ రహదారి.. బుధవారం అర్ధరాత్రి మళ్లీ నెత్తురోడింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో.. మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్లో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రిపేరుతో ఆగివున్న ఓ కలప లోడ్ లారీని.. వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది మరో లారీ. దీంతో.. కలప లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ గాయపడ్డాడు. అదే టైంలో.. ఢీ కొట్టిన లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ గాయపడ్డాడు. డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు వి.కోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ మొగిలి ఘాట్ వద్ద ఇంజన్ సమస్యతో డ్రైవర్ పక్కన నిలిపి రిపేర్ చేస్తున్నాడు. అదే టైంలో.. హుబ్లీ(కర్ణాటక) నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అర్ధరాత్రి 2.30గం. ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కలప లారీలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. షుగర్ లోడ్ లారీ క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోగా.. క్లీనర్ స్పాట్లోనే కన్నుమూశాడు. స్థానికులు డ్రైవర్ను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్తో పాటు, మరో లారీ డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు. అర్ధరాత్రి ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు.. 108, ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేసి.. ట్రాఫిక్ను పునరుద్ధరించాయి. మరో రెండు నిమిషాల్లో షుగర్ లోడ్ లారీ శ్రీని ఫుడ్స్కు చేరుకోవాల్సి ఉంది. ఈ లోపే ప్రమాదానికి కారణం కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొగలి ఘాట్.. ☠️ స్పాట్ ఈనెల 13 న ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టిన లారీ ప్రమాదంలో 7 మంది మృతి, 33 మందికి గాయాలు ఈనెల 14 గాజుల పల్లి వద్ద ఇన్నోవా వాహనం ఫ్రంట్ టైర్ పేలి బోల్తా.. ఇద్దరు మృతి ఈనెల 15 న మొగిలి ఘాట్ లో రోడ్ ప్రమాదాలు నివారణ కు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు ఈనెల 18 న మొగిలి ఘాట్ రోడ్ లో ఆ స్పీడ్ బ్రేకర్స్ గుర్తించక.. టెంపో ట్రావెలర్ ను అతివేగంగా ఢీ కొన్న టమోటో బొలెరో ట్రక్ వాహనం. ఏడుగురికి తీవ్ర గాయాలు తాజాగా.. రెండు లారీలు ఢీ కొట్టి.. ఒకరి సజీవ దహనం, మరోకరు క్యాబిన్లో ఇరుక్కుని మృతి -
తిరుపతి జిల్లాలో లారీ బీభత్సం
-
తిరుపతిలో ఘోర ప్రమాదం.. పలువురు మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కారు, బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు.కాగా, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం భాకరపేట ఘాట్ రోడ్డు కంటైనర్ లారీ అదుపు తప్పింది. ఈ క్రమంలో కారు, బైక్ను లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: అనకాపల్లిలో బరితెగించిన టీడీపీ నాయకులు -
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ టెర్రర్.. ఒకే స్పాట్లో మూడు ప్రమాదాలు..
సాక్షి, ఎన్టీఆర్: ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ దుర్మరణం చెందారు. ఒకే స్పాట్లో కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఖాళీ గ్యాస్ సిలిండర్ల లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే, అదే మార్గంలో వస్తున్న మరో కంటైనర్.. ప్రమాదానికి గురైన లారీ ఢీకొట్టింది. దీంతో, లారీ ముందున్న ఇద్దరు వ్యక్తులు(తండ్రి, కొడుకు) మృతిచెందారు.ఆ తర్వాత ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. కంటైనర్ను స్పీడ్గా నడపడంతో సదరు కంటైనర్.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, సమాచారం అందుకున్న కంచికచర్ల హైవే మొబైల్ పోలీసులు కేసర వద్ద ఆ కంటైనర్ను పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో మృతులు ఎన్టీఆర్ జిల్లా ఐతవరం గ్రామానికి చెందిన సంకు మాధవరావు(65), అతని కుమారుడు సంకు రామరాజు(45)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మెదక్లో రోడ్డు ఘోర ప్రమాదం
మెదక్, సాక్షి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీ ఢీ కొట్టడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ వేగంగా ఢీ కొట్టింది. వెనుకలారీలో ఉన్న అక్కడికక్కడే నలుగురు చనిపోగా.. తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. -
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే...
తూర్పు గోదావరి: స్కూలుకని బయలుదేరిన కొడుకు తిరిగిరాని లోకాలకు తరలిపోవడం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. మండపేట సత్యశ్రీ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందడం పట్టణంలో విషాదాన్ని నింపింది. స్థానిక సంఘం కాలనీకి చెందిన కోనె మహేష్ సత్యశ్రీ రోడ్డులోని ఎస్ఎస్వీవీ మున్సిపల్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరి ఉదయం కాలనీ నుంచి సైకిల్పై పాఠశాలకు బయలుదేరాడు. బైపాస్ రోడ్డు దాటి కోళ్ల ఫారాల మలుపు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడపడం, రోడ్డు బెర్ములు కిందికి కుంగిపోయి ఉండటం వలనే ప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు. స్కూల్కు వెళుతున్న బాలుడు రోడ్డుపై మృతిచెంది ఉండటం దారిన వెళ్లే వారిని కలచివేసింది. మహేష్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి శ్రీనివాస్ భవన నిర్మాణ కారి్మకుడిగా పనిచేస్తూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ
వేలూరు: అర్ధరాత్రి సమయంలో గాడ నిద్రలో ఉండగా లారీ ఇంటిపైకి దూసుకెళ్లడంతో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి నుంచి కట్టల లోడ్డుతో లారీ శుక్రవారం రాత్రి బయలుదేరింది. సేతుపట్టు సమీపంలోని నంబేడు వద్ద వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంటిని అతివేగంగా ఢీకొంది. ఆ సమయంలో ఇంటిలో గాఢనిద్రలో ఉన్నవారిపై గోడలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో మునియప్పన్, భార్య జయలక్ష్మి, కుమారుడు ఏయుమలై, కోడలు సుగన్య ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న వారు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సేతుపట్టు పోలీసులు కేసు నమోదు చేసి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
దైవ దర్శనం కోసం వెళ్తూ.. లారీ ఢీకొని బాలుడి దుర్మరణం..
మహబూబ్నగర్: దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రాయాపురం సమీపంలో లారీ రూపంలో బాలుడిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బింగిదొడ్డితండాకు చెందిన వీరేష్నాయక్, లక్ష్మి దంపతుల కుమారుడు గౌతమ్ (6)తో పాటుగా ఏడేళ్ల బాలిక పరిణికతో కలిసి ద్విచక్ర వాహనంపై ఉరుకుంద వీరన్న స్వామి దర్శనం కోసం బయలుదేరారు. వీరు రాయాపురం దాటి గట్టు వైపు వస్తుండగా, రాయాపురం స్టేజీ వద్ద ఉన్న భారత్మాల రోడ్డు నిర్మాణం క్యాంపులో సిమెంట్ బస్తాలను దింపి గద్వాల వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో గౌతమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. వీరేష్నాయక్, లక్ష్మి తీవ్రంగా గాయపడగా, పరిణిక స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీని ఆపకుండా పరారయ్యాడు. చుట్టు పక్కల రైతులు విషయాన్ని గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నందికర్ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరకున్నారు. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పరిస్థితి చేయిదాటకుండా కేటిదొడ్డి ఎస్ఐ వెంకటేష్, మల్దకల్ ఎస్ఐ కల్యాణ్, అయిజ ఎస్ఐ నరేష్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆందోళనకారులకు నచ్చ చెప్పారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. ఉండవెల్లి వద్ద పట్టుబడ్డ లారీ.. రాయాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీని హైదరాబాద్–కర్నూలు జాతీయ రహదారి ఉండవెల్లి వద్ద పట్టుకున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి కారణమైన లారీ వివరాలను సేకరించి, జీపీఎస్ ఆధారంగా గద్వాల, ఎర్రవల్లి మీదుగా జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని ఉండవెల్లి పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
అన్నమయ్య: పట్టణ పరిధిలోని చిట్వేలి బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఉదయ్కిరణ్(15) అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మండలంలోని ఎస్.కొత్తపల్లికి చెందిన రోజువారీ కూలీలైన తిరుమలేశు, రాజేశ్వరిలకు ముగ్గురు కుమారులు. తల్లిదండ్రులు తమ ముగ్గురు బిడ్డల్ని పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. పెద్ద కొడుకు ఉదయ్కిరణ్ పదో తరగతి చదవుతున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు చిట్వేలి బైపాస్ రోడ్డు దాటుతుండగా రాజంపేట నుంచి రేణిగుంటవైపు వెళ్తున్న లాజిస్టిక్ లారీ ఢీకొంది. దీంతో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కిల్లింగ్.. ఓవర్లోడ్!
ఆదిలాబాద్: జిల్లాలో ఇసుక, కంకర, విద్యుత్ స్తంభాలు తరలిస్తున్న వాహన యజమానులు ఎ లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలు బోల్తా పడటం, రోడ్డు ప్రమాదా లకు కారణమవుతుండటంతో అమాయకులు ప్రా ణాలు కోల్పోతున్నారు. క్వారీల నుంచి ఇతర రాష్ట్రాలకు కంకరను తరలించే క్రమంలో గ్రామీణులు టి ప్పర్ చక్రాల కింద నలిగిపోతున్నారు. ఇటీవల కౌ టాల మండలం వైగాం సమీపంలో ఓవర్ లోడ్తో వి ద్యుత్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ట్రాక్టర్లు, ట్రిపర్లు అధిక లోడుతో వరుసగా పదుల సంఖ్యల్లో పల్లెల మీదుగా దూసుకెళ్తున్నాయి. నిత్యం రాకపోకలు సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లో ఓవర్లోడ్తో భారీ వాహనాలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఆసిఫాబాద్, తిర్యాణితోపాటు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ఇసుకు అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 25 నుంచి 26 టన్నులతో.. 12 టైర్ల లారీ 26 టన్నులతో వెళ్లాల్సి ఉండగా సుమారు 32 టన్నులకు పైగానే లోడ్తో తిప్పుతున్నారు. గతేడాది డిసెంబర్ 4న కౌటాల మండలం యాపలగూడలో ట్రిప్పర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. వాస్తవానికి ట్రాక్టర్ వెనుక భాగంలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించేందుకు వీలుంటుంది. కానీ 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది. కౌటాల మండలం ముత్తంపేట శివారులోని కంకర క్రషర్ల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా కంకర తరలిస్తున్నారు. వాగులు, నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలోనూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు చేపడుతున్నాం ఓవర్ లోడుతో వెళ్తున్న కంక ర టిప్పర్లు, ఇసుక ట్రాక్టర్లు, విద్యుత్ స్తంభాలు తరలించే ట్రాకర్లను నిత్యం తనిఖీ చేస్తూనే ఉన్నాం. సంబంధిత అధికారులకు సైతం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలను పాటించని వాహనాల యాజమానులకు జరిమానా విధిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తాం. – జి.లక్ష్మి, ఆర్టీవో, ఆసిఫాబాద్ జాడలేని తనిఖీలు.. ఓవర్ లోడింగ్ వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల వరుస ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా అధికారులు ఓవర్ లోడింగ్ వాహనాల ను తనిఖీలు చేసి కనీస జరిమానాలు విధించకపోవడం గమనార్హం. -
భద్రాద్రి కొత్తగూడెం: ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. జూలూరుపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో లారీ డీజిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక, ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: ఖమ్మంలో విచిత్ర ఘటన.. రెండేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షం -
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిశ్చితార్థానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తోన్న గిరిజన కుటుంబాలపై మృత్యువు లారీ రూపంలో దూసుకువచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. తీవ్ర గాయాలతో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. గాయపడిన మరో ఐదుగురు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసకి చెందిన 2 కుటుంబాల్లోని 12 మంది గిరిజనులు నిశ్చితార్థం కోసం అదే మండలంలోని తుమ్మలవలసకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి సొంత గ్రామానికి ఆటోలో బయల్దేరారు. 20 నిమిషాల్లో ఇళ్లకు చేరతారనగా..చోళ్లపదం శివాలయం మలుపు వద్ద ఆటోను పార్వతీపురం నుంచి కూనేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జ్జయింది. ప్రయాణిస్తోన్న వారంతా ఎగిరి పడిపోయారు. ప్రమాదంలో ఊయక నరసమ్మ (54), ఊయక లక్ష్మి (48), మెల్లిక శారద(35), మెల్లిక అమ్మడమ్మ(80), ఊయక వెంకట్(55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాలైన మిగతా 8 మందిని పోలీసులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ల్లో తీసుకువెళ్లారు. వారిలో ఊయక రామస్వామి, ఊయక వెంకటేష్ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్కిరణ్లు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. -
ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. ఉపాధి హామీ కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమదాలవలస మండలం మందడిలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గురువందల పాపమ్మ, అంబటి సత్తెమ్మ, కురమాల లక్ష్మి మృతి చెందారు. అమలాపురం గౌరమ్మకు తీవ్ర గాయాలు కాగా, శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. చదవండి: హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారి పనుల్లో నిమగ్నమైన కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనా స్థలిలోనే ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందగా మృతుల సంఖ్య అయిదుకి చేరింది. మిగతా వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు అసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు ప్రమాదాన్ని గమనించి ఆగిపోయారు. ప్రమాదంపై చలించిపోయిన ఎంపీ క్షతగాత్రులను తరలించే చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ జోన్గా ఉన్న మోచెర్ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని భరోసానిచ్చారు. చదవండి: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ -
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవదహనమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి నుండి విశాఖపట్నం వైపుగా వెళ్తున్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి మరొక లారీని ఢీ కొట్టింది. ప్రమాద ఘటనలో క్యాబిన్లో మంటలు వ్యాపించాయి. క్యాబిన్లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అవ్వగా, ఆసుప్రతికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మెకానిక్తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి! -
ఘోర రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప పడిపూజకు వెళ్లి వస్తుండగా..
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. అయ్యప్పస్వాములు పడిపూజకు వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో 33 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. కాగా, దారుణ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురైన గ్యాస్ సిలిండర్ల లారీ
-
డాడీ నొప్పిగా ఉంది.. బయటికి తియ్యి! గంటన్నర పాటు నరక యాతన
మంగపేట (ములుగు జిల్లా): నిండా కలప లోడుతో వెళ్తున్న లారీ.. అదుపు తప్పి రోడ్డు పక్కన వెళ్తున్న బాలురపై బోల్తా పడింది.. ఇద్దరు బాలురపై కలప దుంగలు పడగా.. మరో బాలుడు లారీ క్యాబిన్ కింద చిక్కు కుపోయాడు. సమీపంలోనే ఉన్నవారు పరుగెత్తు కొచ్చేటప్పటికి బాలురు బాధతో రోదిస్తున్నారు. కాసేపటికే లారీ క్యాబిన్ కింద చిక్కుకున్న బాలుడి తండ్రి అక్కడికి వచ్చాడు. బాలుడు తండ్రిని చూసి ‘డా డీ.. నొప్పిగా ఉంది.. నన్ను బయటికి తియ్యండి డాడీ..’అంటూ ఏడ్చాడు. కొడుకును బయటికి తీయలేక.. అతడి బాధను చూడలేక తండ్రి కన్నీళ్లు పెడుతూ విలవిల్లాడిపోయాడు. అక్కడికి వచ్చిన వారంతా అది చూసి కన్నీళ్లు పెట్టారు. గురువారం సాయంత్రం ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి పీహెచ్సీ ఎదుట ఈ ఘటన జరిగింది. మూల మలుపు వద్ద అదుపు తప్పి.. కలప లోడుతో మంగపేట వైపు నుంచి మణుగూరు వైపు వెళ్తున్న లారీ చుంచుపల్లి పీహెచ్సీ ముందు మలుపు వద్ద అదుపుతప్పింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గ్రామ బాలురు పోలెబోయిన సాయి, కల్తీ దిలీప్, చింతకుంటకు చెందిన కొమరం చందులపై బోల్తా పడింది. చందు, దిలీప్పై కలప దుంగలు పడగా.. సాయి లారీ క్యాబిన్ కింద ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కలప కింద ఉన్న ఇద్దరిని బయటికి తీశారు. ఈ ఇద్దరికీ కాళ్లు విరగడం, ఇతర గాయాలూ కావడంతో 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక సాయికి కుడికాలు, కుడిచేయి ఓ కర్రకు, లారీ క్యాబిన్కు మధ్య ఇరుక్కుపోవడంతో అతడిని బయటికి లాగడం వీలుకాలేదు. పోలీసులు స్థానికుల సహకారంతో ప్రొక్లెయిన్, రెండు జేసీబీలను తెప్పించి బాలుడిని సుమారు గంటన్నర తర్వాత బయటికి తీశారు. బాలుడు బాధను తట్టుకోలేక ఏడవడం, అక్కడికి చేరుకున్న తన తండ్రి ఆదినారాయణను చూసి ‘డాడీ నొప్పిగా ఉంది.. బయటికి తియ్యండి’అంటూ రోదించడం అందరినీ కలచివేసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య.. బాలుడిని వైద్యం కోసం తన వాహనంలో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వరదల్లో కొట్టుకుపోయిన లారీ.. రేషన్ బియ్యం నీటిపాలు
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముసురు కారణంగా పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు సైతం రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ విధించారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సైతం మూడు రోజులు పాటు సెలవులు ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో ఓ లారీ వర్షపు నీటి వరదలో కొట్టుకుపోయింది. కాగా, రేషన్ బియ్యం తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో టన్నుల సంఖ్యలో రేషన్ బియ్యం నీటిపాలైంది. అయితే, లారీ డ్రైవర్.. వరద పరిస్థితిని సరిగా అంచనా వేయకుండా లారీని ముందుకు పోనిచ్చాడు. వరద ఉద్ధృతికి ఆ లారీ నీటిలో కొట్టుకుపోయింది. అయితే, మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. छत्तीसगढ़ के बीजापुर में पीडीएस का चावल ले जा रहा ट्रक उफनती नदी में बहा, देखें वीडियो#Bijapur #TruckFallInRiver #ViralVideo #Rainfall #weather #Chhattisgarh pic.twitter.com/8TSSynSmsV — Neo News Mathura (@Neo_NeoNews) July 10, 2022 ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. మూడు రోజులు స్కూల్స్ బంద్ -
ఆర్టీసీ బస్సు–లారీ ఢీ
చింతూరు/మోతుగూడెం: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందగా బస్సు డ్రైవర్, కండక్టర్తో సహా 15 మంది గాయపడ్డారు. చింతూరు, మోతుగూడెం రహదారిలోని సుకుమామిడి సమీపంలో మలుపు వద్ద ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సీలేరు నుంచి విజయవాడ వెళ్తుండగా తెలంగాణ నుంచి ఒడిశాకు సిమెంటు లోడుతో వెళుతున్న లారీని ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన పల్లపు రాజు(26) లారీ క్యాబిన్, స్టీరింగ్ నడుమ ఇరుక్కుని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ అప్పలనాయుడు, ఎస్ఐలు యాదగిరి, సత్తిబాబు తమ సిబ్బందితో కలసి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని శ్రమించి బయటకు తీశారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు మరో 15 మందికి కూడా గాయాలు కాగా వీరిని చికిత్స నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో 11 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చింతూరు తరలించిన పోలీసులు ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో సూరజ్ ధనుంజయ్ గనోరే ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీవోను ఆదేశించారు. -
హైదరాబాద్: హెరిటేజ్ పాల లారీ బీభత్సం.. చెల్లెల్ని బైక్పై తీసుకొస్తుండగా
సాక్షి, హైదరాబాద్: బ్రేకులు ఫెయిలై అతివేగంగా వచ్చిన హెరిటేజ్ పాల లారీ ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లడంతో అన్నా, చెల్లెలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం వనస్థలిపురంలో చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. హయత్నగర్లోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బి.సురేశ్కుమార్ (47), నల్లగొండ పట్టణం వెంకటేశ్వర కాలనీకి చెందిన ఎం.విజయలక్ష్మి (43) అన్నాచెల్లెళ్లు. విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమెకు సంబంధించిన ఎల్ఐసీ లోన్ కోసం మంగళవారం నగరానికి వచ్చారు. చెల్లెలిని సురేశ్కుమార్ తన బైకుపై నగరంలోని అమీర్పేట ఎల్ఐసీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. సురేశ్కుమార్, విజయలక్ష్మి (ఫైల్) ఈ క్రమంలో వనస్థలిపురం సుష్మా చౌరస్తాకు రాగానే రెడ్ సిగ్నల్ పడడంతో ఆగారు. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా బ్రేకులు ఫెయిలైన హెరిటేజ్ పాల లారీ వచ్చి సురేశ్కుమార్ బైకును ఢీకొట్టి మరో స్కూటీని ఢీకొని పాన్డబ్బా పైకి దూసికెళ్లింది. ఈ ప్రమాదంలో సురేశ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరిలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. స్కూటీపై ఉన్న మరో వ్యక్తి మురళీమోహన్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సురేశ్కుమార్ భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ షేక్ బాషాను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. చదవండి: మమత భేటీకి టీఆర్ఎస్ దూరం! -
లారీ ఢీకొని విద్యార్థి దుర్మరణం
మదనపల్లె టౌన్ : సిమెంట్ లారీ బైక్ను ఢీకొని విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన మదనపల్లె పట్టణంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం జుంజురపెంట పంచాయతీ బురుజుపల్లెకు చెందిన దంపతులు ప్రహ్లాద, లక్ష్మీదేవీలు 20 ఏళ్లక్రితం మదనపల్లెకు బతుకుదెరువు నిమిత్తం వచ్చారు. కదిరిరోడ్డులోని అమ్మచెరువుమిట్ట ఏసీ గోడౌన్వద్ద సొంతంగా ఇంటిని నిర్మించుకుని పాడిపశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఒక్కగానొక్క కుమారుడు సి.ఉపేంద్ర (17) స్థానికంగా ఇంటర్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ గురువారం ఉదయం పాడిఆవులకు పచ్చగడ్డి కొనుగోలు చేసేందుకు నీరుగట్టువారిపల్లెకు బైక్లో బయలుదేరాడు. గడ్డి కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళుతున్న క్రమంలో మార్గమధ్యంలో సిమెంట్లారీ వేగంగా వచ్చి బైక్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న వన్టౌన్ ఎస్ఐ లోకేష్ ప్రమాదస్థలికి చేరుకుని విచారణ చేపట్టి పంచనామా అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక మాకు దిక్కెవరంటూ గుండెలు బాదుకోవడం చూపరుల హృదయాలను కలిచివేసింది. -
బీరు లారీ బోల్తా.. బాటిళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో మద్యం ప్రియులు ఎగబడి బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని యునైటెడ్ బ్రేవరేజెస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మద్యం డిపోకు కింగ్ఫిషర్, ఎన్జి బ్రాండు బీరు బాటిళ్ల లోడుతో లారీ బయలుదేరింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలోని విమానాల రన్వేపైకి రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా.. రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. అదే సమయంలో చెన్నై నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ మద్యం లారీ ట్రక్కు భాగాన్ని బలంగా ఢీ కొట్టడంతో బీరు బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. బీరు బాటిళ్ల విలువ అధికారికంగా రూ.5.50 లక్షలు కాగా మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.30 లక్షలు ఉంటుంది. బీర్ బాటిళ్ల లారీ బోల్తా పడిందని తెలుసుకున్న మద్యం ప్రియులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దొరికినవి దొరికినట్లు బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, టంగుటూరు హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. తరువాత క్రేన్ సహాయంతో లారీని రోడ్డు పక్కకు చేర్చి మిగిలిన బాటిళ్లను ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని ఎక్సైజ్, సెబ్ అధికారులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎల్.సంపత్కుమార్ తెలిపారు. -
రెండు లారీలు ఢీ : ఒకరు మృతి
ఓబులవారిపల్లె: మంగంపేట జాతీయరహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీ కొనడంతో డ్రైవర్ సుగ్రీవ్ సింగ్ (25) మృతి చెందాడు.పోలీసుల కథనం మేరకు మంగంపేట ప్రైవేట్ కంపెనీకి చెందిన బెరైటీస్ ఖనిజం సరఫరా చేసే ఏపీ 39యూబీబీ109 నంబర్ గల లారీ మంగంపేట గుట్టపై నుంచి వేగంగా వస్తుండగా నంద్యాల నుంచి శ్రీసీటికి మొక్క జోన్న పప్పుదినుసులు తీసుకెళ్తున్న ఏపీ04టీయూ8489 నెంబర్ గల లారీ ఢీ కొంది. రెండు లారీల ముందు భాగం దెబ్బతింది. లారీలో సుగ్రీవ్ సింగ్ మృతదేహం ఇరుక్కు పోవడంతో అతి కష్టం మీద బయటకు తీశారు. క్లినర్ జైతూకి చెవి వద్ద గాయం కాగా తిరుపతికి తరలించారు. మరో లారీ డ్రైవర్ పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రం, ధూల్ పూర్, చద్యాన్కాపురా గ్రామానికి చెందిన సుగ్రీవ్సింగ్ గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్ప్రదా కంపెనీలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం వివాహం జరిగింది. భార్య శివానితో రైల్వేకొడూరులో నివాసం ఉంటున్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త చనిపోవడంతో శివానీ, బంధువులు విలపించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వరులు తెలిపారు. -
నిద్రిస్తున్న మహిళపై వెళ్లిన లారీ.. ‘ఇలా చావడానికే ఇక్కడకు వచ్చావా అమ్మా’
సాక్షి, మైలార్దేవ్పల్లి: పిల్లలకు భారంగా ఉండకూడదు.. నగరంలో ఏదైనా పనిచేసుకొని బతుకుదామని వచ్చిన ఆ దంపతులను విధి వెక్కిరించింది. ఉద్యోగంలో చేరిన 12 గంటలలోపే భార్యను మృత్యువు కబళించింది. నిద్రిస్తున్న మహిళపై లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె.నర్సింహ, ఎస్ఐ శ్రీలతరెడ్డి తెలిపిన మేరకు.. వనపర్తి జిల్లా అడ్డాకూల గ్రామానికి చెందిన దంపతులు వెంకటమ్మ(55), రామస్వామి నగరంలో వాచ్మెన్గా పనిచేసేందుకు వచ్చారు. బుధవారం సాయంత్రం దుర్గానగర్ చౌరస్తాలోని ఓ వెంచర్లో వాచ్మెన్గా భార్యభర్తలు పనికి కుదిరారు. భోజనం చేసుకొని పనులు కొనసాగుతున్న ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు. కరెంటు లేకపోవడం, దోమల బెడద తీవ్రంగా ఉండడంతో ఇంటికి సమీపంలో పడుకున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ లారీ ఇటుకలను ఆ ఇంటి వద్ద దించేందుకు వచ్చింది. డ్రైవర్ యాదగిరి.. రోడ్డుపై పడుకున్న వెంకటమ్మ, రామస్వాములను గమనించకుండా రివర్స్లో వచ్చాడు. ఆ సమయంలో వెంకటమ్మపైనుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇద్దరు కూతుళ్లు, కుమారుడు వచ్చి గుండెలవిసేలా రోదించారు. ఇలా చావడానికే ఇక్కడకు వచ్చావా.. అమ్మా.. అని వారు రోదించడం కంటతడిపెట్టించింది. నష్టపరిహారం అందజేత... మృతి చెందిన వెంకటమ్మ కుటుంబానికి యజమాని నష్టపరిహారం అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఏఐటియూసీ నాయకుడు వనంపల్లి జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో నష్టపరిహారం రెండు లక్షలను అందజేశాడు. -
పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో లారీ బీభత్సం
-
మేడ్చల్లో ఘోరం.. ఇంటి ముందు నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఐరన్ లోడుతో వచ్చిన ఓ లారీ... వెనక్కి చూసుకోకుండా నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారిని చందన్రామ్, చందన్ కుమార్ సహరిగా గుర్తించారు. బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి
మడికొండ: చీకట్లోనే విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కూలీలను క్వారీ గుంత మింగేసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామశివారులోని లక్ష్మి గ్రానైట్ క్వారీలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చిత్రం చందు(20), జార్ఖండ్ రాష్టానికి చెందిన మహ్మద్ హకీమ్(22)లు హెల్పర్లుగా, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన కొతల ముఖేశ్(23) లారీడ్రైవర్గా ఆరునెలల నుంచి లక్ష్మి గ్రానైట్లో పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత హకీమ్, చందులు క్వారీలోని వేస్ట్ మెటీరియల్ను టిప్పర్లో తరలిస్తుండగా అది అదుపుతప్పి క్వారీ గుంతలో బోల్తాపడింది. దీంతో మహ్మద్ హకీమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన చందు, డ్రైవర్ ముఖేశ్లను ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చందు చనిపోయాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ముఖేశ్ మృతిచెందాడు. చదవండి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి -
అబ్దుల్లాపూర్మెట్లో లారీ బీభత్సం.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అబ్దుల్లాపూర్మెట్ కూడలి వద్దకు రాగానే అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సిరిసిల్లా జిల్లా ప్రగతి నగర్కు చెందిన ప్రణయ్ గౌడ్(20)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే లారీ అదుపు తప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రెప్పపాటులో ప్రమాదం.. కళ్లెదుటే బిడ్డ రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటుంటే
అప్పటివరకు తన కొంగుపట్టుకుని చెంగుచెంగున నడిచిన బిడ్డ ఒక్కసారిగా వెనకపడేసరికి ఆ తల్లి ఉలిక్కిపడింది. బిడ్డ ఏడని చూసేలోగానే రెప్పపాటులో లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ మాతృమూర్తికి తీరని కడుపుకోత మిగిల్చింది. ఆరేళ్ల బాలుడిని నిర్ధాక్షిణ్యంగా బలితీసుకుంది. చిన్న కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కళ్లెదుటే బిడ్డ రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటుంటే ఆ కన్నపేగు విలవిల్లాడిపోయింది. దిక్కులుపిక్కటిల్లేలా.. గుండెలవిసేలా.. రోదించింది. రాజుపాలెం మండలం నకరికల్లులో శుక్రవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందరి గుండెలను పిండేసింది. సాక్షి, గుంటూరు: రాజుపాలెం మండలం లక్ష్మీపురం తండాకు చెందిన రమావత్ కొండానాయక్, దేవీబాయి దంపతులకు రాములునాయక్(6), లక్ష్మి ఇద్దరు కవల పిల్లలు. దేవీబాయి పుట్టిల్లు దాచేపల్లి మండలం భట్లుపాలెం తండాలో ఉంది. అక్కడ కార్తిక మాసం సందర్భంగా ఉత్సవాలు జరుగుతుండడంతో పిల్లలతో కలిసి బయలుదేరింది. వీరిని మోటార్సైకిల్పై ఎక్కించుకుని రమావత్ కొండానాయక్ నకరికల్లులోని అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై దించాడు. ఆవలి వైపునకు వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉండడంతో దేవీబాయి పిల్లలు రాములునాయక్, లక్ష్మితో కలిసి రోడ్డు దాటేందుకు యత్నించింది. రోడ్డు దాటి డివైడర్ ఎక్కే సమయంలో అమ్మ కొంగుపట్టుకుని ఉన్న బాలుడు ఒక్కసారిగా వెనకపడ్డాడు. ఏమైందని చూసేలోపే పిడుగురాళ్లవైపు నుంచి వచ్చిన లారీ రాములునాయక్ను ఢీకొట్టింది. దీంతో బాలుడి శరీరం ఛిద్రమైంది. అవయవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కళ్లెదుటే బిడ్డ దుర్మరణాన్ని చూసిన తల్లి గుండె తట్టుకోలేకపోయింది. పెద్దపెట్టున రోదించింది. రోడ్డు ఆవలవైపున ఉన్న తండ్రి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డ మృతదేహాన్ని చూసి బోరను విలపించాడు. క్షణం క్రితం వరకూ తమతో నవ్వుతూ ఊసులు చెప్పిన అన్న రోడ్డుపై విగతజీవిగా పడిఉండడం చూసి చెల్లి లక్ష్మి తల్లడిల్లింది. కవలల్లో పెద్దవాడైన రాములునాయక్, తన చెల్లితో కలిసి తండాలో రెండోతరగతి చదువుతున్నాడు. ప్రమాదం విషయం తెలుసుకొని తండావాసులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.సురేష్ తెలిపారు. -
ఊహించని ప్రమాదం.. తండ్రితో కలిసి కాలేజీకి వెళ్తుండగా...
సాక్షి, ఖమ్మం: లారీ డ్రైవర్ మద్యం మత్తు ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్లక్ష్యంగా లారీ నడపడంతో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి సమీపంలో వరంగల్– అశ్వారావుపేట ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన ఎనగందుల దేవయ్య అదే మండలంలోని పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్గా పనిచేస్తున్నాడు. ఖమ్మంరూరల్ మండల పరిధిలోని సాయికృష్ణ నగర్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి కుమారుడు ఠాగూర్(18), కుమార్తె పవిత్ర ఉన్నారు. వారిద్దరూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ, మొదటి సంవత్సరాలు చదువుతున్నారు. చదవండి: వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్లే పిల్లలను కాలేజీలో దిగబెట్టడానికి వెళ్లి.. కళాశాలలో దిగబెట్టేందుకని పిల్లలిద్దరినీ తీసుకొని దేవయ్య శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గం మధ్యలోని కరుణగిరి సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ టైర్ ఠాగూర్ నడుముపై నుంచి వెళ్లడంతో కిడ్నీలు బయటకు వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు. దేవయ్య, పవిత్రలపై నుంచి కూడా లారీ వెళ్లడంతో ఇద్దరికీ తీవ్ర గామాలమ్మాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు 108కి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని హైదరాబాద్కు తరలించారు. పోలీసులు డ్రైవర్ను అరెస్ట్ చేసి లారీ సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య పిండిప్రోలులో ఠాగూర్ అంత్యక్రియలు.. కాగా మృతుడు ఠాగూర్ అంత్యక్రియలు స్వగ్రామం పిండిప్రోలులో జరిగాయి. ఓ పక్క తండ్రీ కుమార్తె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉండగా ఠాగూర్ అంత్యక్రియలను తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు బాధాతృప్త హృదయాలతో నిర్వహించారు. ఉన్నత చదువులు చదివి తమను సంతోషంగా చూసుకుంటావని అనుకుంటే కానరాని లోకాలకు వెళ్లిపోయావా కొడకా అంటూ ఠాగూర్ తల్లి రోదిస్తుంటే అక్కడున్న వారు కన్నీరుమున్నీరయ్యారు. -
గుంటూరులో లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల దుర్మరణం
సాక్షి, గుంటూరు: తెనాలి మార్కెట్ యార్డులో లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లపైకి లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కూతురితోపాటు తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. కూతురిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబాన్ని చిదిమేసిన లారీ
గొల్లపల్లి (వెల్గటూర్): స్కూటీపై భార్య, ముగ్గురు పిల్లలతో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా, వారి వాహనాన్ని లారీ డీకొట్టింది. ఈ ఘటనలో ఇంటి యజమాని, ఇద్దరు పిల్లలు మరణించగా, భార్య కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కోడిపుంజుల తిరుపతి (38) ఇళ్లకు మార్బుల్స్ వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య మనోజా, కొడుకులు ఆదిత్య(9), కన్నయ్య(1), కూతురు చిట్టి (1) ఉన్నారు. మనోజా తల్లి మూడు నెలల క్రితం చనిపోయింది. మూడు నెలల కార్యక్రమం కోసం కుటుంబాన్ని తీసుకుని స్కూటీపై అత్తగారి ఊరైన ధర్మపురి మండలం దమ్మన్నపేటకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక సాయంత్రం ఐదుగురూ ఇంటికి బయల్దేరారు. ఊరు చేరేందుకు మరో ఐదు కిలోమీటర్ల దూరంలో వెల్గటూరు మండలం పాశిగామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హరితహోటల్ వద్దకు రాగానే వెనకాలే వస్తున్న లారీ స్కూటీని ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టింది. అందరూ రోడ్డుపై పడిపోయారు. లారీ వీరిపైనుంచి పోవడంతో చిట్టి, కన్నయ్య అక్కడికక్కడే చనిపోయారు. తిరుపతి నడుం పైనుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయ్యింది. మనోజా రెండు కాళ్లు విరిగాయి. ఆదిత్య రోడ్డుకు కొద్ది దూరంలో పడడం తో స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ధర్మపురి సీఐ కోటేశ్వర్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న తిరుపతి, మనోజాను 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యను సీఐ తన వాహనంలో ఆస్పత్రిలో చేర్చాడు. చికిత్స పొందుతూ తిరుపతి మృతిచెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనం దొరకలేదని, సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. కాగా, గుంతలను తప్పించబోయే క్రమంలోనే వేగంగా వస్తున్న లారీ ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. -
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవదహనం
జైపూర్: రాజస్థాన్లో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును..లారీ ఢీకొట్టింది. దీంతో.. ఒక్కసారిగా తీవ్ర మంటలు వ్యాపించాయి. కాగా, సంఘటన స్థలంలోనే నలుగురు సజీవదహనయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 45 నిముషాల పాటు గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అజ్మీర్-జైపూర్ ఎక్స్ప్రెస్ హైవేపై పెద్ద ఎత్తును ట్రాఫిక్ జామ్ అయ్యింది. -
వాహన బీమాలకు 'నకిలీ' మకిలి
రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. వాహనాలకు ఇంతటి అవసరమైన బీమాలను కూడా నకిలీవి తయారు చేస్తున్నాయి. ప్రముఖ బీమా కంపెనీల పేరిట నకిలీ పాలసీలు విచ్చలవిడిగా చేస్తూ అటు ప్రజలకు..ఇటు ప్రభుత్వ జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. సాక్షి, అమరావతి: విజయవాడ–హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై ఐదేళ్ల క్రితం జరిగిన ఓ లారీ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆ లారీకి వాహన బీమా ఉండటంతో థర్డ్పార్టీ పరిహారం కోసం దరఖాస్తు చేశారు. కానీ సదరు బీమా కంపెనీ తాము అసలు ఆ లారీకి బీమానే చేయలేదని చెప్పడంతో అటు లారీ యజమాని, ఇటు బాధిత కుటుంబం అవాక్కయ్యారు. తాము బీమా చేశాము కదా అని సంబంధిత పత్రాలు చూపిస్తే అసలు అవి తమ కంపెనీవే కావని ఆ సంస్థ తేల్చిచెప్పింది. లారీ యజమాని, బాధిత కుటుంబం కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో తమ కంపెనీ పేరిట నకిలీ బీమా దందా సాగుతోందని గ్రహించిన ఆ సంస్థ అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ తరువాత ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో నకిలీ వాహన బీమా రాకెట్ దర్జాగా విస్తరించింది. ఏకంగా 12 కంపెనీల పేరిట నకిలీ వాహన బీమాలు చేయిస్తూ యథేచ్ఛగా మోసం చేస్తోంది. ఇదీ రాష్ట్రంలో నకిలీ వాహన బీమా దందా బాగోతం. అటు ప్రజలను నష్టపరుస్తూ ఇటు ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్న ఈ దందాపై తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు దృష్టి సారించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించడంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీమా కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. దాదాపు 25% నకిలీ పాలసీలే.. రాష్ట్రంలో నకిలీ బీమా పాలసీల దందాపై డీఆర్ఐ అధికారులు దృష్టి సారించారు. ఈ బాగోతాన్ని అరికట్టేందుకు కార్యాచరణకు ఉపక్రమించారు. ర్యాండమ్గా 12 బీమా కంపెనీలకు చెందిన 3 లక్షల వాహన పాలసీలను పరిశీలించారు. వాటిలో 25 శాతం బీమా పాలసీలు నకిలివేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్న పాలసీలను పరిశీలిస్తే మరెన్ని నకిలీ బీమా పాలసీలు బయటపడతాయో అంతుచిక్కడం లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కట్టడికి తగిన విధివిధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బీమా కంపెనీల ప్రతినిధులు కూడా ఈ వ్యవహారంపై డీఆర్ఐ అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. ఇది క్రిమినల్ చర్య కూడా కావడంతో దీనిపై పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని డీఆర్ఐ అధికారులు వారికి సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీమా కంపెనీలు కూడా నిర్ణయించాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ‘మా కంపెనీ పేరిట నకిలీ బీమా పాలసీలు చేస్తున్నట్లుగా గుర్తించాం. దీనిపై మా కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయంలో దర్యాప్తునకు డీఆర్ఐ, పోలీసు అధికారులకు సహకరిస్తాం. – జితేంద్ర సాహూ, జనరల్ మేనేజర్, మాగ్మా ఇన్సూరెన్స్ కంపెనీ, ముంబై కాలుష్య తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహన షోరూమ్లే కేంద్రంగా... రాష్ట్రంలో దాదాపు ఏడేళ్లుగా నకిలీ వాహన బీమా రాకెట్ వేళ్లూనుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతినిచ్చిన కాలుష్య తనిఖీ వాహనాలు కేంద్రంగా ఈ దందా కేంద్రీకృతమైంది. మరోవైపు సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయించే షోరూమ్ల నుంచి కూడా ఈ బాగోతం సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అండదండలతో ఈ రాకెట్ బలోపేతమైంది. వాహన బీమాలు అందించే అధీకృత ఏజెంట్ల కంటే ఈ కాలుష్య నియంత్రణ తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ షోరూమ్లలో తక్కువ మొత్తానికే బీమా పాలసీలు అందుబాటులో ఉంచారు. కాలుష్య తనిఖీల కోసం తమ వాహనాలను తీసుకువచ్చిన వాహనదారులకు అదే పనిగా బీమా పాలసీలు చేయిస్తారు. ఆ విధంగా అధీకృత ఏజంట్ వద్ద కంటే 50% తక్కువకే అందిస్తుండటంతో వాహనదారులు ఆకర్షితులై నకిలీ బీమా పాలసీలు చేసుకుంటున్నారు. ఆ విధంగా ఒక్కో నకిలీ బీమా పాలసీ చేసే కాలుష్య పరీక్షలు/సెకండ్ హ్యాండ్ షోరూమ్ సిబ్బందికి రూ.500వరకు కమీషన్ ముట్టజెబుతారు. దాంతో ఈ నకిలీ వాహన బీమా పాలసీల దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోయింది. -
మంటల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్.. ఆర్తనాదాలు
సాక్షి, శ్రీకాకుళం: స్థానిక యునైటేడ్ బ్రేవరీస్ పరిశ్రమ సమీపంలో (జాతీయ రహదారిపై) సోమవారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. జే.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమ సమీపంలో అగి ఉన్న లారీని విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. లారీ ముందు భాగం (ఎడమ వైపు) నుజ్జునుజు అయింది. లోపల నిద్రిస్తున్న లారీ ఓనర్ (డ్రైవర్) కురిమి స్వామి టైర్, డోర్కు మధ్య ఇరుక్కుపోయాడు. లారీలో ఉన్న చిన్న గ్యాస్ స్టావ్ పేలి మంటలు వ్యాపించాయి. కురిమి స్వామి బయటకు రాలేక అర్తనాదాలు పెట్టాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పి బయటకు తీసే సరికి ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం స్వల్పంగా గాయపడ్డాడు. వీరిని 108లో శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రణస్థలం అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జే.ఆర్.పురం ఎస్ఐ జి.రాజేష్ తెలిపారు. -
చేపల వలలు కొనేందుకు వెళ్తూ.. అనంత లోకాలకు
జగిత్యాలక్రైం: చేపల వేటకు అవసరమైన వలల కోసం వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని మంచినీళ్ల బావివద్ద జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండ ల కేంద్రానికి చెందిన అర్ముల్ల పవన్ (21), అర్ముల్ల శ్రీకాంత్ (26), ఐలవేని నవీన్ (21) బుధవారం మధ్యాహ్నం చేపల వలలు కొనేందుకు బైక్పై జగిత్యాలకు బయల్దేరారు. జగిత్యాల మంచినీళ్ల బావి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో పవన్, శ్రీకాంత్, నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదా నికి కారణమని బాధితుల కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. -
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం
-
దారుణం: మహిళపైకి దూసుకెళ్లిన లారీ
సాక్షి ,శ్రీకాకుళం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డు మీద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓ మహిళ జీవితాన్ని చిదిమేసింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఎచ్చెర్ల మండలంలో చిలకపాలెం టోల్ ప్లాజా వద్ద వస్తున్న లారీ అదుపు తప్పి, అక్కడే రోడ్డు పైన పండ్లు అమ్ముకునే మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ కింద పడి తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మహిళ శరీరం నుజ్జునుజ్జయింది. చదవండి: బావిలో పడ్డ వ్యాన్.. డ్రైవర్, క్లీనర్ మృతి ) -
మహిళపైకి దూసుకెళ్లిన లారీ
-
విజయనగరంలో లారీ బీభత్సం: ఇద్దరు మృతి
సాక్షి, విజయనగరం: జిల్లాలోని ఆర్టీవో కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ అతివేగంతో రోడ్డు మీద బీభత్సం సృష్టించింది. బైకును ఢీకొట్టిన లారీ సమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాని చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వారిని ఏఆర్ కానిస్టేబుల్ రాజు, లెక్చరర్ సంజీవ్గా పోలీసులు గుర్తించారు. చదవండి: నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్: రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం -
లారీలు ఢీ: డ్రైవర్ కోసం మూడు గంటలు..
సాక్షి, నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రహ్మణపల్లి శివారులో గల నాందేడ్-సంగారెడ్డి జాతీయ రహదారిపై వెళుతున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. దీంతో మూడుగంటలు నరకయాతన పడ్డ బాధితుడిని 108అంబులెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి బయటకు తీసి చికిత్స అందించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్-సంగారెడ్డి జాతీయ రహదారిపై సోమవారం హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ క్యాబిన్ నుజ్జునుజ్జ కావడంతో డ్రైవర్ ఇందూరే విఠల్(20) అందులోనే ఇరుక్కుపోయాడు. వెంటనే స్థానికులు ప్రమాదాన్ని గమనించి 108అంబులెన్స్కు సమాచారం అందించారు. వెంటనే పిట్లం అంబులెన్స్ సిబ్బంది సుభాష్, విజయ్కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి డ్రైవర్కు ప్రథమ చికిత్స అందించి, సెలైన్ బాటిల్ ఎక్కించారు. రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న కార్మికులు, జేసీబీ సహయంతో క్యాబిన్లో ఇరుక్కున డ్రైవర్ను బయటకు తీసేందుకు మూడు గంటల పాటు శ్రమించారు. అప్పటికే డ్రైవర్ కాలు రెండు చోట్ల విరగడంతో అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్ సిబ్బంది క్యాబిన్లోనే డ్రైవర్కు వైద్య చికిత్సలు చేస్తూ బాధితుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రుడు విఠల్కు మెరుగై చికిత్స నిమిత్తం అంబులెన్స్లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో అంబులెన్స్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
ఉప్పల్లో లారీ బీభత్సం.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో శనివారం లారీ బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డుమీదకు వస్తున్న లారీ.. ఆగి ఉన్న బైక్తోపాటు మరికొన్ని వాహనాలకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యియి. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మృత్యువులోనూ వీడని బంధం -
కరీంనగర్లో నడిరోడ్డుపై లారీ దగ్ధం
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో నడిరోడ్డుపై మంగళవారం లారీ దగ్ధమయింది. లారీతో పాటు లారీలో ఉన్న కాంక్రిట్ మిక్సర్ మిషన్ కాలిబూడిదయ్యింది. మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి-లింగాపూర్ గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్ను సప్లై చేసే లారీలో కరీంనగర్ నుంచి లింగాపూర్కు కాంక్రీట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా పైన కరెంటు వైర్లు తాకి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ బండిని ఆపి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మిక్సర్ కాలి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లో పడింది. లారీ క్యాబిన్తోపాటు టైర్లు కాలిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మిక్సర్ కాలి బూడిద అయింది. లారీ పాక్షికంగా దెబ్బతింది. నడిరోడ్డుపై అగ్ని ప్రమాదం జరగడంతో ఆ దారిలో వెళ్లే వారు భయాందోళనకు గురయ్యారు. అయితే లింగాపూర్లో చెక్ డ్యామ్ నిర్మాణానికి కాంట్రాక్టర్ లారీలో కాంక్రిట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. నష్టం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. చదవండి: సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? ‘ఆ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతున్నాయి’ -
హనుమాన్ జంక్షన్లో లారీ బీభత్సం
సాక్షి, కృష్ణా : జిల్లాలోని బాపులపాడు మండలంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్లో ఓ లారీ వేగంగా వచ్చి ఆగివున్న కారు, రెండు బైక్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈదులుగూడెం గ్రామానికి చెందిన మహేష్(27) మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి లారీ నడిపినందువల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖలో లారీ బీభత్సం..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ రద్దీ సమయంలో లారీ అదుపు తప్పి వరుసగా ఆగి ఉన్న వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు. హనుమంతవాక జంక్షన్లో మధురవాడ వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా రద్దీగా ఉండే ఈ జంక్షన్ లో ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంది. లేనట్లయితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉండేది. -
మహబూబాబాద్లో ఘోర ప్రమాదం: నలుగురు మృతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.తొర్రూరు మండల చీటాయపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ర లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుల తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. తొర్రూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వేప, తుమ్మ కర్రలను కొనుగోలు చేసిన ఓవ్యాపారి ఇక్కడి నుంచి రాత్రికి రాత్రే కర్రను తరలించాలనుకున్నారు. కొనుగోలు చేసిన కర్రను లోడ్ చేసి తరలిస్తుండగా స్థానికంగా ఉన్న ఎక్కలదాయమ్మ చెరుపు కట్టపై అదుపుతప్పి లారీ బోల్తా పడింది. కట్టెల లోడుపై కూర్చున్న నలుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. క్యాబిన్లో కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు కోసం ఆసుపత్రికి తరలించినటట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందినవారిని హర్యా, గోవింద్, మధు, దూతియాగా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రమాదం జరగగా తెల్లవారుజామున మూడు గంటలకు మృత దేహాలను వెలికి తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అర్ధరాత్రి ఆర్తనాదాలు
ముండ్లమూరు: మండలంలోని శంకరాపురం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ యడ్లపల్లి సునీల్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని పూరిమెట్లకు చెందిన పొగాకు రైతులు ఒగులూరి ఆంజనేయులు, తువ్వదొడ్డి చిన్నబ్బాయి, ఒగులూరి నరేష్, యడ్లపల్లి సునీల్ పొగాకు చెక్కులతో ట్రాక్టర్తో అర్ధరాత్రి వెల్లంపల్లికి బయల్దేరారు. మార్గంమధ్యలో దర్శి–అద్దంకి ప్రధాన రహదారిలో శంకరాపురం వద్దకు వెళ్లగానే డీజిల్ లేక ట్రాక్టర్ ఆగిపోయింది. శంకరాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రోడ్డు పక్కన ట్రాక్టర్ను ఆపుకుంటున్నారు. ఆ సమయంలో నంద్యాల నుంచి టమోటా లోడుతో అద్దంకి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సునీల్ ట్రాక్టర్ టాప్కు ఇంజిన్కు మధ్య ఇరుక్కుపోయాడు. పొగాకు చెక్కులు ట్రాక్టర్పై పడ్డాయి. ప్రమాదాన్ని పసిగట్టిన ఒగులూరి ఆంజనేయులు ట్రాక్టర్ నుంచి పక్కకు దూకేశాడు. పైనే ఉన్న మరో ఇద్దరు ఒగులూరి నరేష్, తువ్వదొడ్డి చిన్నబ్బాయికి, లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సునీల్ను బయటకు లాగేందుకు ఆంజనేయులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్షతగాత్రులు ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదం ధాటికి పెద్ద శబ్దం రావడంతో దగ్గర్లో ఉన్న శంకరాపురం గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొన్న వైఎస్సార్ సీపీ నాయకులు వెంటనే 108 సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో అక్కడికి చేరుకొన్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఒంగోలు తరలించారు. ట్రాక్టర్లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన సునీల్ను బయటకు లాగేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అప్పటికే రోడ్డుకి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పొక్లెయిన్ సాయంతో చెక్కులు తొలగించి డ్రైవర్ను పక్కకు తీశారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాక్టర్ను, లారీని తొలగించారు. మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య ఏసుదయమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు వెంబడే పడి ఉన్న టమోటాలను స్థానికులు ఎవరికి వారు ఇళ్లకు తీసుకెళ్లారు. -
కడచూపు కోసం వచ్చి కానరాని లోకాలకు
కేవీపల్లె (చిత్తూరు జిల్లా): రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ బంధువును చివరిసారి చూసేందుకు వచ్చిన ఓ కుటుంబం తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికై మృత్యువాత పడింది. వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు మరణించగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ► చిత్తూరు జిల్లా కలకడ మండలం కె.బాటవారిపల్లె పంచాయతీ కొత్తగాండ్లపల్లెకు చెందిన మహేష్బాబు (19) శుక్రవారం చిత్తూరు – కడప జాతీయ రహదారిలో స్కూటర్పై వస్తూ అదుపు తప్పి పడిపోవడంతో మృతి చెందాడు. ► మహేష్బాబు మృతదేహం పీలేరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉండటంతో కడచూపు చూడడానికి అతని తాత కొత్తగాండ్లపల్లెకు చెందిన ఆర్.వెంకటరమణ (65), ఆయన పెద్ద భార్య పార్వతమ్మ (60), చిన్నభార్య సుజాతమ్మ (58), కుమార్తె రెడ్డి గోవర్ధని (21), బంధువులైన ఆటో డ్రైవర్ దామోదర్ (35), కేవీపల్లె మండలం గాండ్లపల్లెకు చెందిన నీలావతి (34), ఆమె కుమార్తె పుష్పావతి (18) ఆటోలో పీలేరుకు వచ్చారు. ► మృతదేహాన్ని చూసి, తిరిగి శుక్రవారం రాత్రి ఆటోలో కొత్తగాండ్లపల్లెకు పయనమయ్యారు. మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం వీరి ఆటోను ఢీకొంది. ► వెంకటరమణ, పార్వతమ్మ, సుజాతమ్మ, రెడ్డిగోవర్ధని అక్కడికక్కడే మృతి చెందారు. దామోదర్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నీలావతి, పుష్పావతి చికిత్స పొందుతున్నారు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా జరిగింది: ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఐషర్ (మినీ లారీ) ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎప్పుడు, ఎక్కడంటే : శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం సొరకాయలపేట చెరువు కట్టపై ప్రమాదం. పర్యవసానం : అక్కడికక్కడే నలుగురు, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. -
రెండు లారీలు ఢీ..ఒకరు మృతి
-
మద్యం మత్తు మృత్యువైంది
వేదాద్రి (జగ్గయ్యపేట): మద్యం మత్తు మృత్యు రూపం దాల్చింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న రెండు రైతు కుటుంబాలకు చెందిన 12 మందిని కాటేసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో లారీ డ్రైవర్ సహా మరో 12 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఏటా వ్యవసాయ పనులు చేపట్టే ముందు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా జమలాపురం, కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామాలకు చెందిన బంధువుల్ని నాలుగు రోజుల క్రితం గోపిరెడ్డి తన ఇంటికి ఆహ్వానించాడు. మొక్కు తీర్చుకునేందుకు 25 మంది కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్టర్పై పెద్ద గోపవరం నుంచి బయలుదేరి మధిర మీదుగా వత్సవాయి మండలం తాళ్లూరు చెక్పోస్టు, పెనుగంచిప్రోలు మండలం మీదుగా వేదాద్రికి రాత్రి 10 గంటల సమయంలో చేరుకున్నారు. ఆ రాత్రి ఆలయ పరిసరాల్లో బసచేసి బుధవారం ఉదయం కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో అంతా కలిసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలోనే వండుకుని భోజనాలు చేశారు. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో అదే ట్రాక్టర్పై తిరుగు ప్రయాణమయ్యారు. ప్రమాద స్థలంలో మృతదేహాలను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, తదితరులు ఆ లారీ మృత్యు శకటమై.. వారంతా ప్రయాణిస్తున్న ట్రాక్టర్ సరిగ్గా ఆలయం నుంచి అర కిలోమీటర్ దూరం ప్రయాణించే సరికి ఎదురుగా హేమాద్రి సిమెంట్స్ కర్మాగారం నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ట్రాక్టర్ ఇంజన్ను ఢీకొట్టి దాని ట్రక్కును ఈడ్చుకుపోయింది. ట్రక్కులో ఉన్నవారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా.. పెద్దగోపవరానికి చెందిన వేమిరెడ్డి ఉదయశ్రీ (7), వేమిరెడ్డి పుల్లారెడ్డి (75), వేమిరెడ్డి పద్మావతి (50), వేమిరెడ్డి రాజేశ్వరి (27), జమలాపురానికి చెందిన వెదురు అప్పమ్మ (60), కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జయంతికి చెందిన గూడూరు సూర్యనారాయణరెడ్డి (65), గూడూరు ఉపేంద్రరెడ్డి (14) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలిస్తుండగా.. వేమిరెడ్డి భారతమ్మ (65), లక్కిరెడ్డి తిరుపతమ్మ (70), గూడూరు రమణమ్మ (60) మార్గమధ్యంలో మరణించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దగోపరానికి చెందిన వేమిరెడ్డి కల్యాణి (16), వేమిరెడ్డి లక్ష్మి (9) మృత్యువాతపడ్డారు. గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి వేదాద్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులంతా బంధువులే.. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన బంధువులే. రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుమార్తె ఉదయశ్రీ,, అతడి తాత పుల్లారెడ్డి, బామ్మ భారతమ్మ, నాయనమ్మ పద్మావతి మృత్యువాత పడగా.. మరో రైతు కుటుంబానికి చెందిన గూడూరు సూర్యనారాయణరెడ్డి, రమణమ్మ భార్యాభర్తలు. మృతుల్లో వారి మనుమడు ఉపేంద్రరెడ్డి కూడా ఉన్నాడు. మిగిలిన ఐదుగురూ ఈ రెండు కుటుంబాల వారికి బంధువులు. క్షతగాత్రుల వివరాలివీ.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో గూడూరు శివనాగిరెడ్డి, అరుణ, నరసింహారెడ్డి, భార్గవి, వేమిరెడ్డి లావణ్య, భానుశ్రీ, శీలం లక్ష్మి, లక్కిరెడ్డి రవీంద్రారెడ్డి, ధనలక్ష్మి, ప్రియాంక, కాలపాని వీర్రాజు, ప్రమాదానికి కారణమైన తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ శివసుబ్రమణి ఉన్నారు. వీరిని 108, పోలీస్ వాహనాల్లో జగ్గయ్యపేట, ఖమ్మం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ట్రాక్టర్ నడిపిన రైతు గోపిరెడ్డి, గూడూరు తిరుమలరెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు. మద్యం మత్తులో లారీ నడపడం వల్లే.. లారీ డ్రైవర్ శివసుబ్రమణి అతిగా మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హేమాద్రి సిమెంట్స్ కర్మాగారానికి బొగ్గును లారీలో తీసుకొచ్చిన అతడు.. కర్మాగారంలో సగం బొగ్గును అన్లోడ్ చేసిన తరువాత మిగిలిన బొగ్గుతో మద్యం మత్తులో లారీ నడుపుకుంటూ రోడ్డుపైకి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. లారీని అడ్డదిడ్డంగా నడుపుతూ ట్రాక్టర్ను ఢీకొట్టాడని తెలిపారు. ప్రమాదం అనంతరం లారీ సమీపంలోని కాలువలోకి దూసుకెళ్లి గోతిలో దిగబడిపోగా.. డ్రైవర్ రెండు కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇలా జరిగింది.. వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ ట్రాక్టర్ ఇంజన్ను ఢీకొట్టి.. దాని ట్రక్కును ఈడ్చుకుపోయింది. ఆ తరువాత రోడ్డు పక్కన గల కాలువలోకి దూసుకెళ్లి గుంతలో దిగబడింది. ఎప్పుడు.. ఎక్కడ.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యవసానం డ్రైవర్ పూటుగా మద్యం తాగి తానెటు వెళ్తున్నానో తెలియని స్థితిలో లారీ నడపటం వల్ల దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ సహా మరో 12 మంది గాయపడ్డారు. -
మరణంలోనూ వీడని స్నేహం
కరీంనగర్, మంథని: ముగ్గురివీ పేద కుటుంబాలే.. ముగ్గురూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. పక్కపక్క గ్రామాల్లో ఉన్నప్పటికీ కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేయగా, ఒకరు ఎంబీఏ చదివాడు. జీవితంలో స్థిరపడిన తర్వాతే ముగ్గురూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఉపాధి వేటలో పడ్డారు. అయితే లాక్డౌన్తో వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు ఆర్థికంగా కొంత అండగా ఉండాలనుకున్నారు. నెల క్రితం ముగ్గురూ ఓ ఇసుక క్వారీలో పనికి కుదిరారు. అక్కడే ఉంటూ విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వర్షాలు ప్రారంభం కావడంతో ఇసుక క్వారీల్లో పని ఆగిపోయింది. నెల రోజుల తర్వాత ద్విచక్రవాహనంపై ఆనందంగా ఇంటికి బయల్దేరిన స్నేహితులను మృత్యువు లారీ రూపంలో కబళించింది. ప్రాణాలను తీయగలిగింది కానీ.. స్నేహాన్ని మాత్రం విడదీయలేకపోయింది. మంథని సమీపంలో జరిగిన ఈ ఘటన జూలపల్లి మండలానికి చెందిన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిలో మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్పల్లి శివారులో సోమవారం లారీ ఢీకొని ముగ్గురూ మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జూలపల్లి మండలం అబ్బాపూర్ చెందిన రజనీకాంత్(26), మిట్ట మధుకర్(26), , బాలరాజుపల్లికి అడప సురేశ్(24)లు ముగ్గురు విద్యావంతులు. లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా నెల కిత్రం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ ఇసుక క్వారీలో సూపర్వైజర్లుగా పనికి కుదిరారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్వారీలో పని ఆగిపోగా సోమవారం ద్విచక్రవాహనంపై ముగ్గురు ఇళ్లకు బయలుదేరారు. మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్పల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొ నడంతో రజనీకాంత్, మధుకర్ అక్కడికక్కడే మృతిచెందారు. సురేశ్ను మంథని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రజనీకాంత్, మధుకర్ మృతదేహా లు చిందరవందరగా ఎగిరిపడ్డాయి. శరీర భాగాలు బయటపడ్డాయి. రోడ్డంతా రక్తసిక్తమైంది. లారీ వేగంగా ద్వి చక్రవాహనాన్ని ఢీకొనగా భారీ శబ్దం రావడంతో సమీపంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న వారు ప్రమాద సమాచారాన్ని పోలీసులు చేరవేశారు. లారీ రోడ్డు దిగి పత్తి చేసులోకి దూసుకెళ్లింది. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. మ ంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్యాదవ్, రామగిరి ఎస్సై మహేందర్ మృతదేహాలను అంబులెన్స్›లో ఎక్కించి పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మూడు కుటుంబాల్లో విషాదం ఎలిగేడు(పెద్దపల్లి): మంథని సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు నిరుపేద కు టుంబాలకు చెందినవారే. వీరిలో ఇద్దరిది అబ్బాపూర్ కాగా మరొకరిది బాల్రాజ్పల్లి. ముగ్గురు యువకుల మృతితో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ నేపథ్యం.. మృతుల్లో అబ్బాపూర్కు చెందిన చొప్పరి రజినీకాంత్(26) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి రాజేశ్వరి కూలీపని, తండ్రి కొమురయ్య హమాలీ పని చేస్తూ కుమారుడిని చ దివించారు. అదే గ్రామానికి చెందిన మిట్ట మధుకర్(26)ఎంబీఏ చదివాడు. తల్లి ఆరవ్వ కూలీ పనిచేస్తుతండగా తండ్రి మల్లయ్య హమాలీ పని చేస్తూ ఒక్కగానొక్క కొడుకును ఉన్నత చదువులు చదివించారు. అడప సురేశ్(24)డిగ్రీ చదివాడు. తల్లి లక్ష్మి, తండ్రి లచ్చయ్య కూలిపని చేస్తూ కుమారున్ని చదివించారు. కుటుంబా నికి భారం కాకూడదని ఎంతో కొంత ఆసరాగా ఉండాలని ముగ్గురు యువకులు ఇసుక క్వారీలో పనికి కుది రారు. పనులు సాగక ఇంటికి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. చేతికి అందివచ్చిన కొడుకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. -
విద్యార్థి ఆయువు తీసిన ఆర్థిక కష్టాలు
వైఎస్సార్ జిల్లా, మార్టూరు: బతుకుదెరువు కోసం లారీ క్లీనర్గా మారిన ఇంటర్ విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక జాతీయ రహదారిపై ఇసుక దర్శి (ప్రకాశం జిల్లా) సమీపంలో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు, హైవే అంబులెన్స్ సిబ్బంది కథనం ప్రకారం.. కడపలోని గౌస్ నగర్కు చెందిన వెంకట్ (18) ఇంటర్ చదువుతున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వెంకట్ సోమవారం రాత్రి కడప నుంచి విజయవాడ వెళ్లే టమాటా లారీలో క్లీనర్గా బయల్దేరాడు. స్థానిక ఇసుక దర్శి సమీపంలో అతడు ప్రయాణిస్తున్న లారీకి ముందు వెళ్తున్న మరో లారీ అకస్మాత్తుగా ఆగింది. దీంతో వెనుక లారీ బలంగా ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలుకాగా.. క్యాబిన్లో కూర్చున్న వెంకట్ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది అతడిని లారీ నుంచి అతికష్టం మీద బయటకు తీస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. -
జడ్చర్ల వద్ద లారీ బీభత్సం
జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. పనసకాయల లోడ్ లారీ సర్వీస్రోడ్ను ఆనుకుని ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లారీ కింద పడి దుర్మరణం చెందారు. జడ్చర్ల మండలం కావేరమ్మపేట వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న బంగారయ్య(23), మల్లయ్య (28)తో పాటు రఫీయొద్దీన్(50) అనే వ్యక్తిపై లారీ పడి దుర్మరణం చెందారు. -
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ
సాక్షి, గుంటూరు: చలమల – శ్రీరాంపురం తండా మధ్య జరిగిన లారీ ప్రమాదంలో గాయపడి మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి.. వారిని ఓదార్చారు. తన సొంత నిధుల నుంచి రూ.50 వేలు, వైఎస్సార్ బీమా పథకం నుంచి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి తన నిధుల నుంచి పదివేలు ప్రకటించారు. ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. (మృత్యు ఘోష) -
పది నిమిషాల్లోనే...
పదకొండు నెలల బిడ్డను విశాఖలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరిన ఆ తల్లిదండ్రులు అంతలోనే ప్రమాదానికి గురయ్యారు. ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే తమ బిడ్డతో పాటు తల్లిదండ్రులు ప్రమాదానికి గురయ్యారన్న సమాచారం ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. అదుపుతప్పిన బైక్ లారీ కింది భాగంలోకి బలంగా దూసుకుపోవడంతో బిడ్డ తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఈ ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూసపాటిరేగ (భోగాపురం): ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల వ్యవధిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. మోటారుసైకిల్పై ఆస్పత్రికి వెళ్తుండగా అదుపుతప్పి లారీని ఢీకొన్న ప్రమాదంలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భార్య తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉంది. వారితో ఉన్న 11 నెలల బాలుడు తన్వీర్కు గాయమైంది. వివరాల్లోకి వెళ్తే...జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి చెందిన పడాల శ్రీనివాసరావు(30) తొమ్మిది నెలల కిందట అక్కివరం శ్రీనివాస హేచరీలో సూపర్వైజర్గా విధుల్లో చేరాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో భార్య స్వాతి(29), 11 నెలల కుమారుడు తన్వీర్తో కలిసి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాదు కంటి ఆస్పత్రికి శ్రీనివాసరావు బయలుదేరారు. సవరవిల్లి పంచాయతీ అవ్వపేట జంక్షన్కు వచ్చేసరికి ముందుగా వెళ్తున్న లారీని బైక్తో బలంగా ఢీకొని లారీ కిందకు మోటారుసైకిల్తో పాటు దూసుకెళ్లాడు. శ్రీనివాసరావు వెనక్కి తూలడంతో తలకు బలంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లింది. 11 నెలల తన్వీర్ కిందకు పడడంతో తలకు స్వల్ప గాయమైంది. వెంటనే సమాచారం అందుకున్న భోగాపురం ఎస్ఐ శ్యామల సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన స్వాతిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం విశాఖలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్ఐ శ్యామల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదబుడ్డిడిలో విషాదం... జియ్యమ్మవలస: రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు మృత్యువాత పడడంతో పాటు భార్య స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో పెదబుడ్డిడిలో విషాదం నెలకొంది. అప్పుడే ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబం ఇలా చిన్నాభిన్నం కావడంతో గ్రామమంతా ఉలిక్కి పడింది. రెండేళ్ల కిందటే వివాహమైన శ్రీనివాసరావు, స్వాతి దంపతులకు 11 నెలల బిడ్డ తన్వీర్ కూడా ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తండ్రి మృతి చెందడం, తల్లి కోమాలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ఘటన జరగడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుని తండ్రి కొద్ది సంవత్సరాల కిందట మరణించగా తల్లి, నాన్నమ్మ, తమ్ముడితో కలిసి శ్రీనివాసరావు పెదబుడ్డిడిలో నివాసం ఉంటున్నాడు. నిరుపేద కుటుంబం కావడం, ఇంటికి శ్రీనివాసరావే ఆధారం కావడం ఇంతలోనే మృత్యువాత పడడంతో ఇక ఎలా జీవించేదని కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి. -
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది
-
కన్నవారికి గుండె కోత
ప్రకాశం, మార్కాపురం: సరదాగా గడపాల్సిన ఆదివారం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థి జీవితాన్ని కబళించింది. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో పెద్ద వాటర్ ట్యాంక్ దగ్గర మోటార్ సైకిల్పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని శివాజీనగర్ 6వ లైనులో నివాసం ఉండే దూదేకుల చిన్న జీజీర్ కుమారుడు కరీముల్లా (15) స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎన్సీసీ డ్రిల్కు వెళ్లి బయటకు వచ్చిన తరువాత స్నేహితుడి మోటార్ బైక్ తీసుకుని తర్లుపాడు రోడ్డు వైపు వెళ్తుండగా వినుకొండ నుంచి రాగుల లోడుతో వస్తున్న లారీ పెద్ద వాటర్ ట్యాంక్ వద్దకు రాగానే లారీడ్రైవర్ తన వాహనాన్ని లెఫ్ట్ వైపు కట్ చేస్తుండగా అప్పుడే మోటార్ సైకిల్పై వస్తున్న కరీముల్లాకు తగలటంతో లారీ కింద పడి దుర్మరణం చెందాడు. వార్త విన్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. మార్బుల్ రాళ్ల కూలీగా పని చేస్తున్న చిన్న జజీర్కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. మృతుడు కరీముల్లా ఆఖరి అబ్బాయి. బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తాడని కలలు కంటుండగా ఊహించని రీతిలో లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చి కుటుంబంలో విషాదం నింపిందని కుటుంబ సభ్యులు రోదించారు. శివాజీనగర్ 6వ లైనులో ఉంటున్న కరీముల్లా ఆ ప్రాంతంలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతని మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఉదయం 6 గంటల వరకు తమతో ఉన్న కుమారుడు 9గంటల కల్లా మృతదేహంగా రోడ్డుపై పడి ఉండటాన్ని తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. -
యువ దంపతుల దుర్మరణం..
వైఎస్ఆర్ కడప జిల్లా రామాపురం మండలం కొండావాండ్లపల్లె వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత లారీ ఢీకొనడంతో కలికిరి మండలం గుట్టపాళ్యెంకు చెందిన యువ దంపతులు షేక్ హారున్బాషా(30), షేక్ హసిరా బేగం(28) దుర్మరణం పాలయ్యారు. వారితో పాటు షేక్ హారున్ బాషా అత్త హజిరాబేగం (52), కారు డ్రైవర్ హర్షద్ఖాన్(37) మత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో గుట్టపాళెం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ఈ ప్రమాదంలో హారూన్బాషా, హసిరాల ఇద్దరు బిడ్డలు మాత్రం ప్రాణాలతో బయటపడడం విశేషం. రాయచోటి/కలికిరి : అర్ధరాత్రి దాటాక వరుసగా జరుగుతున్న ప్రమాదాల జాబితాలో మరొకటి చేరింది. వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం కొండావాండ్లపల్లె వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత లారీ ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి పూట రహదారిపై మితిమీరిన వేగంతో లారీ రావడం..మంచు వల్ల మార్గం సరిగా కనిపించకపోవడం ఫలితంగా ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. రాయచోటికి చెందిన పైపుల పరిశ్రమ యజమాని షేక్ఖాదర్ మోహిద్దీన్ తన భార్య హజిరాబేగం, ఇద్దరు కుమారులు, కుమార్తె, అల్లుడు, మనవళ్లతో కలిసి ఇన్నోవా వాహనంలో మంగళవారం ఉదయం ప్రొద్దుటూరు వెళ్లారు. అమెరికాలో ఉండే చిన్న కుమార్తె, అల్లుడు ఈ మధ్యనే ప్రొద్దుటూరుకు వచ్చారు. వారిని చూసేందుకు వీరంతా వెళ్లారు. సాయంత్రం వరకు అందరూ ఆనందంగా గడిపారు. రాత్రి భోజనం చేసి 10.30 గంటల సమయంలో రాయచోటికి తిరుగు ప్రయాణమయ్యారు. కడప మీదుగా రాయచోటిలోని స్వగృహానికి మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. డ్రైవర్తో సహా నలుగురు అక్కడికక్కడే అశువులు బాశారు. చిన్నారులతో కలిసి 11 మంది ఇన్నోవాలో ప్రయాణిస్తున్నారు. మొహిద్దీన్ భార్య హజిరాబేగం(52)లతో పాటు కుమార్తె హసిరా(31) అల్లుడు హరూన్బాషా(35) ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ హర్షద్ఖాన్(37) కూడా దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన హరూన్ బాషా కలికిరి మండలం గుట్టపాలెంకు చెందిన వారు. ఈయన సదుం మండలంలో వ్యవసాయ విస్తరణాధికారిగా పని చేస్తున్నారు. కుటుంబంతో పీలేరులో నివసిస్తున్నారు. హారున్బాషా దంపతుల మృత దేహాలు బుధవారం సాయంత్రం గుట్టపాలెం చేరాయి. గురు వారం అంత్య క్రియలు నిర్వహిస్తారు. అమ్మ ఒడిలో ఒకరు..అమ్మమ్మ ఒడిలో మరొకరు సురక్షితం సంఘటనలో ప్రాణాలను కోల్పోయిన హరూన్బాషా, అతని భార్య హసిరాల పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడడం విశేషం! వీరిరువురు అమ్మ ఒడిలో ఒకరు, అమ్మమ్మ ఒడిలో మరొకరు ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. అమ్మ, అమ్మమ్మలు ఇరువురూ మృతి చెందగా వారి ఒడిలో ఉన్న చిన్నారులు క్షేమంగా బయట పడ్డారు. చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన వీరిని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడు డ్రైవర్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
రోడ్డుపై నుంచి.. వంతెనలో..
గూడూరు: జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ రెప్పపాటులో డివైడర్ మధ్య వంతెనలోకి దూసుకెళ్లింది. లారీడ్రైవర్కు నిద్ర ముంచుకురావడంతో కళ్లు మూతలు పడి.. తెరుచుకునే లోగా.. డివైడర్ల మధ్యలో వంతెన గోడలకు తగులుకుని వేలాడుతోంది. అయితే ఆ లారీలోని డ్రైవర్తో పాటు, క్లీనర్కూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ముప్పు తప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలకు చెందిన లారీ చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున ఆదిశంకర కళాశాల కూడలి ప్రాంతం వద్ద ఉన్న డివైడర్ వద్దకు చేరుకునే సరికి డ్రైవర్ నిద్ర ఆపుకోలేకపోయాడు. కళ్లు మూత పడడంతో అదుపుతప్పిన లారీ డివైడర్ను ఢీకొని వంతెన మధ్యలో తలకిందులుగా పడిపోయింది. వంతెన గోడలను తగులుకుని వేలాడుతూ కనిపించింది. అయితే అందులోని డ్రైవర్ రాజా, క్లీనర్ హుస్సేన్ లారీలోంచి దిగి బయట పడ్డారు. అయితే లారీ వంతెన లోపల పడిపోయి ఉంటే.. ప్రాణనష్టం జరిగేదని తెలుస్తోంది. వంతెనలో నీళ్లు ఉన్నాయి. లారీ ముందు భాగం అందులో మునిగిపోయి ఉండేది. అదే సమయంలో ఆ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న గూడూరు రూరల్ ఎస్సై పుల్లారావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, క్లీనర్ను బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యువులోనూవీడని బంధం
కశింకోట (అనకాపల్లి): మృత్యువులోను వీడని బంధం వారిది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పెళ్లి అయినప్పటి నుంచి వారు ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. చివరగా కలిసి వస్తూనే రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. కశింకోట మండలం తాళ్లపాలెంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తాళ్లపాలెం గ్రామానికి చెందిన కరణం సోమునాయుడు (62), భార్య పైడితల్లి (53) ప్రాణాలు కోల్పోయారు. పొలం నుంచి నడిచి ఆవు పాలు పిండి విక్రయానికి తీసుకు వస్తున్న వీరిని మృత్యువు కబలించింది. కాకినాడ నుంచి విశాఖ వైపు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ దూసుకు వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందా రు. వీరు పాడి పరిశ్రమ ద్వారా కుటుంబ జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారునికి వివాహం చేశారు. ఆయిల్ ట్యాంకర్ను తప్పించుకోలేక.. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు వారివి. వీరు పెళ్లి అయిన మొదలు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లినా ప్రేమికుల్లా కలిసి వెళ్లే వారు. పొలానికి కూడా కలిసే వెళ్లి తిరిగి వచ్చే వారు. వీరికి ఒక పాడి ఆవు ఉంది. ఎప్పటిలాగే శుక్రవారం తెల్లవారుజామున సమీపంలోని మామిడివాక గెడ్డ పక్కన ఉన్న తమ పశువుల శాలకు వెళ్లి ఆవు పాలు పిండుకొని తిరిగి ఇంటికి నడిచి వస్తున్నారు. మార్గమధ్యలో మామిడివాక గెడ్డ వంతెన దాటిన తర్వాత వారిని ఆయిల్ ట్యాంకర్ రూపంలో మృత్యువు కబలించింది. దూసుకు వస్తున్న లారీని వారు చూసినప్పటికీ తప్పించుకోలేక పోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వారిని ఢీకొన్న లారీ పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకుపోయిందని వారు వివరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడకు చేరే సరికి డ్రైవర్ నిద్రలోకి జారుకొని ఉంటాడని, దీనివల్ల లారీ అదుపుతప్పి ప్రమాదానికి దారితీసి ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. విషాదంలో కుటుంబాలు.. దంపతులు సోమునాయుడు, పైడితల్లి మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. ఒకేసారి ఇద్దరు మృతి వారితోపాటు స్థానికులకు కలచి వేసింది. సంఘటన స్థలాన్ని అనకాపల్లి రూరల్ సీఐ నరసింహారావు సందర్శించారు. మృత దేహాలకు పోస్టుమా ర్టం జరిపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎల్.హిమగిరి తెలిపారు. దంప తుల మృతదేహాలకు బంధువులు, కుటుంబ సభ్యులు ఒకేసారి అంత్యక్రియలు జరిపించారు. అదేచోట తరచూ ప్రమాదాలు ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. అలాగే లారీలు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకు పోయి పల్లపు ప్రాంతంలో బోల్తా పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వంతెన నుంచి వాలు ఎక్కువగా దిగువకు ఉండటమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. దీన్ని సరిచేసి ప్రమాదాలు నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రమాదాన్ని సూచించే బోర్డులు ఏర్పాటు చేయా లని పలువురు కోరుతున్నారు. -
విద్యార్థిని బలిగొన్న టిప్పర్
ఎస్కేయూ: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలోని ఇటుకలపల్లి పోలీస్స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు దాటుతున్న ఎంఏ సోషియాలజీ విద్యార్థి బాలకృష్ణ(22)ను టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. తమ కళ్లెదుటే ఘోరం జరిగిపోవడంతో తోటి విద్యార్థులు తల్లడిల్లిపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం ఎస్కేయూ వద్ద జాతీయరహదారిపై బైఠాయించారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఎస్కేయూ వద్ద రోడ్డు వెడల్పు పనులు చేపట్టిన నితిన్సాయి కన్స్ట్రక్షన్స్ (ఎన్ఎస్సీ) సంస్థ కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. సూచిక బోర్డుల ఏర్పాటులో తాత్సారం ప్రదర్శించడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టిప్పర్ ఢీకొని ఎస్కేయూ విద్యార్థి బాలకృష్ణ దుర్మరణం చెందాడు. ఇందుకు నితిన్సాయి కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత వహిస్తూ మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్చౌదరికి చెందిన టిప్పర్ను వెంటనే అదుపులోకి తీసుకుని డ్రైవర్ను అరెస్ట్ చేయాలని నినదించారు. భగ్గుమన్న విద్యార్థులు వందలాదిమంది విద్యార్థులు ఎస్కేయూ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్పై బైఠాయించారు. విద్యార్థి బాలకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. నాలుగు గంటలపాటు ఆందోళన చేయడంతో జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. 8 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆందోళనను విరమించారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, కాంతి కిరణ్, అంకే శ్రీనివాసులు, హేమంత్కుమార్, ఎంఎస్ఎఫ్ నాయకులు తిరుపాల్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. దామవాండ్లపల్లిలో విషాదం నల్లచెరువు: ‘అయ్యో ఎంత పని చేస్తివి దేవుడా.. కుమారుడిని ఉన్నత స్ధానంలో చూడాలనుకుంటిమే. ఇంతలోనే ఎంతపని చేస్తివయ్యా’ అంటూ బాలకృష్ణ తల్లిదండ్రులు రోదించిన తీరు కలచివేసింది. నల్లచెరువు మండలం దామవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ, బయమ్మ దంపతుల చిన్నకుమారుడు బాలకృష్ణ ఆదివారం రాత్రి ఎస్కేయూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం గ్రామానికి తీసుకురావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం
చిత్తూరు ,మదనపల్లె టౌన్ : లారీ డ్రైవర్ మితిమీరిన వేగానికి ఓ భవన నిర్మాణ కార్మికుడు బలయ్యాడు. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. గురువారం ఈ సంఘటన మదనపల్లె లో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, ఒకటో పట్టణ పోలీసుల కథనం..తంబళ్లపల్లె మండలం ఎరమద్దివారిపల్లెకు చెందిన టి.సహదేవ(42) బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చాడు. బెంగుళూరు రోడ్డులో ఉన్న నక్కల దిన్నె తాండాలో నివాసం ఉంటున్నాడు. భవన నిర్మాణ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సహదేవ గురువారం ఉదయం కురబలకోట మండలం అంగళ్లులో భవన నిర్మాణ పనులకు కోటవారిపల్లెకు చెందిన నరసింహులు(37)ను తీసుకుని తన మోటార్ సైకిల్లో బయల్దేరాడు. మార్గమధ్యంలో నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్యార్డు సమీపాన ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ స్పీడు బ్రేకర్ల వద్ద బైక్పై నెమ్మదిగా వెళుతుండగా అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ సహదేవ, నరసింహులు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొంది. ఈ సంఘటనలో సహదేవ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన నరసింహులును అక్కడి ప్రజలు ఆటోలో హుటా హుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ ఎస్ఐ సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాలు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య భాగ్యమ్మ, పిల్లలు తనుజ, జయశ్రీ తమ బంధువులతో అక్కడికి చేరుకుని ‘ఇక మాకు దిక్కెవ్వరు? అంటూ గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు.. వాల్మీకిపురం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని చింతపర్తిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఎగువబూడిదవేడుకు చెందిన ఆవుల ద్వారకనాథ రెడ్డి (32) చింతపర్తి బాహుదానది బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ నాన్స్టాప్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాధితుది తల నుజ్జునుజ్జై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ మోహన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు ఢీకొని మహిళ మృతి బంగారుపాళెం: కారు ఢీకొని మహిళ దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని కేజీ సత్రం వద్ద చెన్నై–బెంగళూరు బైపాస్రోడ్డుపై చోటుచేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ కథనం.. చీకూరుపల్లెకు చెందిన లేట్ లక్ష్మయ్య భార్య లక్ష్మమ్మ(56)పొలం వద్దకు వెళ్లి రోడ్డు దాటుతుండగా చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెల్లవారితే దుబాయ్ ప్రయాణం
సాక్షి, ధర్మారం(కరీంనగర్) : ధర్మారం మండలంలోని నందిమేడారం బైపాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి లారీ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందినట్లు ధర్మారం ఎస్సై ప్రేమ్కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాకాపూర్ గ్రామానికి చెందిన కుదిరే ప్రశాంత్ (23), తనుగుల మనోజ్ (21)లు బైక్పై మేడారం నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా లారీ ఢీకొని మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శాఖాపూర్ గ్రామంలో విషాదం వెల్గటూరు(ధర్మపురి): మండలానికి చెందిన ఇద్దరు యువకులు శనివారం అర్ధరాత్రి ధర్మారం మండలం మేడారం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో శాఖాపూర్ విషాదం నెలకొంది. యువకుల అంత్యక్రియలు ఆదివారం నిర్వహించగా ఊరంతా నివాళి అర్పించింది. తనుగుల మల్లేశ్,పుష్ప అనే దంపతుల కుమారుడైన మనోజ్ కుదిరె తిరుపతి భూమక్కల కుమారుడైన ప్రశాంత్ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. చేతికి అంది వచ్చిన కొడుకులు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెల్లవారితే మనోజ్ దుబాయ్ విమానం ఎక్కేవాడు తనుగుల మనోజ్ కుదిరె ప్రశాంత్ ఇద్దరు స్నేహితులు. మనోజ్ దుబాయ్ వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ధర్మారం మండలం వనపర్తిలో మనోజ్ అక్కను కలిసి, ప్రశాంత్ అక్క పెద్దపల్లిలో జరుపుకుంటున్న పోచమ్మ బోనాలకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. వీరితో గణేశ్ అనే మరో యువకుడు మరోబైక్పై బయల్దేరారు. పెద్దపల్లికి చేరకముందే ఇద్దరు స్నేహితులను మేడారం వద్ద లారీ బలితీసుకొంది. ఈ ప్రమాదంతో భయాందోళన చెందిన గణేశ్ గ్రామానికి చేరుకొని సమాచారమిచ్చాడు. కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి తరలి వెళ్లారు. ఇరు కుటుంబాల్లో ఒక కొడుకు ఒక కూతురు కావడం గమనార్హం. నవయువకుల మృతి తల్లిదండ్రులకు తీరని లోటు మిగిల్చింది. -
అయ్యో.. హారికా..!
సుల్తానాబాద్(పెద్దపల్లి): పది రోజుల్లో పెళ్లి.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు వెంటాడింది. పాడెపైకి చేరేలా చేసింది.. భాజాభజంత్రీతల మధ్య తల్లిదండ్రులు అత్తారింటికి సాగనంపాల్సి ఉండగా.. విధి చిన్నచూపు చూసింది.. చావుడప్పుల మధ్యల శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన సుల్తానాబాద్ మండలం సుద్దాల శివారులో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన మారేడుకొండ తిరుపతి–పద్మ దంపతులకు కొడుకు, కూతురు హారిక ఉన్నారు. ఇటీవలే హారిక వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన పెళ్లికి స్నేహితులను ఆహ్వానించేందుకు శనివారం సోదరుడు కిరణ్తో కలిసి ద్విచక్రవాహనంపై ఓదెల మండలం కొలనూర్కు వెళ్లింది. పెళ్లి కార్డు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. సుద్దాల శివారుకు రాగానే చెరువు మట్టి తరలించే లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో హారిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కిరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కిరణ్ను ఆస్పత్రికి తరలించారు. పది రోజుల్లో పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడి వివాహానికి వెళ్తూ..
బచ్చన్నపేట : స్నేహితుని వివాహానికి బైక్పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండల మొండికుంట వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంటరీ పని చేసే ప్రణీత్ ఆలియాస్ సన్నీ వివాహం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో జరుగుతోంది. పెండ్లికి వెళ్లేందుకు మిత్రులు రవికిరణ్రెడ్డి(24), ఎలిశెట్టి కర్ణాకర్(26) బైక్పై బయలుదేరారు. బైక్ మొండికుంట స్టేజీ వద్దకు చేరుకోగానే మహారాష్ట్రకు చెందిన లారీ ఎదురుగా వచ్చి బైక్ను ఢీ కొట్టింది. దీంతో స్నేహితులిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పది రోజుల్లో ఉద్యోగం వచ్చేది.. రవికిరణ్రెడ్డి తండ్రి మధుమోహన్రెడ్డి సేల్టాక్స్ కార్యాలయంలో పని చేస్తూ చనిపోయాడు. కూతురు, కుమారున్ని తల్లి తార జనగామలో టైలర్ షాపు పెట్టుకొని బట్టలు కుడుతూ చదివిస్తోంది. పది రోజుల్లో రవికిరణ్రెడ్డి తండ్రి జాబ్లో చేరేవాడని, ఇక తమ కష్టాలు తీరేవని తల్లి తార రోదిస్తూ తెలిపింది. ప్రస్తుతం కూతురు బీటెక్ చదువుతోంది. ఇంటికి ఇద్దరూ పెద్ద దిక్కులు పోయి కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చిందని పలువు రోదించారు. కొడుకు, భార్య అనాథ.. రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామానికి చెందిన కర్ణాకర్ వాయిస్ టుడే న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా పని చేస్తున్నాడు. మృతునికి రెండు సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. వారికి తొమ్మిది నెలల బాబు కూడా ఉన్నాడు. మృతుని తండ్రి యాదగిరి, తల్లి కోమలకు వివాహానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అరగంట లోపు చనిపోయాడని సమాచారం వచ్చిందని భార్య అశ్విని రోదనలు మిన్నంటాయి. కళ్ల ముందే విగతజీవులుగా.. బైక్పై వెళ్తున్న ఇద్దరిని అతి వేగంతో వచ్చిన లారీ ఢీకొట్టిందని వారి వెనకాలే వెళ్తున్న వరంగల్కు చెందిన మరో స్నేహితుడు సచిన్ చెబుతున్నాడు. ఆ లారీ వేగానికి తమ బైక్ను పక్కకు ఆపామని, కొంత దూరం వెళ్లి లారీ ప్రమాదం జరగడంతో ఆగిందని వివరించాడు. ఎస్సై రంజిత్రావు ఘటనా స్థలానికి ఎస్సై రంజిత్రావు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి..
ఆనందపురం(భీమిలి): ఆనందపురం మండలం శిర్లపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బొండపల్లి గ్రామానికి చెందిన కోన శ్రీనివాసరావు ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. కుటుంబంతో విజయనగరం కంటోన్మెంట్లో నివాసం ఉంటున్నాడు. సింహాచలంలోని బైరవకోనలో దైవ దర్శనానికి శ్రీనివాసరావుతో పాటు అతని భార్య రేణుకాదేవి, వదిన రమణ, తోడల్లుడు చిన రాంబాబు రెండు బైకులపై సోమవారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లారు. అక్కడ దైవ దర్శనం అనంతరం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా శిర్లపాలెం గ్రామం వద్దకు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న కారు ముందు ఉన్న బస్సును ఓవర్ టేక్ చేసి శ్రీనివాసరావు నడుపుతున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటారు బైక్ వెనుక వైపు కూర్చున్న రేణుకాదేవి(37) కిందపడి పోగా వెనక వైపు నుంచి వస్తున్న లారీ ఆమెపై నుంచి వెళ్లి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ, కారు డ్రైవర్లను ఎస్ఐ శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతి బాకురుపాలెం నుంచి శిర్లపాలెం మధ్య రెండు రోజుల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆనందపురం–పెందుర్తి రహదారి నుంచి విజయనగరం వెళ్లే ఈ మార్గంలో ఇటీవల వాహన రాకపోకలు ఎక్కువయ్యాయి. అలాగే బాకురుపాలెం, ముకుందపురం, శిర్లపాలెం, ముచ్చర్ల గ్రామాల వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఈ రూట్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అతివేగం ప్రాణం తీసింది
నూజివీడు: అతివేగం ఒకరి ప్రాణాలు బలిగొనగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ మృతిచెందగా, రెండో లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గొల్లపల్లి, మీర్జాపురం గ్రామాల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి జగ్గయ్యపేటకు నేలబొగ్గు లోడుతో వెళ్తున్న లారీ, కొండపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలనుకు రోడ్డు మెటీరియల్తో వెళ్తున్న టిప్పరు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల ముందరి భాగం దెబ్బతినగా జగ్గయ్యపేట వెళ్తున్న లారీ డ్రైవర్ జడ వీరబాబు (36) అక్కడికక్కడే మృతిచెందాడు. టిప్పర్ డ్రైవర్ ముత్తు సురేష్ (32)కు గాయాలయ్యాయి. బాధితుడిని 108 వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిది జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఇంకొల్లు సుబ్బారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి..
నాయుడుపేట టౌన్: కుమారుడి పెళ్లి ఎంతో వైభవంగా జరపాలని కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లిపత్రికలు పంపిణీ చేస్తూ ఆనందంగా ఉన్న సమయంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లిపత్రికలను పంచేందుకు బైక్పై వెళ్లిన పెళ్లి కుమారుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. మృతుడి సమీప బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం నాయుడుపేట పట్టణ పరిధిలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డుపై చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు నెల్లూరు పట్టణంలోని పోలీస్కాలనీ సమీపంలో ఏకేనగర్లో నివాసం ఉంటున్న బత్తుల రవీంద్ర(64) చెన్నైలో ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. అతని ఒక్కగానొక్క కుమారుడికి పెళ్లి కుదరడంతో ఈ నెల 16న బెంగళూరులో పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం రవీంద్ర తన బావమరిది చోడిబోయిన పృధ్వీరాజ్తో కలిసి బంధువులకు పెళ్లిపత్రికలు ఇచ్చేందుకు బైక్పై బయలుదేరారు. పలుచోట్ల పెళ్లిపత్రికలు ఇచ్చి నాయుడుపేటలో ఉన్న అతని బంధువు ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపల్లో ఇంటికి చేరుకునే సమయంలో నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ వీరి బైక్ను ఢీకొంది. దీంతో కిందపడిన రవీంద్ర తలపై నుంచి లారీ చక్రం వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అతనితోపాటు ఉన్న పృధ్వీరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పుృధ్వీరాజ్ను 108 అంబులెన్స్ సిబ్బంది సహకారంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్సలు జరిపి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. రవీంద్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమై లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు. తల్లడిల్లిన కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా కుమారుడి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లికుమారుడి తండ్రి బత్తుల రవీంద్ర నాయుడుపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలుసుకుని కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు కొందరు స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. రవీంద్ర మృతదేహానికి పోస్టుమార్టం జరిపిన అనంతరం నెల్లూరుకు తరలించారు. -
రెప్పపాటులో ఘోరం..
కొమరాడ: రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. శుభకార్యానికి వచ్చిన చిన్నారి లారీ ప్రమాదంలో కన్నుమూసింది. కళ్లముందే ఘోరం జరిగిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలం జోగిరాజుపేట గ్రామానికి చెందిన నరాల రాజు, మాధురి దంపతులు విశాఖలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇటీవలే సొంత గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో విక్రమపురంలోని బంధువుల ఇంటిలో జరగనున్న శుభకార్యంలో పాల్గొనేందుకు బుధవారం గ్రామానికి వచ్చారు. రెండో సంతానమైన హరిణిక (8) విక్రంపురం వద్ద జాతీయ రహదారి దాటుతుండగా.. పార్వతీపురం నుంచి ఒడిశా వైపు అతివేగంగా వెళ్తున్న లారీ చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కన్నుమూసింది. రోడ్డు ప్రమాదంలో కళ్లముందే చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కొమరాడ ఎస్సై రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలెన్నో....? కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి.అతివేగంతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్డు మీదకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. గ్రామం వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను గ్రామస్తులు నిలదీశారు. -
ఇద్దరిని కబళించిన లారీ
కె.అగ్రహారం (జగ్గయ్యపేట) : వరిగడ్డి లోడు ట్రాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఓ మహిళకు తీవ్ర గాయాలైన ఘటన గ్రామంలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని ధర్మవరప్పాడు తండాకు చెందిన రూపావత్ లాలు (40), గుగులోతు బాలాజీ (31), బాణావత్ బాలనాగమ్మ తెలంగాణలోని నల్గొండ జిల్లా జాన్పాడులో వరి గడ్డి కొనుగోలు చేసేందుకు ట్రాక్టర్పై వెళ్లారు. వరి గడ్డి కొనుగోలు చేసుకుని ట్రాక్టర్పై తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోని రెండవ మలుపు వద్దకు వచ్చేసరికి రామాంజనేయ ట్రాన్స్పోర్టుకు చెందిన లారీ జగ్గయ్యపేట నుంచి సిమెంట్ కర్మాగారానికి వెళ్తోంది. లారీ వేగంగా ట్రాక్టర్ను ఎదురుగా ఢీకొట్టటమే కాకుండా ట్రాక్టర్ ఇంజిన్పైకి ఎక్కింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ లాలు ఇంజిన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా పక్కనే కూర్చున్న బాలాజీ, నాగమ్మ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న కొందరు 108కు సమాచారమివ్వటంతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల నిమిత్తం వారిని విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలాజీ ఆదివారం ఉదయం మృతి చెందాడు. బాలనాగమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. ప్రమాద ప్రాంతంలో చేతికందే ఎత్తులో 11 కేవీ విద్యుత్ తీగలుండటం గమనార్హం. చిల్లకల్లు ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారే.. మృతి చెందిన లాలు, బాలాజీ, బాలనాగమ్మ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. డ్రైవర్గా పని చేస్తున్న లాలు ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మరో మృతుడు బాలాజీ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మృతులకు భార్య, పిల్లలు ఉన్నారు. ధర్మవరప్పాడు తండాలోవిషాదఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో పాటు మరొకరు తీవ్ర గాయాల పాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పశువులకు వరి గడ్డి కొనుగోలు చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువాత పడటంతో గ్రామస్తులను సైతం కంట తడి పెట్టించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ కమిటీ కన్వీనర్ తన్నీరు నాగేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మృతుల కుటుంబాలను ఫోన్లో పరామర్శించారు. -
రహదారి రక్తసిక్తం
కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం బాచేపల్లి చందర్నాయక్ గేట్ సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారిపై లారీ, తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన 14 మంది హైదరాబాద్లో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు తుఫాన్ వాహనంలో బయలు దేరారు. వీరి వాహనం మార్గమధ్యలో చందర్నాయక్ తండా గేట్ వద్దకు రాగానే నిజాంపేట వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో తుఫాన్ వాహనం డ్రైవర్ షేక్ మన్నాన్(35), శిరిసింబే శివానీ(20)లు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మన్నాన్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోగా స్థానికులు, పోలీసులు వచ్చి బయటికి తీశారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. క్షతగాత్రుల్లో రజని(60), చిప్తి అనే 7 నెలల చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. మిగతావారిలో అర్చన, సంధ్య, మహదేవి, ప్రథమేశ్, ప్రగతి, లత, స్వాతి, అశోక్తోపాటు మొత్తం 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరి ల్లింది. రోడ్డంతా రక్తసిక్తమై భయానకంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణరాజు, కంగ్టి సీఐ తిరుపతియాదవ్ సందర్శించారు. కల్హేర్ ఎస్ఐ ఎం.స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అయ్యో.. రామ
యాలాల: శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న భక్తుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాలాల మండలం దౌలాపూర్ సబ్స్టేషన్ సమీ పంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జుంటుపల్లి ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సిరిమానగారి అనంతయ్య (55), భార్య లక్ష్మి (45), కుమార్తె శివకళ, తాండూరుకు చెందిన తుల్జమ్మ (38), భారతమ్మ (45) వేర్వేరుగా సోమవారం యాలాల మం డలం జుంటుపల్లిలో జరిగిన రామస్వామి జాతరకు వచ్చారు. అనంతరం వారంతా తాండూరు వెళ్లేందుకు అక్కంపల్లి గ్రామానికి చెందిన అశోక్ ఆటోలో ఎక్కారు. ఐదుగురు ప్రయాణికులతో తాండూరుకు వెళ్తున్న ఆటోను దౌలాపూర్ సబ్స్టేషన్ సమీపంలోకి రాగానే తాండూరు నుంచి కొడంగల్ వైపు వెళుతున్న ఓ లారీ ఢీకొట్టింది. అయితే రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతను తప్పించబోయి డ్రైవర్ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అనంతయ్య, లక్ష్మి, తుల్జమ్మ, భారతమ్మæ ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఆటో డ్రైవర్ అశోక్, శివకళ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఉపేందర్, యాలాల ఎస్ఐ విఠల్రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, క్షతగాత్రులను 108 అంబులెన్స్లో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
శివయ్యా.. ఎంత ఘోరం జరిగిందయ్యా!
దేవనకొండ: శ్రీశైల మల్లన్నంటే వారికి ఎనలేని భక్తి. ఏటా ఉగాది సమయంలో వందల కిలోమీటర్లు నడిచి శ్రీశైలానికి వెళ్తుంటారు. మల్లికార్జునస్వామిని దర్శించుకుని వస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాదీ కాలినడకన శ్రీశైలం బయలుదేరారు. అయితే..మార్గమధ్యంలో వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన బుధవారం కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని ఈదులదేవరబండ–కప్పట్రాళ్ల మధ్య చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా మోకా మండలంలోని ఎర్రగుడి ప్రాంతానికి చెందిన గడ్డం ఉలిగయ్య, గడ్డం పోతప్ప, గడ్డం శేఖతో పాటు మరి కొంతమంది రెండు రోజుల క్రితం పాదయాత్రగా శ్రీశైలానికి బయలుదేరారు. మంగళవారం రాత్రి ఆస్పరి మండలం పుటకలమర్రి మోడల్ స్కూల్ వద్ద సేద తీరారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి నడక ప్రారంభించారు. దేవనకొండ దాటి ఈదులదేవరబండ –కప్పట్రాళ్ల మధ్య వెళ్తుండగా బళ్లారి నుంచి నంద్యాల వెళ్తున్న లారీ (ఏపీ21టీఈ0099) వెనుక వైపు నుంచి భక్తుల మీదుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎర్రగుడి గ్రామానికి చెందిన గడ్డం ఉలిగయ్య(28), గడ్డం శేఖ(15), గడ్డం పోతప్ప(23) అక్కడికక్కడే మృతిచెందారు. గడ్డం గాదిలింగ, గడ్డం పోతులింగ, హాలహర్వి నాగరాజు, దేవేందర్రెడ్డి, గడ్డం బాలరాజు, గడ్డం పరశురాముడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజనాసుపత్రికి తరలించారు. పోతులింగ, నాగరాజు, దేవేందర్రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ చిన్నపీరయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలుకు తరలించారు. మృతులు గడ్డం ఉలిగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, గడ్డం పోతప్పకు ఒక కుమారుడు ఉన్నారు. కాగా.. లారీలకు ఎక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అతివేగంగా రావడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రూ.8 లక్షల డీజిల్ నేలపాలు
పీఎం పాలెం(భీమిలి): జాతీయ రహదారిపై మారికివలస కూడలిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు రూ.8లక్షలు విలువ చేసే డీజిల్ నేలపాలయింది. షీలానగర్కు చెందిన ట్యాంకర్ 18 వేల లీటర్ల డీజిల్తో ఆదివారం ఒడిశాకు బయలుదేరింది. జాతీయ రహదారి మారికవలస కూడలి వద్దకు వచ్చేసరికి కూడలిలో యూ టర్న్ తిరుగుతున్న భారీ కంటెయినర్ డీజిల్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టొంది. దీంతో ట్యాంకర్ బోల్తా కొట్టింది. ట్యాంకరుకు గల బ్లాకుల మూతలు తెరుచుకోవడంతో ఆయిల్ రోడ్డుపై ఏరులా పారింది. సందట్లో సడేమియా అన్నట్లు స్థానికులు రోడ్డుపై పారుతున్న డీజిల్ను చేతికి అందినంత డబ్బాలతో పట్టుకుపోయారు. నేల పాలైన ఆయిల్ విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని సిబ్బంది తెలిపారు. లారీ యజమాని సాధి సూరిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు రమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.సూర్యారావు తెలిపారు.